Saturday, October 10, 2009

క్రికెట్ తెలియనివాడు ...

అనగనగనగనగా ఒక ఊరిలో బుజ్జిగాడు అనే ఓ కుర్రాడు ఉండేవాడు. వాడు ఎలా ఉన్నా.. వాడ్ని అందరు ఇంచు మించు గా హీరో రాజా లా (మేధావి లా) చూసేవారు. అంటే ఊర్లో కష్టాలు లేకున్నా ఏదో ఒకటి చేసి కొంచం కష్టం గా దాన్ని చిత్రీకరించి ఉపాయాలు చెప్పేవాడు. అందరు వాడ్ని బాగా చూసుకునేవారు. ఊర్లో కాస్తో కూస్తో కొంచం జ్ఞానం బుద్ధి ఉన్నవాళ్ళళ్ళో ఒకడిగా అందరి అభిమానం పొందాడు. ఇలా ఉండగ పక్క ఊరునుండి ఒకడు వచ్చి బుజ్జిగాడి మేధస్సు చూసి "మామూలుగా రండి మేధవులుగా పొండి" అనే పోటికి పంపమని ఆ ఊరువాళ్ళతో చెప్పాడు. ఊరు పరువు పేరు నిలబెట్టాలి అని చెప్పి పెద్దలు నిర్ణయించి బుజ్జిగాడికి ఓ తోడు ఇచ్చి ఆ పోటి కి పంపారు.

బుజ్జిగాడు వాడి స్నేహితుడు పోటి జరుగుతున్న స్థలానికి చేరారు. మొత్తం ఇంకా అన్ని ప్రదేశాల నుండి ఓ వంద మంది వచ్చారు. అసలు పోటిల్లో పాల్గొనే అర్హత ఉందో లేదో అని ముందు చిన్న చిన్న పరీక్షలు పెట్టి మొత్తం మీద ఓ ఆరు మందిని ఎన్నుకున్నారు. ఇంక పోటిలూ ప్రారంభమైయ్యాయి. మొదటిది ఏంటంటే మూడు అగ్గిపుల్లల్తో ముప్పై మందికి మూడు రకలా వంటలు చేసి పెట్టాలి. ఇలాంటివి మన బుజ్జిగాడికి పప్పుతో పెట్టిన విద్య .. వెంట్టనే మూడు పుల్లల్ల్ని వేరు వేరు చేసి మూడు గిన్నెల కింద పెట్టి చక చక వంట చేసేసాడు. పోటిలో మొదటి స్థానాన్ని సంపాదించాడు. రెండో పోటి ఐస్కాంతం తో ఓ కాంత ని ఆకర్షించాలి. ఇది కూడా చిల్లర పని కాబట్టి నిమిషాల్లో చేసేసాడు. ఇలా ఐదు విడతల పోటిల తర్వాత మొదటి స్థానం లో బుజ్జిగాడు నిల్చున్నాడు. ఇంక ఫలితాలు చెప్పే సమయం అయ్యింది.. అందరు ఇంక బుజ్జిగాడికే వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. బుజ్జిగాడు కూడా విజయగర్వం తో అందరికి చేతులు ఊపుతు నిల్చున్నాడు. కాని చివరి క్షణంలో ఆ పోటి విజేత విజేంద్ర వర్మ అని చెప్పేసరికి ఎనలేని నిరాశ నిస్ప్రుహతో స్ప్రుహ కోల్పోయాడు బుజ్జిగాడు. ఇంక జీవితం మీద విరక్తి కలిగి అలా అలా నడుచుకుంటు దగ్గర్లో ఉన్న అడివిలోకి వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. కొద్ది రోజులు తర్వత ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైయ్యాడు. అప్పుడు బుజ్జిగాడు అడిగిన ఏకైక ప్రశ్న అన్నింటిలోను తాను ముందుండగా మేధావి అనే బిరుదు మాత్రం వేరేవాడికి ఎలా వచ్చింది అని. అప్పుడు ఆ పరమేశ్వరుడు "నీకు దైవ క్రీడ్ ఐన క్రికెట్ అంటే ఇష్టం లేకపోవడమే కారణం బుజ్జి" అని. ఆ మాటకి అవాక్కైన బుజ్జికి మించు ఇంచు గా మతి భ్రమించింది. "దేవా.. దేవాది దేవా మహాదేవా ....ఏంటి మీరంటుందేది. కొంచం వివరంగా చెప్పగలరు" అని పరిపరివిధములుగా ప్రార్థించగా ఆ పరమేశ్వరుడు చిన్నగా నవ్వి చెప్పడం ఆరంభించాడు -

ఒకానొకప్పుడు దేవుళ్ళు దూర్వస ముని శాపము వలన వారి శక్తులు అన్ని కోల్పోయారు. అప్పుడు వాళ్ళందరు విష్ణు మూర్తిని స్తుతించగా విష్ణుమూర్తి సంతుషూటుడై వారికి వారి గతవాఇభవం చేరూకే ఒక ఉపాయము చెప్పెను. క్షేరసాగరాన్ని మదించి అందులోనుండి వెలువడిన అమ్రుతాన్ని సేవించినచో దేవుళ్ళకి వారి గత వైభవం తిరిగివచ్చునని తెలిపెను. దేవుళ్ళు ఒక్కరే ఆ సాగరాన్ని మదించలేరు కాబట్టి వారి చుట్టలైన అసురులని కూడా ఆహ్వానించిరి. అలా ఇరువురు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి మదనాన్ని ఆరంభించిరి. హాలాహలము, కామధేనువు గట్ర అన్ని వచ్చాక అమృతం బయటకి వచ్చెను. ఆ అమృతానికి దేవుళ్ళు అసురులు కొట్లాడుకోవడం ఆరంభించారు. ఆ కొట్లాటని పరిష్కరించేదానికి కనుగొనబడిన క్రీడ ఈ క్రికెట్. ఆ రోజు జరిగిన మ్యాచ్ కి అంపైర్ గా వ్యవరించినది సాక్షాత్తూ ఆ బ్రహ్మే. మధ్యలో అసురులు వీరవిపరీతం గా విజ్రుంభిస్తూంటే వారి ఆటని దెబ్బకొట్టేదానికి విష్ణుమూర్తి మోహిని గా వచ్చే సరికి ఆ సుందరిని చూస్తూ మతిచెడి అసురులు ఓడిపోయారు. అలాంటి ఆటని హేళన చేసినందుకును ఇష్టపడనందుకును నీకు ఆ బిరుదు రాలేదు.

ఇది విన్న బుజ్జిగాడికి కళ్ళు చెమ్మగిల్లాయి.. ఐతే దేవా ఈ క్రీడని తెల్లోళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు? ఇది మన జాతీయ క్రీడ అవ్వాలి కద? అని అడిగాడు. అందుకు ఆ మహదేవుడి ఇలా సెలవిచ్చాడు - "భారతీయులకి ఓ భయంకరమైన జబ్బు ఉంది. అది ఎందుకు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు అసంధర్భం కావున చెప్పడం లేదు.. కాని ఆ జబ్బేంటంటే 'భారతీయులకి - పొరుగింటి పుళ్ళకూర రుచి! మనది, మన దేశానిది మన వాళ్ళూ అంటే చచ్చిన అవళంబించరు సరికద అపహాసం చేస్తారు. అందుకనే ఈ క్రీడని తెల్లోళ్ళకి అంటగట్టాల్సి వచ్చింది. అలా అయినా మనవాళ్ళు దీన్ని పుళ్ళకూరంత రుచిగా చూసుకుంటారని. ఇప్పుడు జరుగుతుండేది అదే కద!" ఇలా చెప్పేసరికి బుజ్జిగాడికి బోధిచెట్టుకింద కూర్చున్నంత జ్ఞానమొచ్చి ఇలా అన్నడు:

ఖగపతితోడన్ క్షీరసాగరము మదించగన్,
తగువున్ చేదించుటకు విధాత తలపుగన్,
జన్మనొందెన్ ఈ మహోనత క్రికెట్ క్రీడన్,
క్రికెట్ తెలియనివాడు దున్నపోతై పుట్టున్..

గమనిక: ఈ టపా ఎవ్వరిని ఉద్దేసించి వ్రాసినదికాదు. 'నేను-నేనుగా' యే 'నేస్తా'ల సహాయం లేకుండా రాసినది. ఎవరినైన బాధ కలిగిస్తే కేసేసుకోండి. నేను దానికి బదులుగా ముందే ఓ రెండు మూడు కేసులేసేస్తా.

Read more...

Saturday, October 3, 2009

Wake Up Sid - My Experience

నిన్న చూసా ఈ చిత్రం. బాగా అనిపించింది. చాలా రోజులు తర్వత ఓ మంచి కాఫీ లాంటి సినెమా చూస్తున్నట్టూ అనిపించింది. చెట్లెనకాలా పుట్లెనకాలా పెరిగెత్తే పాటలు లేవు.. తాతా ముత్తాతా ని తలుచుకుంటూ సోది లేదు.. కార్లు గాల్లో పల్టీలు కొట్టడాలు ఒక్క గుండు తో ఓ సైన్యాన్ని చంపేడలు లాంటివి అస్సలు లేదు. అలగే తేజా టైప్ "టీనేజ్ రొమాన్స్" లేదు. చాలా మెచూర్డ్ గా ఉంది మూవీ. దాదాపుగా నిజజీవితం లో జరిగేట్టే ఉంది. మన సినెమాల్లో అరుదుగా కనిపించే నిజాయతి ఉంది.

సిడ్ ఉరఫ్ సిద్ధార్త్ అంటే రనబీర్ కష్టపడి అప్పుడప్పుడు పాసయ్యే రకం అన్నమాట. రేపు పరీక్ష అంటే ఈ రోజు వన్-డే బ్యాట్టింగ్ లాగా అన్నమాట. మనలో (అంటే మాలో) సగం పైన ఇదే పద్ధతి తో గట్టెక్కాం .. బండిని లాక్కుంటు వచ్చాం. దానికి ఓ కిటుకు ఉంది.. పాత ప్రశ్నాపత్రాలని తిరగేస్తే ఓ అంచన వస్తుంది ఎలాంటి ప్రశ్నలు రావచ్చో అని.. మసిపూసి మారేడుకాయ చేయడం మాత్రమే మిగులుతుంది.. అలా కాకుండా పాపం ఒక్క రోజు ముందు టెక్స్ట్ బూక్ తిరిగేయడం మొదలెడతాడు. ఇంక పరినామం అర్థం అయినట్టే కద!!! పరీక్ష హాల్ లో ఏటు నుండి ఏటు చూసిన ముక్క అర్థం కాదు.. నాకైతే నా ఇంజరీనింగ్ ఫస్ట్ సెం లో ఓ పరీక్ష గుర్తొచ్చింది. (డీటేల్స్ అడగొద్దు.. శాస్త్రి గారి పలుకు ప్రకారం "ఉందిగా సెప్టెంబరు మార్చి పైనా... " అనుకోవడమే..)

ఫైనల్ పరీక్ష తర్వాతా రేపటి నుండి అదేగో గొప్ప ఘణకార్యం చేసినట్టు ఇంట్లో బయట అందరు "ఇంకేంట్రా పెద్దోడివైపోయావు" అని అంటారు. ఒక్క రోజులో విధ్యార్థి దశ నుండి నిరుద్యోగి దశ కి చేరుకుంటాం. కనీసం పరీక్ష ఫలితాలు వచ్చేవరకి కూడా ఆగరు. అదేంటో. అదో మన్మోహన్ (అదే చిదంబర) రహశ్యం. అలా ఒక్కరోజులో "పెద్ద"వాడైపోకుండా నిరసిస్తున్న సిడ్ కథే ఈ చిత్రం. బొంబాయి ని చాలా అందం గా చూపించారు. బొంబాయి అంటే గుర్తొచ్చింది.. సినెమా మొత్తం అందరు బొంబాయి ని బొంబాయి అనే.. సారి సారి "ముంబాయి" ని బొంబాయి అని అన్నారని శివ సేన ధర్నా చేసిందట. అస్సలు పనిలేకుండా ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు.

చాలా మెచూర్డ్ గా డీల్ చేసాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. బ్యానర్ .. ధర్మా ప్రొడక్షన్స్ .. కరణ్ జోహర్ ది.. చూసి దడుసుకొని జడుసుకొని కొంచం భయపడి ఎగ్గొట్టేద్దాం అని చాలా రోజులక్రితమే ఆలోచనమొదలెట్టా. కాని కరణ్ దర్శకత్వం కాదు కద అని కొంచం ఊపిరిపీల్చుకొని సాహసించా. బయటకి హాయిగా వచ్చాం. బ్యానర్ ని బట్టి మూవిలని కొలచకూడదని తెలుసుకున్నా. కొంకణా సేన్ గురించి చెప్పెక్కరలేదు. ఎటువైంటి పాత్రకైన న్యాయం చేస్తుంది. ఇందులోను అంతే. ఒక కొత్త ఊరికి వస్తే.. వచ్చిన మొదట్లో ఎలా ఉంటుందో అని మరోసారి గుర్తుచేసింది. అమెరికా కీ వచ్చినప్పుడు నాకు తెలిసినవాడు ఒక్కడు కూడా లేడు మా కాలేజి లో. అసలు హైదరబాదు దాటి ఒక్కడినే నేను వెళ్ళీన గరిష్ట దూరం దిల్లీ. అదెక్కడ అమెరికా ఎక్కడ. కొత్త ఊరూ కొత్త వాతావర్ణం.. మళ్ళా ఆ రోజులు గుర్తొచ్చాయి ఈ మూవీ చూస్తూంటే. చిన్నప్పటి స్నేహితులని విడిచి వస్తున్నప్పుడు కలిగిన బాధ... తర్వాత తర్వాత కొద్ది కాలానికే పరిచయమైన కొత్త స్నేహితులు.... కాలక్రమేన వీళ్ళు ఆ ప్రాణ స్నేహితుల జాబితాలోకి చేరిపోతారు. అది సహజం.. మన నైజం. ఇవ్వనిటితోబాటు తల్లిదండ్రులతో ఘర్షణలు.. అన్ని ఉన్నాయి ఇందులో. ఒక్క సీన్ మాత్రం చింపేసారు. ఎంత authentic గా ఉందంటే I am sure everyone can identify themselves with that.

చివరగా ఓ మాట. ఇది ప్రేమ కథే. కాని పదో తరగతో కాలేజో ప్రేమ కథ కాదు. అందుకే చూడండి అంటున్నా. వీలైతే. ఇంతకంటే సినెమా గురించి చెప్పడం కష్టం. చెప్తే మీకు కథ చెప్పేసినట్టు ఉంటూంది.. చెప్పకపోతే కూడా కష్టమే. సో పొరబాటున కథ ఎమైన చెప్పెస్తె క్షమించేయండి.

Read more...

Friday, October 2, 2009

కృష్ణమ్మ కొంచం కోపం తగ్గించుకోమ్మ..

గత వందేళ్ళళ్ళో ఎన్నడులేనంత ఆంధ్ర దేశం లో వరద ప్రాంతం ఏర్కొన్నది. భాస్కర్ దీన్ని *పాలనా వ్యవస్థల అట్టర్ ఫైల్యూర్* అన్నారు. కాని ఒక్కటి అసలు ఇంత వస్తుంది అని కలలో కూడా ఎవ్వరు ఊహించిండరు. కేవలం శ్రీ వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం తప్ప ఇంక ఎవ్వరు ఊహించలేదు ఇది. ప్రతి యేట వచ్చే వరదలని తట్టుకునే .. అలాంటివి వచ్చిన వెంట్టనే ఆదుకునే సత్త మాత్రమే మన ప్రభుత్వానికి ఉంది. అంతే తప్ప ఇలా ఇంత భారి లెవెల్ లో వరదలు వస్తే ఎవ్వరు ఏమీ చేయలేరన్నది నా అభిప్రాయం. మన దేశమే కాదు అసలు ఎక్కడ ఎవ్వరు ఈ లెవెల్ లో వరదలని ఎదుర్కునేంత లేదు. (please correct me if I am wrong).

ఇందాకే డా|| జయప్రకాష్ నారాయణ్ గారు చెప్పారు - ప్రపంచంలో యే ప్రభుత్వం / ప్రపంచలోని అన్ని ప్రభుత్వాలు కలిసి పని చేసిన మూడుగంటల్లో మూడులక్షల మందిని మూవ్ చేయలేరు అని. అది వాస్తవమే. మూడు రోజులుగా కురుస్తున్న భారి వర్షాలని తప్పు అంచనా వేసిందా మన ప్రభుత్వం అంటే .. అది నిజమే. కాని ఇంత లా ఔతుంది అని ఎవ్వరు ఊహించలేదు.

ఇప్పుడు సమయం రాత్రి 11:10 దేశం లో.శ్రీశైలం గరిష్ట స్థాయికి చేరుకుంది అట. మొత్తం 11 గేట్లు 43 అడుగులు ఎత్తివేసారు అట. 889 అడుగుల నీటిమట్టం చేరుకుంది. ఇంకా ఈ రోజో రేపో "మేము నీళ్ళు ఇవ్వము వదలము దాచుకుంటాం గిన్నేలో బిందెల్లో పోసుకొని ఇంటి భూగర్భం లో పెట్టుకుంటాం" అన్ని ఇన్నేళ్ళు అన్న పొరుగురాష్ట్రం ఇంకో ఇరవై లక్షల క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తుంది అట. అది రేపు మధ్యానానికో సాయంత్రానికో శ్రీశైలం చేరుకుంటుంది. కర్నూలు అప్పటికి ఉంటుందనే ఆశిస్తున్నాను. నా భయం.. శ్రీశైలానికి పొరబాటున అటు ఇటు ఏమైన జరిగితే మొత్తం నాగార్జున సాగర్ మీద పడుతుంది..

నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు ఇంకొద్ది గంట్టల్లో. అక్కడ 26 గేట్లు ఎత్తేసారు. రేపు మధ్యానానికి మొత్తం లెవెల్ లో ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి అట. ఇంక మిగిలింది ప్రకాశం. ప్రకాసం 12 గేట్లు ఇప్పుడు 6 అడుగులు ఎత్తేసారు. రేపు మధ్యానానికి ఆరులక్షల క్యూసెక్ల నీరు చేరుతుంది అట బెజవాడ కి. కర్నూల్ లో కరెంట్ తీసేసారు. ల్యాండ్ లైన్లు లేవు. కేవలం సెల్ మీదే నడుస్తోంది. ఇంకా భారి వర్షాలు పడుతున్నాయి మన రాష్ట్రం లో.. అలనే కర్ణాటకలో కూడానూ. ఇంకో ఇరవై నాలుగు చాలా క్లిష్ట పరిస్థితి మన రాష్ట్రానికి కొన్ని జిల్లాలకి ....

Update: రేపు ప్రొదున్నకి మద్రాసు నుండి 30 పవర్ బోట్లు చేరుతాయి అట కర్నూల్ నగరం. అలనే కర్ణాటక 20 లక్ష క్యూసెక్లు వరద నీరు ఒదిలేసింది. దీని వళ్ళ రేపు ప్రొదున్నకి ఇంకో పది అడుగులు .. పది అడుగులు నీరు పెరుగుతుంది అట కర్నూల్ నగరం లో.

Update సమయం తెల్లవారి 3:15. జూలార 60 గేట్లు తెరిచేసారు అట. శ్రీశైలం లో నీటి ప్రవాహం ఇప్పుడు 891 అడుగులకి చేరుకుంది!!!! శ్రీశైలం గరిష్ట ఎత్తు 885 అడుగులు. దేవుని మీద భారం వేసి సైట్ నుండి వెళ్ళిపోయారట ఇంజనీర్లు.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP