పాత రాష్ట్రం కొత్త పథం - 2
3. మన రాష్ట్రం లో విద్యుత్ కొరత అంతగా ఉండదు. కాని అవకాశం ఉన్నప్పుడే ఇంకా అభివృద్ధి పరచడం మంచిది కదా! అందులో క్రొత్త రాజధానికి విద్యుత్ చాలా అవసరం ఔతుంది. ఇవ్వన్నింటిని దృష్టి లో పేట్టుకొని శ్రీకాకులం లో అణు శక్తి విద్యుత్ ప్ల్యాంట్ కి శ్రీకారం చుట్టాలి. హైదరాబాదు కి కూడా విద్యుత్ శక్తి అవసరం పడుతుంది.. ఆ రాష్ట్రానికి కూడా ఆంధ్ర నుండి విద్యుత్ అమ్మవచ్చు.
4. గోదావరి, కృష్ణమ్మల మీద ఆనకట్టలు నిర్మిస్తే చాలా ప్రమాదం మనకి. ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలున్న చోత drip irrigation ని ప్రోత్సహించాలి. ఈ పద్ధతికి అనుకూలంగా అన్నదాతలకి రుణాలు సదుపాయాలు ఇవ్వాలి.
5. కనీసం ఒక ఐదు - పది సంవత్సరాలు ట్యాక్సులు ఉండవు కనుక ఆంధ్ర లో head quarters పెట్టాలని అనుకునే కంపనీలు ఇక్కడి ప్రజలకు కూడా ఉద్యోగాలు సమకూర్చే విధంగా చేయాలి.
6. ఈ విభజన వల్ల అందరికంటే ఎక్కువగా నష్ఠపోయింది విద్యార్థులే. అందునా పది - ఇంటర్ చదువుతున్న వారు ఎందుకంటే వీరికి ఇంక హైదరాబాదు లోని మంచి కళాశాలల్లో చేరాలేరు [JNTU Hyderabad, CBIT, Vasavi మున్నగునవి]. రాష్ట్ర పురోగతి వీరి మీదే ఆధారిపడి ఉంది కాబట్టి క్రొత్త / పాత కళాశాలలు ఆ లోటుని భర్తీ చేసేట్టు చూడాలి. అమేరికా, ఐరోపా, చైనా, జపాన్ లోని top universities తో ఒప్పందం కుదుర్చుకొని ఆ కళాశాలల్లోని professors ని మన రాష్ట్రాంలో [ఒక 1-2 సంవత్సరాలకి] చదువు నేర్పించమని అభ్యర్తించాలి. అలనే జాతీయ అంతర్జాతీయ కంపనీలతో ఒప్పందం కుదుర్చుకొని వారికి కావాల్సిన research ని చేసే సదుపాయాములని కలిగించాలి. ఇలా చేయగలిగితే పది - పదిహేను సంవత్సరములలో మన కళాశాలలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.
ఇవ్వన్ని చేయాలంటే ప్రథమంగా లంచగుండీ తనం తగ్గాలి. పోలీసు యాంత్రంగం సక్రమంగా ఉంటే మిగిలిన చోట్ల అదుపు చేసే ఆస్కారం ఉంటూంది. అందుకు పోలీసు వ్యవస్థకి కొన్ని అధిక, ఆధునీక సదుపాయాలు కలుగచేయాలి. మచ్చుక్కి - ఆర్మీ లాగా వస్తువులని చౌకగా అందజేయాలి. వారి కుటుంభ సభులకి కాలేజీల్లో కొంత reservation లాంతికి ఇవ్వాలి. ఇలాంటివి అన్నమాట.
------
నేను రాసినవి నాకు తోచిన కొన్ని అంశాలు మాత్రమే. ఒక్కసారి అనుకోవాలే కాని మన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక స్వణాంధ్రగా ఒక హరితాంధ్రగా తీర్చిదిద్దగలం!
పై చెప్పినవి సులభం అని నేను అనడం లేదు భావించడమూ లేదు. కాని పోయినదాని గురించి బాధపడుతూ ఉండటం కంటే ఉన్నదాన్ని ఎలా అభ్యుదయ పరచాలో ఆలోచిస్తే ఉత్తమం అని నా అభిప్రాయం. మహాకవి శ్రీ శ్రీ అన్నట్టు అగాధమౌ జలనిధి లోనే ఆణిముత్యం ఉన్నటులే శోకాల మడుగున దాగి శుఖమున్నదిలే...
Read more...
Tuesday, December 22, 2009
ఒక తెలుగు వాడి క్షోభ.
జీవితం లో మొదటి సారి తెలుగువాడైనందుకు సిగ్గు గా ఉంది.. ఇంత ద్వేషం నా జన్మలో ఎప్పుడూ చూడలేదు. మండల్ కమీషన్ అప్పుడు కూడా గొడవలు జరిగాయి కాని ఈ స్థాయిలో ద్వేషం మాత్రం ఎప్పుడూ చూడలేదు. నాలుకలు కోస్తాం అని ఒక నాయకుడు అనడం ఎంత చండాలంగా ఎంత నీచం గా ఎంత దరిద్రం గా ఉందో మాటల్లో చెప్పలేను. ఒక్కడు చేసిన పనికి.. ఒక్కడు వాడి స్వార్థం కోసం మొదలెట్టిన పని ఇన్ని కోట్లమంది కడుపు కొడుతోందో. ఎన్ని వేల కోట్ల వ్యాపార నష్టం .. ఎన్ని జీవితాల నష్టం.. ఎన్ని కోట్ల ఆశ్తి నష్టం.
దీనివళ్ళ ఒరిగింది ఏంటి? ఎవరికి ఏమి ఒరిగింది? హైదరాబాదు లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టరు. ఎంచక్క పక్క రాష్ట్రాలకి వెళ్తారు. ఇంకో పదేళ్ళు ఇటు వైపు కుడా చూడరు.. అదృష్టం బాగుండి అప్పటికి ఓ మంచి నేత వస్తే మళ్ళా హైదరాబాదు గత వైభవం రావచ్చు... లేకుంటే ఒకప్పటి పాట్నా ఎందుకు పనికిరాకుండా పోయేట్టు పోవచ్చు. చెప్పలేము. అప్పుడు కోస్తా సీమ వాళ్ళే కాదు తెలంగాణా వీరులుకూడా హైదరాబాదుకి రారు.. వచ్చి ప్రయోజనం ఉండదు కనుక.
ఎవరో తెలుగుతల్లి ని దూషించారు.. ఇంకొంతమంది అమరజీవి పొట్టి శ్రీరములని తిట్టిపోసారు.. చెప్పుల హారం వేసారు.. ఇంకొంతమంది అమ్మవారికి మాండలీకం అంటగట్టారు.. కోస్తా నుండి వచ్చింది అని ప్రసాదం స్వీకరించలేదు... వెంకన్న సీమలో వెలసి ద్రోహం చేసాడు అని సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన వేంకటేశ్వరున్ని అనరాని మాటలన్నారు. థూ మీ బ్రతుకులు... అన్నింటిలోనూ అన్ని చోట్ల అణువూఅణువున ఉండే ఆ దైవానికే ప్రదేశాలు అంటగట్టి దూషించేవాళ్ళకి బుద్ధి ఉంటుంది వస్తుంది అని నేను ఆశించను. ఇంత ద్వేషాన్ని నేను ఎప్పుడు చూడలేదు. తెలుగు జాతి అనేది ఈ క్షణం అంతరించిపోతే బాగున్ను అనిపిస్తుంది. అంత సిగ్గు పడుతున్నాను. "ఆత్మ గౌరవం" అనేది ఇంకో సారి అనకుండా అదః పాతాళానికి తొక్కేసాము. ఇన్నేళ్ళా పురోగతి ఒక్క నెలలో ఒక్కడి దీక్షా నాటకం వలన నాశనం అయిపోయింది. ప్రతి తెలుగు వాడు ఆంధ్రూడే అని గ్రహించని మూర్ఖులకి ఏం చెప్పగలం?
రాజకీయ స్వార్థం కోసం రచించిన ఈ దరిద్ర నాటకానికి తెర ఎప్పుడు ఎలా పడుతుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. దీనివళ్ళ ఎవరికి ఏం ఒరుగుతుందో తెలీదు. ఇంత స్వార్థం ద్వేషం మాత్రం యే జాతికి పట్టకూడదు. కాని ఒక్కటి మాత్రం నిజం తెలుగువాదైనందుకు జీవితం లో మొట్టమొదటిసారి సిగ్గు పడుతున్నాను. శాస్త్రి గారి 'తలయెత్తి జివించు తమ్ముడా తెలుగునేలలో జమ్నించినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని" అని మాత్రం ఈ జన్మలో పాడలేము. ఇంత నెగటివిటి (negativity) నేను భరించలేను. తెలంగాణా వచ్చినా రాకున్నా.. ఆంధ్ర రాష్ట్రం ఉన్నా లేకున్న.. i just will not give a hoot anymore. నేను పట్టించుకోకుండ ఉన్న్న మాత్రానా ప్రపంచానికి ఒరిగేది ఏమీ లేదు.. కాని at the very least I wont be a part of that negativity. అంతే చాలు నాకు.
జై తెలుగు తల్లి.
Thursday, December 10, 2009
అనుకోనిదా? కోరుకున్నదా?
తెలంగాణా ఇస్తాం అన్న వ్యాఖ్య తో భగ్గుమన్నది ఆంధ్రావణి. ఇప్పటికి 112 MLAలు, 5 MPలు రాజీనామాలు చేసారు. పదకొండు రోజులుగా తెలంగాణా హోరెత్తున్నా ఏమి అనని మిగితా రాష్ట్రం కేంద్రం అల అనేసరికి భగ్గుమంది. పార్టిలకి సంబంధం లేకుండా 112 మంది రాజీనామాలు చేసారంటే చూసి ముచ్చటేస్తోంది. తెలంగాణా కి చెందిన కొంతమంది MLAలకి అలా చేయాలని ఉన్న.. పాపాం చేయలేరు. ఇగ మిగిలింది గ్రేటర్ MLAలు. వాళ్ళు కూడా రాజీనామా చేస్తే బాగున్ను.
దెబ్బకి మిగితా రాష్ట్రం వాళ్ళు కూడా అడగడం మొదలెట్టారు. పైనుండి మొదలుకొని చూస్తే:
1. బెంగాల్ లో గోర్ఖాల్యాండ్
2. బీహార్ + మధ్య ప్రదేశ్ + ఉత్తర్ ప్రదేశ్ కొన్ని ప్రదేశాలు కలిపి బుందేల్ఖండ్
3. ఉత్తర్ ప్రదేశ్ కొన్ని భాగాలతో హరిత్ ప్రదేశ్
4. గుజరాత్ లో సౌరాష్ట్ర
5. మహరాష్ట్ర లో విధర్బా
6. కర్నాటక లో కూర్గ్
7. తమిళనాడు - ??? వీళ్ళకి వేరు దేశం కావాలేమో మరి.
ఇవి సాధించడం పిచ్చ వీజీ కద. కె సి ఆర్ చూపిన దారి ఉంది కద. ఆయా ప్రదేశాల ఏం.పీ లు ఓ పది రోజులు సలైన్ పెట్టుకొని నిరాహారదీక్ష చేస్తే చాలు. ఇవ్వన్ని చాలా చాలా యేళ్ళ నుండి అడుగుతున్నవే. ఈ రోజేమి కొత్త కాదు. కాని తెలంగాణా ఇస్తాము అనడం వళ్ళ అన్ని మొదలయ్యాయి.
ఈ పరినామం కాని, ప్రతినిధుల రాజీనామాలు కాని అస్సలు ఊహించనిది కానేకాదు. రాష్ట్రాన్ని విభజిస్తాము అంటే మిగితావాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? It makes perfect sense to the way they reacted. They owe nothing to Telangana.. but everything to Visalandhra. కొందరు వ్రాశారు కేంద్రానికి మంచి షాక్ తగిలింది అని. కాని నాకు అనిపిస్తోంది ఇది వాళ్ళు కోరుకున్నదే అని. అటు మేము తెలంగాణా ఇచ్చేదానికి ఒప్పుకున్నాము కాని ప్రజలు ఒప్పుకోలేదు అని అనవచ్చు. అటు ఇచ్చినట్టు ఉంటుంది ఇటు ఇవ్వనట్టు ఉంటుంది. ఇచ్చారు అని తెలంగాణా ప్రజలు ఆనందిస్తారు ఇవ్వలేదని విశాలాంధ్ర ప్రజలు హర్షితారు. భలే భలే!! నష్టపోయింది అదిగో కె సి ఆర్ గిమిక్కులు చూసి ఆత్మహత్య చేసుకున్న వాడి కుటుంబం. రాజకీయనాయకులకి ఎప్పుడు నష్టం రాదు. జరగదు.
ఒక "మేధావి" అన్న మాటలు - ఇన్ని రోజులు రాజకీయనాయకులు దోచుకొని కోస్తా లో పెట్టుబడి పెట్టి కోస్తా ని అభివృద్ధి పరచారు అట. ఇప్పుడు తెలంగాణా వస్తే దోచుకున్న సొమ్ము తెలంగాణాలోనే పెడతారట. అందుకే వేరు రాష్ట్రం కావాలి అట. ఆ లాజిక్ నాకు అర్థం కాలేదు - ఇప్పుడు కూడా దోచుకొని కోస్తాలో పెట్టుబడి పెట్టచు కద? తెలంగాణా కి వేరు "రూపాయలు" లేవు కద? కొత్తగా రాష్ట్రం వచ్చినా వాడేది "ఇండియన్ రుపీ" నే కద? తెలంగాణా వస్తే అన్నల రాజ్యం ఎక్కువతుందేమో ఎందుకైన మంచింది అని పూర్వము కంటే ఎక్కువ డబ్బులు వేరే చోట పెట్టుబడి పెట్టడని నమ్మకం ఏంటి? ఆ వేరే చోట వేరు రాష్ట్రం కూడా అవ్వచ్చు కద? ఏంటో ..
ఈ గోల వళ్ళ హైదరాబాదు లో కాని మిగితా రాష్ట్రం లో ఎవైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకున్నవాళ్ళు ఇగ చేయరేమో. దాని వళ్ళ తెలుగువారందరికి నష్టమే. అంత ఆలోచనే ఉంటే ఇదంత ఎందుకు జరుగుద్ది? ఇక ముందు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. . కాని ఈ పరినామం మాత్రం ఊహించనిది అంటే నమ్మబుద్ధి కావడం లేదు.
Tuesday, November 17, 2009
ఒక గోడ - ఒక సామ్రాజ్యం - ఒక రాష్ట్రం.
ఇరవై యేళ్ళు. ఒక్క గోడ రెండు దేశాలు. ఆ గోడ ని కూల్చి మళ్ళా ఒక్క దేశం గా ఆవిర్భవించింది. ఇంతక ముందు కంటే పెద్దగా ఒక్కటైంది. ఈ టప ఒక్కటైన జర్మనీ గురించి కానే కాదు. గోడ కూలడం తో ఆరంభమైన సామ్రాజ్య పతనం గురించి. ఎనభై యేళ్ళు అవిచ్చిన్నంగా ఎదిగిన రష్యా ... క్షమించాలి సోవియట్ యూనియన్ చిన్నభిన్నం అవడం మొదలైంది బెర్లిన్ వాల్ కూలడం తోనే. కాని దానికి నాంది మాత్రం ఆఫ్ఘన్ లో కాలుపెట్టడమే. అంతక ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంచక్క అన్నింటిని రేషన్ చేసి నెట్టుకొని వస్తున్న యూనియన్ ఆఫ్ఘన్ లో అడుగుపెట్టిన తర్వత ఏది సరిగ్గా చేయలేకపోయింది.
ఐనా ఆఫ్ఘన్ లో వాళ్ళంతటవాళ్ళే వెళ్ళలేదు కద.. అప్పటి ఆఫ్ఘన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వీళ్ళు పాపాం వెళ్ళారు. 79 లో. కనిపించిన చిన్న చిన్న గుడిసెలు సైతం సైతాన్నుల్లాగా పేల్చేసారు. ఇసుకని గుప్పెట్లో బంధించే ప్రయత్నం లానే ఇది విఫలమైంది. కాని దాని ప్రకంపణలు క్రెంలిన్ లో కనిపించాయి. రేషన్ చేసి అన్నింటికి కోట (quota) లెక్కన అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే ప్రభుత్వం ఇంక ఏమీ చేయలేకపోయింది. చేసేదానికి డబ్బు లేకుండా పోయింది. ఒక్కసారి ఈస్ట్ జెర్మని వెస్ట్ లో చేరిపోయాక యూనియన్ లోని మిగితా దేశాలు కూడా స్వతంత్రం అడిగాయి. ఇంక ఇవ్వకతప్పలేదు కద... Nov 09, 1989 బెర్లిన్ వాల్ ని కూలద్రోసారు. సోవియట్ యూనియన్ ఇంకో రెండు సంవత్సరాలు బ్రతకగలిగింది... అది విరిగి 15 కొత్త దేశాలు ఆవిర్భవించాయి. ప్రపంచం లో అతి పెద్ద కమ్యునిస్ట్ దేశం గా రష్యా పోయి చైనా అయ్యింది. మన దేశం కూడా అదే సమయం లో సోషలిస్ట్ / కమ్యునిస్ట్ ఛాయలనుండి సురక్షితంగా బయటపడింది... శ్రీ పీ.వీ మేధస్సు తో.
ఒక్క రాష్ట్రం తప్ప. మన దేశం లో ఆ ఒక రాష్ట్రం లో గత 30 సంవత్సరాల నుండి ఒకటే పార్టి పరిపాలిస్తోంది కద.. పాపం ఒక్కప్పుడు చాలా విషయాల్లో ముందంజ లో ఉన్న ఆ రాష్ట్రం ఇప్పుడు టిక్కు టిక్కు అంటూ నెట్టుకొస్తోంది. అంటే కమ్యునిస్టేతర రాష్ట్రాలు బాగుపడ్డాయా అంటే అది నిజం కాదు.. బీహర్, ఉత్తర ప్రదేశ్ వాటికి ఉదాహరణలు.. కాని నకు కమ్యునిస్ట్లన్న ఫెమినిస్ట్లన్న పడరు. కమ్యూనిస్ట్లు చైనా తో యుద్ధం అప్పుడు చైనా కి సపొర్ట్ ఇచ్చారు. ఆ ఒక్క విషయం చాలు వాళ్ళని దేశం నుండి బహిష్కరించేదానికి. ప్రగతికి అడ్డంకులు.. అందుకే వాళ్ళంటే నాకు పరమ చిరాకు. ఏం సాధించారో ముఫై యేళ్ళళ్ళో నాకైతే తెలీదు. ఇన్వెస్ట్మెంట్స్ లేవు.. సరిగ్గ పని చేసేవాళ్ళు లేరు .. పెద్దగ ఒరిగింది కూడా లేదు. ఒకప్పుడు అగ్ర రాష్ట్రాల్లో ఒక్కటిగా ఉండినది ఇప్పుడు బీహార్ కంటే కొంచం మెరుగ్గా ఉంది అట. మొన్న జరిగిన లోకల్ ఎన్నికల్లో అస్సెంబ్లీ ఉప ఎనికల్లో కొంచం వెనుకపడింది సి.పి.ఎం. చూద్దం ఈ సారి ఎన్నికల్లో గెలుస్తుందో లేక చివరికి బెంగాల్ కి కూడా మంచి రోజులు వస్తయో లేదో అని.
క్యాపిటలిజం గొప్పది అనో సర్వరోగ నివారణి అనో నేను అనడం లేదు. అనేంత తెలివి కూడా నాకు లేదు. కాని కమ్యునిస్ట్ కంటే యే రోజైన క్యాపిటలిస్ట్ సొసైటి బెటెర్ అని నా అభిప్రాయం. వాక్ స్వాతంత్రం కదిలే స్వాతంత్రం నాకు చాలా ముఖ్యం. ఒక్క మాట ఎవరినైన అంటే రాత్రి ఎవడొచ్చి తలుపు కొడతాడో ఎక్కడ క్యాంపుల్లో పడేస్తారో అని భయపడాల్సిన అవసరం ఉండదు. డెమాక్రసి అలాంటిది. కమ్యూనిస్ట్ అంటే ఒక మాట చెప్పాలి - పని ఎవడి శక్తి కొలది వాళ్ళు చేయాలి పరిహారం మాత్రం అందరికీ సరిపోయేంతే అనే ముష్ఠి భావన మీద బేసైన ఎటువంటి "ఆలోచన" ఐనా నాకు చిరాకే. నేను చేసే పనికి తగినంత పరిహారం నాకు కావాలి. నేను 12 గంటలు కొట్టించుకొనీ.. నా పక్కనోడు ఓ గంట చేసి ఇద్దరికి ఒకటే జీతం అంటే లాగి కొట్టలనిపిస్తుందా లేదా? ఎమైన అంటే ప్రపంచం బాగు కోసం అని అనడం ఇంకో పెద్ద బూతు. నాకు పని చేయాలి అని అనిపిస్తే కద నేను, నా ఇల్లు, నా ఊరూ నా దేశం నా ప్రపంచం బాగుపడేది? అసలు నేను ఎంత కొట్టించుకున్నా నాకు మిగిలేది చిప్పే అంటే నేనెందుకు పని చేయాలి? ఎందుకు చేస్తా? ఈ చిన్న ముక్క బుద్ధి లేకుండా అసలు ఆ కాన్సెప్ట్ ఎలా నెగ్గిందో నాకు ఐతే అర్థం కాదు. ఏదైతేనేమి ఇంకో ఇరవై సంవత్సరాల్లో . బెంగల్ వాళ్ళకి బుద్ధి రాకపోద్దా..మన దేశం మారకపోద్దా. చూద్దాం. ఆశిద్దాం.
గమనిక: ఇది నా బ్లాగు. నాకు నచ్చని వాటి గురించి నచ్చిన వాటి గురించి రాస్తాను. కార్ల్ మార్క్స్ దేవుడు లెనిన్ ఇంకో దేవుడు. స్టాలిన్ మావో లు దేవుని ప్రతిరూపాలు గట్ర గట్ర అని అనాలనుకుంటే దారి అటు --> ఇక్కడ కాదు. నా దృష్టి లో లాలూ ములయం మాయవతి కంటే తక్కువ పింకోలు .. వాళ్ళని చూస్తే at least చెప్పచ్చు దేనికి పనికిరారు అని.. వీళ్ళు అల కాదు. మరోసారి చెప్తున్న ఈ టప కమ్యునిస్ట్ టప లాంటిది.. వ్యతిరేకిస్తే కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పడేసి కుర్చి కి కట్టేసి వివాహ్ సినెమా చూపిస్తా. కేసు బోనస్!! ఖబర్దార్!.
Sunday, November 15, 2009
సెన్సార్ కత్తెరా మజాకా!!
నాకు చాలా రోజులనుండి ఓ అనుమానం.. ఇంతకీ మనకి సెన్సార్ బోర్డ్ అవసరమా? ఈ ప్రశ్న మొన్న "మహాత్మ" లో ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా అనే పాట మీద సెన్సార్ కత్తెర పడింది అని తెలిసినప్పుడు ఇంకా తీవ్రం గా ఆలోచిస్తున్నా. అంటే ఇందిర గాంధి ని ఏమైన ఓ మాట అంటే అది తప్పైపోద్దా ? అందుకని తీసేయాలా ? ఇదెక్కడి అన్యాయం? నిన్నేమో లీడర్ సినెమాలో వై.ఎస్.ఆర్ ది ఏదో స్పీచ్ ఉందని తీసేమన్నారు అట. అదేంటో ఎందుకో అర్థం కాలేదు నాకు. ఇంక పేరు - reference కూడా తీసేయమంటారేమో ఇంకొద్ది రోజుల్లో. అసలు మనది ప్రజాస్వామ్యమేనా అని అనుమానం వస్తుంది. బహుశా పేరుకి మాత్రమే ప్రజాస్వామ్యం.. పద్ధతి మాత్రం రాచరికమే!!
కాదంటారా? ఒక్క సారి చుట్టు చూసుకోండి. ఒక మంత్రి చనిపోతే అతడి కుటుంబ సభ్యులకే ఆ పదవి ఇస్తారు. ఇవ్వకపోతే బస్సులు తగలెడతారు. ఓ రజకీయ నాయకుడి మీద.. అంటే అతడు ఉన్నా పోయినా ఓ మాట చెడ్డగా రాస్తే ఇంక ఐపోయినట్టే. అసలు అతడు బ్రతికున్నప్పుడు మొహం మీద ఓ మాట అంటే అతడు కూడా ఏమికునేవాడు కాకపోవచ్చు కాని అనుచరులు మాత్రం నానా రబస చేస్తారు. సొంత అమ్మ బాబులని అంటే కూడా అంతగా బాధపడరేమో అని అనిపిస్తుంది. ఈ విషయం లో ఇందిరమ్మ ఇంటిపేరు నిజంగానే గాంధి కాదు.. కాని ఆ వాస్తవాన్ని చెప్పినందుకు .. ప్రజలకి గుర్తుచేసీనందుకు కత్తెర పడింది. ఇది మన దేశ పరిస్థితి. ఇప్పుడే కాదు గత అరవై సంవత్సరాల నుండి ఇలనే ఉంది. యే విషయం అయినా సరే ప్రజళ్ళో ప్రజలతో చర్చ అనేది శూన్యం. ఒకడు ఎవడో "ఇది ఇలా చేయాలి" అని శాశిస్తాడు. మిగితా వాళ్ళు శిరసావహిస్తారు. అది మంచో చెడో అని తర్కించకుండా. వేల సంవత్సరాల నాటి రాచరికం గుర్తులు అయ్యిండచ్చు.
సెన్సార్ అనేది వేరొకరిని కించపరిస్తేనో అసభ్యకరంగా మాట్లాడితేనో నియంత్రించాలి తప్ప ఇల ప్రతి ఒక్కదానికి అడ్డుగా నిలవడం సమంజసం కాదు. వాక్ స్వతంత్రం ఎలాగో మనకి లేదు. మన దేశం లో పేరుకి మాత్రమే ఉండే స్వతంత్రాల్లో ఇదోటి. పొరబాటున ఎమైన రాస్తే పబ్లిక్ గా ఏమి జరగకపోయినా లోపల లోపల రాసినోడు గల్లంతు అయిపోతాడు. అంత స్వతంత్రం ఉంది మనకి. ఐనా నేనేం చూడాలో ఎలాంటిది చూడాలో నిర్ణయించేదానికి సెన్సార్ ఎవరు? నేనేమైన చిన్నపిల్లాడినా ఇది చూస్తే చెడిపోతా అది చూస్టే బాగుపడతా అని అనుకునేదానికి? ఇంకో విధం అంటే థియేటర్ లో టికెట్లు ఇచ్చేటప్పుడే కొంచం జాగ్రత్త పడ్డం. అంటే స్కూల్ పిల్లలని "A" సినెమాల్లోకి రానివ్వకపోవడం అన్నమాట. అసలు ఆ సర్టిఫికేట్లకి చూసేవాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదే!! ఉంటే అరుంధతి లాంటి వాయిలెంట్ సినెమాకి చిన్న చిన్న పిల్లల్తో రావడం ఎంటి? ముందే దానికి తాటికాయ అక్షరాలతో రాసారు "A" అని.
మన జనత కూడా మంద లా కాకుండా అప్పుడప్పుడు కొంచం niche లా ఆలోచిస్తున్నారు. మారుతున్న రుచులకి అనుగుణంగా చిత్రాలు వస్తున్నాయి. అందుకే అసలు ఆ సెన్సార్ని లేపేసి రేటింగ్ బోర్డ్ ని పెడితే సరి. అడ్డమైన చెత్త పిల్లలు చూడకుండా చూసే పూచి థియేటర్ మీద పెట్టాలి. అడ్డమైన చెత్త అంటే రోజు టీ.వీ లో వచ్చేదానికంటే తక్కువే!! యే డాన్స్ కార్యక్రమం ఓ ఐదు నిమిషాలు చూస్తే మీకే అర్థం ఔతుంది. థూ.. అసలు 4-5 యేళ్ళ పిల్లలు అంత వల్గర్ స్టెప్పులేస్తుంటే నా జీవితం మీదే కాదు అలా వేస్తున్న చప్పట్లు కొట్టే వాళ్ళ అమ్మ నాన్నల జీవితాల మీద కూడా విరక్తి కలుగుతుంది. వాటితో పోలిస్తే మన "A" సినెమాల్లో చెత్త ఇంకా తక్కువే. కుటుంబ సమేతంగా చూసేదానికి శేఖర్ కమ్ములా, కే. విశ్వనాథ్, కృష్ణా రెడ్డి తదితరుల సినెమాలు ఉండనే ఉన్నాయి కద. మిగితా వాటిని కూడా "కుటుంబ సమేతం" చేయడం ఎందుకు?
ఇది నా ఓన్-సొంత-పర్సనల్ అభిప్రాయం. అలకాదు ప్రతి మాటకి కత్తెర పడాలి అంటే ఇంక అనేది ఏమీ లేదు. నా దృష్టిలో మాత్రం సెన్సార్ బోర్డ్ సుద్ధ దండగ. కించ పరిస్తే మరోకరిని గాయ పరిస్తే వేరే విషయం కాని చిన్నా చితక రెఫరెన్సుల్ని కూడా పట్టించుకొని ప్రతి సినెమాని చెడగొట్టడం మాత్రం మంచిది కాదు అనే అంటాను.
Friday, October 30, 2009
పాక్ లో కలకలం.. ఆనందమా? ఆలోచనా ?
ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదు. ఒక వైపు ఆనందం గా ఉన్నా మరో వైపు పాపం వాళ్ళు మనలాంటి ప్రజలే కదా అని అనిపిస్తుంది. ఇన్నేళ్ళు మన దేశం మీద పన్నిన కుట్రకి జరిపించిన మారణహోమానికి తగిన సాస్తే జరుగుతున్నట్టు అనిపిస్తోంది.. కాని ఉగ్రవాదానికి ఇటువైపు ఉండి అనేకానేక దాడులని తట్టుకొని ఉండడం వళ్ళేమో కొంచం .. అంటే చాలా చాలా చాలా చిన్నమోతాదులో .. బాధ కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఎవరు తొవ్విన గొయ్యిలోకి వాళ్ళే పడతారు అని మరోసారి రుజువైనట్టుంది. మన దేశాన్ని ముక్కలు ముక్కలు గా చేయాలి అని చాలా యేళ్ళు ప్రయత్నించి అటు కాశ్మీరంలో, పంజాబ్లో, మన రాజధానిలో, సిమి లాంటి దేశద్రోహులకి అన్ని విధాలుగ సహాయం ఇచ్చి లక్షల మందిని పొట్టనపెట్టుకున్న పాప ఫలమేమో ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్న మారణహోమం. ఇందులో మన హస్తం పెద్దగ లేదనిపిస్తుంది. అసలు అవసరమే లేదనిపిస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ పైన సోవియట్ల దాడి చేసాకా కొద్ది రోజులు తర్వత అమెరికా ప్రోద్బలం మీద పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ గర్భం లో జన్మించింది తాలిబాన్. మొదటి పది సంవత్సరాలు డబ్బు గట్ర అంతా సి.ఐ.ఏ ద్వర వచ్చేవి. తర్వత సోవియట్లు తిరిగి వెళ్ళిపోయారు... సోవియట్ యూనియన్ చరిత్రపూటాల్లోకి జారుకుంది. ఇంక చేసేది ఏమి లేక ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్గత కలహాలు చెలరేగాయి. ఒక తరం తుడిచిపెట్టుకుపోయింది ఆ దేశం లో ఈ యుద్ధాల మూలంగ. 79 నుండి 89-90 వరకు సోవియట్ల భీభత్సం వళ్ళ దేశం చాలా చాల నష్ట పోయింది.. తర్వత ఇంకో ఐదారేళ్ళు అంతర్గత కలహాలు చెలరేగాయి. పాకిస్తాన్ సహయాం చేయడం తో అందరిని ఓడించి కాబుల్ మీద విజయపతాకం ఎగరవేసింది తాలిబాన్. ఒక "గవర్నమెంట్" కూడా స్థాపించింది. దాన్ని ప్రపంచం మొత్తం మీద అంగీకరించిన రెండే రెండు దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఎంతైన సొంత బిడ్డ లాంటిది కద... అప్పుడే వాళ్ళు బమియాన్ లో ఉన్న వేల సంవత్సరాల బుద్ధ విగ్రహాలని పేల్చేసారు. యే ఒక్క దేశం కై కుయి అని అనలేదు. మన దేశం ఐతే మాటవరసకి వద్దు ఆపండి ఈ ఘోరం లాంటి కొన్ని డవిలాగులు అన్నదే తప్ప.. అంతకు మించి ఏమీ చేయలేదు. రెండు వేల సంవత్సరాల క్రిందట.. ఆ బుద్ధ విగ్రహాలని చెక్కినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మన దేశం లో ఓ భాగమే అని గుర్తించవారు కూడా తక్కువే!! ఏం చేస్తాం.. బుద్ధుడే ఆపలేకపోయాడు మనమెంత అని అందరు ఊరుకున్నారు. అది వేరే విషయం..
అలా అలా చిలకలు గోరికలు లా బ్రతుకుతున్న తరుణం లో.. అమెరికా మీద దాడి చేసింది అల్-ఖైదా. మరి అమెరికా ఊరుకుంటదా? ముందే ఏమి మిగలని ఆఫ్ఘనిస్తాన్ ని ఇంకా కుమ్మేసింది. అసలు అక్కడ ఏముందని ..అదే ఏం మిగిలిందని దాడి చేసిందో నాకు ఇంత వరకు అంతు చిక్కలేదు. అలా ఘోరం గా ఓడిపోయిన తాలిబాన్ అగ్ర నాయకులని స్వయానా తన సొంత విమానం లో సురక్షితం గా తీసుకొచ్చింది పాకిస్తాన్. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద తన దాడికి సహాయం చేయకపోతే వాళ్ళాని అదేలా చేస్తాం అని మెల్లిగా చెప్పేసరికి దిక్కులేక సహాయానికి ఒప్పుకుంది పాకిస్తాన్. కాని ఎంతైన తాలిబాన్ ని పుట్టించి పోషించింది కద.. ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది.. అటు అమెరికా కి సహాయం చేస్తా అంటునే ఇటు వీళ్ళకీ సహాయం చేసేది. రెండు వేరు వేరు దిక్కుల్లో పొయే గుఱ్ఱాల మీద ఒకటే సారి స్వారీ చేస్తే ఎల ఉంటదో తెలుసుకుందాం అని చేసినట్టు ఉండేది. రెండు చెరో దిక్కు వెళ్ళిపోయి నడ్డి ఇరిగినట్టు ఉంది ఇప్పుడు. "ఉగ్రవాదం మీద యుద్ధం" లో మొదటి ఐదేళ్ళు అస్సలు ఏమి చేయలేదు పాకిస్తాన్. కాని ఇలా తాలిబాన్లకి కూడా సహాయం చేయడం అమెరి"కనుల"కి తెలీకుండ ఉంటద? తెలుసుకున్నారు... ఇలా చేస్తే పెట్టే భిక్ష ఆపేస్తాం అన్నారు. జడుసుకొని కొంచం భయపెట్టాలని ప్రయత్నించింది పాకిస్తాన్. వజీరిస్తాన్ మీద దాడులు చేసింది.. NWFP (North West Frontier Province) మీద దాడులు చేసింది.. అమెరికా చేసిన దానికంటే పాకిస్తాన్ చేయడం వలన కోపం వచ్చింది తాలిబాన్ కి. ఆ మాత్రం ఉండదు? సొంత వళ్ళే అంటే కోపం రాదు మరి?
ముందు ఆఫ్ఘనిస్తాన్ వలయం లోకి మెల్లగా లాగింది అమెరికా ని. పాపాం వాళ్ళకి తెలీదు కద ఆఫ్ఘనిస్తాన్ గురించి.. ఇర్రుక్కున్నారు. అలెక్సాండరే భయపడ్డాడు ఆఫ్ఘన్లని చూసి. చెంఘిస్ ఖాన్, సోవియట్లు ఎవ్వరు నిలదక్కుకోలేకపోయారు .. అలాంటి చోట ఇరుకున్నారు అమెరికన్లు. గత ఐదేళ్ళలో చాలా భాగం మళ్ళా తాలిబాన్ల చేతుల్లోకి వచ్చేసింది. కాని ఇటు పాకిస్తాన్ సైన్యం వళ్ళ చాల నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడే వాళ్ళా దృష్టి పాకిస్తాన్ మీదకి సారించారు. NWFP, వజీరిస్తాన్ లో పాక్ సైన్యాన్ని ఎదుర్కోగలిగింది. స్వాట్ లోయలోకి వచ్చి పాక్ సైన్యం తో ఢీ కొట్టింది. తర్వత ఒక రోజు అమెరికా విమానం తో పాక్ తాలిబాన్ అధ్యక్షుడ్ని చంపేసింది. దానికి ప్రతీకారం గా కొత్తగా ఎన్నికైన తాలిబాన్ నాయకుడు మొదలెట్టిన ప్రతీకరమే ప్రస్తుతానికి పాకిస్తాన్ తో రగులుతున్న భీభత్సం.
ఈ సంవత్సరం కనీసం 500 మంది బలి అయ్యారు అడపా దడపల బాంబుల వళ్ళ. ఇన్నేళ్ళు మన మీద సాగించిన కుట్ర ఎల ఉంటదొ ఇప్పుడిప్పుడే అర్థం ఔతున్నట్టు ఉంది వాళ్ళకి. ఇంటి బయటకి వెళ్తే తిరిగి వస్తారో లేదో అన్న భయం వచ్చింది పాకిలకి. వాళ్ళ పరిపాలకులకి కూడా ఆ భయం వస్తే బాగుంటుంది. మొన్నామధ్య ఏకంగా ఆర్మీ హెడ్క్వాటర్ మీదే దాడి చేసారు. మన ప్రమేయం ఏమీ లేకుండా పాక్ ఇలా ఔతోంది అంటే ఎక్కడో కొంచం ఆనందం గా ఉంది. ఈ యుద్ధం సాగుతునే ఉంటుంది.. గెలుపు రుచి చూసారు తాలిబాన్లు పాకిస్తాన్ మీద. వజీరిస్తన్, NWFP లో వాళ్ళదే రాజ్యం ఇప్పుడు. మరో ఆఫ్ఘనిస్తాన్ తయారు చేసారు అక్కడ. అందుకే మిగితా పాక్ ని అల చేయాలి అని ఆశ పడుతున్నారు. అల జరిగితే మనకి నష్టమే కష్టమే. కాని ఎప్పటి వరకు ఐతే పాక్ సైన్యం ప్రభుత్వం ఈ యుద్ధం కొనసాగిస్తుందో అప్పటి వరకు మనకి ఢోకా లేదు. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి...
Friday, October 23, 2009
ఆనందం ఆనందం ఆయే...
ప్రదేశం: హైదరాబదు లో ఓ గృహం
సమయం: అసురసంధ్య వేల
అప్పుడే ఆగిన ఓ కారు.. అందులోనుండి దిగిన కొంత మంది గేటు దాటుకొని ఇంట్లోకి ప్రవేసించారు. ఇంట్లో చుట్టూర్త జనం. కనీసం ఓ ముప్పై మంది ఉంటారు. అందరూ ఆ కార్లోనుండి దిగిన వ్యక్తినే చూస్తున్నారు తదేకగ. అతడికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా గోల సద్దుమనిగింది.. ఎవరో అన్నారు - అమ్మాయిని బయటకి తీసుకొనిరండి అని.. వెంట్టనే.. అంటే ఓ పది నిమిషాలు తర్వత అమ్మాయి బయటకి వచ్చింది ఇంకో ఐదారు మందితో. ఇప్పుడు అందరు దృష్టి అమ్మాయి మీద ఉంది.. తనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇంతలో ఎవరో అన్నారు వాళ్ళిదర్నే మాట్లాడుకోనివ్వండి అని. అంతే ఒక్క క్షణం లో అందరు మాయమైపోయారు.. అబ్బాయి అమ్మాయి వైపు చూసి.. మీకు మీకు వంట వచ్చా అని అడిగాడు .. మొదటి ప్రశ్న ఎవడైన అది అడుగుతాడా?.. ఆ పర్లేదండి అన్నది అమ్మాయి.. తర్వతా ఇంక ఎదో అడగబోయాడు...
కట్ కట్ కట్.. చస్ .. ఇదేదో ఇరవైఏళ్ళ క్రితం వచ్చిన మూవీలో సీన్ లా ఉంది...
ప్రదేశం: బిర్లా మందిర్ ప్రాంగణం
సమయం: అసురసంధ్యవేల
నీటుగా టై కూడా కట్టుకొని క్రాఫ్ చేసుకున్న జుత్తుతో ఉన్నాడు అబ్బాయి. మొహం లో ఎక్కడలేని టెన్షన్. మొదటిసారి ఇంటర్వ్యూ కి వెళ్ళ్తున్నవాడిలా ఉన్నాడు చూట్టానికి. ఆరు గంటలకి కలుద్దాం అని చెప్పినా ఎందుకైన మంచిందే అని ఐదున్నరకే వచ్చేసారు అబ్బయి పట్టుపట్టడం తో. సీన్ కట్ చేస్తే...
అమ్మాయి అబ్బాయి ఇద్దరే ఓ మెట్టు మీద కూర్చొని ఉన్నారు. వీళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు అందరు మధ్యలో ఎందుకులే అని ఇద్దర్నే వదిలేసి ఆ వెంకన్న దర్శనానికి వెళ్ళారు. అమ్మాయి హాయిగా ఉంది.. అబ్బయేమో కొంచం ఇబ్బందిగ కూర్చున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాకుండా బిక్కు బిక్కు మంటు నలుదిక్కుల హైదరాబదు ట్రాఫిక్ చూస్తున్నాడు. ఇంతలో అమ్మాయి అడిగింది... మీకు వంట వచ్చా? అని.. ఎదో while loop లో ఇరుకున్న అబ్బాయి ఆలోచనలకి break పడినట్టు ఈ లోకానికి మళ్ళా వచ్చేసాడు. పాకం పురుష లక్షణం.. రాకుండ ఎలా అండి అన్నాడు. హమ్మయ్య ఓ పని తగ్గింది అనుకుంది అమ్మాయి. మీకు బండి నడపడం వచ్చా అని అడిగింది.. ఆ పోలీసుకి దొరక్కుండ నడుపుతా అన్నాడు... దొరికినా ఒక కహాని చెప్పి డబ్బు కట్టకుండా ఉంటా అన్నాడు... ఇంకే ఇదే పదివేలు అనుకుంది అమ్మాయి. ఇలా ఓ గంట బాటు పరస్పర ప్రశ్న-జవాబుల కార్యక్రమం కొనసాగింది. అప్పటికి ఇద్దరికి కొంచం అవగాహణ వచ్చింది.. సరే అని అమ్మాయి ముందు చెప్పింది.. అబ్బాయి ఇంచు మించు గా ఓ కిలోమీటర్ గెంతాడు ఆనందంతో... అంతే.. మరుసటి రోజు లగ్నపత్రిక రాసేసారు..
ఇలానే జరిగిందా అంటే ఏమో మరి చెప్పలేము.. కాని బహుశా ఇలానే జరిగింటది అని నా ఆలోచన.. మన పెంకి పింకీ పెళ్ళిచూపులు. అబ్బాయి పాపం భయం భయం గా ఉన్నాడు... మన పిల్ల వాగ్ధాటి చూసి. అబ దబ జబ అని ఇప్పటికే హాస్పిటల్ లో తను పుట్టినప్పటి విషయాలనుండి చెప్పడం మొదలెట్టేసింటుంది. ఇన్ని రోజుల్లో ఇంకా నర్సరీ లోనో UKG లోనో ఉండి ఉంటుంది.. ఇంకా ఇంజనీరింగ్ ఉద్యోగం వరకు వచ్చేపాటికి ఎన్నేళ్ళూ పడతాయో అని బెంగ పెట్టుకొని ఉంటాడు. పెళ్ళి చూపుల్లో మొదటి ప్రశ్నకే అర్థం అయ్యిండాలి... కాని ఏం చేస్తాం.. లగ్గం ఆకాశం లో జరిగింటాయి అంటారు.. అదే marriages are made in heaven అని. నేను-నేనుగా అని అనుకుంటున్న పింకీ కి ఇంక నేను-మేముగ అని అనే టైం ఆసన్నమైంది.
వాళ్ళ ఇరువురికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ.. ఇంకొద్ది రోజుల్లో .. మన పింకీ పెళ్ళికూతురాయేనె...
Sunday, September 6, 2009
వై.యెస్.ఆర్ ... తర్వాత ?
ఒక మనిషి చేసిన మంచి చావులో తెలుస్తుంది అంటారు. ఆ విధంగా చూస్తే వై.యెస్ పేదలకి చాలానే మంచి చేసినట్టూ గోచరిస్తుంది. నాకు పెద్దగ నచ్చకపోయినా ఒక్క అంశం వల్ల నచ్చేవాడు. జలయగ్ఞం. మన రాష్ట్రం లో దేశం లో భూమిలో నీరు అంటే గ్రౌండ్ వాటర్ టేబల్ చాలా చాలా చాలా దారుణంగా పడిపోతోంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మన మూర్ఖవతం వలన వచ్చిన ముప్పే. ఒక కాలం లో అంటే బ్రిటిషర్లు రాకమునుపు అన్నమాట, ఓ 7-8 వేల సంవత్సరాలు మన పూర్వీకులు ప్రతి ఊరిలో ఓ కోనేరు అని ప్రతి కిలోమీటర్ కి ఓ కోనేరు అని కట్టే వాళ్ళు. అలనే "స్టెప్ ట్యాంక్" లని కూడా భారీ లెవెల్ లో నిర్మించారు. వీటి వళ్ళ రెండు ఉపయోగాలు - ఒకటి వషపు నీరు ఇందులో చేరడం వలన ఊరికి నిత్యం నీరు ఉండేది. రెండు - కింద మట్టే కాబట్టి నీరు తిరిగి నేలలో ఇంకిపోయేది. అల వాడని నీరు భూమిలో పోయేది. ఎప్పుడైన అవసరం వచ్చి బావి తొవ్వితే నీరు వచ్చేది. ఇది నా దృష్టిలో ultimate water conservation. కాని బ్రిటిషర్లు ఈ కోనేరులు filthy water అని నమ్మి చాలా వాటిని పూడ్చేసారు. స్వతంత్రం వచ్చాక మన ప్రభుత్వం వేల యేళ్ళ నాటి మన మనుగడని తలచక బ్రిటిషర్ల బాటలోనే నడిచి.. ఇదిగో ఇప్పుడు నీళ్ళూ లేని పరిస్థితి తెచ్చి పెట్టింది.
పంటలకి నీటి కోసం పంపు సెట్లు ఎంత లోపల దింపిన చాలా చోట్ల నీరు రావడం లేదు ఈ కాలం లో. అసలు భూమిలో నీరు ఉంటే కద వచ్చేది. water table restoration కి ఓ ఉపాయం జలయగ్ఞం. 70 చిల్లర చిన్న పెద్ద ఆనకట్టలు నిర్మించడంతో ఈ సమస్య కొంత తీరుతుందేమో. అందులో భాగం గా ఇప్పటికి 35 దాక నిర్మాణం పూర్తి చేసింది వై.యెస్ ప్రభుత్వం. అన్నిటి నిర్మాణం తర్వత ఒక కోటి ఎకరాలకి సాగునీరు అందేది. వ్యవసాయం మీదే ఆధరపడే మనకి ఇది ఎంత మేలో మాటల్లో చెప్పలేము. మన దేశం లో గుజరాత్ తర్వత ఇంతగా నీటి మీద వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపింది ఈ ప్రభుత్వమే. అందుకే నాకు వై.యెస్ అంటే అభిమానం. మన నాయకుల మీద మనకి ఎంత అపనమ్మకం అంటే వాడు ఎంత తిన్న పర్లేదు కొంచం ప్రజలకి చేస్తే చాలు అని అనుకుంటాం. అందులో ఇంకొంచం ఎక్కువగా ప్రజల సమస్యలని పట్టించుకుంటే దేవుడు అనేస్తాం. వై.యెస్, ఎన్.టీ.ఆర్, జలగం, బూర్గుల, ప్రకాశం పంతులు .. ఈ కోవకి చెందిన వారు.
వై.యెస్ హఠాన్మరణం తో ఆంధ్ర చరిత్రలో ఓ గొప్ప ఘట్టం ముగిసింది. ఇప్పుడు అతడి పేరు చెప్పుకొని బ్రతికే ఘట్టం ఆరభం ఔతుంది. మనం పేరుకిమాత్రం democracy పనితీరు మాత్రం feudalistic అని చెప్పేదానికి గత రెండు మూడు రోజుల్లో టి.వీ చూస్తే చాలు. శరత్ అన్నట్టు YS est mort, vive YS!. అసలు జగన్ అనేవాడు ఎవరు? ముఖ్యమంత్రి కి కావల్సింది ఎక్స్ పీరియన్స్. అది అతనికి అసలు ఉందా? సాక్షి పెట్టకమునుపు అతనెవరో కూడా చాలా మందికి తెలీదు. పైగా సత్యం అవకతవకల్లో అతనికీ భాగం ఉందని అప్పట్లో అన్ని పత్రికలు, చానల్లు రాసాయి / చెప్పాయి. ఇప్పుడు అవేమి గుర్తుకు రావే!! ఇందిరాని చంపేసారని రాజీవ్ కి పట్టం కట్టారు. 410+ సీట్లోచ్చిన కాంగ్రెస్ని ఐదేళ్ళల్లో 200 కంటే తక్కువచి తెచ్చేసాడు. యే పనికైన ఎక్స్పీరియన్సె అవసరం. అంటే జూనియర్ పోస్ట్లకి కాదు.. అవి నేర్చుకునేదానికే ఉంటాయి. కాని పెద్ద పోస్ట్లకి వెళ్ళేటప్పుడు ఆ పోస్ట్ కి తగ్గ బుద్ధి విగ్ఞానం తోబాటు మనకి ఉన్న అనుభవాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటారు. కేవలం రాజకీయాల్లో సినిమాళ్ళో ఇదెందుకో వర్తించదు.
ఏమైన అంటే మా రక్తం లో నటన ఉందనో రాజకీయం ఉందనో అంటారు. అదెలా? సినిమాలూ వేరే విషయం అనుకోండి. ఒక గొప్ప నటుడి కొడుకు (ఫార్ దట్ మాటర్ కూతురు) సర్రిగ నటించకపోతే దేశానికి ఒచ్చే నష్టం ఏమీ లేదు. ఓ రెండు మూడు సినిమాలు తర్వత వాడ్ని అసలు ఎవ్వరు చూడరు. దానితో ఎవ్వరికి నష్టం లేదు. కాని రజకీయం ఇత్యాది వాటిల్లో అల జరగకూడదు. ఉదాహరణకి - ఒక గొప్ప వైద్యుడు ఉన్నడనుకుందాం. అతడు ఎన్నో యేళ్ళగా కృషి చేసి వైద్య తప్పస్సు చేసి మంచి హస్తవాసి ఉన్నవాడిలా పేరు సంపాదించడనుకోండి. అతడు పాపం ఒక రోజు ఆపరేషన్ చేస్తు మధ్యలో పోయాడనుకోండి అప్పుడు వెంఠనే జెస్ట్ అప్పుడే ఎంసెట్ రాసిన అతడి పిల్లడ్ని పిలిచి మిగితా ఆపరేషన్ పూర్తిచేయమని అంటారా? సపోస్ వాళ్ళ నాన్న కార్డియాలగిస్ట్ అయ్యిఉంటే ఇతడు ఆర్థోపెడిస్ట్ ఐనా కూడా లేదు లేదు వాళ్ళ నాన్న గొప్ప గుండె డాక్టర్ కాబట్టి ఇతడి రక్తం లో గుండెకోయడం వచ్చింటది అందుకే ఇతడే గుండె ఆపరేషన్ చేయాలి అని పట్టుబడతారా?
చెప్పోచేదేంటంటే ఇప్పటికైన ఈ వారస్త్వపు ఆలోచనలు మానేయాలి. ముకేష్ అంబానిని కూడా డైరెక్ట్ గా ఎం.డి చేయలేదు ధీరుభాయి. అతడికి మొదట్లో చిన్న చితక పనులు ఇచ్చి అది చేసాకే ప్రమోషన్ ఇచ్చాడు. కుమారమంగళం కథ కూడా అదే. సురేష్ బాబు కథ కూడా అదే. నటవారసుల సంగతి నాకు తెలీదు కాని మిగితావాటిలో వారసత్వం.. i am not that sure.
Monday, August 10, 2009
పరీక్షలే లేకుంటే..
ప్రతి ఒక్కరి జీవితం లో అసలు మరిచిపోలేని మరపురాని రోజులు ఏంటా అని తిరిగిచూస్తే సగానికి సగం పరీక్షలు రాసిన రోజులే అయ్యింటాయేమో. పదవ తరగతి పరీక్షలు మొదలైన రోజు.. మొదలైయ్యే ముందు రోజు పొట్టలో పోటి పడ్డ పక్షులు గుర్తొస్తాయి. మాకు అంటే cbse ఉద్దరించిన వాళ్ళకి పదవ తరగతే మొదటి సారి పబ్లిక్ పరీక్షలు. జీవితం లో మొట్ట మొదటి సారి హాల్ కి వెళ్ళి పరీక్ష రాయడం అంటే అదేదో గొప్ప అనుభూతి. అంత మందితో పోటి పడ్డం పక్కన.. అసలు నెగ్గుతామా లేదో తెలీని పరిస్థితి. రాస్తున్నప్పుడు అల్ల నన్ను ఎవరైన చూస్తున్నరేమో డిబార్ చెస్తారేమో అని పిచ్చి టెన్షన్. కాని అల ఏమి జరలఏదు. అది వేరే విషయం. తర్వాత తర్వాత అన్ని పబ్లిక్ పరీక్షలు కావడం తో ఇంజనీరింగ్ రేండో యేడు వచ్చేపాటికి పెద్దగా ఏమీ అనిపించేది కాదు. జెస్ట్ పాసా ఫేల్ ఆ అని తప్ప.
ఇంకొద్ది రోజుల్లో ఇలాంటి గొప్ప అనుభూతి ఉండకపోవచ్చేమో. మన విద్యాసాఖ మంత్రి కపిల్ సిబాల్ పావు పారితే ఇంక పదవ తరగతి కి పరీక్షలు ఉండకపోవచ్చు. అసలు పరీక్ష అంటే ఆ యేడు మనం ఎంత నేర్చుకున్నామో మన పుర్రెల్లో ఎంత పోయిందో ఎంత గాలికి వదిలేసామో సినిమాల చూసి ఎంత నేర్చుకున్నామో కొత్త స్టెప్పులు కొత్త కామెడి గట్ర గట్ర అని. సరే సరే సినిమా విషయం పక్కనపెడితే మిగితావి అన్ని పరీక్షిస్తారు. అలానే ఈ యేడు కొత్తగా కాపీ కొట్టే పద్దథులని కూడా పనిలో పని గా టెస్ట్ చేసుకోవచ్చు. అసలు పబ్లిక్ పరీక్షల ముందు ఓ రెండు మూడు నెలల నుండి ఇంట్లో బయట నెలకొనే ఉత్కంఠత మాటల్లో చెప్పలేము. ప్రతి ఒక్కరు దాన్ని అనుభవించింటారు. అనుభవించాలి. జీవితం అంటే ఏంటో చాలా మందికి బోధ పడే సమయం కూడా అదే అనుకుంట.
అసలుకే మోసం తేవడం లో కపిల్ సిబాల్ ఆలోచన నాకు అంతు చిక్కడం లేదు. మన పరీక్షా విధానం కొంచం తప్పే. అంటే బొరుగుల బట్టి కొట్టగలిగేవాళ్ళు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటారు .. కొంచం చదివి అర్థం చేసుకొని వాళ్ళా భాషలో రాసేవాళ్ళు కొంచం కష్టంగా మార్కులు తెచ్చుకుంటారు. ఇది ఎంత పెద్ద తప్పో లోక విధితమే! పరీక్షా విధానాన్ని సవరించాల్సింది పోయీ అసలు ఆ సంస్థనే తీసేద్దాం అనడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి నిపుణులతో చర్చించాల్సి తీసుకోవాల్సిన నిర్ణయం. స్కూల్ స్కూల్ కి విడి విడిగా పరీక్ష ఒక ఉపాయం కాని అప్పుడు స్కూల్ వాళ్ళే స్వార్థం కోసం పరీక్ష విధానాన్ని వారికి అనుకూలంగ మార్చుకోరు అని నమ్మకం ఏంటి? అసలు ఇలా జరగకూడదూ అనే కద పబ్లిక్ పరీక్ష పద్దతి ని ప్రవేశపెట్టింది. బట్టికొట్టే విధానన్ని అరికట్టాలి... అంతే కాని అసలు పరీక్షలే ఎత్తేస్తే సినిమా హాల్లు నిండడం తప్ప ఒరిగేది ఏమి ఉండదు.
ఉన్నత విద్య ని కూడా కొంచం మెరుగు పరిస్తే బాగుంటుంది. ఆంధ్ర దేశం లో మొత్తం మీద ఓ 5-6 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదే అమేరికా లో ఐతే దాదాపుగా ఓ 3000-5000 దాకా ఉన్నాయి. రెంటికి పోలికే లేదు. కొత్త పదవి జోష్ లో రెండు దశాబ్దాల నుండి ఎవ్వరు పట్టించుకోని ఉన్నత విద్య ని కపిల్ సిబల్ గారు ఎమైన చొరవ చూపి modernize చేస్తే అదే పది వేలు, పది లక్షలు. చూద్దాం. మనిషి ఆశా జీవి కద..
Thursday, July 9, 2009
పనిపాట ఏటూ లేదు ట్విట్టర్ అయినా పంపు బ్రదర్..
ఏంటో.. కొన్ని సార్లు అనిపిస్తుంది అసలు నాకేమైన తెలుసా అని. అంటే ఏ ఒక్క ఫీల్డ్ లో అయినా కొంచం కొద్దో గొప్పో జ్ఞానం ఉంది అంటే అది ఈ సాఫ్ట్ వేర్ రంగం లోనే.. కాని ఇది ఓ మహా సముద్రం లా అనిపిస్తుంది. అది నిజమే.. కాని కొత్తగా ఏదైనా వస్తే అది ఎలా పని చేస్తుందో ఎందుకు పని చేస్తుందో అని వెంట్టనే అర్థం ఔతుంది. అదో ఆనందం. తుత్తి. నాలాగే చాలా మంది ఉంటారని నా అభిప్రాయం. మచ్చుక్కి.. గూగల్ వారి "క్రోం" వచ్చినప్పుడు దాన్ని దింపుకొని వాడి -ఓస్ ఇంతేనా. మంటనక్క (ఫైర్ ఫాక్స్) తో పోలిస్తే కొన్ని లేవు కొన్ని మంచిగా ఉంది అని తెలిసే వరకు జీవితం లో అదేదో కోల్పోయినట్టు ఉండడం సహజం. అది మన నైజం.
దీనికి విభిన్నంగా ఒక కొత్త (అంటే కొత్తదేమి కాదు.. ఓ రెండేళ్ళు అయ్యిందనుకుంట) టెక్నాలజి వచ్చి అది అంటుబట్టకుండా ఉంది అంటే అది - ట్విట్టర్. అది మొదలైనప్పుడు ప్రతిసారి లాగే ఓ యకౌంట్ తెరిచా. అదేంటో అని కొంచం వాడాను కాని అంతు బట్టలేదు. అసలు ఎందుకు వాడతారో అర్థం కాలేదు. ప్రతి క్షణం నేను ఏం చేస్తున్నానో తెలుసుకోవాలనుకునే వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు లేరు. ఉండరని నా నమ్మకం. ఆశ కూడా.. నమ్మకం కంటే ఆశే ఎక్కువ. :p నిజంగా ఉన్నరంటే వాళ్ళ కంటే పని లేని వాళ్ళు.. అంటే కే.సీ.ఆర్ టైప్ అన్నమాట.. భూ ప్రపంచకం ఓల్ మొత్తం మీద ఎవ్వరు ఉండరు. అయినా సరే బోలెడు మంది ట్విట్టర్ ట్విట్టర్ అంటూ ఉంటారు. మచ్చుక్కి CNN పొరబాటున పెడితే చాలు. ప్రతి ఒక్కడు న్యూస్ బదులు ట్విట్టర్ చూడండి అంటు తెగ గోల చేస్తూ ఉంటారు. ట్విట్టర్ లో అంత గొప్ప గా నాకేమి కనిపించలేదు. బహుశా కనిపించదు కూడా. well this is just my own సొంత personal opinion. కాదు కూడాదు అని ఎవరైన అంటే కేసు పడుద్ది (TM).
నాకనిపించేది ఏంటంటే గూగల్ పెరుగుదల చూసి అర్రెర్రె ఇది మిస్ కొట్టామే ఇప్పుడెలా అని అనుకుంటున్న సమయం లో ఇది కనిపించింటది.. అందరు యకౌంట్లు తెరుస్తున్నారు బహుశ ఇది నెక్స్ట్ గూగల్ ఔతదేమో .. మళ్ళా ఇది కూడా మిస్ ఐతే జీవితం వేస్టూ అని భావించి ఈ CNN గట్ర ట్విట్టర్ వెంట పడ్డారు అని. అస్సలు పనికిరాదు అని చెప్పడం లేదు.. బంబాయి మీద దాడులు జరిగినప్పుడు ఈ ట్విట్టర్ ద్వారానే చాలా తెలిసింది. అలాంటప్పుడు ఒప్పుకుంటా.. కాని నిత్యం నిరంతరం "నేను ఇప్పుడు ఫార్ లూపు రాస్తున్నా" "ఇప్పుడు సొనాలీ బేంద్రే పోస్టర్ చూస్తున్నా " "ఇప్పుడు బుడుగుని తిట్టుకుంటున్నా" లాంటివి ఎవడు చదువుతాడు అని నా అనుమానం. నాతో ఎవడైన మాట్లాడాలంటే జీ-టాక్ లో పింగ్ చేస్తారు లేకపోతే .. వాళ్ళా అద్రుష్టం పండి ఉల్టా అయితే ఫోన్ చేస్తారు.. అంతే తప్ప ట్విట్టర్ లో "అరేయ్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా" అని ఎవ్వడు రాయడు అనే నా ఫీలింగ్.
- ఇప్పుడే వీరో ఎంట్రీ ఇచ్చాడు.
- అప్పుడే ఓ పాట. పాట ఇలా ఉంది "పనిపాట ఏటూ లేదు ట్విట్టర్ అయినా పంపు బ్రదర్.. " (సాపాటు ఏటు లేదు ట్యూన్ లో..)
- వీరో "అగరబత్తులు" పట్టుకు తిరుగుతున్నాడు. ఎందుకో తెలీదు.
- వీరోఇన్ వచ్చింది.
- హీరో అగరబత్తులు వీరొఇన్ కి ఇచ్చాడు. ఏంటో నాకు పిచ్చేకుతోంది.
- వీరో కలగంటున్నాడు. అందులో బాలయ్య - హరికృష్ణ - తారక రత్నా - కలిసి పాటలు పాడుతున్నారు. అటువైపు నుండి రజని ఈల వేసుకుంటూ వస్తున్నాడు..
- ఇటు వైపు నుండి నేను జంప్ అని.
-----
- ఇప్పుడే మమతా తన రైలు బడ్జెట్ ప్రెసెంట్ చేస్తోంది.
- అటు పక్కనే కె.సి.ఆర్ ఎదో తాగుతున్నాడు
- లాలూ కి ఒక్క ముక్క అర్థం కాకుండా తన నోట్ బుక్ లో ఆవుల బొమ్మలేసుకుంటూ గడ్డిని ఊహించుకుంటున్నాడు.
ఏంటి వీడికి పిచ్చేకిందా అనుకుంటున్నారా? అంత లేదు..ఇది రాబోయే కాలానికి సంకేతాలు. ఆ రెండవది శశి తరూర్ ట్విట్టర్లు. (స్వకల్పితం) పోయినేడు U.N.O ఎన్నికల్లో బాన్-కి-మూన్ కి ప్రత్యర్థిగా నిలచి ఓడిపోయిన అతడికి కాంగ్రెస్ లో సీటిచ్చి పాలకాడ్ నుండి నిలబెట్టారు.. గెలిచేసాడు.. అర్రెర్రె గెలిచేసాడే ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే బాగోదేమో అని ఓ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఫుల్ "techie guy, youth తో టచ్ లో ఉన్నా అని ఎలా చెప్పాలా అనుకుంటున్నతడిని ఈ ట్విట్టర్ కరిచింది. దెబ్బకి ఇప్పుడు కేవలం ట్విట్టర్తోనే మాట్లాడుతున్నాడట. పదివేల మంది "followers" ఉన్న మొట్టమొదటి భారతీయుడు అట. (ఎందుకు అని అడగద్దు అది చదివిన తర్వత ఎందుకో వరైటి గా అనిపించింది).
ఈ ట్విట్టర్ మీఎవరికైన అర్థం అయితే ప్లీజ్ నాకు చెప్పండి. ఎం.ఎఫ్. హూసైన్ చిత్రాలు, బాలయ్య రొమాన్స్, అరవ కామెడి, అజిత్ అగార్కర్ బౌలింగ్ - వీటి తో బాటే ఈ ట్విట్టర్ అని డిసైడ్ అయ్యాను. అల కాదు దీన్ని ఇలా వాడాలి అనో అరవ కామెడి ని అర్థం చేసుకే పద్దథి ఇది అనో ఎవరైన నాకు "ట్విట్టరోపదేశం" చేస్తా అంటే - ధన్యుడని. అంత వరకు..
Thursday, June 25, 2009
ఇళ్ళా? ఉద్యోగమా?
కొంత కాలం కిందట .. ఈ మధ్యలో వరకు కూడా అనుకోండి కొన్ని ఇళ్ళల్లో ఒక చిన్న ప్రశ్న మొలిచేది.. తల్లా? పెళ్ళామా? అని. ఆ ప్రశ్న ఎంత మూర్ఖంగా ఉన్నా..ఈ మధ్య కాలం లో అసలు ఈ ప్రశ్న కి సమయమే లేకుండాపోయింది. శుభం అనుకునే లోపే ఇళ్ళా? ఉద్యోగమా? అన్న ప్రశ్న మొదలైంది. ఇది మూర్ఖమైన ప్రశ్న కాకున్నా చాలా మంది జీవితాల్లో చాలా ఇళ్ళాల్లో జరిగే నిరంతర పోరాటమే అని అనుకోవచ్చు. (చాలా ఇళ్ళాల్లో అన్నదానికి నా కాడ statistics గాని సర్వేలు కాని లేవు.. జీవితంలో చూసిన దాన్ని బట్టి నేను ownగా సొంతంగా personalగా ఊహించుకున్న సంఖ్య మాత్రమే!!).
ఉద్యోగం నుండి బయటకి వచ్చాకా అంటే జెస్ట్ ఆ డోర్ నుండి బయటకి వచ్చాక యే కంపనీ నీది అంటే బ్రహ్మానందం చూపులు చూసే వాళ్ళని నేను ఎరుగుదును. అందులో ఒక కాలం లో నేను ఉన్నా. ఠంచన్ గా ఐదో ఆరో అయితే మళ్ళా అసలు వర్క్ గురించి గుర్తుండేది కాదు నాకు. ఆ రోజు రాసిన for లూపులు కూడా మర్చిపోయేవాడ్ని. అల అయ్యేదానికి కొన్ని యేళ్ళు పట్టింది. అది వేరే విషయం. ఇప్పుడు కూడా నేను మించు ఇంచు గా అదే టైప్. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు.. ఇంకో పది రోజుల్లో ఒక పెద్ద డెలివరి ఉంది మాకు.. సో అది అయ్యకా మళ్ళా ఐదైతే అన్ని మర్చిపోతా. అంత వరకు మాత్రం రోజుకి ఒక 12 గంటలు తప్పడం లేదు. అలా సంవత్సరానికో ఆర్నెల్లకో చేసేవాళ్ళని చూసాను. కాని నిత్యం నిరంతరం పెతీ రోజు అలా ఉద్యోగమే జీవితం అనుకుంటు ఉండేవాళ్ళూ ఉన్నారు.
ఎవరైన ఉద్యోగమ? ఫామిలీ ఆ? అని అడిగితే క్షణం పట్టదు తేల్చుకునేదానికి. కాని అలా 12 గంటలు ఇంట్లో కూడా మాట మాట్లాడకుండా ఎదో జాతిని ఉద్దరించే పని చేస్తున్నట్టుగా చేసేవాళ్ళ priority మీద నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. వీళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళూ ఎట్లా భరిస్తున్నారా అని. ఆ స్టేట్మెంట్ కొంచం ఎక్కువే అయినా అందులో ఓ యాభై సాతం నిజం లేకపోలేదు. వీళ్ళు ఇంట్లో ఉన్నా వర్క్ లో ఉన్నా పెద్దగా తేడా పడదు.. జెస్ట్ ఎదో ఇంట్లో ఉంటే మన ముందు ఉన్నరాన్న ఆనందం తప్ప. కాని అదీ క్షణికమే. వర్క్ చేసేటప్పుడు శబ్ధం వచ్చినా మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టే.. ఆ భాగ్యానికి ఇంటికి రావడం ఎందుకో? అని కూడా అనిపిస్తుంది. జివః కో రుచి అని తెలుసు... వెర్రి వెయ్యి విధాలు అని కూడా తెలుసు కాని ఇంత వర్క్ వెర్రా?
నేనేదో ఉత్తముడిని అని చెప్పడం లేదు..కాని at least i have my priorities right. క్రికెట్, NFL, ఫుడ్, సినిమాలు, ఫ్యామిలి, ................................................ వర్క్. in that order. సెప్టెంబర్ నుండి మొదటి రెండు కొంచం అటూ ఇటూ ఔతాయి. కాని ఆర్డర్ మాత్రం పెద్దగా మారలేదు చాలా ఏళ్ళగా. ఈ ఎకానమి లో ఆ మాత్రం పని చేయకపోతే కష్టం అని అనకండి.. ఎందుకంటే వీళ్ళు ఎకానమి ఎలా ఉన్నా మారరు కాబట్టి. అయినా పక్కనోడికి చెప్పేంత నాకు లేదు. నేను నూరుశాతం కాకపోయినా తొంభై తొమ్మిది శాతం పర్ఫెక్ట్ కాబట్టి చెప్తున్నా అంతే. ఉద్యోగాలు మారుతాయి (ఇది చాలా మందికి. కొంత మంది అలా ఒక్క సారి చేరితే గవర్నమేంట్ మారినా.. బాలయ్య మారిన.. చివరికి కె.చంద్రశేఖర్ రావ్ మారినా .. అదే ఉద్యోగం లో ఉంటారు. అది వాళ్ళ నైజం. ఇష్టం. స్వభిప్రాయం. choice. దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. మిగితా వాళ్ళా గురించి అంటున్నా).. కాని ఫ్యామిలి మారదు. జావా కాకపోతే డాట్ నెట్ .. కాని ఫ్యామిలి కి ప్రత్యామ్న్యానం లేదు కదా!! అయినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు.. ఎవరికి చెప్పాలని చూస్తున్నా నేనూ? నా వెర్రి కాకపోతే..
Sunday, June 21, 2009
నేను మార్గదర్శి లో చేరా.. నేకు "కేసు" పెట్టా..
నేను మార్గదర్శి లో చేరుతా.. నేను కేసు పెడతా. ఎందుకు ఏమిటి అంటే ఒప్పుకోను ... అడిగే హక్కు మీకు లేదు. నా జాతిని బట్టి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నాకు అర్థం అయ్యింది. మీ మీద కూడా పెట్టేస్తా. మలక్ పేట్ రౌడి గారి మీద కేసు పెడుతున్న బుడుగు ఉరఫ్ జీడిపప్పు మీద నేను కేసు పెడుతున్నా. నా కంటే ముందు అలా కేసు పెడతా అని వ్రాసినందుకు. కేసు పెట్టడం నా జన్మ సిద్ధ అధికారం. దాన్ని నా నుండి ఎవ్వరు వేరు చేయలేరు.
నాకు అలా కేసు పెట్టాలనె ఆలోచన రాకమునుపే బుడుగు కి వచ్చింది. ఇది IPC సెక్షన్ 1116 క్రింద ఘోరాతి ఘోరమైన నేరం. దీన్ని శిక్షించకపోతే బుడుగు లాంటివాళ్ళు నా లాంటి మేధావుల్ని తొక్కేస్తారు. మాకు ఆలోచనలు రాకమునుపే కాపి కొట్టేస్తారు. ఇలాంటి "కిష్యోటకల్ని" ఒదిలితే దేశానికి చాలా నష్టం, కష్టం. అందుకే కేసు పెడుతున్నా. ఎందుకు ఏమిటీ అంటే అది అంతే. ఇది చెట్టరీత్య నేరం. అడిగినందుకు కూడా మీ మీద పెడతా. ఒక కేసు. ముందే హైదరాబాద్ లో ఈ మధ్యే సాఫ్ట్-వేర్ ఉద్యోగాలు పోయిన నా స్నేహితుల్ని అడిగి కనుకున్నా.. వాళ్ళు చాలా చాల కష్టపడి internet తీగలమీద పాకి స్తంబాలు ఎక్కి మరీ ఈ క్రింద చెప్పడే వ్యక్తుల IP లు కనుకున్నారు.
"మనవోన్మాది" "మానవద్వేషి" బుడుగు a.k.a జీడిపప్పు మీద పెడతా. యే సెక్షనో అర్థం కావడం లేదు. కొంచం ఎవరైన "న్యాయవాదుల్ని" సంప్రదించి చెప్పగలరు. బుడుగు IP, birth certificate వాళ్ళా ఊరి మునసబ్ నుండి తెచ్చిన లేఖ వాళ్ళా బడి హెడ్ మాస్టారు ఇచ్చిన 'అ-ప్రశంసా పత్రం" అన్ని సేకరిచ్చా నేను.
మీకు అలాంటివి ఇంకేమైన దొరికితే నన్ను సంప్రదించండి. నా ఈ-మేల్ ;dikkulenicourtlodava@gmail.com. అలనే బుడుగు ఉరఫ్ జీడిపప్పు ఫోటో కూడా సంపాదించా. (క్షమించాలి ఆ ఫోటో పెట్టలేకపోతున్నా. "unparliamentary / uncivilised గా ఉంటుందని) ఇంత చదువుకు కొని ఇన్నేసి చికేన్ లని తిని అన్నేసి సార్లు గాడ్ ఫాథర్ చూసినా కూడా జీడిపప్పు కి బుద్ధుని లా జ్ఞానం రాకపోవడం చింతనీయం.
పనిలో పని పేపర్లో పేపరు కేసులో కేసు అన్నట్టు మలక్ పేట్ రౌడి గారి మీద, రాఘవ మీద, నేను నిద్రపోతున్న సమయంలో నా బుర్రలోని ఆలోచనల్ని కాపి కొట్టిన ఏక లింగం గారి మీద, గూగల్ మీద నేను పెట్టాలనుకున్న కేసుని నా కంటే ముందే ఆలోచించిన విశ్వక్శేనుడి మీద, మాటి మాటికి కేసు కేసు అని భయపెట్టి నా లాంటి మేధవుల్ని కించపరుస్తున్న నాగప్రసాద్ మీద, ఇవ్వంటికి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటున్న శరత్ 'కాలాం" మీద కూడా ఓ పదో పాతికో కేసులు పడేస్తున్నా. వీళ్ళు హైదరాబాదులో కనిపిస్తే అప్పడ తప్పడి తాండ్రే.!!!! ఖబర్దార్!!! కమాన్ సూస్కుందాం. బస్తిమే సవాల్!!! ఎవరెవరు ఎన్నేసి కేసులు పెడతారో సూస్కుందాం.
నా కంటే ముందు మీకు ఏమైన ఆలోచన వస్తే జాగ్రత్త!!! ఇదే మీకు తుది హెచ్చరిక. నా కంటే ముందు ఆలోచిస్తే కేసు పడుద్ది.
ఇది చూసి కామెంట్ వేయని వాళ్ళకి / నా కంటే ముందే నా ఆలోచనల్ని కాపీ కొట్టే వాళ్ళకి ఇదే హెచ్చరిస్తున్నా: మీ IP Address నాకు తెలుసు. మీ పైన atrocity కేసు పెడతాను. నా బ్లాగు అడ్రస్ ఇస్తూ incriminating వ్యాఖ్యలు చేస్తే that amounts to cheating and impersonating. IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఉంటే 23240663, 27852274 ఫోన్ చేసి కనుక్కోండి.
Tuesday, May 19, 2009
మిషన్: షాపింగ్
అసలు భూ ప్రపంచం లో అతి బోర్ కొట్టే పనుల్లో ఈ షాపింగ్ ఒకటి. అన్-లైన్ కాదు నడుచుకొని వెళ్ళి కొంటామే అది. నా లిస్ట్ లో బట్టలు మడతపెట్టడం తర్వత వస్తుంది ఇది. అంత బోర్ నాకు షాపింగ్ అంటే. ఒక్క పుస్తకాలు కొనేటప్పుడు తప్ప ఇంకెప్పుడు ఇది ఇష్టం ఉండదు నాకు. పుస్తకాలు అంటే అబ్బో అదో సరద నాకు. చిన్నప్పుడు కోఠీ లో, ఆబిడ్స్ లో ప్రతి ఆదివారం పెట్టే పుస్తకాల కొలువు కి వెళ్ళేవాడ్ని. ఓ 3-4 గంటలు తీరిగ్గా వెతికి బేరమాడి నాకు నచ్చేవి నచ్చుతాయి అనుకున్నవి తెచుకునెవాడ్ని. ఇది ప్రతి వారం కాదు.. నాన్న ఇచ్చిన జేబు డబ్బు లో నా "దినసరి" ఖర్చులు పోను మిగిలినవి దాచుకొని రెండొందలో మూడొందలో అయ్యాక వెళ్ళేవాడ్ని. ఇప్పటికి గుర్తొస్తే ఆ రోజులు కొంచం బాధగ కొంచం ఆనందంగా ఉంటది.
కాని నేను మాట్లాడుతున్న షాపింగ్ పుస్తకాలు కాదు.. రోజు వారి చేసేది. మొన్నామధ్య దివ్య వాళ్ళ స్నేహితుడు ఒకడు వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టు ఉండచ్చు కద... పనికిమాలిన రాళ్ళ నుమాయిష్ (అదే జెం షో) ఉందని చెప్పడు. అప్పటికి చెప్పా నువ్వు వాడు వెళ్ళిరండి నన్ను ఒగ్గేయండి అని. ఊ హూ.. నా మాటే వింటే తను దివ్య ఎందుకు అవుద్ది? రారా అని లకలకలక అని నిను వీడని నీడను నేనే... అంటే మరి మరి చివరి పాట కాదు కాని మిగితావి పాడతా అని బెదిరించి లాక్కెళ్ళింది నన్ను. నాకు ముందే బద్దకం. అసలు ఆదివారం (ఎన్.ఎఫ్.ఎల్ అప్పుడు) సోఫా నుండి కదలకుండా అలనే శిలా విగ్రహం లా పడుకొని దినమంతా టీ.వి చూస్తా. అలాంటిది వారాంతం అని కూడా చూడకుండ నన్ను ఆ దిక్కుమాలిన జెం షో కి తీస్కెళ్తె ఎల ఉంటది? ఏం చేస్తాం.. కష్టాలు మనుషులకి కాకుండా మంచు బ్రదర్స్ కి వస్తాయా అని వెళ్ళా. తీరా చూస్తే అదేదో సుల్తాన్ బజార్ టు పవర్ సుల్తాన్ బజార్ లా ఉంది. అందరు తెలుగే మాట్లాడుతున్నారు. ఇదేమైన విజేంద్ర వర్మ లా బాలాయ్య కొత్త చిత్రం షూటింగా అని ఒక్క సారి అనుమానం వచ్చింది. తర్వత తట్టింది ఇలా రాళ్ళు రప్పలు రత్నాలు అంటే మనవాళ్ళాకే అమితమైన ఇష్టం కదా అని. అలా మొదలైంది నా దినం.. అదే నాకు ఆ దినం.
సీన్ కట్ చేస్తే ఓ రెండు గంటల తర్వత కూడా వీళ్ళు ఏ ఒక్క "రాయి" కొనలేదు. నేనేమో అప్పటికే కన్య కుమరి నుండి కాష్మీరం వరకు మోకాలి మీద పాకినట్టు నీరశించి పోయా. పోనీ టైం పాస్ కి ఎవరైన అమ్మయిలని చూద్దం అనుకుంటే దివ్య ఫీల్ ఔతుందేమో అని ఆగిపోయా. ఇంక ఇలా అయితే రోజంతా అక్కడే ఉండి నిమిష నిమిషానికి ఓ ఇంచి చొప్పున భూస్థాపితం అయిపోతా అని అనుమానం వచ్చి ఇంక మొదలెట్ట.. ఆకలి, త్వరగా కానివ్వండి అని. అప్పటికి నా పరిస్థితి అగమ్యగోచరమే! గోమేధుకం బఠాని లాగ ముత్యాలు సబ్బు బియ్యం లా కనిపించాడం మొదలయ్యాయి.. అదే విషయం చెపా దివ్య కి. ఇంక నా వళ్ళ కాదే ఇంక పి.టీ.ఉష లా పరిగెట్టేళ్ళి తినకపోతే సోషొచ్చిపడిపోతా అని. పాపాం నిజంగానే అల అయిపోతా అని ఇంకో గంట లో మొత్తం షాపింగ్ అవ్వగొట్టింది.
అదే విషయం ఆలోచిస్తుంటే నాకు ఒక్కటి అనిపించింది. అసలు దివ్య కి ఇంత ఓపిక ఎక్కడిది అని. మామూలుగా అయితే ఎక్కడైన మాల్ గట్రా వెళ్తే ఓ గంట-గంటన్నర తిరిగేసరికి ఇద్దరికి ఓపిక నశిస్తుంది. అసలు అమేరికా లో పరమవిపరీతల్టిమేట్ షాపింగ్ బొనాంజా అయిన థాంక్స్-గివింగ్ షాపింగే రెండు గంటలకంటే ఎక్కువ తిరగము. నాకు బోర్ లెవెల్ తారాస్థాయి కి చేరిపోద్ది అప్పటికి. పద ఇంటికి పోదాం సినిమా కి పోదాం కార్ వరకు పోదాం అని మొదలెడుతా. తనకి అంతే. ఎక్కువ సేపు చేయదు షాపింగ్. కాని మొన్న అలా అవలీలగ నాలుగు గంటలు తను ఏక ధాటిగా షాపింగ్ చేసేసరికి భయం వేసింది. ఇది అలవాటు అయిపోతే నా గతేంటి అని? నేను షాపింగ్ అంటే ముందే ఎల వెళ్ళాలో ఏమి ఏమి కొనాలో అవి ఎక్కడ ఉంటాయో ముందే ఆలోచిచేసుకుంటా. అంతెందుకు సపోజ్ పర్ సపోజ్ హొల్ ఫుడ్స్ కి, లైబ్రరి కి సేఫ్ వే కి వేళ్ళాలంటే ముందుగా కార్ ఎక్కేలోపే ఏ దారి లో వెళ్తే త్వరగ పనులు అయిపోతాయో అని ఓ నాలుగు ఐదు దారులు ఆలోచించేసి "షార్టెస్ట్ పాథ్" ఎన్నుకొని హొల్ ఫుడ్స్ లో సేఫ్ వే లో ఏది ఎక్కడ ఉంటదో బాగా తెలుసు కాబట్టి అందులో కూడా ఏ దారి లో వెళ్తే త్వరగా బిల్ చేయించూవాచ్చో అని ఆలోచించి అలనే చేస్తా.
మామూలుగా నాకు తెలిసి.. అంటే నాకు తెలిసిన బాయ్స్ అందరు ఇలనే చేస్తారు అనుకుంటా. బ్రహ్మచారి గా ఉన్నప్పుడు షాపింగ్ కి ముగ్గురం వెళ్తే కొనాల్సిన వస్తువుల పట్టి ని ముగ్గురం పంచేసుకొని టక టక కొనేసి వచ్చేవాళ్ళాం కార్ దగ్గరికి. బిల్ దగ్గర క్యూ పెద్దగా ఉంటే ఒకడిని అక్కడ ముందు ఆగమని చెప్పి మిగిలిన వాళ్ళు వెళ్ళి అన్ని కొనేసి తెచ్చేవాళ్ళాం. ఇలా కాకుండా యే షాప్ కి వెళ్ళినా ప్రతి వస్తువుని చూసి పరిశీలించి వీలైతే ఆ వస్తువు ఎల ఉందో మిగితా వాళ్ళూ ఏమన్నరో అని తెలుసుకొని అప్పుడు కొనలా వద్దా అని ఆలోచించి ఓ నాలుగైదు ఫోన్లు చేసి కొనచ్చని తర్వత తర్వత తెలిసింది. ఇల దివ్య చేయదు. ముందే చెప్తున్నా మళ్ళా మొదలెట్టకండి. పాపాం తనకి షాపింగ్ అంటే బోరే. నా పూర్వ జనం సుకృతం అని డిసైడ్ అయ్యా. కాని కొంత మంది నా స్నేహితులని చూసి ఈ అనుమానం వచ్చింది. జీవితం లో నాకు తెలియని అతి తక్కువ విష్యాల్లో ఇదొకటి. అందుకే అడిగి తెలుసుకుందాం అని అడుగుతున్నా. అబ్బయిలు అందరు నాలాగే ఒక మిలిటరి మిషన్ లా షాపింగ్ చేస్తారా? మనలో కూడా షాపింగ్ ని "అనందించే" వాళ్ళు ఉన్నారా? ఆడలేడీస్ కి (ప్రత్యేకించి గంటలు గంటలు తిరిగి షాపింగ్ చేసే వాళ్ళాకి) నా ప్రశ్న - మీ దృష్టి లో షాపింగ్ అంటే ఏంటి : అవసరమా - ఆనందమా - ఏం తోచకుండా కాలం వెళ్ళబుచ్చడమా?
Sunday, May 17, 2009
ఒక్క రోజు తర్వాత..
నిన్న (అమేరికా టైం ప్రకారం) ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి లా అనిపించింది. రాష్ట్రం లో తెలుగుదేశమో, చిరంజీవో (అత్యాశ కాని లోక్ సత్తానో) వస్తుందేమో అని భావించా. మన ఆంధ్ర ప్రజలు నువ్వేమనుకుంటే నాకేంట్రా అని తిరిగి రాజశేఖర్ రెడ్డినే ఎన్నుకున్నారు. అలనే దేశం లో కాంగ్రెస్ రాదేమో బహుశా భా.జ.పా. వస్తుందేమో .. ఎదో చమత్కారం అయి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయిపోతాడేమో అని అనుకున్న. ఆశ పడ్డ. కాని ఏం చేస్తాం.. మళ్ళ మన్మోహనుడినే ఎన్నుకున్నారు.
మొదట్లో అంటే ఎన్నికల ఫలితాలు ఇంకా వస్తున్న తరుణం లో కొంచం బాధవేసింది. నేను ఆశించింది జరగడం లేదని. నిన్న అంతా అలనే సాగింది. ఏంటో ఏంటో లాగా ఉండింది రోజంతా. ఈ రోజు ప్రొదున్న లేచుపాటికి దమాక్ కొంచం సరిపోయినట్టు ఉంది. ఫలితాలు చూసి అంతగా బాధ అనిపించలేదు. ఎందుకో రాష్ట్రం లో చెం.బా రాలేదు అని ఎక్కడో ఒక మూల కొంచం రిలీఫ్ గా అనిపించింది. ఎందుకో అర్థం కాలేదు. నేను జన్మతహా కాంగ్రెస్ వ్యతిరేకుడ్ని. ఒక్క శ్రీ పీ.వీ.నరసింహా రావు గారు తప్ప ఎవ్వరు నచ్చరు నాకు. అలాంటిది రాష్ట్రం లో వై.యెస్.ఆర్ కేంద్రం లో మన్మోహన్ రావడం అంత చెడేమి కాదని అనిపిస్తోంది. ఎందుకో తెలీడం లేదు.
కొంచం ఆలోచించగా రాష్ట్రం లో కాంగ్రెస్ రావడం కంటే ఎక్కువగా తె.రా.స ని చిత్తు చిత్తు గా కొట్టడం ఆనందంగా అనిపిస్తోంది. తెలంగాణా ప్రజలని స్వార్థం కోసం ఇన్ని యేళ్ళగా వాడుకొని విసిరేసిన కే.సీ.ఆర్ ని ఈ సారి కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు ప్రజలు. తెలంగాణా లో కాంగ్రెస్ కి మహాకూటమి కి సరిసమానంగా 54 సీట్లు రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే తెలంగాణా ప్రజలు రాష్ట్రానికి తెలంగాణా కి ఎదైన మేలు చేసేది వై.యెస్.ఆర్ ప్రభుత్వమే తప్ప కే.సీ.ఆర్ కాదని భావించినట్టు ఉన్నారు. మళ్ళా ఇక్కడ తెలంగాణా సాయుధ పోరటం తెలంగాణా ప్రజలు వేరు భాష వేరు గట్ర గట్ర అని ఎవరైన అనకముందే ఒక్క మాట చెప్పాలి. మా కుటుంబం కూడా ఆ నాడు జరిగిన పోరాటం లో పాల్గొన్నదే. త్యాగాలు చేసినదే. ఓ రెండొందల యేళ్ళ నుండి మా నాన్నమ్మా వాళ్ళు భాగ్యనగరంలో ఉన్నవాళ్ళే. అయినా నాకు విశాలాంధ్రే ఇష్టం. రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసుకోడం ఇష్టం లేదు. నా స్వభిప్రాయం. ఈ సారి తగిలిన దెబ్బ వళ్ళన ఇంక తె.రా.స సంగతి అయినట్టే అనిపిస్తోంది. మళ్ళ ఇంకో "నాయకుడు" వచ్చి స్వార్థానికి ఆశలు రేపి నట్టేట్లో ముంచేదాకా తెలంగాణా ప్రజలకి కొంచం విరామం.
ఇంక కేంద్రం లో.. నాకు ఈ రాష్ట్ర నాయకులు కేంద్రాన్ని బ్లాక్ మేల్ చేయడం అస్సలు నచ్చదు. గత పది యేళ్ళ గా ఇలాంటి స్వార్థలు వళ్ళనా దేశం ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన వలని వచ్చింది. ఒక ఎన్నికల భారాన్ని కూడా అధికంగా మోసింది. మాటి మాటికి ఆ కమ్యునిస్ట్ల చెత్త ని సేవించాల్సి వచ్చింది. హమ్మయ్య.. దెబ్బకి దరిద్రం ఒదిలింది. 60 నుండి 24 కి పడ్డ వాళ్ళ సీట్లని చూస్తే అబ్బో సంబరం పట్టలేకపోయా. నాకు బేసిక్ కా కమ్యునిస్ట్లన్నా ఫెమినిస్ట్లన్న పడరు. 60 సీట్లతో దేశాన్ని ఓ ఐదేళ్ళూ చీడపురుగుల్లా వేధించిన దానికి తగిన శాస్తే జరిగింది. ఇంక దేశాం నుండి శాస్వతంగా ఈ చెండాలం వెళ్ళిపోతే ఆ రోజు మనకి పెద్ద పండగే. పలిసీలకి చైనా ని సమర్థించే ఈ బూటకపు నాయకులని జైల్లో వేయాలి. ఆ అవసరం లేకుండా దేశ ప్రజలు వాళ్ళని తరిమి తరిమి కొట్టారు. అలనే మిగితా లోకల్ రాష్ట్ర నాయకులని కూడా ఎక్కువగా ఎన్నుకోలేదు. కాంగ్రెస్ భా.జ.ప కలిపి 320-330 సీట్లు వచ్చాయి ఈ సారి. ఇద్దరి ఎకనామిక్ పాలిసీలు ఇంచు మించు ఒకటే అవడం వలన తొంభై శాతం దేశ భవిషత్తుకి మంచిదయ్యే పాలిసీలు సులువుగా నెగ్గుతాయి అనిపిస్తోంది. చూద్దాం. మధ్యలో ఎక్కడ ములాయాం ప్రధాని అయిపోతాడో అని టెన్షన్. హమ్మయ్యా అనిపించింది లెక్కలు చూసాక.
చివరిది ఎందుకో నాకు అద్వాని కంటే మన్మోహనే మంచి ప్రధానిలా అనిపిస్తాడు. అంటే అద్వాని ఎప్పుడు ప్రధాని కాలేదు అనకండి. ప్రధాని అయ్యింటే కూడా మన్మోహన్ అంత అయ్యిండేవాడు కాదు అని నా అభిప్రాయం. ఇవ్వన్నీ చూతే మన ప్రజలు బాగా ఆలోచించే వోటు వేసారనిపిస్తోంది. I seriously hope that is the case, and that we have turned a corner. చూద్దాం. ఒక్కటి మాత్రం అనిపిస్తుంది.. రాష్ట్రం లో పోయిన సారి చేపట్టినన్ని అభివృధి కార్యక్రమాలు మాత్రం జరగవు.. కేంద్రం లో పోయినసారి కంటే ఎక్కువ అభివృధి జరుగుతుంది అని. చూద్దాం.
Friday, May 8, 2009
దిల్లీ 6- జోర్ సా ఝట్కా జోర్ సె లగా..
సినిమా మధ్యలో బ్రేక్ ఎందుకు ఇస్తారు అనేదానికి మా బావగాడి ఉవాచ - ఎలాగో థియేటర్ వాడికి, నిర్మాత కి మనం చదివించాల్సింది చదివించేసాము, ఇంక మన తో ఆ దర్శకుడికి పెద్దగా అవసరం లేదు .. మన ఖర్మకొద్ది మిగితా సగం చూడచ్చు లేకుంటే బ్రతుకు జీవుడా అని పారిపోవచ్చు. ఇలా నాకు సినిమా మధ్యలో నుండి పారిపోవాలి అని ఇప్పటివరకు జెస్ట్ రెండే రెండు సార్లు అనిపించి లేచ్చి వచ్చాను. అల రావడం వలనే ఇంకా మతిస్థిమితంగా ఉన్నా అని ఎప్పుడూ అనిపిస్తూంటది. రజనీకాంత్ - మాధురి దీక్షీత్ "శంకర్", నాగ్ - "డాన్" లాంటి ఆస్కర్ లెవెల్ చిత్రాలనే అవలిలగా తట్టుకున్నా.. అలాంటిది రెండు సినిమాల మధ్యలో నుండి వాక్-ఔట్ చేశా.. అవి ఏంటో చెప్తే నన్ను బోలెడు మంది తిడతారు. అయిన పర్లేదు .. ఒకటి దర్శకేంద్రుని "పరదేశీ" (గుర్తుందా? అదేదో talent search పెట్టి నలుగురు జాతి రత్నాలని ఎన్నుకొని, ఒక ముష్టి కథ తో తీసిన ఘనమైన చిత్రం అది. చూసినోళ్ళకి సతసహస్ర వందనాలు. మీరు నాకంటే చాలా ఘనులు.). ఇంకొకటి .. చెప్పేస్తున్నా.. ఇదిగో మళ్ళ నామీద అరవకండి - హం ఆప్కె హై కౌన్. నా జీవితం మీద నాకే విరక్తి కలిగించిన చిత్రం. మూడు నెలల ముందు టికెట్ కొని మరీ దొబ్బించుకున్నా. సగం అయ్యేసరికి నా జుట్టు నెరిసిపోయింది.. నేను చార్మినార్ కట్టినట్టు, టీ లో సాంబార్ పోసుకొని బ్రెడ్ తో తిన్నట్టు ఇల రక రకాలుగా అనిపించింది. అందుకే లేచ్చొచేసా(ము).
ఇప్పుడివ్వన్ని ఎందుకు చెప్తున్నా అంటారా.. అబ్బే ఏమీ లేదు.. దిల్లి 6 చూసాక ఎందుకో ఇవ్వన్ని గుర్తొచ్చాయి నాకు. తాడు బొంగరం లేకుండా ఏదో అప్పట్లో ఆషికీ సినిమా తీసినట్టుగా ఉంది. మొదట్లో ఓహో ఇది మతసామరస్యం మీద మూవీ అనుకున్న.. తర్వత కాలా బందర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఓహో ఇది satarical మూవీ అనుకున్న.. మధ్య మధ్యలో అంటే అసలు ఎందుకు వచ్చాయో ఎల వచ్చాయో అర్థం లేకుండా పాటలు వచ్చినప్పుడు ఓహో ఇది మ్యూజికల్ మూవీ అనుకున్న.. కాని ఇది ఏదీ కాదు. అన్ని అని చివరకి తేలింది.
ఈ సినిమా చూస్తున్నప్పుడు అనిపించింది.. బహుశా రహమాన్ సంగీతం సమకూర్చాకా కథ రాశారేమో అని. ఎందుకంటే చాలా చోట్ల చాలా డిస్జాయింట్ గా ఉంటుంది. రెండేళ్ళ పిల్ల కి ఆ సంవత్సరం లో తిరిగిన ప్రదేశాల చిత్రపటాలు ఇచ్చి ఒక ఆల్బం లొ పెట్టమంటే ఎల ఇష్టం వచ్చినట్టూ పెడుతుందో ఊహించుకోండి. అదే దాదాపుగా మూడూ గంటలు సినిమా తీస్తే ఎల ఉంటుంది? సేం టు సేం. కథ పరంగా ఐతే ఒక కోతి వళ్ళ మనుషులు మతి ఎల కోల్పోతారో మత కలహాలు ఎల రేగుతాయో.. అదే ఒక కోతి వళ్ళ అని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. మనిషి కోతి నుండే పుట్టాడు కావున మనిషి కలహాలు కూడా కోతి వళ్ళనే అన్న నిజాన్ని నేను ఈ చిత్రం ద్వారా గ్రహించాను.
అభిషేక్ సినిమా మొత్తం ఒకటే ఎక్స్ప్రెషన్ తో ఉంటాడు. బోలేడు మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తారు పోతారు. ఎందుకు అన్నరంటే డిక్కి లో తొంగోబెట్టేస్తా. అది అంతే. వాళ్ళకి డబ్బిచాడు కద నిర్మాత? అందుకే వాళ్ళు వస్తారు. పోతారు. నీకెందుకోయి? ఆ సోనల్ కపూర్ గురించి నేను చెప్పదల్చుకోలేదు. అనిల్ కపూర్ అమ్మయిగా పుట్టింటే ఎల ఉంటాడో అలనే ఉంది. బహుశా ఇంకొక ఐదేళ్ళ తర్వత ఏమైన మార్పు వస్తుందేమో పిల్ల లో చూడాలి. అప్పటి వరకు అయితే లైట్. ఆ మధ్యలో మీనాక్షి అని టబు తో యం.ఎఫ్.హుస్సేయిన్ తీసాడు. గుర్తుందా? భలే పాటలు. ఇది అంతే. ఐ.క్యూ ఒక 300 ఉంటే కాని అర్థం కాదేమో. నాకు అంత టాలెంట్ లేదు. మీకుందేమో చూడండి. ఈ సినిమా చూస్తే ప్లీజ్ ప్లీజ్ నాకు కథ చెప్పడం మరువకండి.
Wednesday, April 29, 2009
కుడి ఏడమైతే..
పొరబాటు ఉందోయి. పెద్ద పొరబాటు. ప్రొదున్న ఉద్యోగానికి వేళ్ళేటప్పుడు ఆ తొందరలో ఆ చిరాకు లో కుడు ఏడమ చాలా పెద్ద తేడా చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అమేరికా లో ట్రాఫిక్ కొంచం మన దేశం కంటే పద్ధాతిగా ఉంటుంది.. అందుకే ఎడమ లో ఉండే సివరాఖరి బిట్టు ని కొంచం వేగం గా వేళ్ళే వాళ్ళకి కేటాయించారు. హైదరాబాదు లో అయ్యింటే యే సందుల్లోనో పాకల మధ్యలో నుండో ఆర్.టీ.సీ బస్సు కింద నుండో పైనుండో డేక్కుంటూ పాక్కుంటూ రద్ది నీ దాటచ్చు. (ఇది ఒక 10+ సంవత్సరాలు హైదరబాదు రద్దిలో నడిపీ నడిపీ తెలుస్కున్న కిటుకుల వలన.) వన్-వే లో వెళ్తూ పోలీసు పట్టుకుంటే సుధాకర్ సుధాకర్.. ఇదిగో జేస్ట్ ఇప్పుడే చాలా రోజుల తర్వత హైదరబాదు కి వచ్చాను అనో లేకుంటే సార్ చదువుకునే పిల్లలం సార్ మా కాడ ఏముంటది చాయి కి చిల్లర తప్ప అనో బుకాయించి తప్పించుకోవచ్చు రద్ది నీ పోలీసు ని. కాని ఈ అమేరికా లో ఇది చాలా కష్టం. పద్ధతి కొంచం ఎక్కువ. చస్..
ప్రొదున 20 మైళ్ళ దూరం ఉండే ఆఫీసుకి బయలదేరా. మామూలుగా అయితే అంటే జనసంచారం మహేష్ బాబు-త్రివిక్రం-అనుష్కాపాప కొత్త చిత్రం విడుదల రోజు లా కాకుండా "ఈ అబ్బయి చాలా మంచోడు" సినెమా హీరో కొత్త చిత్రం విడుదల రోజు లా ఉంటే 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. కాని ఈ రోజు పెద్ద తుఫాను వచ్చినట్టు వార్తల్లో చూడ్డం మరిచా. తుఫాను అంటే అదేదో కట్రినా నో మొన్నామధ్యలో బాంగ్లదేశం లో వచ్చినా నగీనా (పేరు ఇలాంటిదే ఎదో ఉండాలి మరిచా) లాంటిది కాదు సుమీ.. మే లో మద్రాస్ లో పడే వానా లాంటిది అన్నమాట.. దానికి ఎదురుగా సునామి వచ్చినట్టు జనాలు మెల్లిగా అతి మెల్లిగా మరీ మెల్లిగా అతివీరభయంకర మెల్లిగా వేళ్ళడం మొదలెట్టారు. సివరాఖరి "వేగ లేను" లో కూడా చెక్కుచెదరని ఆత్మ విశ్వాశం తో 55 స్పేడు లిమిట్ లో 35 లో వెళ్ళడం మొదలెట్టారు. అలా నా 30 నిమిషాల ప్రయాణం ఒక గంటన్నర కి చేరింది. అ వెళ్ళే 35 యెం.పీ.ఎచ్. ఆ మూల కుడి వైపు వెళ్ళచ్చు కద? అదేదో 90 లో నడుపుతున్నట్టు నా లేను పట్టేయడం అవసరమా?
ముందే వర్షం వళ్ళ చిరాకు, దానికి తోడు ఈ స్పీడు మనుషులు నాకు బీ.పీ భయంకరంగా పెరుగుతునుది. road rage అనేది ఎందువళ్ళ వచ్చిందో మా ఊర్లో 66-495 మీద ఒక నెల నడిపితే అర్థమైపోతుంది. నేను అదేదో గొప్పగా నడుపుతా అని చెప్పడం లేదు.. కాని 55 జోను లో ఓ 70-75 కొడతా.. 35 లో ఓ 45-50. పాము లాగా మధ్యలో అటూ ఇటూ వెళ్తా. ఏం చేయను? అటు ఫాస్టు లేను లోను ఇటు స్లో లేను లోనూ ఒకటే వేగం లో వెళ్తే నా లాంటి వళ్ళు మరి ఎక్కడ నడపాలి బండి ని?
అందుచేత నేను చెప్పోచ్చేది ఏంటంటే - మీరు ఎడమ లేను లో 55 లో 50 లో వెళ్తూంటే నేను కట్ చేస్తే ఏమి అనుకోకండి. tailgate చేస్తే కూడా ఏమి అనుకోకండి. అప్పుడప్పుడు మెంటల్ ఎక్కువై హార్ను చేస్తే కూడా ఏమీ అనుకోకండి. వీళైతే నాకంటే వేగంగా వెళ్ళండి. come on.. you can do it. Let's make this world a faster place to live in...
Wednesday, April 22, 2009
విశ్వ దర్శిని - ఈ వారం నేను చదివిన వార్తలు.
అంటే కేవలం ఇవే కావనుకోండి. రోజు చదివే వార్తల్లో ఇవి కొంచం మంచిగా,వరైటీగా అనిపించాయి. ఇంక ఆలస్యం యేలా?
అంటార్టికా లో ఒక చోట, భూమికి 400 మీ కింద, గాలి కూడా లేని ప్రదేశం లో కొన్ని లక్షల సంవత్సరాల నుండి కొన్ని microbes జీవిస్తున్నాయి అట. ఈ క్రిమికీటకాలు మన ప్రాణ వాయువికి బదులుగా సల్ఫర్ ని, ఇనుము ని "పీల్చుకుంటాయట". ఇన్ని సంవత్సరాలు నిపుణులు అంతరిక్షం లో మన భూమి లాంటి గ్రహాల కోసం వెతుకేవాళ్ళు. అంటే నీరు, గాలి, వెలుతురు - ఇవి జీవనానికి అత్యంత ఆవశక్యమైనవని ఇన్నేళ్ళు నమ్మారు.. కాని అసలు ఇవేమి లేకుండా కేవలం సల్ఫర్ మీద బ్రతికే ఇలాంటి జీవులని చూసాక ఆ అభిప్రాయం మార్చుకోక తప్పదు. మార్స్ యొక్క ఎరుపు దీనివళ్ళేనేమో! ఏది ఏమైన వీటిని కన్నుకోవడం వలన ఈ అంతరిక్షం లో మనమ్మొక్కరమే లేము అన్నది వాస్తవమ్మే రోజు దగ్గర్లో ఉన్నట్టే ఉంది.
జావా ని కనుక్కొని ఎన్నో లక్షల ప్రోగ్రామర్లకి ఆరాధ్యంగా నిలిచిన SUN Microsystems ని Oracle కొనుక్కునే యత్నం చేస్తోంది. గత యేడది సన్ MySql ని ఒక్క బిల్లియన్ డాల్లర్లకి కొనుకున్నది. ఓరకల్ కి mysql కొంచం గట్టి పోటినిచ్చేది. ఆ మధ్యకాలం లో ఓరకల్ BEA ని కూడా కొన్నుకోవడం తో అటు middleware సాఫ్ట్వేర్ ని ఇటు database ని గట్టిపరుచుకుంది. జావా ని కొన్నుకోవడం తో అన్ని ఓరకల్ గుప్పెట్లోకి వచ్చినట్టే. దీని వల్ల జావా, mysql పై ప్రభావం ఎల ఉంటుందో మరి.
ఆ మధ్యలో డెరివేటివ్ల గురించి రాసాను. వాటి మీద ఇంకొన్ని వార్తలు. ఒక వార్త ప్రకారం, ఈ డెరివేటివ్ మార్కెట్ మొత్తం "విలువ" 64 ట్రిల్లియన్ డాల్లర్లట!! మన ప్రపంచ జీ.డీ.పీ విలువ కేవలం 56 ట్రిల్లియన్లు మాత్రమే. దీన్ని బట్టి అంచనా వేయచ్చు అసలు ఈ డెర్వేటివ్లని వారెన్ బఫ్ఫెట్ ఎందుకు financial weapons of mass destruction అని అన్నారో.
1963 నుండి 1998 వరకు వచ్చిన భూకంపలన్నంటిని ఒక చిత్రపటం పై వేస్తే ఇల ఉంటుంది. ప్రతి యొక్క tectonic plate ని చక్కగ గుర్తుపట్టచు. కొన్ని లక్షల సంవత్సరాల తర్వత మన భారతఖండం యురేశియా ప్లేటు కిందికి వెళ్ళిపోతుంది.
మొన్సాంటో ని జెర్మనీ బహిష్కరించింది అట. ప్రపంచంలోకల్ల అతి నీచమైన కంపనీల్లో ఈ మొన్సాంటో ఒకటి. వాళ్ళు చేసే చెండాలపు పనుల గురించి చెప్పలంటే దానికే ఒక టపా రాయాలి. మరికొన్ని వార్తల్తో మళ్ళి కలుద్దాం. అంత వరకు సెలవు.
Thursday, April 16, 2009
ఆకాశమంతా - just భరించగలిగేంత.
శంకారాభరణం, స్వర్ణకమలం, గోదావరి, గమ్యం ఇత్యాది సినిమాలు నచ్చడ్డం వలన నేను "క్లాసో" విజేంద్ర వర్మా, టైగర్ హరిస్చంద్రప్రసాద్, చిత్రం భలారే విచిత్రం, లేడిస్ టైలర్ లాంటి సినిమాలు నచ్చడ్డం వలన "మాసో" ఇంతదాకా అర్థం కాలేదు నాకు. బహుశా నాలాగా అందరూ అనుకుంటారేమో తెలేదు మరి. ఏ సోదంత ఎందుకురా అంటారా.. నిన్నా అంటే రెండు రోజులు పట్టింది లేండి .. ఆకాశమంతా చూసేసరికి. కొంతమంది ఇది చాలా క్లాస్ మూవీ నీకు నచ్చుద్ది అన్నరు.. ఇంకొంతమంది మామా ఇది మనకి ఎక్కదురా అన్నారు. సరే రజనీ, మాధురీ దీక్షీత్, జాకీ ష్రాఫ్ నటించిన "శంకర్" చిత్రం ఇప్పటికి ఒక 20 సార్లు చూసినవాడికి ఇదో లెక్క అని చూసా.
ఏంటో.. పరమ వరైటిగా అనిపించింది చిత్రం. ఒక్కర్తే కూతురు ఉంటే ఇలా ఉంటదా అని అనుమానం వచ్చింది కూడా. వెంట్టనే మా అక్క కి కాలా.. అక్కా నువ్వు ఒక్కర్తే కద ఇలా ఇలా ఉంటదా అని.. తనేమో ఇలా ఎగెస్ట్రాలు చేసింటే తనకి దెబ్బలి పడేవని, అలనే వాళ్ళ నానా అలా (సినెమా లో లా) చేసింటే ఎప్పుడో ఇంటి నుండి పారిపోయేదని చెప్పింది. అప్పుడు కొంచం కుదుటబడ్డ. ఇది నా అభిప్రాయం మాత్రమే. బహుశా అలాంటి తండ్రులు ఉన్నరేమో.. సినెమా లో ప్రకాష్ రాజ్ కి జూనియర్ వర్షన్ నేను చూశా / చూస్తూనే ఉన్నా. (ఎవరు అనేది ఇక్కడ చెప్పలేను .. స్వారీ) కానీ సినెమా లో లాగా "అంతా కూతురిమయం" ఎప్పుడు చూడలేదు.
ఒక్కరే ఉంటే అంటే ఒక్కర్తే అమ్మయి అయినా, ఒక్కడే అబ్బయి అయినా చాలా గారాబం అని ఒక అపనమ్మకం ఉంది ప్రజల్లో. అపనమ్మకం అని ఎందుకు అన్ననంటే నేను ఒక్కడినే కాని మా అమ్మ నానాలు నేను అడిగిన వెంట్టనే ఏది ఇవ్వలేదు. పైపెచ్చు ఇంట్లో అటు అమ్మయి కోటా పనులు ఇటు అబ్బయి కోటా పనులు చేయాల్సి వచ్చేది (మచ్చుక్కి - ఇళ్ళు చిమ్మి, ముగ్గు పెట్టడం మొదలు గంజ్ కి వెళ్ళి నెలకి సరిపడ సరుకులు తేవడం గట్ర వరకు అన్నమాట) చేయాల్సి వచ్చేది / చేయాల్సి వస్తోంది. సో.. ఎవ్వరాఇనా "త్రిషా ఒక్కర్తే అమ్మయి కద అందుకే అంత గారాభంగా పెరిగింది అంటే నేను ఒప్పుకోను"..
ఇంతకీ కథ ఏంటంటే - ఒక్కర్తే అమ్మయి ఉన్న తల్లిదండ్రుల కథ అన్నమాట. ఒక కూతురికి తన తండ్రికి మధ్యలో ఉండే మనోభావాలు. కొంచం గరం మసాలా, ఉప్పు, కారం, చింతపండు, మామిడి తొక్కు, కొబ్బెర పచ్చడి, టమాట పప్పు వేసి తయారు చేసింది. అంత వరైటీ తగ్గించింటే నచ్చేదేమో కాని ఇన్ని కలిపే సరికి టేస్ట్ మరోలా తయారయ్యింది. ప్రకాష్ రాజ్ కొన్ని చోట్ల అతిగా కొన్ని చోట్ల మామూల్గా చేసాడు. త్రిష కి పెద్దగా రోలు లేదు. ఐశ్వర్యా తల్లిగా బానే చేసింది. మిగితా వాళ్ళందరు లైట్.
సినెమా ఒక 30% నిజానికి దగ్గర్లో ఉందని ఖచితంగా చెప్పగలను. అంతకు మించి ఏమీ లేదు. చిత్రం భలారే విచిత్రం చూసి చూసి బోరు కొడితే ఇది చూడండి.. చూసాకా మళ్ళా చిత్రం భలారే విచిత్రం చూడచ్చు.
Saturday, April 11, 2009
ఆదాబ్ హైదరాబాద్
హైదరాబాదు... ఆ పేరు వినగానే ఎదలోతుల్లో నిక్షిప్తమైన ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు అలా వరదలొచ్చిన గోదావరిలా గండిపేట్ కట్టకమునుపు మూసీ నదిలా తన్నుకుంటూ బాదుకుంటూ వస్తాయి. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ సొంత ఊరు గుర్తొస్తే ఇలానే ఉంటుంది అనుకుంటా. పుట్టి పెరిగి తిని గల్లి గల్లి (మించు ఇంచుగా) తిరిగిన నా సొంత ఊరూ కాబట్టి హైదరబాదు అంటే కొంచం... చాలా ఎక్కువ ఆప్యాయత. నేను మా ఇంటిని వదిలి వెళ్ళడానికి బాధ పడలేదు.. నా సిటీ ని వదిలి వచ్చెనందుకు బాధ పడతా. ఇప్పటికీ అంతే. ఊరుని మిస్స్ అవ్వమ్ము అక్కడ మన స్నేహితలని మిస్స్ అవుతాము అని మొదట్లో చాలా మంది చెప్తే .. ఓహో బహుశా ఇది నిజమేమో అనుకున్న. కాని కాదని తర్వత తర్వత తెలుసుకున్నా. ఇప్పటికీ ఐ మిస్స్ మై సిటి.
ప్రొదున్న నానా దగ్గర "చదువుకో" అనో, "ఇంత టైం అయినా లేవడు" (అప్పుడు టైం ఉదయం 6:15) అనో తిట్లు తప్పించుకోవడం కోసం, 6 కే లేచి ఓస్మానియా లో జాగ్గింగ్ చేయడం మిస్స్ ఔతా. హిల్టన్ దగ్గర బండి పెట్టేసి అక్కడ నుండి ఆర్ట్స్ భవనం వరకు వెళ్ళి తిరిగి జాగ్గింగ్ చేస్తూ వచ్చి చేసిన వ్యాయామం కి సరిపడ చాయి, ఓస్మానియా బిస్కెట్లు తిని తాపిగ యే 8 కో అల ఇంటికి రావడం మిస్స్ ఔతా. ఆంధ్ర యువతి మండలి, శివం రోడ్డు పై ఆ సమయానికే ఉండే "అందాలని" చూడ్డం మిస్స్ ఔతా (ఇది ఇంక ఇప్పుడు సాధ్యం కాదేమో.. but still... ;-) )
హిల్టన్ లో ఖాతా, గంగా హాస్టల్ ఎదురుగా సత్తర్ డబ్బా దగ్గర ఖాతా, మా కాలేజి క్యాంటీన్ లో ఖాతా, బస్స్ స్టాప్ దగ్గర యాదవ్ డబ్బా లో ఖాతా - అబ్బో ఇంకా దిల్షుక్ నగర్ లో ఒకటి రెండు చోట్ల ఖాతా ఇలా ప్రతి నెల 20-22 కి మొదలైయ్యేది. మళ్ళా నానా పాకెట్ మనీ ఇచ్చాకో మరి ఎక్కువగా విసిగిస్తే ఒక టెక్స్ట్ బుక్కు అమ్మాకో తీర్చడం. తార్నాకా జంక్షన్ దాటాక ఒక అమ్మయిల కాలేజి (పేరు గుర్తు రావడం లేదు) ముందు ఉన్న పానీ పూరి డబ్బ, సికందరాబాద్ లో స్వప్నలోక్ ముందు ఉన్న పాని పూరి డబ్బ, తిలక్ నగర్ లో ఒక పాని పూరి డబ్బ లో తినడం. ఒక సారి (అంటే ఇది రెండు రూపైయిలకి ఐదు పాని పూరి రోజులు) నేను మా నాగ్ గాడు కలిసి తిలక్ నగర్ లోని బండి (అది షాపు అనుకోండి) వాడి దగ్గర 26 రూపైయిల పానీ పూరి తిన్నాం!! ఇంటికి వెళ్ళాక అమ్మ పెట్టిన టిఫినూ తిన్నాం అనుకోండి అది వేరే విషయం. లకిడి-కా-పూల్ లోని ధనలక్ష్మీ మెస్స్ లో 23 ఫుల్ మీల్స్ ఉండేది. అక్కడికి వెల్తే మరి ఒక గంట గంటన్నర తినేవాళ్ళం.
ఇక్కడ ఒక సంఘటన - మెహదీపట్నం లో స్వాతి టిఫిన్స్ అని ఉంది. అక్కడ ఐదు రూపాయిలకి ప్లేట్ ఇడ్లీ ఉండేది. మేము అంటే ఒక 8 మంది వెళ్ళాం, ప్లేట్ ఇడ్లి కి 2-3 సాంబార్, 2-3 చట్నీ లాగించాం.. మరి వాడేమనుకున్నాడో ఎమో మరో సారి వెళ్తే ఎకెస్ట్రా సాంబార్ కి 1 రుపాయి అని పెట్టాడు. ఇలా అయితే మేము దివాలా ఐపోతాము అని, సగం ఖాలి అయిన సాంబార్ గిన్నే తీసుకు వెళ్ళేవాళ్ళం .. అప్పుడు దానికి వాడు చార్జి చేయలేడు కద. పాపాం ఒక వారం తర్వత ఆ ఎక్స్ట్రా చార్జీ తీసేసాడు. ఇలా ఎన్నో ఎన్నో విషయాలు గుర్స్తోస్తాయి.
కొయి లౌటా దె మెరె భీతే హుయే దిన్...
మళ్ళి కలిసే వరకు - ఆదాబ్ హైదరాబాద్.
Friday, April 3, 2009
ఎకానమి -1: ఇంకా జరగాల్సింది ఉంది.
అంటే ఎకానమి గురించి చెబుతున్నా. అసలు సమస్యని మూడు భాగాలుగా విభజిస్తే అందులో sub prime ఒక్క భాగము మాత్రమే. మిగిలిన రెండు Alt A, ARM మరియు credit cards గా భావించచ్చు. ఇంకా ఒక్కటే అయ్యింది.. రెండు మిగిలి ఉన్నాయి అనిపిస్తోంది. Alt A గురించి చాలా తక్కువ మంది వినిఉంటారు. ఎందుకంటే ఇది సుబ్-ప్రైం అంత సత్తా లేకపోయినా ఎదో దానికి చేతనైనంత పంజా విసురుతుంది. Alt A అనగా Alternate prime -A అని అర్థం. ఇవి అటు sub prime కి ఇటు రెగులర్ ప్రైం లోన్లకి మధ్యలోనివి. క్రెడిట్ క్రైసిస్ లేకపోయింటే వీటితో ఇంత కష్టం నష్టం వచ్చేవి కాదు.. ఎందుకంటె జన్మతః ఇవి high risk కావు. కానీ సుబ్-ప్రైం వళ్ళ కలిగిన ఈ క్రైసిస్ ములాన వీటి మీద కూడా ప్రభావం పడి... ఇప్పుడు ఈ Alt A లోన్లు గురి తప్పుతున్నాయి. ఈ లోన్ల మీద san francisco chronicle కథనం ఇక్కడ వుంది.
ఇళ్ళాకి సుబ్-ప్రైం లాగానే కార్పొరేట్ రంగానికి కూడా మార్టగేజ్లు ఉంటాయి. ఎకానమి అంతగా బాగోలేకపోవడం వలన గత యేడాది కంపనీలు అంతగా (అంటే మిగిలున్న కంపనీలు) లాభం పొందలేదు. అందువలన వాళ్ళు కార్పొరేట్ లోన్లు కట్టడం తగ్గాయి... వాటి ప్రభావం ప్రతి బ్యాంక్ మీద మళ్ళి పడుతుంది. sub prime part 2 అన్నమాట!! వీటితోబాటు ARM resets కూడా జరగనున్నాయి. ఈ సంవత్సరం రెండవ భాగం లో ఇవి జరగనున్నాయి. ముందే ఉద్యోగాలు లేక డబ్బు సరిపోక అంతంత మాత్రం లో ఉంటున్న వాళ్ళ నెత్తి మీద సిమెట్ట తో కొట్టీనట్టే. ARM అనగా Adjustable Rate Mortagage - అమేరికా లో ఇంటికోసం అప్పు తీసుకునేటప్పుడు ఈ వింత సదుపాయం కూడా ఉంటూంది.. అంటే మొదటి మూడో ఐదో యేళ్ళు అప్పు తీసుకున్న వడ్డి కి బదులుగా తక్కువ రేట్ తో కట్టచ్చు.. (అలా తగ్గించినట్టుగా అనిపించే డబ్బు "అసలు" లో చేరుతుంది.. అంటే మొదటి మూడో ఐదో యేళ్ళూ ఇలా ARM తీసుకున్నవాళ్ళు ఇంటి అప్పులో నయ పైసా కూడా తీర్చలేదన్నమాట!! వీటీ మీద pbs లోనూ cbs లోనూ ప్రసారాలు వచ్చాయి. కవాలంటే ఆ లంకెలు ఇక్కడ పెడతా.)
ఈ atl a, arm reset చాలా చిన్నవిగా అనిపిస్తాయి అసలు సిసలైన నాటు బాంబుతో పోలిస్తే.. అదే credit card క్రైసిస్. దాని గురించి, మన బీ.యస్.యీ ఎందుకు పైకి వెళ్తోందో, మన దేశం ఎందుకు కొంచం మెరుగ్గా ఉండచ్చొ ఇవ్వన్ని మరో టపాలో. అంత వరకు happy stock picking...