పాత రాష్ట్రం కొత్త పథం - 2
3. మన రాష్ట్రం లో విద్యుత్ కొరత అంతగా ఉండదు. కాని అవకాశం ఉన్నప్పుడే ఇంకా అభివృద్ధి పరచడం మంచిది కదా! అందులో క్రొత్త రాజధానికి విద్యుత్ చాలా అవసరం ఔతుంది. ఇవ్వన్నింటిని దృష్టి లో పేట్టుకొని శ్రీకాకులం లో అణు శక్తి విద్యుత్ ప్ల్యాంట్ కి శ్రీకారం చుట్టాలి. హైదరాబాదు కి కూడా విద్యుత్ శక్తి అవసరం పడుతుంది.. ఆ రాష్ట్రానికి కూడా ఆంధ్ర నుండి విద్యుత్ అమ్మవచ్చు.
4. గోదావరి, కృష్ణమ్మల మీద ఆనకట్టలు నిర్మిస్తే చాలా ప్రమాదం మనకి. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలున్న చోత drip irrigation ని ప్రోత్సహించాలి. ఈ పద్ధతికి అనుకూలంగా అన్నదాతలకి రుణాలు సదుపాయాలు ఇవ్వాలి.
5. కనీసం ఒక ఐదు - పది సంవత్సరాలు ట్యాక్సులు ఉండవు కనుక ఆంధ్ర లో head quarters పెట్టాలని అనుకునే కంపనీలు ఇక్కడి ప్రజలకు కూడా ఉద్యోగాలు సమకూర్చే విధంగా చేయాలి.
6. ఈ విభజన వల్ల అందరికంటే ఎక్కువగా నష్ఠపోయింది విద్యార్థులే. అందునా పది - ఇంటర్ చదువుతున్న వారు ఎందుకంటే వీరికి ఇంక హైదరాబాదు లోని మంచి కళాశాలల్లో చేరాలేరు [JNTU Hyderabad, CBIT, Vasavi మున్నగునవి]. రాష్ట్ర పురోగతి వీరి మీదే ఆధారిపడి ఉంది కాబట్టి క్రొత్త / పాత కళాశాలలు ఆ లోటుని భర్తీ చేసేట్టు చూడాలి. అమేరికా, ఐరోపా, చైనా, జపాన్ లోని top universities తో ఒప్పందం కుదుర్చుకొని ఆ కళాశాలల్లోని professors ని మన రాష్ట్రాంలో [ఒక 1-2 సంవత్సరాలకి] చదువు నేర్పించమని అభ్యర్తించాలి. అలనే జాతీయ అంతర్జాతీయ కంపనీలతో ఒప్పందం కుదుర్చుకొని వారికి కావాల్సిన research ని చేసే సదుపాయాములని కలిగించాలి. ఇలా చేయగలిగితే పది - పదిహేను సంవత్సరములలో మన కళాశాలలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.
ఇవ్వన్ని చేయాలంటే ప్రథమంగా లంచగుండీ తనం తగ్గాలి. పోలీసు యాంత్రంగం సక్రమంగా ఉంటే మిగిలిన చోట్ల అదుపు చేసే ఆస్కారం ఉంటూంది. అందుకు పోలీసు వ్యవస్థకి కొన్ని అధిక, ఆధునీక సదుపాయాలు కలుగచేయాలి. మచ్చుక్కి - ఆర్మీ లాగా వస్తువులని చౌకగా అందజేయాలి. వారి కుటుంభ సభులకి కాలేజీల్లో కొంత reservation లాంతికి ఇవ్వాలి. ఇలాంటివి అన్నమాట.
------
నేను రాసినవి నాకు తోచిన కొన్ని అంశాలు మాత్రమే. ఒక్కసారి అనుకోవాలే కాని మన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక స్వణాంధ్రగా ఒక హరితాంధ్రగా తీర్చిదిద్దగలం!
పై చెప్పినవి సులభం అని నేను అనడం లేదు భావించడమూ లేదు. కాని పోయినదాని గురించి బాధపడుతూ ఉండటం కంటే ఉన్నదాన్ని ఎలా అభ్యుదయ పరచాలో ఆలోచిస్తే ఉత్తమం అని నా అభిప్రాయం. మహాకవి శ్రీ శ్రీ అన్నట్టు అగాధమౌ జలనిధి లోనే ఆణిముత్యం ఉన్నటులే శోకాల మడుగున దాగి శుఖమున్నదిలే...
Read more...
Tuesday, December 22, 2009
ఒక తెలుగు వాడి క్షోభ.
జీవితం లో మొదటి సారి తెలుగువాడైనందుకు సిగ్గు గా ఉంది.. ఇంత ద్వేషం నా జన్మలో ఎప్పుడూ చూడలేదు. మండల్ కమీషన్ అప్పుడు కూడా గొడవలు జరిగాయి కాని ఈ స్థాయిలో ద్వేషం మాత్రం ఎప్పుడూ చూడలేదు. నాలుకలు కోస్తాం అని ఒక నాయకుడు అనడం ఎంత చండాలంగా ఎంత నీచం గా ఎంత దరిద్రం గా ఉందో మాటల్లో చెప్పలేను. ఒక్కడు చేసిన పనికి.. ఒక్కడు వాడి స్వార్థం కోసం మొదలెట్టిన పని ఇన్ని కోట్లమంది కడుపు కొడుతోందో. ఎన్ని వేల కోట్ల వ్యాపార నష్టం .. ఎన్ని జీవితాల నష్టం.. ఎన్ని కోట్ల ఆశ్తి నష్టం.
దీనివళ్ళ ఒరిగింది ఏంటి? ఎవరికి ఏమి ఒరిగింది? హైదరాబాదు లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టరు. ఎంచక్క పక్క రాష్ట్రాలకి వెళ్తారు. ఇంకో పదేళ్ళు ఇటు వైపు కుడా చూడరు.. అదృష్టం బాగుండి అప్పటికి ఓ మంచి నేత వస్తే మళ్ళా హైదరాబాదు గత వైభవం రావచ్చు... లేకుంటే ఒకప్పటి పాట్నా ఎందుకు పనికిరాకుండా పోయేట్టు పోవచ్చు. చెప్పలేము. అప్పుడు కోస్తా సీమ వాళ్ళే కాదు తెలంగాణా వీరులుకూడా హైదరాబాదుకి రారు.. వచ్చి ప్రయోజనం ఉండదు కనుక.
ఎవరో తెలుగుతల్లి ని దూషించారు.. ఇంకొంతమంది అమరజీవి పొట్టి శ్రీరములని తిట్టిపోసారు.. చెప్పుల హారం వేసారు.. ఇంకొంతమంది అమ్మవారికి మాండలీకం అంటగట్టారు.. కోస్తా నుండి వచ్చింది అని ప్రసాదం స్వీకరించలేదు... వెంకన్న సీమలో వెలసి ద్రోహం చేసాడు అని సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన వేంకటేశ్వరున్ని అనరాని మాటలన్నారు. థూ మీ బ్రతుకులు... అన్నింటిలోనూ అన్ని చోట్ల అణువూఅణువున ఉండే ఆ దైవానికే ప్రదేశాలు అంటగట్టి దూషించేవాళ్ళకి బుద్ధి ఉంటుంది వస్తుంది అని నేను ఆశించను. ఇంత ద్వేషాన్ని నేను ఎప్పుడు చూడలేదు. తెలుగు జాతి అనేది ఈ క్షణం అంతరించిపోతే బాగున్ను అనిపిస్తుంది. అంత సిగ్గు పడుతున్నాను. "ఆత్మ గౌరవం" అనేది ఇంకో సారి అనకుండా అదః పాతాళానికి తొక్కేసాము. ఇన్నేళ్ళా పురోగతి ఒక్క నెలలో ఒక్కడి దీక్షా నాటకం వలన నాశనం అయిపోయింది. ప్రతి తెలుగు వాడు ఆంధ్రూడే అని గ్రహించని మూర్ఖులకి ఏం చెప్పగలం?
రాజకీయ స్వార్థం కోసం రచించిన ఈ దరిద్ర నాటకానికి తెర ఎప్పుడు ఎలా పడుతుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. దీనివళ్ళ ఎవరికి ఏం ఒరుగుతుందో తెలీదు. ఇంత స్వార్థం ద్వేషం మాత్రం యే జాతికి పట్టకూడదు. కాని ఒక్కటి మాత్రం నిజం తెలుగువాదైనందుకు జీవితం లో మొట్టమొదటిసారి సిగ్గు పడుతున్నాను. శాస్త్రి గారి 'తలయెత్తి జివించు తమ్ముడా తెలుగునేలలో జమ్నించినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని" అని మాత్రం ఈ జన్మలో పాడలేము. ఇంత నెగటివిటి (negativity) నేను భరించలేను. తెలంగాణా వచ్చినా రాకున్నా.. ఆంధ్ర రాష్ట్రం ఉన్నా లేకున్న.. i just will not give a hoot anymore. నేను పట్టించుకోకుండ ఉన్న్న మాత్రానా ప్రపంచానికి ఒరిగేది ఏమీ లేదు.. కాని at the very least I wont be a part of that negativity. అంతే చాలు నాకు.
జై తెలుగు తల్లి.
Thursday, December 10, 2009
అనుకోనిదా? కోరుకున్నదా?
తెలంగాణా ఇస్తాం అన్న వ్యాఖ్య తో భగ్గుమన్నది ఆంధ్రావణి. ఇప్పటికి 112 MLAలు, 5 MPలు రాజీనామాలు చేసారు. పదకొండు రోజులుగా తెలంగాణా హోరెత్తున్నా ఏమి అనని మిగితా రాష్ట్రం కేంద్రం అల అనేసరికి భగ్గుమంది. పార్టిలకి సంబంధం లేకుండా 112 మంది రాజీనామాలు చేసారంటే చూసి ముచ్చటేస్తోంది. తెలంగాణా కి చెందిన కొంతమంది MLAలకి అలా చేయాలని ఉన్న.. పాపాం చేయలేరు. ఇగ మిగిలింది గ్రేటర్ MLAలు. వాళ్ళు కూడా రాజీనామా చేస్తే బాగున్ను.
దెబ్బకి మిగితా రాష్ట్రం వాళ్ళు కూడా అడగడం మొదలెట్టారు. పైనుండి మొదలుకొని చూస్తే:
1. బెంగాల్ లో గోర్ఖాల్యాండ్
2. బీహార్ + మధ్య ప్రదేశ్ + ఉత్తర్ ప్రదేశ్ కొన్ని ప్రదేశాలు కలిపి బుందేల్ఖండ్
3. ఉత్తర్ ప్రదేశ్ కొన్ని భాగాలతో హరిత్ ప్రదేశ్
4. గుజరాత్ లో సౌరాష్ట్ర
5. మహరాష్ట్ర లో విధర్బా
6. కర్నాటక లో కూర్గ్
7. తమిళనాడు - ??? వీళ్ళకి వేరు దేశం కావాలేమో మరి.
ఇవి సాధించడం పిచ్చ వీజీ కద. కె సి ఆర్ చూపిన దారి ఉంది కద. ఆయా ప్రదేశాల ఏం.పీ లు ఓ పది రోజులు సలైన్ పెట్టుకొని నిరాహారదీక్ష చేస్తే చాలు. ఇవ్వన్ని చాలా చాలా యేళ్ళ నుండి అడుగుతున్నవే. ఈ రోజేమి కొత్త కాదు. కాని తెలంగాణా ఇస్తాము అనడం వళ్ళ అన్ని మొదలయ్యాయి.
ఈ పరినామం కాని, ప్రతినిధుల రాజీనామాలు కాని అస్సలు ఊహించనిది కానేకాదు. రాష్ట్రాన్ని విభజిస్తాము అంటే మిగితావాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? It makes perfect sense to the way they reacted. They owe nothing to Telangana.. but everything to Visalandhra. కొందరు వ్రాశారు కేంద్రానికి మంచి షాక్ తగిలింది అని. కాని నాకు అనిపిస్తోంది ఇది వాళ్ళు కోరుకున్నదే అని. అటు మేము తెలంగాణా ఇచ్చేదానికి ఒప్పుకున్నాము కాని ప్రజలు ఒప్పుకోలేదు అని అనవచ్చు. అటు ఇచ్చినట్టు ఉంటుంది ఇటు ఇవ్వనట్టు ఉంటుంది. ఇచ్చారు అని తెలంగాణా ప్రజలు ఆనందిస్తారు ఇవ్వలేదని విశాలాంధ్ర ప్రజలు హర్షితారు. భలే భలే!! నష్టపోయింది అదిగో కె సి ఆర్ గిమిక్కులు చూసి ఆత్మహత్య చేసుకున్న వాడి కుటుంబం. రాజకీయనాయకులకి ఎప్పుడు నష్టం రాదు. జరగదు.
ఒక "మేధావి" అన్న మాటలు - ఇన్ని రోజులు రాజకీయనాయకులు దోచుకొని కోస్తా లో పెట్టుబడి పెట్టి కోస్తా ని అభివృద్ధి పరచారు అట. ఇప్పుడు తెలంగాణా వస్తే దోచుకున్న సొమ్ము తెలంగాణాలోనే పెడతారట. అందుకే వేరు రాష్ట్రం కావాలి అట. ఆ లాజిక్ నాకు అర్థం కాలేదు - ఇప్పుడు కూడా దోచుకొని కోస్తాలో పెట్టుబడి పెట్టచు కద? తెలంగాణా కి వేరు "రూపాయలు" లేవు కద? కొత్తగా రాష్ట్రం వచ్చినా వాడేది "ఇండియన్ రుపీ" నే కద? తెలంగాణా వస్తే అన్నల రాజ్యం ఎక్కువతుందేమో ఎందుకైన మంచింది అని పూర్వము కంటే ఎక్కువ డబ్బులు వేరే చోట పెట్టుబడి పెట్టడని నమ్మకం ఏంటి? ఆ వేరే చోట వేరు రాష్ట్రం కూడా అవ్వచ్చు కద? ఏంటో ..
ఈ గోల వళ్ళ హైదరాబాదు లో కాని మిగితా రాష్ట్రం లో ఎవైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకున్నవాళ్ళు ఇగ చేయరేమో. దాని వళ్ళ తెలుగువారందరికి నష్టమే. అంత ఆలోచనే ఉంటే ఇదంత ఎందుకు జరుగుద్ది? ఇక ముందు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. . కాని ఈ పరినామం మాత్రం ఊహించనిది అంటే నమ్మబుద్ధి కావడం లేదు.
Tuesday, November 17, 2009
ఒక గోడ - ఒక సామ్రాజ్యం - ఒక రాష్ట్రం.
ఇరవై యేళ్ళు. ఒక్క గోడ రెండు దేశాలు. ఆ గోడ ని కూల్చి మళ్ళా ఒక్క దేశం గా ఆవిర్భవించింది. ఇంతక ముందు కంటే పెద్దగా ఒక్కటైంది. ఈ టప ఒక్కటైన జర్మనీ గురించి కానే కాదు. గోడ కూలడం తో ఆరంభమైన సామ్రాజ్య పతనం గురించి. ఎనభై యేళ్ళు అవిచ్చిన్నంగా ఎదిగిన రష్యా ... క్షమించాలి సోవియట్ యూనియన్ చిన్నభిన్నం అవడం మొదలైంది బెర్లిన్ వాల్ కూలడం తోనే. కాని దానికి నాంది మాత్రం ఆఫ్ఘన్ లో కాలుపెట్టడమే. అంతక ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంచక్క అన్నింటిని రేషన్ చేసి నెట్టుకొని వస్తున్న యూనియన్ ఆఫ్ఘన్ లో అడుగుపెట్టిన తర్వత ఏది సరిగ్గా చేయలేకపోయింది.
ఐనా ఆఫ్ఘన్ లో వాళ్ళంతటవాళ్ళే వెళ్ళలేదు కద.. అప్పటి ఆఫ్ఘన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వీళ్ళు పాపాం వెళ్ళారు. 79 లో. కనిపించిన చిన్న చిన్న గుడిసెలు సైతం సైతాన్నుల్లాగా పేల్చేసారు. ఇసుకని గుప్పెట్లో బంధించే ప్రయత్నం లానే ఇది విఫలమైంది. కాని దాని ప్రకంపణలు క్రెంలిన్ లో కనిపించాయి. రేషన్ చేసి అన్నింటికి కోట (quota) లెక్కన అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే ప్రభుత్వం ఇంక ఏమీ చేయలేకపోయింది. చేసేదానికి డబ్బు లేకుండా పోయింది. ఒక్కసారి ఈస్ట్ జెర్మని వెస్ట్ లో చేరిపోయాక యూనియన్ లోని మిగితా దేశాలు కూడా స్వతంత్రం అడిగాయి. ఇంక ఇవ్వకతప్పలేదు కద... Nov 09, 1989 బెర్లిన్ వాల్ ని కూలద్రోసారు. సోవియట్ యూనియన్ ఇంకో రెండు సంవత్సరాలు బ్రతకగలిగింది... అది విరిగి 15 కొత్త దేశాలు ఆవిర్భవించాయి. ప్రపంచం లో అతి పెద్ద కమ్యునిస్ట్ దేశం గా రష్యా పోయి చైనా అయ్యింది. మన దేశం కూడా అదే సమయం లో సోషలిస్ట్ / కమ్యునిస్ట్ ఛాయలనుండి సురక్షితంగా బయటపడింది... శ్రీ పీ.వీ మేధస్సు తో.
ఒక్క రాష్ట్రం తప్ప. మన దేశం లో ఆ ఒక రాష్ట్రం లో గత 30 సంవత్సరాల నుండి ఒకటే పార్టి పరిపాలిస్తోంది కద.. పాపం ఒక్కప్పుడు చాలా విషయాల్లో ముందంజ లో ఉన్న ఆ రాష్ట్రం ఇప్పుడు టిక్కు టిక్కు అంటూ నెట్టుకొస్తోంది. అంటే కమ్యునిస్టేతర రాష్ట్రాలు బాగుపడ్డాయా అంటే అది నిజం కాదు.. బీహర్, ఉత్తర ప్రదేశ్ వాటికి ఉదాహరణలు.. కాని నకు కమ్యునిస్ట్లన్న ఫెమినిస్ట్లన్న పడరు. కమ్యూనిస్ట్లు చైనా తో యుద్ధం అప్పుడు చైనా కి సపొర్ట్ ఇచ్చారు. ఆ ఒక్క విషయం చాలు వాళ్ళని దేశం నుండి బహిష్కరించేదానికి. ప్రగతికి అడ్డంకులు.. అందుకే వాళ్ళంటే నాకు పరమ చిరాకు. ఏం సాధించారో ముఫై యేళ్ళళ్ళో నాకైతే తెలీదు. ఇన్వెస్ట్మెంట్స్ లేవు.. సరిగ్గ పని చేసేవాళ్ళు లేరు .. పెద్దగ ఒరిగింది కూడా లేదు. ఒకప్పుడు అగ్ర రాష్ట్రాల్లో ఒక్కటిగా ఉండినది ఇప్పుడు బీహార్ కంటే కొంచం మెరుగ్గా ఉంది అట. మొన్న జరిగిన లోకల్ ఎన్నికల్లో అస్సెంబ్లీ ఉప ఎనికల్లో కొంచం వెనుకపడింది సి.పి.ఎం. చూద్దం ఈ సారి ఎన్నికల్లో గెలుస్తుందో లేక చివరికి బెంగాల్ కి కూడా మంచి రోజులు వస్తయో లేదో అని.
క్యాపిటలిజం గొప్పది అనో సర్వరోగ నివారణి అనో నేను అనడం లేదు. అనేంత తెలివి కూడా నాకు లేదు. కాని కమ్యునిస్ట్ కంటే యే రోజైన క్యాపిటలిస్ట్ సొసైటి బెటెర్ అని నా అభిప్రాయం. వాక్ స్వాతంత్రం కదిలే స్వాతంత్రం నాకు చాలా ముఖ్యం. ఒక్క మాట ఎవరినైన అంటే రాత్రి ఎవడొచ్చి తలుపు కొడతాడో ఎక్కడ క్యాంపుల్లో పడేస్తారో అని భయపడాల్సిన అవసరం ఉండదు. డెమాక్రసి అలాంటిది. కమ్యూనిస్ట్ అంటే ఒక మాట చెప్పాలి - పని ఎవడి శక్తి కొలది వాళ్ళు చేయాలి పరిహారం మాత్రం అందరికీ సరిపోయేంతే అనే ముష్ఠి భావన మీద బేసైన ఎటువంటి "ఆలోచన" ఐనా నాకు చిరాకే. నేను చేసే పనికి తగినంత పరిహారం నాకు కావాలి. నేను 12 గంటలు కొట్టించుకొనీ.. నా పక్కనోడు ఓ గంట చేసి ఇద్దరికి ఒకటే జీతం అంటే లాగి కొట్టలనిపిస్తుందా లేదా? ఎమైన అంటే ప్రపంచం బాగు కోసం అని అనడం ఇంకో పెద్ద బూతు. నాకు పని చేయాలి అని అనిపిస్తే కద నేను, నా ఇల్లు, నా ఊరూ నా దేశం నా ప్రపంచం బాగుపడేది? అసలు నేను ఎంత కొట్టించుకున్నా నాకు మిగిలేది చిప్పే అంటే నేనెందుకు పని చేయాలి? ఎందుకు చేస్తా? ఈ చిన్న ముక్క బుద్ధి లేకుండా అసలు ఆ కాన్సెప్ట్ ఎలా నెగ్గిందో నాకు ఐతే అర్థం కాదు. ఏదైతేనేమి ఇంకో ఇరవై సంవత్సరాల్లో . బెంగల్ వాళ్ళకి బుద్ధి రాకపోద్దా..మన దేశం మారకపోద్దా. చూద్దాం. ఆశిద్దాం.
గమనిక: ఇది నా బ్లాగు. నాకు నచ్చని వాటి గురించి నచ్చిన వాటి గురించి రాస్తాను. కార్ల్ మార్క్స్ దేవుడు లెనిన్ ఇంకో దేవుడు. స్టాలిన్ మావో లు దేవుని ప్రతిరూపాలు గట్ర గట్ర అని అనాలనుకుంటే దారి అటు --> ఇక్కడ కాదు. నా దృష్టి లో లాలూ ములయం మాయవతి కంటే తక్కువ పింకోలు .. వాళ్ళని చూస్తే at least చెప్పచ్చు దేనికి పనికిరారు అని.. వీళ్ళు అల కాదు. మరోసారి చెప్తున్న ఈ టప కమ్యునిస్ట్ టప లాంటిది.. వ్యతిరేకిస్తే కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పడేసి కుర్చి కి కట్టేసి వివాహ్ సినెమా చూపిస్తా. కేసు బోనస్!! ఖబర్దార్!.
Friday, October 30, 2009
పాక్ లో కలకలం.. ఆనందమా? ఆలోచనా ?
ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదు. ఒక వైపు ఆనందం గా ఉన్నా మరో వైపు పాపం వాళ్ళు మనలాంటి ప్రజలే కదా అని అనిపిస్తుంది. ఇన్నేళ్ళు మన దేశం మీద పన్నిన కుట్రకి జరిపించిన మారణహోమానికి తగిన సాస్తే జరుగుతున్నట్టు అనిపిస్తోంది.. కాని ఉగ్రవాదానికి ఇటువైపు ఉండి అనేకానేక దాడులని తట్టుకొని ఉండడం వళ్ళేమో కొంచం .. అంటే చాలా చాలా చాలా చిన్నమోతాదులో .. బాధ కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఎవరు తొవ్విన గొయ్యిలోకి వాళ్ళే పడతారు అని మరోసారి రుజువైనట్టుంది. మన దేశాన్ని ముక్కలు ముక్కలు గా చేయాలి అని చాలా యేళ్ళు ప్రయత్నించి అటు కాశ్మీరంలో, పంజాబ్లో, మన రాజధానిలో, సిమి లాంటి దేశద్రోహులకి అన్ని విధాలుగ సహాయం ఇచ్చి లక్షల మందిని పొట్టనపెట్టుకున్న పాప ఫలమేమో ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్న మారణహోమం. ఇందులో మన హస్తం పెద్దగ లేదనిపిస్తుంది. అసలు అవసరమే లేదనిపిస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ పైన సోవియట్ల దాడి చేసాకా కొద్ది రోజులు తర్వత అమెరికా ప్రోద్బలం మీద పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ గర్భం లో జన్మించింది తాలిబాన్. మొదటి పది సంవత్సరాలు డబ్బు గట్ర అంతా సి.ఐ.ఏ ద్వర వచ్చేవి. తర్వత సోవియట్లు తిరిగి వెళ్ళిపోయారు... సోవియట్ యూనియన్ చరిత్రపూటాల్లోకి జారుకుంది. ఇంక చేసేది ఏమి లేక ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్గత కలహాలు చెలరేగాయి. ఒక తరం తుడిచిపెట్టుకుపోయింది ఆ దేశం లో ఈ యుద్ధాల మూలంగ. 79 నుండి 89-90 వరకు సోవియట్ల భీభత్సం వళ్ళ దేశం చాలా చాల నష్ట పోయింది.. తర్వత ఇంకో ఐదారేళ్ళు అంతర్గత కలహాలు చెలరేగాయి. పాకిస్తాన్ సహయాం చేయడం తో అందరిని ఓడించి కాబుల్ మీద విజయపతాకం ఎగరవేసింది తాలిబాన్. ఒక "గవర్నమెంట్" కూడా స్థాపించింది. దాన్ని ప్రపంచం మొత్తం మీద అంగీకరించిన రెండే రెండు దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఎంతైన సొంత బిడ్డ లాంటిది కద... అప్పుడే వాళ్ళు బమియాన్ లో ఉన్న వేల సంవత్సరాల బుద్ధ విగ్రహాలని పేల్చేసారు. యే ఒక్క దేశం కై కుయి అని అనలేదు. మన దేశం ఐతే మాటవరసకి వద్దు ఆపండి ఈ ఘోరం లాంటి కొన్ని డవిలాగులు అన్నదే తప్ప.. అంతకు మించి ఏమీ చేయలేదు. రెండు వేల సంవత్సరాల క్రిందట.. ఆ బుద్ధ విగ్రహాలని చెక్కినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మన దేశం లో ఓ భాగమే అని గుర్తించవారు కూడా తక్కువే!! ఏం చేస్తాం.. బుద్ధుడే ఆపలేకపోయాడు మనమెంత అని అందరు ఊరుకున్నారు. అది వేరే విషయం..
అలా అలా చిలకలు గోరికలు లా బ్రతుకుతున్న తరుణం లో.. అమెరికా మీద దాడి చేసింది అల్-ఖైదా. మరి అమెరికా ఊరుకుంటదా? ముందే ఏమి మిగలని ఆఫ్ఘనిస్తాన్ ని ఇంకా కుమ్మేసింది. అసలు అక్కడ ఏముందని ..అదే ఏం మిగిలిందని దాడి చేసిందో నాకు ఇంత వరకు అంతు చిక్కలేదు. అలా ఘోరం గా ఓడిపోయిన తాలిబాన్ అగ్ర నాయకులని స్వయానా తన సొంత విమానం లో సురక్షితం గా తీసుకొచ్చింది పాకిస్తాన్. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద తన దాడికి సహాయం చేయకపోతే వాళ్ళాని అదేలా చేస్తాం అని మెల్లిగా చెప్పేసరికి దిక్కులేక సహాయానికి ఒప్పుకుంది పాకిస్తాన్. కాని ఎంతైన తాలిబాన్ ని పుట్టించి పోషించింది కద.. ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది.. అటు అమెరికా కి సహాయం చేస్తా అంటునే ఇటు వీళ్ళకీ సహాయం చేసేది. రెండు వేరు వేరు దిక్కుల్లో పొయే గుఱ్ఱాల మీద ఒకటే సారి స్వారీ చేస్తే ఎల ఉంటదో తెలుసుకుందాం అని చేసినట్టు ఉండేది. రెండు చెరో దిక్కు వెళ్ళిపోయి నడ్డి ఇరిగినట్టు ఉంది ఇప్పుడు. "ఉగ్రవాదం మీద యుద్ధం" లో మొదటి ఐదేళ్ళు అస్సలు ఏమి చేయలేదు పాకిస్తాన్. కాని ఇలా తాలిబాన్లకి కూడా సహాయం చేయడం అమెరి"కనుల"కి తెలీకుండ ఉంటద? తెలుసుకున్నారు... ఇలా చేస్తే పెట్టే భిక్ష ఆపేస్తాం అన్నారు. జడుసుకొని కొంచం భయపెట్టాలని ప్రయత్నించింది పాకిస్తాన్. వజీరిస్తాన్ మీద దాడులు చేసింది.. NWFP (North West Frontier Province) మీద దాడులు చేసింది.. అమెరికా చేసిన దానికంటే పాకిస్తాన్ చేయడం వలన కోపం వచ్చింది తాలిబాన్ కి. ఆ మాత్రం ఉండదు? సొంత వళ్ళే అంటే కోపం రాదు మరి?
ముందు ఆఫ్ఘనిస్తాన్ వలయం లోకి మెల్లగా లాగింది అమెరికా ని. పాపాం వాళ్ళకి తెలీదు కద ఆఫ్ఘనిస్తాన్ గురించి.. ఇర్రుక్కున్నారు. అలెక్సాండరే భయపడ్డాడు ఆఫ్ఘన్లని చూసి. చెంఘిస్ ఖాన్, సోవియట్లు ఎవ్వరు నిలదక్కుకోలేకపోయారు .. అలాంటి చోట ఇరుకున్నారు అమెరికన్లు. గత ఐదేళ్ళలో చాలా భాగం మళ్ళా తాలిబాన్ల చేతుల్లోకి వచ్చేసింది. కాని ఇటు పాకిస్తాన్ సైన్యం వళ్ళ చాల నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడే వాళ్ళా దృష్టి పాకిస్తాన్ మీదకి సారించారు. NWFP, వజీరిస్తాన్ లో పాక్ సైన్యాన్ని ఎదుర్కోగలిగింది. స్వాట్ లోయలోకి వచ్చి పాక్ సైన్యం తో ఢీ కొట్టింది. తర్వత ఒక రోజు అమెరికా విమానం తో పాక్ తాలిబాన్ అధ్యక్షుడ్ని చంపేసింది. దానికి ప్రతీకారం గా కొత్తగా ఎన్నికైన తాలిబాన్ నాయకుడు మొదలెట్టిన ప్రతీకరమే ప్రస్తుతానికి పాకిస్తాన్ తో రగులుతున్న భీభత్సం.
ఈ సంవత్సరం కనీసం 500 మంది బలి అయ్యారు అడపా దడపల బాంబుల వళ్ళ. ఇన్నేళ్ళు మన మీద సాగించిన కుట్ర ఎల ఉంటదొ ఇప్పుడిప్పుడే అర్థం ఔతున్నట్టు ఉంది వాళ్ళకి. ఇంటి బయటకి వెళ్తే తిరిగి వస్తారో లేదో అన్న భయం వచ్చింది పాకిలకి. వాళ్ళ పరిపాలకులకి కూడా ఆ భయం వస్తే బాగుంటుంది. మొన్నామధ్య ఏకంగా ఆర్మీ హెడ్క్వాటర్ మీదే దాడి చేసారు. మన ప్రమేయం ఏమీ లేకుండా పాక్ ఇలా ఔతోంది అంటే ఎక్కడో కొంచం ఆనందం గా ఉంది. ఈ యుద్ధం సాగుతునే ఉంటుంది.. గెలుపు రుచి చూసారు తాలిబాన్లు పాకిస్తాన్ మీద. వజీరిస్తన్, NWFP లో వాళ్ళదే రాజ్యం ఇప్పుడు. మరో ఆఫ్ఘనిస్తాన్ తయారు చేసారు అక్కడ. అందుకే మిగితా పాక్ ని అల చేయాలి అని ఆశ పడుతున్నారు. అల జరిగితే మనకి నష్టమే కష్టమే. కాని ఎప్పటి వరకు ఐతే పాక్ సైన్యం ప్రభుత్వం ఈ యుద్ధం కొనసాగిస్తుందో అప్పటి వరకు మనకి ఢోకా లేదు. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి...
Sunday, September 6, 2009
వై.యెస్.ఆర్ ... తర్వాత ?
ఒక మనిషి చేసిన మంచి చావులో తెలుస్తుంది అంటారు. ఆ విధంగా చూస్తే వై.యెస్ పేదలకి చాలానే మంచి చేసినట్టూ గోచరిస్తుంది. నాకు పెద్దగ నచ్చకపోయినా ఒక్క అంశం వల్ల నచ్చేవాడు. జలయగ్ఞం. మన రాష్ట్రం లో దేశం లో భూమిలో నీరు అంటే గ్రౌండ్ వాటర్ టేబల్ చాలా చాలా చాలా దారుణంగా పడిపోతోంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మన మూర్ఖవతం వలన వచ్చిన ముప్పే. ఒక కాలం లో అంటే బ్రిటిషర్లు రాకమునుపు అన్నమాట, ఓ 7-8 వేల సంవత్సరాలు మన పూర్వీకులు ప్రతి ఊరిలో ఓ కోనేరు అని ప్రతి కిలోమీటర్ కి ఓ కోనేరు అని కట్టే వాళ్ళు. అలనే "స్టెప్ ట్యాంక్" లని కూడా భారీ లెవెల్ లో నిర్మించారు. వీటి వళ్ళ రెండు ఉపయోగాలు - ఒకటి వషపు నీరు ఇందులో చేరడం వలన ఊరికి నిత్యం నీరు ఉండేది. రెండు - కింద మట్టే కాబట్టి నీరు తిరిగి నేలలో ఇంకిపోయేది. అల వాడని నీరు భూమిలో పోయేది. ఎప్పుడైన అవసరం వచ్చి బావి తొవ్వితే నీరు వచ్చేది. ఇది నా దృష్టిలో ultimate water conservation. కాని బ్రిటిషర్లు ఈ కోనేరులు filthy water అని నమ్మి చాలా వాటిని పూడ్చేసారు. స్వతంత్రం వచ్చాక మన ప్రభుత్వం వేల యేళ్ళ నాటి మన మనుగడని తలచక బ్రిటిషర్ల బాటలోనే నడిచి.. ఇదిగో ఇప్పుడు నీళ్ళూ లేని పరిస్థితి తెచ్చి పెట్టింది.
పంటలకి నీటి కోసం పంపు సెట్లు ఎంత లోపల దింపిన చాలా చోట్ల నీరు రావడం లేదు ఈ కాలం లో. అసలు భూమిలో నీరు ఉంటే కద వచ్చేది. water table restoration కి ఓ ఉపాయం జలయగ్ఞం. 70 చిల్లర చిన్న పెద్ద ఆనకట్టలు నిర్మించడంతో ఈ సమస్య కొంత తీరుతుందేమో. అందులో భాగం గా ఇప్పటికి 35 దాక నిర్మాణం పూర్తి చేసింది వై.యెస్ ప్రభుత్వం. అన్నిటి నిర్మాణం తర్వత ఒక కోటి ఎకరాలకి సాగునీరు అందేది. వ్యవసాయం మీదే ఆధరపడే మనకి ఇది ఎంత మేలో మాటల్లో చెప్పలేము. మన దేశం లో గుజరాత్ తర్వత ఇంతగా నీటి మీద వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపింది ఈ ప్రభుత్వమే. అందుకే నాకు వై.యెస్ అంటే అభిమానం. మన నాయకుల మీద మనకి ఎంత అపనమ్మకం అంటే వాడు ఎంత తిన్న పర్లేదు కొంచం ప్రజలకి చేస్తే చాలు అని అనుకుంటాం. అందులో ఇంకొంచం ఎక్కువగా ప్రజల సమస్యలని పట్టించుకుంటే దేవుడు అనేస్తాం. వై.యెస్, ఎన్.టీ.ఆర్, జలగం, బూర్గుల, ప్రకాశం పంతులు .. ఈ కోవకి చెందిన వారు.
వై.యెస్ హఠాన్మరణం తో ఆంధ్ర చరిత్రలో ఓ గొప్ప ఘట్టం ముగిసింది. ఇప్పుడు అతడి పేరు చెప్పుకొని బ్రతికే ఘట్టం ఆరభం ఔతుంది. మనం పేరుకిమాత్రం democracy పనితీరు మాత్రం feudalistic అని చెప్పేదానికి గత రెండు మూడు రోజుల్లో టి.వీ చూస్తే చాలు. శరత్ అన్నట్టు YS est mort, vive YS!. అసలు జగన్ అనేవాడు ఎవరు? ముఖ్యమంత్రి కి కావల్సింది ఎక్స్ పీరియన్స్. అది అతనికి అసలు ఉందా? సాక్షి పెట్టకమునుపు అతనెవరో కూడా చాలా మందికి తెలీదు. పైగా సత్యం అవకతవకల్లో అతనికీ భాగం ఉందని అప్పట్లో అన్ని పత్రికలు, చానల్లు రాసాయి / చెప్పాయి. ఇప్పుడు అవేమి గుర్తుకు రావే!! ఇందిరాని చంపేసారని రాజీవ్ కి పట్టం కట్టారు. 410+ సీట్లోచ్చిన కాంగ్రెస్ని ఐదేళ్ళల్లో 200 కంటే తక్కువచి తెచ్చేసాడు. యే పనికైన ఎక్స్పీరియన్సె అవసరం. అంటే జూనియర్ పోస్ట్లకి కాదు.. అవి నేర్చుకునేదానికే ఉంటాయి. కాని పెద్ద పోస్ట్లకి వెళ్ళేటప్పుడు ఆ పోస్ట్ కి తగ్గ బుద్ధి విగ్ఞానం తోబాటు మనకి ఉన్న అనుభవాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటారు. కేవలం రాజకీయాల్లో సినిమాళ్ళో ఇదెందుకో వర్తించదు.
ఏమైన అంటే మా రక్తం లో నటన ఉందనో రాజకీయం ఉందనో అంటారు. అదెలా? సినిమాలూ వేరే విషయం అనుకోండి. ఒక గొప్ప నటుడి కొడుకు (ఫార్ దట్ మాటర్ కూతురు) సర్రిగ నటించకపోతే దేశానికి ఒచ్చే నష్టం ఏమీ లేదు. ఓ రెండు మూడు సినిమాలు తర్వత వాడ్ని అసలు ఎవ్వరు చూడరు. దానితో ఎవ్వరికి నష్టం లేదు. కాని రజకీయం ఇత్యాది వాటిల్లో అల జరగకూడదు. ఉదాహరణకి - ఒక గొప్ప వైద్యుడు ఉన్నడనుకుందాం. అతడు ఎన్నో యేళ్ళగా కృషి చేసి వైద్య తప్పస్సు చేసి మంచి హస్తవాసి ఉన్నవాడిలా పేరు సంపాదించడనుకోండి. అతడు పాపం ఒక రోజు ఆపరేషన్ చేస్తు మధ్యలో పోయాడనుకోండి అప్పుడు వెంఠనే జెస్ట్ అప్పుడే ఎంసెట్ రాసిన అతడి పిల్లడ్ని పిలిచి మిగితా ఆపరేషన్ పూర్తిచేయమని అంటారా? సపోస్ వాళ్ళ నాన్న కార్డియాలగిస్ట్ అయ్యిఉంటే ఇతడు ఆర్థోపెడిస్ట్ ఐనా కూడా లేదు లేదు వాళ్ళ నాన్న గొప్ప గుండె డాక్టర్ కాబట్టి ఇతడి రక్తం లో గుండెకోయడం వచ్చింటది అందుకే ఇతడే గుండె ఆపరేషన్ చేయాలి అని పట్టుబడతారా?
చెప్పోచేదేంటంటే ఇప్పటికైన ఈ వారస్త్వపు ఆలోచనలు మానేయాలి. ముకేష్ అంబానిని కూడా డైరెక్ట్ గా ఎం.డి చేయలేదు ధీరుభాయి. అతడికి మొదట్లో చిన్న చితక పనులు ఇచ్చి అది చేసాకే ప్రమోషన్ ఇచ్చాడు. కుమారమంగళం కథ కూడా అదే. సురేష్ బాబు కథ కూడా అదే. నటవారసుల సంగతి నాకు తెలీదు కాని మిగితావాటిలో వారసత్వం.. i am not that sure.
Sunday, May 17, 2009
ఒక్క రోజు తర్వాత..
నిన్న (అమేరికా టైం ప్రకారం) ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి లా అనిపించింది. రాష్ట్రం లో తెలుగుదేశమో, చిరంజీవో (అత్యాశ కాని లోక్ సత్తానో) వస్తుందేమో అని భావించా. మన ఆంధ్ర ప్రజలు నువ్వేమనుకుంటే నాకేంట్రా అని తిరిగి రాజశేఖర్ రెడ్డినే ఎన్నుకున్నారు. అలనే దేశం లో కాంగ్రెస్ రాదేమో బహుశా భా.జ.పా. వస్తుందేమో .. ఎదో చమత్కారం అయి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిపోతాడేమో అని అనుకున్న. ఆశ పడ్డ. కాని ఏం చేస్తాం.. మళ్ళ మన్మోహనుడినే ఎన్నుకున్నారు.
మొదట్లో అంటే ఎన్నికల ఫలితాలు ఇంకా వస్తున్న తరుణం లో కొంచం బాధవేసింది. నేను ఆశించింది జరగడం లేదని. నిన్న అంతా అలనే సాగింది. ఏంటో ఏంటో లాగా ఉండింది రోజంతా. ఈ రోజు ప్రొదున్న లేచుపాటికి దమాక్ కొంచం సరిపోయినట్టు ఉంది. ఫలితాలు చూసి అంతగా బాధ అనిపించలేదు. ఎందుకో రాష్ట్రం లో చెం.బా రాలేదు అని ఎక్కడో ఒక మూల కొంచం రిలీఫ్ గా అనిపించింది. ఎందుకో అర్థం కాలేదు. నేను జన్మతహా కాంగ్రెస్ వ్యతిరేకుడ్ని. ఒక్క శ్రీ పీ.వీ.నరసింహా రావు గారు తప్ప ఎవ్వరు నచ్చరు నాకు. అలాంటిది రాష్ట్రం లో వై.యెస్.ఆర్ కేంద్రం లో మన్మోహన్ రావడం అంత చెడేమి కాదని అనిపిస్తోంది. ఎందుకో తెలీడం లేదు.
కొంచం ఆలోచించగా రాష్ట్రం లో కాంగ్రెస్ రావడం కంటే ఎక్కువగా తె.రా.స ని చిత్తు చిత్తు గా కొట్టడం ఆనందంగా అనిపిస్తోంది. తెలంగాణా ప్రజలని స్వార్థం కోసం ఇన్ని యేళ్ళగా వాడుకొని విసిరేసిన కే.సీ.ఆర్ ని ఈ సారి కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు ప్రజలు. తెలంగాణా లో కాంగ్రెస్ కి మహాకూటమి కి సరిసమానంగా 54 సీట్లు రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే తెలంగాణా ప్రజలు రాష్ట్రానికి తెలంగాణా కి ఎదైన మేలు చేసేది వై.యెస్.ఆర్ ప్రభుత్వమే తప్ప కే.సీ.ఆర్ కాదని భావించినట్టు ఉన్నారు. మళ్ళా ఇక్కడ తెలంగాణా సాయుధ పోరటం తెలంగాణా ప్రజలు వేరు భాష వేరు గట్ర గట్ర అని ఎవరైన అనకముందే ఒక్క మాట చెప్పాలి. మా కుటుంబం కూడా ఆ నాడు జరిగిన పోరాటం లో పాల్గొన్నదే. త్యాగాలు చేసినదే. ఓ రెండొందల యేళ్ళ నుండి మా నాన్నమ్మా వాళ్ళు భాగ్యనగరంలో ఉన్నవాళ్ళే. అయినా నాకు విశాలాంధ్రే ఇష్టం. రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసుకోడం ఇష్టం లేదు. నా స్వభిప్రాయం. ఈ సారి తగిలిన దెబ్బ వళ్ళన ఇంక తె.రా.స సంగతి అయినట్టే అనిపిస్తోంది. మళ్ళ ఇంకో "నాయకుడు" వచ్చి స్వార్థానికి ఆశలు రేపి నట్టేట్లో ముంచేదాకా తెలంగాణా ప్రజలకి కొంచం విరామం.
ఇంక కేంద్రం లో.. నాకు ఈ రాష్ట్ర నాయకులు కేంద్రాన్ని బ్లాక్ మేల్ చేయడం అస్సలు నచ్చదు. గత పది యేళ్ళ గా ఇలాంటి స్వార్థలు వళ్ళనా దేశం ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన వలని వచ్చింది. ఒక ఎన్నికల భారాన్ని కూడా అధికంగా మోసింది. మాటి మాటికి ఆ కమ్యునిస్ట్ల చెత్త ని సేవించాల్సి వచ్చింది. హమ్మయ్య.. దెబ్బకి దరిద్రం ఒదిలింది. 60 నుండి 24 కి పడ్డ వాళ్ళ సీట్లని చూస్తే అబ్బో సంబరం పట్టలేకపోయా. నాకు బేసిక్ కా కమ్యునిస్ట్లన్నా ఫెమినిస్ట్లన్న పడరు. 60 సీట్లతో దేశాన్ని ఓ ఐదేళ్ళూ చీడపురుగుల్లా వేధించిన దానికి తగిన శాస్తే జరిగింది. ఇంక దేశాం నుండి శాస్వతంగా ఈ చెండాలం వెళ్ళిపోతే ఆ రోజు మనకి పెద్ద పండగే. పలిసీలకి చైనా ని సమర్థించే ఈ బూటకపు నాయకులని జైల్లో వేయాలి. ఆ అవసరం లేకుండా దేశ ప్రజలు వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. అలనే మిగితా లోకల్ రాష్ట్ర నాయకులని కూడా ఎక్కువగా ఎన్నుకోలేదు. కాంగ్రెస్ భా.జ.ప కలిపి 320-330 సీట్లు వచ్చాయి ఈ సారి. ఇద్దరి ఎకనామిక్ పాలిసీలు ఇంచు మించు ఒకటే అవడం వలన తొంభై శాతం దేశ భవిషత్తుకి మంచిదయ్యే పాలిసీలు సులువుగా నెగ్గుతాయి అనిపిస్తోంది. చూద్దాం. మధ్యలో ఎక్కడ ములాయాం ప్రధాని అయిపోతాడో అని టెన్షన్. హమ్మయ్యా అనిపించింది లెక్కలు చూసాక.
చివరిది ఎందుకో నాకు అద్వాని కంటే మన్మోహనే మంచి ప్రధానిలా అనిపిస్తాడు. అంటే అద్వాని ఎప్పుడు ప్రధాని కాలేదు అనకండి. ప్రధాని అయ్యింటే కూడా మన్మోహన్ అంత అయ్యిండేవాడు కాదు అని నా అభిప్రాయం. ఇవ్వన్నీ చూతే మన ప్రజలు బాగా ఆలోచించే వోటు వేసారనిపిస్తోంది. I seriously hope that is the case, and that we have turned a corner. చూద్దాం. ఒక్కటి మాత్రం అనిపిస్తుంది.. రాష్ట్రం లో పోయిన సారి చేపట్టినన్ని అభివృధి కార్యక్రమాలు మాత్రం జరగవు.. కేంద్రం లో పోయినసారి కంటే ఎక్కువ అభివృధి జరుగుతుంది అని. చూద్దాం.
Wednesday, March 25, 2009
కేవలం ఎనిమిది..
ఎనిమిది .. సంఖ్య చిన్నదే అయినా ఎంత తేడా చేస్తుందో. గెలుపుకి ఓటమికి తేడా 'ఒక్క ఇంచే' అని రాజీవ్ కనకాల అరిచి అరిచి చెప్పాడు.. అలాంటిది 8 అంటే కొంచం ఎక్కువే తేడా అనిపిస్తుంది. కాని 545 లో 8 అంత పెద్ద సంఖ్య కాదు. మన దురద్రుష్టం ఆ 8 అటు పడింది.. అదే ఇటు పడింటే కథే వేరుగా ఉండేది. ఎనిమిది సంఖ్య ప్రాధాన్యత గురించా ఈ టపా అనుకోకండి.. గత ఎన్నికల్లో ఈ సంఖ్య చేసిన తేడా గురించి చెప్తున్నా.
బహుసా చాలా మంది ప్రకారం మనం అంటే అంధ్ర ప్రజలు, దేశానికి నష్టం చేకూర్చాము. మన కష్టాలు మనకి ఉంటే ఇదేలా చేసాం అని ఆలోచిస్తున్నారా? ఇదేదో రాకెట్ సైన్స్ కాదు.. గత ఎన్నికల్లో కాంగ్రెస్స్ గెలిచిన ఏకైక 'పెద్దా రాష్ట్రం మనదే! చంద్రబాబు ని ముఖ్యమంత్రిగా చూసి చూసి బొరు కొట్టి మనం మారిస్తే దాని ప్రభావం యావత్ దేశం మీద పడింది.. ఆ 29 సీట్లే కాంగ్రెస్స్ ని లోక సభ లో అతి పెద్ద పార్టీ చేసింది. 29 కూడా కాదు కేవలం 8. (భారతీయ జనతా పార్టి కి 137 సీట్లు, కాంగ్రెస్స్ కి 145 సీట్లు వచాయి గత ఎన్నికల్లో). 9 యేళ్ళ తె.దే.పా పరిపాలన తో విసుగెత్తో చెం.బా. చేసిన అప్పులతో విసుగెత్తో మనం ఎదో మిగిలిన దిక్కుగా వై.యెస్.ఆర్ ని ఎన్నుకున్నం.. పనిలోపనిగా లోక సభ కి కూడా కాంగ్రెస్స్ కే వేసేసాం దానితో మొదలైంది కేంద్రం లో UPA పరిపాలన.
1989 ఎన్నికల నుండి చూస్తే కాంగ్రెస్స్ 1991 sympathy wave లో తప్ప ఎప్పుడు 200 సీట్లు దాటలేదు. పైపెచ్చు వోట్ల శాతం కూడా 1991 నుండి 30 దాటలేదు. 1996 నుండి అయితే 141 సీట్లని మించి రాలేదు.. ఐతే సోనియామ్మ కీ సీతారాం కేసరి కి తేడా ఏంటో? ఈ ప్రశ్న కి జవాబు కేవలం కాంగ్రెస్స్ వాదీయులే చెప్ప గలరేమో!! 2004 ఎన్నికల్లో చిన్న చితక రాష్ట్రాలని గెలుచుకొని 145 సీట్లు సాధించింది కాంగ్రెస్స్. అతి పెద్ద పార్టి కావడం వళ్ళ వాళ్ళనే ఆహ్వానించారు. ఈ సారి మన రాష్ట్రం లో 29 సీట్లు కాంగ్రెస్స్ కి రావడం చాలా కష్టం అనిపిస్తోంది. మహకూటమి, ప్రె.రా.పా సంగతి ఎలా వున్నా.. వై.యెస్.ఆర్ మరియూ జగన్ నిర్వాకాలు చూసి ఆంధ్ర ప్రజలు మళ్ళి వాళ్ళకే పట్టం కట్టడం కష్టం.
నా అంచనా ప్రకారం అయితే భా.జ.పా 180 సీట్ల కంటే ఎక్కువ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాని భారత ప్రజానికాని గురించి ఎం చెప్పగలం? ఐదేళ్ళు మోడి ప్రధానమంత్రి అయితే మన దేశ భవిషత్తే మారిపోతుంది. కాని అది జరగడం ఆసాధ్యంగా అనిపిస్తుంది. చూద్దాం. ఏ నిమిషానికి ఏమి జరుగునో....
Friday, March 20, 2009
క్రొత్త పార్టీ - భాగ్యనగర ప్రజా పార్టీ
పాత రోజుళ్ళో లాగ కాకుండా ఈ నాడు ఎంత తక్కువ సీట్లు ఉంటే అంత ఉత్తమం. లేకపోతే రెండే రెండు సీట్ల తో కమ్మునిస్ట్లు ఒర్రిస్సా లో చేసిన ఆర్భాటం చూస్తే వాళ్ళకి ఒక పాతిక సీట్లు ఉన్నయి అనిపిస్తుంది. నావీన్ పట్నయక్ కి బహుసా ఏం చెప్పలో అర్థం కావడం లేదేమో. లేకపోతే ఎన్నికల్లో 7 గెలుచుకున్న వాళ్ళకి ఈ సారి 35 కావాలట! కేంద్రం లో కూడా వీళ్ళ 60 మంద తో చాలా గోల చేసారు నాలుగేళ్ళు. బహుసా కమ్మున్స్ట్లకీ తెలుసనుకుంటా ఇంక జీవితం లో మళ్ళి ఇన్నేసి స్థానాలు గెలవరు అని. (నన్నడిగితే వాళ్ళ వల్ల నష్టమే కాని లాభం ఏమి ఉండదు).
నేనూ ఇలాంటిదే ప్లాన్ చేస్తున్నా.. తె.రా.స లా ఏదో ఒక sentiment ని రెచ్చగొట్టి ఒక 10 సీట్లలో గెలిస్తే 5 యేళ్ళల్లో కనీసం ఒక 2000-3000 ఎకరాలు + 40-50 కోట్ల రూపాయలు నొక్కేయాలని. చాలా సేపు ఆలోచించగా ఒక మహత్తరమైన ఉపాయం తోచింది. తెలంగాణా sentimentకోసం చాలా మందే కొట్టుకుంట్టూనారు.. అందుకని తెలంగాణా ఆధారంగా నా పార్టీ ని గెలిపించలేను.. so "జై భాగ్యనగరం" అంటున్నా!!! "భాగ్యనర రాజ్య పార్టీ" ని తదనుగుణంగా స్థాపిస్తున్న అని సభాముఖం గా తెలియజేస్తున్న.
(ప్రజా రాజ్యం లో రాజ్యం, భా.జ.పా నుండి పార్టీ, తె.రా.స నుండి ఆలోచన కొట్టేసీ పార్టీ పెట్టేసా - నా మేధస్సే మేధస్సు!)
మా పార్టీ మానిఫెస్టో ఇంకా ముద్రణ లో ఉండడం వళ్ళ ఆవిష్కరించలేకపోతున్న. కాని అగెండ లోని కొన్ని కీలక అంశాలు :
* భాగ్యనరాన్ని వేరే రాష్ట్రం గా చేయాలి. దానికి ముఖ మంత్రి నేనే అవ్వాలి. (ఈ విషయం లో ససేమిరా no compromise)
* ఇక్కడ కంపనీ పెట్టలంటే నాకు ముందుగా ఒక 100 ఎకరాల భూమి (మిగిలిన ఆంధ్ర రాష్ట్రం లో ఎక్కడైనా పర్లేదు) + 10 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడున్న కంపనీలకి కొంచం concession ఇస్తాము.
* ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళలో ఎవ్వరిని వెళ్ళగొట్టము లేండి - అంటే ఎవరైతే "హైదరాబాదు" ని "హైదరాబాదు" అంటారో వాళ్ళు నిస్సంకోచంగా ఉండచ్చు. "హైడ్రాబాడ్" అనేవాళ్ళకి మాత్రం మా "భాగ్యనర రాష్ట్రం" లో చోటు లేదు.
* ఇప్పుడున్న శాసన సభ స్థలం కావాలంటే భాగ్యనగరేతరులే పెట్టేసుకోండి. ఇంకా కావాలంటే తెలంగాణా శాసనసభ, ఖమ్మం శాసనసభ, రాయలసీమ శాసనసభ etc కి కూడా భాగ్యనరం లోనే చోటిస్తాము - ఎదో పెతీ యాడాదికో నెలకో వారానికో ఇంత అని పన్ను కట్టమంటమనుకోండి. అది వేరే విషయం.
ఇల ఇంక్కొన్ని అంశాలు ఉన్నయి మా అగెండాలో. ఏది ఏమైనా ఈ sentiment ని రెచ్చగొట్టి క్యాష్ చేసుకోవాలి ఈ ఎన్నికల్లో.. ఇంతటి అద్భుతమైన ఆలోచనా-ట్యాంక్ బండ్ల (ఆలోచనాతరంగాలు type) మా పార్టీ లో సభ్యత్వం కోరేవారు సంప్రదించ ప్రార్థన. (సభ్యత్వ ఫీసు just 116 డాల్లర్లు మాత్రమే - ఒక్కసారి 10 సీట్లూ గెలిచాకా అంతకంత సంపాదించచ్చులేండీ)
Monday, March 16, 2009
ఈ సారి...
మళ్ళి ఎన్నికల సమయం వచ్చేసింది. వోట్ల కోసం మన రాజకీయ నాయకులు పడే పాట్లని చూస్తూంటే భలే ముచ్చట్టేస్తుంది. నోటికొచ్చినన్ని మాటలు, కంటికి కనబడని వాస్తవాలు, విపరీతంగా అప్పుచేసిన సరిపోని వాగ్ధానాలు - ప్రతీ పార్టి అదే పద్దత్తి. ఈ టపలో నేను ప్రతి రాజకీయ పార్టీ ని విశ్లేసించడం లేదు చేస్తానని వాగ్ధానం కూడా చేయడం లేదు.. కేవలం నా అభిప్రాయం మాత్రమే చెబుతున్న.
మొదట్లో చిరంజీవి పార్టి పెట్టినప్పుడు తిరుపతి లో అతని మాటలు విని చాలా ఆనందించాను మొట్టమొదటి సారి ఎవరైన కులాల గురించి కాదు ఆర్థిక వర్గాల గురించి మాట్లాడారు అని.. పోలీసుల గురించి వారికి అందించాల్సిన సదుపాయాల గురించి మాట్లాడారు అని.. కాని అదంతా కేవలం ఆ speech కే పరిమితం అయ్యయి అని తెలుసుకునేదానికి ఎక్కువ సమయం పట్టలేదు. పేరుమోసిన గూండాలు వేరే వేరే పార్టీల నుండి వలస వచ్చిన రాజకీయవేత్తలని చూస్తే అర్థం అవుతుంది ప్ర.రా.పా మిగిలిన వాళ్ళ లాగానే మరొకటిగా మరిందని. దానికి తోడు ఉచిత వాగ్ధానాలు. అబ్బో ఇంక వాటి గురించి ఎంత తక్కువ చెబితే అంథ మంచింది. దానికి తోడు ప్రతి విషయం లో జాతిని బట్టి మాట్లాడ్డం.. కొత్తదననికి తావు లేకుండా భలే set చేసేసారు. కొత్తదనం అంటే గుర్తొచింది.. ప్రె.రా.పా కొత్తగా రాజకీయాల్లోకి తెచ్చింది - direct గా బూతులు తిట్టుకునే పద్దత్తి. రోజ - శోభ ల మాటలు వింటే తెలుగు తెలిసినందుకు, దేవుడు కనులకి రెప్పల్లు ఇచ్చినట్టు చెవులకి మూతలు ఎందుకు ఇవ్వలేదనందుకు (జై జంధ్యాలా) బాధ వేస్తుంది. వీళ్ళు మనని పరిపాలిస్తారట!! బూతులు ఎంత వస్తే అంత త్వరగా సీటు ఇస్తరేమో..
పోతే.. (అంటే నేనో ఇంకొకళ్ళో కాదు సుమీ) తె.దే.పా, కాంగ్రెస్స్ గురించి చెప్పనే చెప్పక్కరలేదు. వాటి గురించి అయితే ఒక్కొక్కొదానికి ఒక్కొక్క టపా తప్పదు. కమ్యూనిస్ట్ల గురించి అయితే వాళ్ళకి pro-china అని ఏది అనిపిస్తే అదే వాళ్ళ మానిఫెస్టో.
ఇంక మిగిలింది లోక్ సత్తా. జేబులో దారిద్ర్యం ఉన్న ఆలోచనా దారిద్ర్యం లేని ఏకైక పార్టి. రాష్ట్రం గురించి దేశం గురించి ఆలోచిస్తున్న పార్టి. వీళ్ళు చండలమైన వాగ్ధానాలు చేయలేదు.. చేయలేరు కూడా. రాజకీయాల్లో నిజాయతీకి తావు లేదు అని చెప్పెడానికి ఇదొక్కట్టే సరిపోతుంది. పాపం campaign కి కూడా సరిగ్గా డబ్బులు లేని పార్టి..కాని దేశం పురోగతి చెందాలంటే వీళ్ళకే వోటు వేయాలి. ఒక్క సీటు గెలవకపోయినా మనఃసాక్షి గెలుస్తుంది అని నా అభిప్రాయం. మన రాష్ట్రాన్ని / దేశాన్ని ఇంకా అప్పుల్లో ముంచేవాళ్ళకి వోటు వేయలేదు అన్న సంత్రుప్తైనా వస్తుంది. అందుకే ఈ సారి నా వోటు వీళ్లకే.