కృష్ణమ్మ కొంచం కోపం తగ్గించుకోమ్మ..
గత వందేళ్ళళ్ళో ఎన్నడులేనంత ఆంధ్ర దేశం లో వరద ప్రాంతం ఏర్కొన్నది. భాస్కర్ దీన్ని *పాలనా వ్యవస్థల అట్టర్ ఫైల్యూర్* అన్నారు. కాని ఒక్కటి అసలు ఇంత వస్తుంది అని కలలో కూడా ఎవ్వరు ఊహించిండరు. కేవలం శ్రీ వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం తప్ప ఇంక ఎవ్వరు ఊహించలేదు ఇది. ప్రతి యేట వచ్చే వరదలని తట్టుకునే .. అలాంటివి వచ్చిన వెంట్టనే ఆదుకునే సత్త మాత్రమే మన ప్రభుత్వానికి ఉంది. అంతే తప్ప ఇలా ఇంత భారి లెవెల్ లో వరదలు వస్తే ఎవ్వరు ఏమీ చేయలేరన్నది నా అభిప్రాయం. మన దేశమే కాదు అసలు ఎక్కడ ఎవ్వరు ఈ లెవెల్ లో వరదలని ఎదుర్కునేంత లేదు. (please correct me if I am wrong).
ఇందాకే డా|| జయప్రకాష్ నారాయణ్ గారు చెప్పారు - ప్రపంచంలో యే ప్రభుత్వం / ప్రపంచలోని అన్ని ప్రభుత్వాలు కలిసి పని చేసిన మూడుగంటల్లో మూడులక్షల మందిని మూవ్ చేయలేరు అని. అది వాస్తవమే. మూడు రోజులుగా కురుస్తున్న భారి వర్షాలని తప్పు అంచనా వేసిందా మన ప్రభుత్వం అంటే .. అది నిజమే. కాని ఇంత లా ఔతుంది అని ఎవ్వరు ఊహించలేదు.
ఇప్పుడు సమయం రాత్రి 11:10 దేశం లో.శ్రీశైలం గరిష్ట స్థాయికి చేరుకుంది అట. మొత్తం 11 గేట్లు 43 అడుగులు ఎత్తివేసారు అట. 889 అడుగుల నీటిమట్టం చేరుకుంది. ఇంకా ఈ రోజో రేపో "మేము నీళ్ళు ఇవ్వము వదలము దాచుకుంటాం గిన్నేలో బిందెల్లో పోసుకొని ఇంటి భూగర్భం లో పెట్టుకుంటాం" అన్ని ఇన్నేళ్ళు అన్న పొరుగురాష్ట్రం ఇంకో ఇరవై లక్షల క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తుంది అట. అది రేపు మధ్యానానికో సాయంత్రానికో శ్రీశైలం చేరుకుంటుంది. కర్నూలు అప్పటికి ఉంటుందనే ఆశిస్తున్నాను. నా భయం.. శ్రీశైలానికి పొరబాటున అటు ఇటు ఏమైన జరిగితే మొత్తం నాగార్జున సాగర్ మీద పడుతుంది..
నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు ఇంకొద్ది గంట్టల్లో. అక్కడ 26 గేట్లు ఎత్తేసారు. రేపు మధ్యానానికి మొత్తం లెవెల్ లో ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి అట. ఇంక మిగిలింది ప్రకాశం. ప్రకాసం 12 గేట్లు ఇప్పుడు 6 అడుగులు ఎత్తేసారు. రేపు మధ్యానానికి ఆరులక్షల క్యూసెక్ల నీరు చేరుతుంది అట బెజవాడ కి. కర్నూల్ లో కరెంట్ తీసేసారు. ల్యాండ్ లైన్లు లేవు. కేవలం సెల్ మీదే నడుస్తోంది. ఇంకా భారి వర్షాలు పడుతున్నాయి మన రాష్ట్రం లో.. అలనే కర్ణాటకలో కూడానూ. ఇంకో ఇరవై నాలుగు చాలా క్లిష్ట పరిస్థితి మన రాష్ట్రానికి కొన్ని జిల్లాలకి ....
Update: రేపు ప్రొదున్నకి మద్రాసు నుండి 30 పవర్ బోట్లు చేరుతాయి అట కర్నూల్ నగరం. అలనే కర్ణాటక 20 లక్ష క్యూసెక్లు వరద నీరు ఒదిలేసింది. దీని వళ్ళ రేపు ప్రొదున్నకి ఇంకో పది అడుగులు .. పది అడుగులు నీరు పెరుగుతుంది అట కర్నూల్ నగరం లో.
Update సమయం తెల్లవారి 3:15. జూలార 60 గేట్లు తెరిచేసారు అట. శ్రీశైలం లో నీటి ప్రవాహం ఇప్పుడు 891 అడుగులకి చేరుకుంది!!!! శ్రీశైలం గరిష్ట ఎత్తు 885 అడుగులు. దేవుని మీద భారం వేసి సైట్ నుండి వెళ్ళిపోయారట ఇంజనీర్లు.