Monday, February 8, 2010

రణ్ - మీడియా రణరంగం

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ప్రస్ఫుటంగా అనిపిస్తుంది.. గత రెండు నెలలుగా మన ఆంధ్ర దేశం లో జరిగిన అల్లకల్లోలాకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా ఇలాంటి స్థిథి నెలకొన్నదానికి ఓ రకంగా పర్తికా రంగం దోహదపడింది. TV9, TV5, I-TV గట్ర గట్ర ఎంత సేపు ఎవరు ముందు చెప్పారా వార్తని ఎవరు ఎవరిని "ఓడించారా" అన్న విషయం మీదె ఎక్కువ మక్కువ చూపుతోంది.. అసలు వార్త కంటే. వై యెస్ ఆర్ ప్రయానించిన హెలీకాప్టర్ కనిపిస్తే ముందు ఆ వార్త చెప్పింది మేమే అంటు అంత దుఖం లో కూడా సొంత డబ్బా కొట్టుకోవడం మనం చూసాము. ఓ రాజకీయ నేత కి ఓ ప్రఖ్యాత చానెల్ అధినేతకి చాలా మంచి సంబంధాలు ఉండడం వలన రెండు రోజుల్లో ఆపేసిన నిరాహారదీక్ష ఎంత పెద్ద గందరగోలం సృష్టించిందో విధితమే.

ఒక కాలం లో బొఫొర్స్ ని బయటపెట్టి 'investigative journalism తో దేశానికి మేలు చేసిన పత్రికలు లేకపోలేదు. 75-77 లో ఎమర్జెన్సీ లో పత్రికాస్వేచ్చని నిర్బంధించిన ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ సంపాదకీయం స్థానాన్ని నల్లగా చేసి.. అటు తర్వత ఓ యేడాది పాటు అసలు పత్రికనే ప్రచురించకుండా అందులో పని చేసే అందరికి జీతాలు ఇచ్చిన పత్రికలూ ఉన్నాయి. అవన్ని గతం గతః ఎమో అనిపిస్తోంది ఇప్పుడు. ఎంతసేపు TRP రేటింగ్స్ ... అడ్డతిడ్డమైన అసహ్యకరణమైన నృత్యాలు గోరంత వార్తని కొండంత చేసి చూపే ప్రయత్నాలు. ప్రతి గంట ఎక్కడ నుండి వస్తాయి "బ్రేకింగ్ న్యూస్" ??? అందుకే వార్తలని సృస్టిస్తున్నారేమో. ఇలాంటి సమయాల్లో యే కొంచం అలజడి జరిగినా వీళ్ళకి పండాగే!! గొడవ ఆగిపోతే మళ్ళ చూపేదానికి వార్తలు విశేషాలు ఉండవు కద! ఎన్ని రోజులు గొడవలు జరిగితే అన్ని రోజులు పండగ.

ఈ వార్తా చాన్నెల్ల వ్యవహారం గురించే వర్మ తీసిన "రణ్". కొంచం కథా పరంగా బేలాగా ఉన్న కథనం మాత్రం నిజానికి దగ్గర్లో అనిపించింది. ఈ రోజు మన దేశం లో ఉన్న .. దేశం అనే కాదు ఇక్కడ అమేరికా లో కూడా అలానే తగలెడ్డాయి .. గోరంతని కొండంతగా చూపిస్తూ. సినెమా అంతా ఒక ఎత్తు.. అమితాబ్ చివర్లో 20 నిమిషాలు మీడియా ని కడిగేయడం ఒక ఎత్తు. అసలు ఆ సినెమా ని ఆయువుపట్టు అదే అనిపించింది. పైపెచ్చు మన తెలుగు వారికి బాగా అర్థం ఔతుంది.. గత రెండు నెలలుగా నెలకొన్న పరిస్థితుల ద్రుష్ట్యా.

నటనా పరంగా చూస్తే అమితాబ్ కొంచం కంట్రోల్డ్ గా చేసారు. ఆ చివరి క్లిమాక్స్ లో మాత్రం తన నటనా వైశిష్ట్యాన్ని చూపారు. తరువాత నాకు నచ్చిన వాడు సుదీప్. అతడు కన్నడ నటుడట. చాలా చాలా బాగా చేసాడు. కాని ఒక్కటే ఏంటంటే ప్రతి సీన్ లో ధూమపానం చేస్తూ ఉంటాడు. అదొక్కటే చిరాక్ గా ఉండింది. రితేష్ దేష్ముఖ్ సీరియస్ రోల్ చేసాడు. ఎప్పుడు నవ్వించేవాడు ఇందులో అంత సీరుయస్ గా చేయడం బాగుండింది. ఒక్క చోట అతని నిస్సహయత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.. భలే సీన్ అది. అదే సీన్ లో ఇంకొకడు మొనీష్ భేల్. వార్తని సృష్టించినా అడపాదడపా అబద్దాలు చెప్పినా ఆ మనకేమౌతుందిలే.. చూసేవాళ్ళు చూస్తారు అన్న భావన ఉన్న చానల్ అధిపతి. డబ్బే ప్రాధన్యాం గా మంచి రోల్. పరేష్ రావల్ గురించి చెప్పక్కరలేదు. గుల్ పనాగ్, సుచిత్ర బాగా చేసారు. ఈ సినెమాలో నాకు నచ్చిన ఇంకో ఆంశం ఏంటంటే ఏదైన వీడియో చూస్తుంటే చూసేవారి ముఖ కదలికల మీదే ఉంటుంది కమేరా.. వీడియో కంటే. వారి ఎక్స్ ప్రెషన్స్ ని బట్టి చెప్పచ్చు అది ఎంత షాకింగో ఏంటో అని. నాకు అది నచ్చింది.

చివరగా ఓ మాట - మీడియ గురించి కొన్ని నిజాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడచ్చు. తొక్కలే నాకెందుకు ఎవడు ఎటుపోతే అని అనుకుంటే గంటన్నర సమయం వృధ అని అనిపిస్తుంది. కామేడి ట్రాక్ పాటలు గట్ర ఏమీ లేదు. సింగల్ పాయింట్ అజెండ తో తీసిన చిత్రం. సీరీయస్ సినెమాలు చూసేవారికి నచ్చుతుంది.

Read more...

Friday, December 25, 2009

The Known Universe - మనమొక్కరమే అంటే నమ్మలేను...

నాకెప్పుడు ఒక అనుమానం ఉంటుంది.. ఈ సృష్టి లో మనమొక్కరమే ఉన్నమా అని? దానికి ఇంకా సమాధానం దొరక్కపోయినా.. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది - మనమొక్కరమే ఉంటే అంత స్పేస్ ఎందుకు అని.. ఎదో సినెమా లో అన్నట్టు "If we were all alone, that would be an enormous waste of space" అని. అది నిజం. ఈ కింద వీడియో లో చూడండి.. ఇప్పటి వరకు ఇన్నేళ్ళల్లో విశ్వాన్ని మనము మ్యాప్ చేసినది. హబ్బల్ టెలిస్కోప్ తో మిగితావాటితో మనం చూడగలిగినవి అన్నింటిని ఒక చోట పెడితే ఇలా ఉంటుంది..

మధ్యలో భాగం మనం చూడలేకపోతున్నాము. ఎందుకంటే మనము ఈ ధరణి నుండి పైకో కిందికో చూసి అటువైపు ఉండే నక్షత్రాలని చూడగలము. కాని కుడీ యెడమల్లో చూడలంటే మనకి ఆకాశ గంగ లోని ఇతరనక్షత్రాలే కనిపిస్తున్నాయి. అందుకే ఆ రెండు భాగాల్లో ఇంకా మ్యాప్ చేయలేదు. బహుశా ఏదో ఒక రోజు మనము ఆ భాగాలని కూడా ఇంతకంటే సూక్ష్మంగా పరిశీలించచ్చేమో. ఆ రోజుకోసమే చూస్తున్నా.



ఈ వీడియో చూసాక ఎవ్వరికైన అనిపించాలి - మనము ఉండే చోటు ఎంత చిన్నది అంటే it is just not worth fighting over petty things. మనవజాతి అంతా ఒక తాటిపై నిలబడి సమస్త జగతిని అభివృద్ధి పరిచేదానికి ప్రయత్నం చేయాలి. అంతరిక్షాన్ని అర్థం చేసుకొని వేరే గ్రాహాల మీద ఇంక ఎవరైన ఉన్నరేమో అని వెతికేదానికి సర్వ శక్తుల ప్రయత్నం చేయాలి. అన్ని కోట్ల కోట్ల నక్షత్రాల చుట్టు ఇంకా కోట్ల కోట్ల భూమి లాంటి గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. అందులో జీవులు ఉంటారన్నది ఖండించలేని వాస్తవం. ఒక ఊహ ప్రకారం వాళ్ళు ఎంత ముందు ఉండింటారంటే వాళ్ళు పంపే సిగ్నల్స్ మనకి అర్థం కావడం లేదు - ఒక చీమకి మన భాష ఎట్ల అర్థం కాదో అలా అన్నమాట. అది కూడా అయ్యిండచ్చు. చూద్దాం.. ఇంకో ఇరవై యేళ్ళల్లో మన సాంకేతిక పరిజ్ఞానం ఆ మాత్రం అభివృద్ధి చెందదా? Hopefully someday we will be able to make contact with the others....Hopefully..

Read more...

Tuesday, December 22, 2009

ఒక తెలుగు వాడి క్షోభ.

జీవితం లో మొదటి సారి తెలుగువాడైనందుకు సిగ్గు గా ఉంది.. ఇంత ద్వేషం నా జన్మలో ఎప్పుడూ చూడలేదు. మండల్ కమీషన్ అప్పుడు కూడా గొడవలు జరిగాయి కాని ఈ స్థాయిలో ద్వేషం మాత్రం ఎప్పుడూ చూడలేదు. నాలుకలు కోస్తాం అని ఒక నాయకుడు అనడం ఎంత చండాలంగా ఎంత నీచం గా ఎంత దరిద్రం గా ఉందో మాటల్లో చెప్పలేను. ఒక్కడు చేసిన పనికి.. ఒక్కడు వాడి స్వార్థం కోసం మొదలెట్టిన పని ఇన్ని కోట్లమంది కడుపు కొడుతోందో. ఎన్ని వేల కోట్ల వ్యాపార నష్టం .. ఎన్ని జీవితాల నష్టం.. ఎన్ని కోట్ల ఆశ్తి నష్టం.

దీనివళ్ళ ఒరిగింది ఏంటి? ఎవరికి ఏమి ఒరిగింది? హైదరాబాదు లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టరు. ఎంచక్క పక్క రాష్ట్రాలకి వెళ్తారు. ఇంకో పదేళ్ళు ఇటు వైపు కుడా చూడరు.. అదృష్టం బాగుండి అప్పటికి ఓ మంచి నేత వస్తే మళ్ళా హైదరాబాదు గత వైభవం రావచ్చు... లేకుంటే ఒకప్పటి పాట్నా ఎందుకు పనికిరాకుండా పోయేట్టు పోవచ్చు. చెప్పలేము. అప్పుడు కోస్తా సీమ వాళ్ళే కాదు తెలంగాణా వీరులుకూడా హైదరాబాదుకి రారు.. వచ్చి ప్రయోజనం ఉండదు కనుక.

ఎవరో తెలుగుతల్లి ని దూషించారు.. ఇంకొంతమంది అమరజీవి పొట్టి శ్రీరములని తిట్టిపోసారు.. చెప్పుల హారం వేసారు.. ఇంకొంతమంది అమ్మవారికి మాండలీకం అంటగట్టారు.. కోస్తా నుండి వచ్చింది అని ప్రసాదం స్వీకరించలేదు... వెంకన్న సీమలో వెలసి ద్రోహం చేసాడు అని సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన వేంకటేశ్వరున్ని అనరాని మాటలన్నారు. థూ మీ బ్రతుకులు... అన్నింటిలోనూ అన్ని చోట్ల అణువూఅణువున ఉండే ఆ దైవానికే ప్రదేశాలు అంటగట్టి దూషించేవాళ్ళకి బుద్ధి ఉంటుంది వస్తుంది అని నేను ఆశించను. ఇంత ద్వేషాన్ని నేను ఎప్పుడు చూడలేదు. తెలుగు జాతి అనేది ఈ క్షణం అంతరించిపోతే బాగున్ను అనిపిస్తుంది. అంత సిగ్గు పడుతున్నాను. "ఆత్మ గౌరవం" అనేది ఇంకో సారి అనకుండా అదః పాతాళానికి తొక్కేసాము. ఇన్నేళ్ళా పురోగతి ఒక్క నెలలో ఒక్కడి దీక్షా నాటకం వలన నాశనం అయిపోయింది. ప్రతి తెలుగు వాడు ఆంధ్రూడే అని గ్రహించని మూర్ఖులకి ఏం చెప్పగలం?

రాజకీయ స్వార్థం కోసం రచించిన ఈ దరిద్ర నాటకానికి తెర ఎప్పుడు ఎలా పడుతుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. దీనివళ్ళ ఎవరికి ఏం ఒరుగుతుందో తెలీదు. ఇంత స్వార్థం ద్వేషం మాత్రం యే జాతికి పట్టకూడదు. కాని ఒక్కటి మాత్రం నిజం తెలుగువాదైనందుకు జీవితం లో మొట్టమొదటిసారి సిగ్గు పడుతున్నాను. శాస్త్రి గారి 'తలయెత్తి జివించు తమ్ముడా తెలుగునేలలో జమ్నించినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని" అని మాత్రం ఈ జన్మలో పాడలేము. ఇంత నెగటివిటి (negativity) నేను భరించలేను. తెలంగాణా వచ్చినా రాకున్నా.. ఆంధ్ర రాష్ట్రం ఉన్నా లేకున్న.. i just will not give a hoot anymore. నేను పట్టించుకోకుండ ఉన్న్న మాత్రానా ప్రపంచానికి ఒరిగేది ఏమీ లేదు.. కాని at the very least I wont be a part of that negativity. అంతే చాలు నాకు.
జై తెలుగు తల్లి.

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP