Friday, December 25, 2009

The Known Universe - మనమొక్కరమే అంటే నమ్మలేను...

నాకెప్పుడు ఒక అనుమానం ఉంటుంది.. ఈ సృష్టి లో మనమొక్కరమే ఉన్నమా అని? దానికి ఇంకా సమాధానం దొరక్కపోయినా.. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది - మనమొక్కరమే ఉంటే అంత స్పేస్ ఎందుకు అని.. ఎదో సినెమా లో అన్నట్టు "If we were all alone, that would be an enormous waste of space" అని. అది నిజం. ఈ కింద వీడియో లో చూడండి.. ఇప్పటి వరకు ఇన్నేళ్ళల్లో విశ్వాన్ని మనము మ్యాప్ చేసినది. హబ్బల్ టెలిస్కోప్ తో మిగితావాటితో మనం చూడగలిగినవి అన్నింటిని ఒక చోట పెడితే ఇలా ఉంటుంది..

మధ్యలో భాగం మనం చూడలేకపోతున్నాము. ఎందుకంటే మనము ఈ ధరణి నుండి పైకో కిందికో చూసి అటువైపు ఉండే నక్షత్రాలని చూడగలము. కాని కుడీ యెడమల్లో చూడలంటే మనకి ఆకాశ గంగ లోని ఇతరనక్షత్రాలే కనిపిస్తున్నాయి. అందుకే ఆ రెండు భాగాల్లో ఇంకా మ్యాప్ చేయలేదు. బహుశా ఏదో ఒక రోజు మనము ఆ భాగాలని కూడా ఇంతకంటే సూక్ష్మంగా పరిశీలించచ్చేమో. ఆ రోజుకోసమే చూస్తున్నా.



ఈ వీడియో చూసాక ఎవ్వరికైన అనిపించాలి - మనము ఉండే చోటు ఎంత చిన్నది అంటే it is just not worth fighting over petty things. మనవజాతి అంతా ఒక తాటిపై నిలబడి సమస్త జగతిని అభివృద్ధి పరిచేదానికి ప్రయత్నం చేయాలి. అంతరిక్షాన్ని అర్థం చేసుకొని వేరే గ్రాహాల మీద ఇంక ఎవరైన ఉన్నరేమో అని వెతికేదానికి సర్వ శక్తుల ప్రయత్నం చేయాలి. అన్ని కోట్ల కోట్ల నక్షత్రాల చుట్టు ఇంకా కోట్ల కోట్ల భూమి లాంటి గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. అందులో జీవులు ఉంటారన్నది ఖండించలేని వాస్తవం. ఒక ఊహ ప్రకారం వాళ్ళు ఎంత ముందు ఉండింటారంటే వాళ్ళు పంపే సిగ్నల్స్ మనకి అర్థం కావడం లేదు - ఒక చీమకి మన భాష ఎట్ల అర్థం కాదో అలా అన్నమాట. అది కూడా అయ్యిండచ్చు. చూద్దాం.. ఇంకో ఇరవై యేళ్ళల్లో మన సాంకేతిక పరిజ్ఞానం ఆ మాత్రం అభివృద్ధి చెందదా? Hopefully someday we will be able to make contact with the others....Hopefully..

Read more...

Tuesday, December 22, 2009

ఒక తెలుగు వాడి క్షోభ.

జీవితం లో మొదటి సారి తెలుగువాడైనందుకు సిగ్గు గా ఉంది.. ఇంత ద్వేషం నా జన్మలో ఎప్పుడూ చూడలేదు. మండల్ కమీషన్ అప్పుడు కూడా గొడవలు జరిగాయి కాని ఈ స్థాయిలో ద్వేషం మాత్రం ఎప్పుడూ చూడలేదు. నాలుకలు కోస్తాం అని ఒక నాయకుడు అనడం ఎంత చండాలంగా ఎంత నీచం గా ఎంత దరిద్రం గా ఉందో మాటల్లో చెప్పలేను. ఒక్కడు చేసిన పనికి.. ఒక్కడు వాడి స్వార్థం కోసం మొదలెట్టిన పని ఇన్ని కోట్లమంది కడుపు కొడుతోందో. ఎన్ని వేల కోట్ల వ్యాపార నష్టం .. ఎన్ని జీవితాల నష్టం.. ఎన్ని కోట్ల ఆశ్తి నష్టం.

దీనివళ్ళ ఒరిగింది ఏంటి? ఎవరికి ఏమి ఒరిగింది? హైదరాబాదు లో పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు ఇప్పుడు పెట్టరు. ఎంచక్క పక్క రాష్ట్రాలకి వెళ్తారు. ఇంకో పదేళ్ళు ఇటు వైపు కుడా చూడరు.. అదృష్టం బాగుండి అప్పటికి ఓ మంచి నేత వస్తే మళ్ళా హైదరాబాదు గత వైభవం రావచ్చు... లేకుంటే ఒకప్పటి పాట్నా ఎందుకు పనికిరాకుండా పోయేట్టు పోవచ్చు. చెప్పలేము. అప్పుడు కోస్తా సీమ వాళ్ళే కాదు తెలంగాణా వీరులుకూడా హైదరాబాదుకి రారు.. వచ్చి ప్రయోజనం ఉండదు కనుక.

ఎవరో తెలుగుతల్లి ని దూషించారు.. ఇంకొంతమంది అమరజీవి పొట్టి శ్రీరములని తిట్టిపోసారు.. చెప్పుల హారం వేసారు.. ఇంకొంతమంది అమ్మవారికి మాండలీకం అంటగట్టారు.. కోస్తా నుండి వచ్చింది అని ప్రసాదం స్వీకరించలేదు... వెంకన్న సీమలో వెలసి ద్రోహం చేసాడు అని సాక్షాత్తు ఆ కలియుగ దైవమైన వేంకటేశ్వరున్ని అనరాని మాటలన్నారు. థూ మీ బ్రతుకులు... అన్నింటిలోనూ అన్ని చోట్ల అణువూఅణువున ఉండే ఆ దైవానికే ప్రదేశాలు అంటగట్టి దూషించేవాళ్ళకి బుద్ధి ఉంటుంది వస్తుంది అని నేను ఆశించను. ఇంత ద్వేషాన్ని నేను ఎప్పుడు చూడలేదు. తెలుగు జాతి అనేది ఈ క్షణం అంతరించిపోతే బాగున్ను అనిపిస్తుంది. అంత సిగ్గు పడుతున్నాను. "ఆత్మ గౌరవం" అనేది ఇంకో సారి అనకుండా అదః పాతాళానికి తొక్కేసాము. ఇన్నేళ్ళా పురోగతి ఒక్క నెలలో ఒక్కడి దీక్షా నాటకం వలన నాశనం అయిపోయింది. ప్రతి తెలుగు వాడు ఆంధ్రూడే అని గ్రహించని మూర్ఖులకి ఏం చెప్పగలం?

రాజకీయ స్వార్థం కోసం రచించిన ఈ దరిద్ర నాటకానికి తెర ఎప్పుడు ఎలా పడుతుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. దీనివళ్ళ ఎవరికి ఏం ఒరుగుతుందో తెలీదు. ఇంత స్వార్థం ద్వేషం మాత్రం యే జాతికి పట్టకూడదు. కాని ఒక్కటి మాత్రం నిజం తెలుగువాదైనందుకు జీవితం లో మొట్టమొదటిసారి సిగ్గు పడుతున్నాను. శాస్త్రి గారి 'తలయెత్తి జివించు తమ్ముడా తెలుగునేలలో జమ్నించినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని" అని మాత్రం ఈ జన్మలో పాడలేము. ఇంత నెగటివిటి (negativity) నేను భరించలేను. తెలంగాణా వచ్చినా రాకున్నా.. ఆంధ్ర రాష్ట్రం ఉన్నా లేకున్న.. i just will not give a hoot anymore. నేను పట్టించుకోకుండ ఉన్న్న మాత్రానా ప్రపంచానికి ఒరిగేది ఏమీ లేదు.. కాని at the very least I wont be a part of that negativity. అంతే చాలు నాకు.
జై తెలుగు తల్లి.

Read more...

Saturday, December 19, 2009

అవతార్ - my experience

ప్రతీ యేట కొన్ని వేల చిత్రాలు విడుదతౌతాయి. కాని కొన్ని సంవత్సరాలకి ఒక్క సారి ఓ చిత్రం వస్తుంది.. సినీ చత్రిరనే తిరిగిరాసే చిత్రం. ఒక్కప్పుడు స్టార్ వార్స్ వచ్చింది. (1979 మొదటిది).. ఆ రోజుల్లో అంత ఆధునికంగా తీసిన చిత్రం. తర్వాత తర్వాత ఆ టెక్నాలజి అందరికి అందుబాటలోకి వచ్చి ఇప్పటి తరం వారికి స్టర్ వార్స్ చూపిస్తే ఓస్ ఇంతేనా.. దీనికంటే గొప్ప సినెమాలు చూసాము అని అంటారు. రాముడు భీముడు ఇప్పుడు చూస్తే అలనే ఉంటది.

ప్రపంచ సినీ చరిత్రలో తనకంటు ఓ స్థానాన్ని కైవసం చేసుకున్న అలాంటి ఒక (వి)చిత్రమే ఈ "అవతార్". సినెమాలు వచ్చాయి. 3D సినెమాలు వచ్చాయి. కాని ఇలాంటి 3D చిత్రం రాలేదు. ఇంకొన్ని సంవత్సరాల్లో బోలేడు వస్తాయి ఇలాంటి సినెమాలు కాని ఇదే ప్రథమం. ఊహని అందని అందాలని అధ్భుతంగా చూపించాడు జేంస్ క్యామరూన్. టర్మినేటర్, ఏలియన్స్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత ..టైటానిక్ లాంటి పరమ సుత్తి చిత్రం తర్వాత 12 యేళ్ళకి ఈ సినెమా తీసాడు. ఈ సినిమ మీద అతడి (+ ఫాక్స్ కూడా) ఖర్చు 1200 కోట్ల రూపాయలు. అంత ఖర్చు పెట్టాడు అని కాదు.. ఖర్చు పెట్టిన ప్రతి పవల కనిపిస్తుంది మూవీ లో. మన వాళ్ళు ఖర్చుపెడతారు.. గజిని ని నలభై కోట్లు అయ్యింది అట.. ఎందుకు అయ్యిందో ఎక్కడ ఖర్చు చేసారో కనిపించదు. అలా కాదు ఈ అవతార్.

కథా పరంగా పెద్దగ చెప్పుకునేదానికి ఏమి లేదు. కాని for some reason I could identify with the story at multiple levels. అంగ్రేజులు రాకమునుపు ఓ తొమ్మిది వేళ సంవత్సరాలు మన దేశం లో మనము ప్రకృతిని చాలా గొప్పగా ఆధారించేవాళ్ళం. ఒక చెట్టు కొట్టేసేమునుపు ఇంకో రెండు నాటేవాళ్ళం. అందుకే చాలా చాలా చాలా అరుదుగా మన దేశం లో కరువు ఉండేది. నీళ్ళని కాని భూమిని కాని విచ్చలవిడిగా ఉపయోగించేవాళ్ళం కాదు.. ఎదైన ఉపయోగించే ముందు ఆలోచించి వాడేవాళ్ళం. అందువలన there was a balance in the environment. ఇలా మనం తొమ్మిదివేల సంవత్సరాలు గడిపాము. కాని బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఇవన్ని గాలికి వదిలేసి.. ఇదిగో ఇలా తయారయ్యాం. కథ కూడా ఇలాంటిదే.. పండోరా అనే గ్రహం మీద ఉండేవాళ్ళు ఇలానే ప్రకృతి తో అవినాభావంగా ఉంటారు. కాని భూమి నుండి వెళ్ళిన వాళ్ళు ఆ గ్రాహన్ని కూడా స్వార్థం కోసం ఎలా ధ్వంసం చేస్తారో .. అది కథ.

కథ కొంచం సైడ్ కి పెడితే తీసిన విధానం మాత్రం -A W E S O M E !!!! హెలీకాప్టర్లు మొదలుకొని అన్ని 100 years into the future లా ఉంది. తీసిన టెక్నాలజీ కూడా ఓ పదేళ్ళ ముందే వచ్చినట్టు ఉంది. ఆర్థర్ క్లార్క్ ఊహమీద పుట్టినదే జియో-స్టేషనరీ సటిలైట్ (geo-stationary statellite), జూల్స్ వెర్న ఊహే సబ్మరీన్ (సుబ్మరినె).. అలనే జేంస్ క్యమరూన్ ఊహే ఈ రకం చిత్రం అని చెప్పుకోవచ్చు. 3D లోనే చూడాలి మూవి. వీలైతే IMAX 3D లో చూడండి. anything less would be doing injustice to the effort that went into making this movie.

గమనిక: ఇలా నకు నచ్చే చిత్రాలు నాకు నచ్చే విధం గానే మీకు నచ్చాలని రూల్ లేదు. Every movie is a personal experience. నాకు ఇలాంటి technically advanced movies చాలా ఇష్టం.

Read more...

Thursday, December 10, 2009

అనుకోనిదా? కోరుకున్నదా?

తెలంగాణా ఇస్తాం అన్న వ్యాఖ్య తో భగ్గుమన్నది ఆంధ్రావణి. ఇప్పటికి 112 MLAలు, 5 MPలు రాజీనామాలు చేసారు. పదకొండు రోజులుగా తెలంగాణా హోరెత్తున్నా ఏమి అనని మిగితా రాష్ట్రం కేంద్రం అల అనేసరికి భగ్గుమంది. పార్టిలకి సంబంధం లేకుండా 112 మంది రాజీనామాలు చేసారంటే చూసి ముచ్చటేస్తోంది. తెలంగాణా కి చెందిన కొంతమంది MLAలకి అలా చేయాలని ఉన్న.. పాపాం చేయలేరు. ఇగ మిగిలింది గ్రేటర్ MLAలు. వాళ్ళు కూడా రాజీనామా చేస్తే బాగున్ను.

దెబ్బకి మిగితా రాష్ట్రం వాళ్ళు కూడా అడగడం మొదలెట్టారు. పైనుండి మొదలుకొని చూస్తే:
1. బెంగాల్ లో గోర్ఖాల్యాండ్
2. బీహార్ + మధ్య ప్రదేశ్ + ఉత్తర్ ప్రదేశ్ కొన్ని ప్రదేశాలు కలిపి బుందేల్ఖండ్
3. ఉత్తర్ ప్రదేశ్ కొన్ని భాగాలతో హరిత్ ప్రదేశ్
4. గుజరాత్ లో సౌరాష్ట్ర
5. మహరాష్ట్ర లో విధర్బా
6. కర్నాటక లో కూర్గ్
7. తమిళనాడు - ??? వీళ్ళకి వేరు దేశం కావాలేమో మరి.

ఇవి సాధించడం పిచ్చ వీజీ కద. కె సి ఆర్ చూపిన దారి ఉంది కద. ఆయా ప్రదేశాల ఏం.పీ లు ఓ పది రోజులు సలైన్ పెట్టుకొని నిరాహారదీక్ష చేస్తే చాలు. ఇవ్వన్ని చాలా చాలా యేళ్ళ నుండి అడుగుతున్నవే. ఈ రోజేమి కొత్త కాదు. కాని తెలంగాణా ఇస్తాము అనడం వళ్ళ అన్ని మొదలయ్యాయి.

ఈ పరినామం కాని, ప్రతినిధుల రాజీనామాలు కాని అస్సలు ఊహించనిది కానేకాదు. రాష్ట్రాన్ని విభజిస్తాము అంటే మిగితావాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? It makes perfect sense to the way they reacted. They owe nothing to Telangana.. but everything to Visalandhra. కొందరు వ్రాశారు కేంద్రానికి మంచి షాక్ తగిలింది అని. కాని నాకు అనిపిస్తోంది ఇది వాళ్ళు కోరుకున్నదే అని. అటు మేము తెలంగాణా ఇచ్చేదానికి ఒప్పుకున్నాము కాని ప్రజలు ఒప్పుకోలేదు అని అనవచ్చు. అటు ఇచ్చినట్టు ఉంటుంది ఇటు ఇవ్వనట్టు ఉంటుంది. ఇచ్చారు అని తెలంగాణా ప్రజలు ఆనందిస్తారు ఇవ్వలేదని విశాలాంధ్ర ప్రజలు హర్షితారు. భలే భలే!! నష్టపోయింది అదిగో కె సి ఆర్ గిమిక్కులు చూసి ఆత్మహత్య చేసుకున్న వాడి కుటుంబం. రాజకీయనాయకులకి ఎప్పుడు నష్టం రాదు. జరగదు.

ఒక "మేధావి" అన్న మాటలు - ఇన్ని రోజులు రాజకీయనాయకులు దోచుకొని కోస్తా లో పెట్టుబడి పెట్టి కోస్తా ని అభివృద్ధి పరచారు అట. ఇప్పుడు తెలంగాణా వస్తే దోచుకున్న సొమ్ము తెలంగాణాలోనే పెడతారట. అందుకే వేరు రాష్ట్రం కావాలి అట. ఆ లాజిక్ నాకు అర్థం కాలేదు - ఇప్పుడు కూడా దోచుకొని కోస్తాలో పెట్టుబడి పెట్టచు కద? తెలంగాణా కి వేరు "రూపాయలు" లేవు కద? కొత్తగా రాష్ట్రం వచ్చినా వాడేది "ఇండియన్ రుపీ" నే కద? తెలంగాణా వస్తే అన్నల రాజ్యం ఎక్కువతుందేమో ఎందుకైన మంచింది అని పూర్వము కంటే ఎక్కువ డబ్బులు వేరే చోట పెట్టుబడి పెట్టడని నమ్మకం ఏంటి? ఆ వేరే చోట వేరు రాష్ట్రం కూడా అవ్వచ్చు కద? ఏంటో ..

ఈ గోల వళ్ళ హైదరాబాదు లో కాని మిగితా రాష్ట్రం లో ఎవైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకున్నవాళ్ళు ఇగ చేయరేమో. దాని వళ్ళ తెలుగువారందరికి నష్టమే. అంత ఆలోచనే ఉంటే ఇదంత ఎందుకు జరుగుద్ది? ఇక ముందు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. . కాని ఈ పరినామం మాత్రం ఊహించనిది అంటే నమ్మబుద్ధి కావడం లేదు.

Read more...

Tuesday, December 8, 2009

నాకి హైదరాబాదు నాకి ఇవ్వుర్రి.. భాగ్యనగర ప్రజా పార్టీ డిమాండ్!!

మొన్న ఆ మధ్య ఎక్కడో చదివా "ఆంద్ర బ్యాంక్" పేరు కొట్టేసి "తెలంగాణా బ్యాంక్" అని రాసారని. అసలు అలా రాయడం లో ఎమైన బుద్ది ఉందా అని నా అనుమానం. ఆ సాతవాహనుడి కాలం కంటే పూర్వమే మన ప్రదేశానికి "ఆంధ్ర" అని పేరుండేది. అశోకుని చరిత్రలో కూడా మన ప్రదేశాన్ని "ఆంద్రా" అనే ఉంది. మన రాష్ట్రం లోని మూడు పెద్ద ప్రదేశాల్లో ఒకటి రాయలసీమ. ఆ మాటకి వస్తే ఓ ఐదొందల యేళ్ళ క్రితం అసలు ప్రస్తుత రాయలసీమ కి ఆ పేరే లేదు. రాయలవారు పరిపాలించేదాకా ఆ సీమ కి పేరే లేదు. (ఉండింటే నాకు తెలీదు). నా ఉద్దేశం ఏంటంటే "ఆంధ్రులు" అంటే కేవలం కోస్తా జిల్లా వారే కాదు అని.

అది అలా ఉండగా.. ఇన్ని యేళ్ళు తెలంగాణా రాకపోవడానికి కారణం.. ఇకపై కూడా అదే వర్తించచ్చు కూడా.. ఒక్కటే.. హైదరాబాదు. అసలంటు 'నా' నగరం తెలంగాణా లో లేకపోయింటే 1969 తెలంగాణా ఉద్యమం అప్పుడే వచ్చేసేది. సపోస్ పర్ సపోస్ మన రాజధాని హైదరాబాదు కాకుండా యే కర్నూలో, బెజవాడో, పలమనేరో అయ్యింటే ఇంత జరిగేది కాదు. ఇది లోక విధితమైన మాటే కద! మా ఊరే లేకుంటే ఇప్పటికి మరో చత్తిస్ ఘడ్ లా, ఉత్తరాంచల్ లా తెలంగాణా కూడా మరో రాష్ట్రం అయ్యిండేది. అందుకే నేను మా పార్టీ బాగా ఆలోచించి.. చించి చించి చించి.. ఆంధ్ర పటాన్ని ఇంకాస్త చించితే అప్పుడే వచ్చింది ఈ ఆలోచన.. తెలంగాణా రావడానికి అడ్డుగా ఉన్నా నా ఊరుని పీకేయండి. నాకి హైదరాబాదు నాకి ఇవ్వుర్రి.. ఇదే మా డిమాండ్!

శరత్ లాంటి వాళ్ళ మాటలు వినకండి. అతడు హైదరాబాదు-ద్రోహి. నలగొండ "పులి" ఎమో కాని మా ఊరుకి మాత్రం అన్యాయం తలబెడుతున్నాడు. he has lost all my respect. అసలు ఎవరిని అడిగి ఇలా హైదరాబాదుని వేరు చేయద్దు అని అంటున్నాడు? అసలు మా ఊర్లో ఎప్పుడైన ఉన్నాడా? ఉంటే ఇంటి నంబరు, ఫోను నంబరు, రెజిస్ట్రాషన్ అన్ని చూపించమని డిమాండ్ చేస్తున్నా!!

అలనే మిగితా విషయాలకి వస్తే. మా రాష్ట్రం లో నివసించేదానికి కొన్ని నిబంధనలు పెట్టాము. వాటిలో కొన్ని:

* గ్రేటర్ హైదరాబాదు ఇప్పుడున్న విస్తారానికి ఇంకో ఐదో పదో కిలోమీటర్లు అన్ని వైపులా జోడిచి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి.

* భాగ్యనరానికి ముఖ మంత్రి నేనే అవ్వాలి. (ఈ విషయం లో ససేమిరా no compromise). మిగితా పోస్టులకి కె.బ్లా.స వారు తువాల్లు వేసుకోవచ్చు.

* ఇక్కడ కంపనీ పెట్టలంటే నాకు ముందుగా ఒక 100 ఎకరాల భూమి (మిగిలిన ఆంధ్ర రాష్ట్రం లో ఎక్కడైనా పర్లేదు) + 10 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడున్న కంపనీలకి కొంచం చొంచెస్సిఒన్ ఇస్తాము.

* ఇప్పుడు నివసిస్తున్న వాళ్ళలో ఎవ్వరిని వెళ్ళగొట్టము లేండి - అంటే ఎవరైతే "హైదరాబాదు" ని "హైదరాబాదు" అంటారో వాళ్ళు నిస్సంకోచంగా ఉండచ్చు. "హైడ్రాబాడ్" అనేవాళ్ళకి మాత్రం మా "మహా భాగ్యనగరం" లో చోటు లేదు.

* ఇప్పుడున్న శాసన సభ స్థలం కావాలంటే భాగ్యనగరేతరులే పెట్టేసుకోండి. ఇంకా కావాలంటే తెలంగాణా శాసనసభ, ఖమ్మం శాసనసభ, రాయలసీమ శాసనసభ గట్రా కి కూడా భాగ్యనరం లోనే చోటిస్తాము - ఎదో పెతీ యాడాదికో నెలకో వారానికో ఇంత అని పన్ను కడితే సరి. అది వేరే విషయం.

* ఓస్మానియా లోని సత్తర్ డబ్బా ని national monument గా డిక్లార్ చేయాలి.

మా రాష్ట్రాన్ని మేము దక్కించుకుంటాం. ఎలాగో మన శరత్ నిరాహార దీక్ష చేస్తనే ఉన్నాడు. అతని డిమాండ్లతో బాటే ఇది చేర్చే ప్రయత్నం చేస్తున్నా.

జై తెలుగు తల్లి.
జై హైదరబాదు.
జై హైదరబాదు నూతన ముఖ మంత్రి (అంటే నేనే!!)...

సవరణ - ఇందాక నేను "తిట్టేటప్పుడు" శరత్ ఓ టపా రాసేసాడు. పార్టీ లో సిద్ధాంతకర్త పదవి ఇస్తా అంటే ప్లేట్ ఫిరయించి ఇప్పుడు "జై హైదరాబాదు" అంటున్నాడు. అందుములాంగా అతడిని హైదరాబాదు-ద్రోహుల ఖాతా నుండి సగౌరవంగా తొలగించడమైనది. బ్రదర్ welcome to "my" state.

గమనిక: ఇది తెలంగాణా వాదననో వాదులనో కించపరిస్తూ వ్రాసినది కానే కాదు. మీరు అనవసరంగా అపోహలు పెట్టుకోకండి. ఎదో శరత్ టపా చూసి ఉత్తేజితుడనై రాసినది అంతే. రాజకీయ రంగులు పులుముకొని చూడకండి. చూస్తే అది మీ ఇష్టం. నాకు తెలంగాణా, కోస్తా, రాయలసీమ, కర్నాటక కంటే భారతదేశం ముఖ్యం. తర్వాత నా ఊరు ముఖ్యం. నా భాగ్యనగరం యే ఒక్కరి వళ్ళో ఇంత అభివృద్ధి చెందలేదు.. ఎంతో మంది తెలుగు వారు, వెరే రాష్ట్రాల వారు అందరి సమిష్టగా కృషి చేస్తేనే ఈ మాత్రం ఉంది.

Read more...

Wednesday, December 2, 2009

"పులి" నిరాహార దీక్ష జయప్రదం చేయండి!!!

జై తెలంగాణా. జై జై తెలుగు తల్లి.. అర్రెరె మరిచా.. తెలంగాణా తల్లి కద. మరిచే పోయా. ఇంతకి పాపాం ఆ తెలుగు తల్లిని విభజించి తెలంగాణా తల్లి అని మిగితా వాళ్ళ తల్లి అని చేసారు.. ఇప్పుడు ఏక్కడుందో ఏంటో ఆ తల్లి. ఎంతో మంది వారి వారి స్వార్థం.. కేవలం pure unadultrated 100% సుద్దమైన స్వార్థం కోసం తెలంగాణా ఉద్యమాన్ని ఆ సెంటిమెంట్ ని లేవదీసారు. ఆ నాడు చెన్నా రెడ్డి ఐతే ఈ రోజు కె సి ఆర్. రేపు మరొకడు. ఇలా మాకు తెలంగాణా కావాలి కావాలి అని అరిచి రబస చేస్తున్న యే ఒక్కడు నిజంగానే తెలంగాణా అంటూ వస్తే ఎలా అభివృద్ధి పరుస్తారో చెప్పిన ఆనవాళ్ళు లేవు. ఇప్పుడు మళ్ళా కె సి ఆర్ రూపొందించిన "ప్రణాలిక" ని తె రా స మానిఫెస్టొ ని చూపించేరు!!! అందులో తెలంగాణాని సంపాదించేదానికి ఏం చేస్తారో ఉంది .. ఎలా అభివృద్ధి చేస్తారో లేదు. అంత దూరం ఆలోచించలెదేమో మరి మేధవులు...

బొంబాయి లో మహరాష్ట్రేతరులు ఉండకూడదు అని ఒక మలపత్రాష్టుడు ఓ తొక్కలో ఉద్యమం లేవనెత్తాడూ ఓ నలభై యేళ్ళ క్రితం. ఇప్పుడు అతడి చుట్టం అదే అంటున్నాడు మళ్ళా. ఈ లోపు పాపం అన్యం పున్యం ఎరుగని సచిన్ ని కూడా ఈ పరమ కంపులోకి లాగారు. నాకు తెలీక అడుగుతాను బొంబాయి.. ఇటు హైదరబాదు ఎవడబ్బ జాగీరు అని ఇల అంటున్నారు వీళ్ళు ? అసలు ఈ భూమి అంటే మన ధరణి ఆవిర్భవించినప్పటి నుండి కె సి ఆర్ వాళ్ళు కానివండి అటు మ.న.ని.సే వాళ్ళు కాని ఉన్నరా ఇక్కడే? అల కాదు అంటే వాళ్ళు ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళే. జాతి మీద విభజించుకున్నాం.. తర్వత భాషల మీద.. ఇప్పుడు మాండలీకల మీదా? అంతే లేండి.. every country has leaders it deserves. మనకి కె సి ఆర్, రాజ్ థాకరె నే కరెక్ట్ ఏమో. వీళ్ళని నాయకులు అని అనడం లేదు... ఎంతో మంది జీవితాలతో ఆడుకుంతున్నారు వీళ్ళు. ఆ పాపం ఊరికే పోదు.

దానికి మళ్ళా ఓ నిరాహార దీక్ష.. అదో నాటకం. కాని కాని ఇక్కడే అసలు twist ఉంది. కె సి ఆర్ ఒక్కడేనా నిరాహార దీక్ష చేసేది? ఆ మాత్రం దీక్ష మేమూ చేయగలం అని మనలో ఒకడు ముందుకు వచ్చాడు. అతన్ని మనం అందరం ఉత్సాహ పరచాలి. ముందుకు తోసి.. అదే ముందుంచి వెనకనుండి మనం మన support ఇవ్వాళ్ళి. కె సి ఆర్ లా మధ్యలో విరమించనీయకూడదు. ఎంతో కష్ట సాధ్యమైన అతడి గమ్యాన్ని చేరేదాకా నిరహారదీక్ష చేసేట్టు మనమే చేయాలి. అందునా తోటి కె బ్లా స సభ్యులు ముందుగా మనం మనం మాట్లాడుకోని పులిరాజు ఎటువంటి మంతనాలు జరపకుండ జాగ్రత్త పడాలి. నీమ్మ రసం, చారు, ఇడ్లి, విస్కీ ఇలంటివి ఏది అతనికి ఇవ్వకూడదు... at least గమ్యం చేరే వరకు.

గమ్యం ఏంటి అన్నది ఇంకా ఆలోచిస్తున్నాము. అంత వరకు సమయం ఎందుకులే వృధ చేసేది అని రేపటి నుండే మన పులిరాజుని బరిలోకి దింపే పనిలో ఉన్నాము. రేపటి నుండి అభినవ పొట్టి శ్రీరాములు .. ఉరఫ్ పులిరాజు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించబోతున్నారు. అందరి ఈ మహోనత్త ఉద్యమానికి ఆహ్వానితులే. అందరు పాలు పెరుగు పూరి కూర పంచుకుందాం.. మన పులిరాజుని మాడగొడదాం.. అదే పులిరాజు ఆకాంక్షని తీరుద్దాం. మీరందరు తప్పకుండా వస్తారనే ఆశిస్తూ.... జై పులిరాజు. జై జై పులిరాజు.

Read more...

Tuesday, November 17, 2009

ఒక గోడ - ఒక సామ్రాజ్యం - ఒక రాష్ట్రం.

ఇరవై యేళ్ళు. ఒక్క గోడ రెండు దేశాలు. ఆ గోడ ని కూల్చి మళ్ళా ఒక్క దేశం గా ఆవిర్భవించింది. ఇంతక ముందు కంటే పెద్దగా ఒక్కటైంది. ఈ టప ఒక్కటైన జర్మనీ గురించి కానే కాదు. గోడ కూలడం తో ఆరంభమైన సామ్రాజ్య పతనం గురించి. ఎనభై యేళ్ళు అవిచ్చిన్నంగా ఎదిగిన రష్యా ... క్షమించాలి సోవియట్ యూనియన్ చిన్నభిన్నం అవడం మొదలైంది బెర్లిన్ వాల్ కూలడం తోనే. కాని దానికి నాంది మాత్రం ఆఫ్ఘన్ లో కాలుపెట్టడమే. అంతక ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంచక్క అన్నింటిని రేషన్ చేసి నెట్టుకొని వస్తున్న యూనియన్ ఆఫ్ఘన్ లో అడుగుపెట్టిన తర్వత ఏది సరిగ్గా చేయలేకపోయింది.

ఐనా ఆఫ్ఘన్ లో వాళ్ళంతటవాళ్ళే వెళ్ళలేదు కద.. అప్పటి ఆఫ్ఘన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వీళ్ళు పాపాం వెళ్ళారు. 79 లో. కనిపించిన చిన్న చిన్న గుడిసెలు సైతం సైతాన్నుల్లాగా పేల్చేసారు. ఇసుకని గుప్పెట్లో బంధించే ప్రయత్నం లానే ఇది విఫలమైంది. కాని దాని ప్రకంపణలు క్రెంలిన్ లో కనిపించాయి. రేషన్ చేసి అన్నింటికి కోట (quota) లెక్కన అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే ప్రభుత్వం ఇంక ఏమీ చేయలేకపోయింది. చేసేదానికి డబ్బు లేకుండా పోయింది. ఒక్కసారి ఈస్ట్ జెర్మని వెస్ట్ లో చేరిపోయాక యూనియన్ లోని మిగితా దేశాలు కూడా స్వతంత్రం అడిగాయి. ఇంక ఇవ్వకతప్పలేదు కద... Nov 09, 1989 బెర్లిన్ వాల్ ని కూలద్రోసారు. సోవియట్ యూనియన్ ఇంకో రెండు సంవత్సరాలు బ్రతకగలిగింది... అది విరిగి 15 కొత్త దేశాలు ఆవిర్భవించాయి. ప్రపంచం లో అతి పెద్ద కమ్యునిస్ట్ దేశం గా రష్యా పోయి చైనా అయ్యింది. మన దేశం కూడా అదే సమయం లో సోషలిస్ట్ / కమ్యునిస్ట్ ఛాయలనుండి సురక్షితంగా బయటపడింది... శ్రీ పీ.వీ మేధస్సు తో.

ఒక్క రాష్ట్రం తప్ప. మన దేశం లో ఆ ఒక రాష్ట్రం లో గత 30 సంవత్సరాల నుండి ఒకటే పార్టి పరిపాలిస్తోంది కద.. పాపం ఒక్కప్పుడు చాలా విషయాల్లో ముందంజ లో ఉన్న ఆ రాష్ట్రం ఇప్పుడు టిక్కు టిక్కు అంటూ నెట్టుకొస్తోంది. అంటే కమ్యునిస్టేతర రాష్ట్రాలు బాగుపడ్డాయా అంటే అది నిజం కాదు.. బీహర్, ఉత్తర ప్రదేశ్ వాటికి ఉదాహరణలు.. కాని నకు కమ్యునిస్ట్లన్న ఫెమినిస్ట్లన్న పడరు. కమ్యూనిస్ట్లు చైనా తో యుద్ధం అప్పుడు చైనా కి సపొర్ట్ ఇచ్చారు. ఆ ఒక్క విషయం చాలు వాళ్ళని దేశం నుండి బహిష్కరించేదానికి. ప్రగతికి అడ్డంకులు.. అందుకే వాళ్ళంటే నాకు పరమ చిరాకు. ఏం సాధించారో ముఫై యేళ్ళళ్ళో నాకైతే తెలీదు. ఇన్వెస్ట్మెంట్స్ లేవు.. సరిగ్గ పని చేసేవాళ్ళు లేరు .. పెద్దగ ఒరిగింది కూడా లేదు. ఒకప్పుడు అగ్ర రాష్ట్రాల్లో ఒక్కటిగా ఉండినది ఇప్పుడు బీహార్ కంటే కొంచం మెరుగ్గా ఉంది అట. మొన్న జరిగిన లోకల్ ఎన్నికల్లో అస్సెంబ్లీ ఉప ఎనికల్లో కొంచం వెనుకపడింది సి.పి.ఎం. చూద్దం ఈ సారి ఎన్నికల్లో గెలుస్తుందో లేక చివరికి బెంగాల్ కి కూడా మంచి రోజులు వస్తయో లేదో అని.

క్యాపిటలిజం గొప్పది అనో సర్వరోగ నివారణి అనో నేను అనడం లేదు. అనేంత తెలివి కూడా నాకు లేదు. కాని కమ్యునిస్ట్ కంటే యే రోజైన క్యాపిటలిస్ట్ సొసైటి బెటెర్ అని నా అభిప్రాయం. వాక్ స్వాతంత్రం కదిలే స్వాతంత్రం నాకు చాలా ముఖ్యం. ఒక్క మాట ఎవరినైన అంటే రాత్రి ఎవడొచ్చి తలుపు కొడతాడో ఎక్కడ క్యాంపుల్లో పడేస్తారో అని భయపడాల్సిన అవసరం ఉండదు. డెమాక్రసి అలాంటిది. కమ్యూనిస్ట్ అంటే ఒక మాట చెప్పాలి - పని ఎవడి శక్తి కొలది వాళ్ళు చేయాలి పరిహారం మాత్రం అందరికీ సరిపోయేంతే అనే ముష్ఠి భావన మీద బేసైన ఎటువంటి "ఆలోచన" ఐనా నాకు చిరాకే. నేను చేసే పనికి తగినంత పరిహారం నాకు కావాలి. నేను 12 గంటలు కొట్టించుకొనీ.. నా పక్కనోడు ఓ గంట చేసి ఇద్దరికి ఒకటే జీతం అంటే లాగి కొట్టలనిపిస్తుందా లేదా? ఎమైన అంటే ప్రపంచం బాగు కోసం అని అనడం ఇంకో పెద్ద బూతు. నాకు పని చేయాలి అని అనిపిస్తే కద నేను, నా ఇల్లు, నా ఊరూ నా దేశం నా ప్రపంచం బాగుపడేది? అసలు నేను ఎంత కొట్టించుకున్నా నాకు మిగిలేది చిప్పే అంటే నేనెందుకు పని చేయాలి? ఎందుకు చేస్తా? ఈ చిన్న ముక్క బుద్ధి లేకుండా అసలు ఆ కాన్సెప్ట్ ఎలా నెగ్గిందో నాకు ఐతే అర్థం కాదు. ఏదైతేనేమి ఇంకో ఇరవై సంవత్సరాల్లో . బెంగల్ వాళ్ళకి బుద్ధి రాకపోద్దా..మన దేశం మారకపోద్దా. చూద్దాం. ఆశిద్దాం.

గమనిక: ఇది నా బ్లాగు. నాకు నచ్చని వాటి గురించి నచ్చిన వాటి గురించి రాస్తాను. కార్ల్ మార్క్స్ దేవుడు లెనిన్ ఇంకో దేవుడు. స్టాలిన్ మావో లు దేవుని ప్రతిరూపాలు గట్ర గట్ర అని అనాలనుకుంటే దారి అటు --> ఇక్కడ కాదు. నా దృష్టి లో లాలూ ములయం మాయవతి కంటే తక్కువ పింకోలు .. వాళ్ళని చూస్తే at least చెప్పచ్చు దేనికి పనికిరారు అని.. వీళ్ళు అల కాదు. మరోసారి చెప్తున్న ఈ టప కమ్యునిస్ట్ టప లాంటిది.. వ్యతిరేకిస్తే కాన్సంట్రేషన్ క్యాంపుల్లో పడేసి కుర్చి కి కట్టేసి వివాహ్ సినెమా చూపిస్తా. కేసు బోనస్!! ఖబర్దార్!.

Read more...

Sunday, November 15, 2009

సెన్సార్ కత్తెరా మజాకా!!

నాకు చాలా రోజులనుండి ఓ అనుమానం.. ఇంతకీ మనకి సెన్సార్ బోర్డ్ అవసరమా? ఈ ప్రశ్న మొన్న "మహాత్మ" లో ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా అనే పాట మీద సెన్సార్ కత్తెర పడింది అని తెలిసినప్పుడు ఇంకా తీవ్రం గా ఆలోచిస్తున్నా. అంటే ఇందిర గాంధి ని ఏమైన ఓ మాట అంటే అది తప్పైపోద్దా ? అందుకని తీసేయాలా ? ఇదెక్కడి అన్యాయం? నిన్నేమో లీడర్ సినెమాలో వై.ఎస్.ఆర్ ది ఏదో స్పీచ్ ఉందని తీసేమన్నారు అట. అదేంటో ఎందుకో అర్థం కాలేదు నాకు. ఇంక పేరు - reference కూడా తీసేయమంటారేమో ఇంకొద్ది రోజుల్లో. అసలు మనది ప్రజాస్వామ్యమేనా అని అనుమానం వస్తుంది. బహుశా పేరుకి మాత్రమే ప్రజాస్వామ్యం.. పద్ధతి మాత్రం రాచరికమే!!

కాదంటారా? ఒక్క సారి చుట్టు చూసుకోండి. ఒక మంత్రి చనిపోతే అతడి కుటుంబ సభ్యులకే ఆ పదవి ఇస్తారు. ఇవ్వకపోతే బస్సులు తగలెడతారు. ఓ రజకీయ నాయకుడి మీద.. అంటే అతడు ఉన్నా పోయినా ఓ మాట చెడ్డగా రాస్తే ఇంక ఐపోయినట్టే. అసలు అతడు బ్రతికున్నప్పుడు మొహం మీద ఓ మాట అంటే అతడు కూడా ఏమికునేవాడు కాకపోవచ్చు కాని అనుచరులు మాత్రం నానా రబస చేస్తారు. సొంత అమ్మ బాబులని అంటే కూడా అంతగా బాధపడరేమో అని అనిపిస్తుంది. ఈ విషయం లో ఇందిరమ్మ ఇంటిపేరు నిజంగానే గాంధి కాదు.. కాని ఆ వాస్తవాన్ని చెప్పినందుకు .. ప్రజలకి గుర్తుచేసీనందుకు కత్తెర పడింది. ఇది మన దేశ పరిస్థితి. ఇప్పుడే కాదు గత అరవై సంవత్సరాల నుండి ఇలనే ఉంది. యే విషయం అయినా సరే ప్రజళ్ళో ప్రజలతో చర్చ అనేది శూన్యం. ఒకడు ఎవడో "ఇది ఇలా చేయాలి" అని శాశిస్తాడు. మిగితా వాళ్ళు శిరసావహిస్తారు. అది మంచో చెడో అని తర్కించకుండా. వేల సంవత్సరాల నాటి రాచరికం గుర్తులు అయ్యిండచ్చు.

సెన్సార్ అనేది వేరొకరిని కించపరిస్తేనో అసభ్యకరంగా మాట్లాడితేనో నియంత్రించాలి తప్ప ఇల ప్రతి ఒక్కదానికి అడ్డుగా నిలవడం సమంజసం కాదు. వాక్ స్వతంత్రం ఎలాగో మనకి లేదు. మన దేశం లో పేరుకి మాత్రమే ఉండే స్వతంత్రాల్లో ఇదోటి. పొరబాటున ఎమైన రాస్తే పబ్లిక్ గా ఏమి జరగకపోయినా లోపల లోపల రాసినోడు గల్లంతు అయిపోతాడు. అంత స్వతంత్రం ఉంది మనకి. ఐనా నేనేం చూడాలో ఎలాంటిది చూడాలో నిర్ణయించేదానికి సెన్సార్ ఎవరు? నేనేమైన చిన్నపిల్లాడినా ఇది చూస్తే చెడిపోతా అది చూస్టే బాగుపడతా అని అనుకునేదానికి? ఇంకో విధం అంటే థియేటర్ లో టికెట్లు ఇచ్చేటప్పుడే కొంచం జాగ్రత్త పడ్డం. అంటే స్కూల్ పిల్లలని "A" సినెమాల్లోకి రానివ్వకపోవడం అన్నమాట. అసలు ఆ సర్టిఫికేట్లకి చూసేవాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదే!! ఉంటే అరుంధతి లాంటి వాయిలెంట్ సినెమాకి చిన్న చిన్న పిల్లల్తో రావడం ఎంటి? ముందే దానికి తాటికాయ అక్షరాలతో రాసారు "A" అని.

మన జనత కూడా మంద లా కాకుండా అప్పుడప్పుడు కొంచం niche లా ఆలోచిస్తున్నారు. మారుతున్న రుచులకి అనుగుణంగా చిత్రాలు వస్తున్నాయి. అందుకే అసలు ఆ సెన్సార్ని లేపేసి రేటింగ్ బోర్డ్ ని పెడితే సరి. అడ్డమైన చెత్త పిల్లలు చూడకుండా చూసే పూచి థియేటర్ మీద పెట్టాలి. అడ్డమైన చెత్త అంటే రోజు టీ.వీ లో వచ్చేదానికంటే తక్కువే!! యే డాన్స్ కార్యక్రమం ఓ ఐదు నిమిషాలు చూస్తే మీకే అర్థం ఔతుంది. థూ.. అసలు 4-5 యేళ్ళ పిల్లలు అంత వల్గర్ స్టెప్పులేస్తుంటే నా జీవితం మీదే కాదు అలా వేస్తున్న చప్పట్లు కొట్టే వాళ్ళ అమ్మ నాన్నల జీవితాల మీద కూడా విరక్తి కలుగుతుంది. వాటితో పోలిస్తే మన "A" సినెమాల్లో చెత్త ఇంకా తక్కువే. కుటుంబ సమేతంగా చూసేదానికి శేఖర్ కమ్ములా, కే. విశ్వనాథ్, కృష్ణా రెడ్డి తదితరుల సినెమాలు ఉండనే ఉన్నాయి కద. మిగితా వాటిని కూడా "కుటుంబ సమేతం" చేయడం ఎందుకు?

ఇది నా ఓన్-సొంత-పర్సనల్ అభిప్రాయం. అలకాదు ప్రతి మాటకి కత్తెర పడాలి అంటే ఇంక అనేది ఏమీ లేదు. నా దృష్టిలో మాత్రం సెన్సార్ బోర్డ్ సుద్ధ దండగ. కించ పరిస్తే మరోకరిని గాయ పరిస్తే వేరే విషయం కాని చిన్నా చితక రెఫరెన్సుల్ని కూడా పట్టించుకొని ప్రతి సినెమాని చెడగొట్టడం మాత్రం మంచిది కాదు అనే అంటాను.

Read more...

Friday, October 30, 2009

పాక్ లో కలకలం.. ఆనందమా? ఆలోచనా ?

ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదు. ఒక వైపు ఆనందం గా ఉన్నా మరో వైపు పాపం వాళ్ళు మనలాంటి ప్రజలే కదా అని అనిపిస్తుంది. ఇన్నేళ్ళు మన దేశం మీద పన్నిన కుట్రకి జరిపించిన మారణహోమానికి తగిన సాస్తే జరుగుతున్నట్టు అనిపిస్తోంది.. కాని ఉగ్రవాదానికి ఇటువైపు ఉండి అనేకానేక దాడులని తట్టుకొని ఉండడం వళ్ళేమో కొంచం .. అంటే చాలా చాలా చాలా చిన్నమోతాదులో .. బాధ కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఎవరు తొవ్విన గొయ్యిలోకి వాళ్ళే పడతారు అని మరోసారి రుజువైనట్టుంది. మన దేశాన్ని ముక్కలు ముక్కలు గా చేయాలి అని చాలా యేళ్ళు ప్రయత్నించి అటు కాశ్మీరంలో, పంజాబ్లో, మన రాజధానిలో, సిమి లాంటి దేశద్రోహులకి అన్ని విధాలుగ సహాయం ఇచ్చి లక్షల మందిని పొట్టనపెట్టుకున్న పాప ఫలమేమో ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్న మారణహోమం. ఇందులో మన హస్తం పెద్దగ లేదనిపిస్తుంది. అసలు అవసరమే లేదనిపిస్తుంది.

ఆఫ్ఘనిస్తాన్ పైన సోవియట్ల దాడి చేసాకా కొద్ది రోజులు తర్వత అమెరికా ప్రోద్బలం మీద పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ గర్భం లో జన్మించింది తాలిబాన్. మొదటి పది సంవత్సరాలు డబ్బు గట్ర అంతా సి.ఐ.ఏ ద్వర వచ్చేవి. తర్వత సోవియట్లు తిరిగి వెళ్ళిపోయారు... సోవియట్ యూనియన్ చరిత్రపూటాల్లోకి జారుకుంది. ఇంక చేసేది ఏమి లేక ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్గత కలహాలు చెలరేగాయి. ఒక తరం తుడిచిపెట్టుకుపోయింది ఆ దేశం లో ఈ యుద్ధాల మూలంగ. 79 నుండి 89-90 వరకు సోవియట్ల భీభత్సం వళ్ళ దేశం చాలా చాల నష్ట పోయింది.. తర్వత ఇంకో ఐదారేళ్ళు అంతర్గత కలహాలు చెలరేగాయి. పాకిస్తాన్ సహయాం చేయడం తో అందరిని ఓడించి కాబుల్ మీద విజయపతాకం ఎగరవేసింది తాలిబాన్. ఒక "గవర్నమెంట్" కూడా స్థాపించింది. దాన్ని ప్రపంచం మొత్తం మీద అంగీకరించిన రెండే రెండు దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఎంతైన సొంత బిడ్డ లాంటిది కద... అప్పుడే వాళ్ళు బమియాన్ లో ఉన్న వేల సంవత్సరాల బుద్ధ విగ్రహాలని పేల్చేసారు. యే ఒక్క దేశం కై కుయి అని అనలేదు. మన దేశం ఐతే మాటవరసకి వద్దు ఆపండి ఈ ఘోరం లాంటి కొన్ని డవిలాగులు అన్నదే తప్ప.. అంతకు మించి ఏమీ చేయలేదు. రెండు వేల సంవత్సరాల క్రిందట.. ఆ బుద్ధ విగ్రహాలని చెక్కినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మన దేశం లో ఓ భాగమే అని గుర్తించవారు కూడా తక్కువే!! ఏం చేస్తాం.. బుద్ధుడే ఆపలేకపోయాడు మనమెంత అని అందరు ఊరుకున్నారు. అది వేరే విషయం..

అలా అలా చిలకలు గోరికలు లా బ్రతుకుతున్న తరుణం లో.. అమెరికా మీద దాడి చేసింది అల్-ఖైదా. మరి అమెరికా ఊరుకుంటదా? ముందే ఏమి మిగలని ఆఫ్ఘనిస్తాన్ ని ఇంకా కుమ్మేసింది. అసలు అక్కడ ఏముందని ..అదే ఏం మిగిలిందని దాడి చేసిందో నాకు ఇంత వరకు అంతు చిక్కలేదు. అలా ఘోరం గా ఓడిపోయిన తాలిబాన్ అగ్ర నాయకులని స్వయానా తన సొంత విమానం లో సురక్షితం గా తీసుకొచ్చింది పాకిస్తాన్. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద తన దాడికి సహాయం చేయకపోతే వాళ్ళాని అదేలా చేస్తాం అని మెల్లిగా చెప్పేసరికి దిక్కులేక సహాయానికి ఒప్పుకుంది పాకిస్తాన్. కాని ఎంతైన తాలిబాన్ ని పుట్టించి పోషించింది కద.. ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది.. అటు అమెరికా కి సహాయం చేస్తా అంటునే ఇటు వీళ్ళకీ సహాయం చేసేది. రెండు వేరు వేరు దిక్కుల్లో పొయే గుఱ్ఱాల మీద ఒకటే సారి స్వారీ చేస్తే ఎల ఉంటదో తెలుసుకుందాం అని చేసినట్టు ఉండేది. రెండు చెరో దిక్కు వెళ్ళిపోయి నడ్డి ఇరిగినట్టు ఉంది ఇప్పుడు. "ఉగ్రవాదం మీద యుద్ధం" లో మొదటి ఐదేళ్ళు అస్సలు ఏమి చేయలేదు పాకిస్తాన్. కాని ఇలా తాలిబాన్లకి కూడా సహాయం చేయడం అమెరి"కనుల"కి తెలీకుండ ఉంటద? తెలుసుకున్నారు... ఇలా చేస్తే పెట్టే భిక్ష ఆపేస్తాం అన్నారు. జడుసుకొని కొంచం భయపెట్టాలని ప్రయత్నించింది పాకిస్తాన్. వజీరిస్తాన్ మీద దాడులు చేసింది.. NWFP (North West Frontier Province) మీద దాడులు చేసింది.. అమెరికా చేసిన దానికంటే పాకిస్తాన్ చేయడం వలన కోపం వచ్చింది తాలిబాన్ కి. ఆ మాత్రం ఉండదు? సొంత వళ్ళే అంటే కోపం రాదు మరి?

ముందు ఆఫ్ఘనిస్తాన్ వలయం లోకి మెల్లగా లాగింది అమెరికా ని. పాపాం వాళ్ళకి తెలీదు కద ఆఫ్ఘనిస్తాన్ గురించి.. ఇర్రుక్కున్నారు. అలెక్సాండరే భయపడ్డాడు ఆఫ్ఘన్లని చూసి. చెంఘిస్ ఖాన్, సోవియట్లు ఎవ్వరు నిలదక్కుకోలేకపోయారు .. అలాంటి చోట ఇరుకున్నారు అమెరికన్లు. గత ఐదేళ్ళలో చాలా భాగం మళ్ళా తాలిబాన్ల చేతుల్లోకి వచ్చేసింది. కాని ఇటు పాకిస్తాన్ సైన్యం వళ్ళ చాల నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడే వాళ్ళా దృష్టి పాకిస్తాన్ మీదకి సారించారు. NWFP, వజీరిస్తాన్ లో పాక్ సైన్యాన్ని ఎదుర్కోగలిగింది. స్వాట్ లోయలోకి వచ్చి పాక్ సైన్యం తో ఢీ కొట్టింది. తర్వత ఒక రోజు అమెరికా విమానం తో పాక్ తాలిబాన్ అధ్యక్షుడ్ని చంపేసింది. దానికి ప్రతీకారం గా కొత్తగా ఎన్నికైన తాలిబాన్ నాయకుడు మొదలెట్టిన ప్రతీకరమే ప్రస్తుతానికి పాకిస్తాన్ తో రగులుతున్న భీభత్సం.

ఈ సంవత్సరం కనీసం 500 మంది బలి అయ్యారు అడపా దడపల బాంబుల వళ్ళ. ఇన్నేళ్ళు మన మీద సాగించిన కుట్ర ఎల ఉంటదొ ఇప్పుడిప్పుడే అర్థం ఔతున్నట్టు ఉంది వాళ్ళకి. ఇంటి బయటకి వెళ్తే తిరిగి వస్తారో లేదో అన్న భయం వచ్చింది పాకిలకి. వాళ్ళ పరిపాలకులకి కూడా ఆ భయం వస్తే బాగుంటుంది. మొన్నామధ్య ఏకంగా ఆర్మీ హెడ్క్వాటర్ మీదే దాడి చేసారు. మన ప్రమేయం ఏమీ లేకుండా పాక్ ఇలా ఔతోంది అంటే ఎక్కడో కొంచం ఆనందం గా ఉంది. ఈ యుద్ధం సాగుతునే ఉంటుంది.. గెలుపు రుచి చూసారు తాలిబాన్లు పాకిస్తాన్ మీద. వజీరిస్తన్, NWFP లో వాళ్ళదే రాజ్యం ఇప్పుడు. మరో ఆఫ్ఘనిస్తాన్ తయారు చేసారు అక్కడ. అందుకే మిగితా పాక్ ని అల చేయాలి అని ఆశ పడుతున్నారు. అల జరిగితే మనకి నష్టమే కష్టమే. కాని ఎప్పటి వరకు ఐతే పాక్ సైన్యం ప్రభుత్వం ఈ యుద్ధం కొనసాగిస్తుందో అప్పటి వరకు మనకి ఢోకా లేదు. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి...

Read more...

Friday, October 23, 2009

ఆనందం ఆనందం ఆయే...

ప్రదేశం: హైదరాబదు లో ఓ గృహం
సమయం: అసురసంధ్య వేల

అప్పుడే ఆగిన ఓ కారు.. అందులోనుండి దిగిన కొంత మంది గేటు దాటుకొని ఇంట్లోకి ప్రవేసించారు. ఇంట్లో చుట్టూర్త జనం. కనీసం ఓ ముప్పై మంది ఉంటారు. అందరూ ఆ కార్లోనుండి దిగిన వ్యక్తినే చూస్తున్నారు తదేకగ. అతడికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా గోల సద్దుమనిగింది.. ఎవరో అన్నారు - అమ్మాయిని బయటకి తీసుకొనిరండి అని.. వెంట్టనే.. అంటే ఓ పది నిమిషాలు తర్వత అమ్మాయి బయటకి వచ్చింది ఇంకో ఐదారు మందితో. ఇప్పుడు అందరు దృష్టి అమ్మాయి మీద ఉంది.. తనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇంతలో ఎవరో అన్నారు వాళ్ళిదర్నే మాట్లాడుకోనివ్వండి అని. అంతే ఒక్క క్షణం లో అందరు మాయమైపోయారు.. అబ్బాయి అమ్మాయి వైపు చూసి.. మీకు మీకు వంట వచ్చా అని అడిగాడు .. మొదటి ప్రశ్న ఎవడైన అది అడుగుతాడా?.. ఆ పర్లేదండి అన్నది అమ్మాయి.. తర్వతా ఇంక ఎదో అడగబోయాడు...

కట్ కట్ కట్.. చస్ .. ఇదేదో ఇరవైఏళ్ళ క్రితం వచ్చిన మూవీలో సీన్ లా ఉంది...

ప్రదేశం: బిర్లా మందిర్ ప్రాంగణం
సమయం: అసురసంధ్యవేల

నీటుగా టై కూడా కట్టుకొని క్రాఫ్ చేసుకున్న జుత్తుతో ఉన్నాడు అబ్బాయి. మొహం లో ఎక్కడలేని టెన్షన్. మొదటిసారి ఇంటర్వ్యూ కి వెళ్ళ్తున్నవాడిలా ఉన్నాడు చూట్టానికి. ఆరు గంటలకి కలుద్దాం అని చెప్పినా ఎందుకైన మంచిందే అని ఐదున్నరకే వచ్చేసారు అబ్బయి పట్టుపట్టడం తో. సీన్ కట్ చేస్తే...

అమ్మాయి అబ్బాయి ఇద్దరే ఓ మెట్టు మీద కూర్చొని ఉన్నారు. వీళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు అందరు మధ్యలో ఎందుకులే అని ఇద్దర్నే వదిలేసి ఆ వెంకన్న దర్శనానికి వెళ్ళారు. అమ్మాయి హాయిగా ఉంది.. అబ్బయేమో కొంచం ఇబ్బందిగ కూర్చున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాకుండా బిక్కు బిక్కు మంటు నలుదిక్కుల హైదరాబదు ట్రాఫిక్ చూస్తున్నాడు. ఇంతలో అమ్మాయి అడిగింది... మీకు వంట వచ్చా? అని.. ఎదో while loop లో ఇరుకున్న అబ్బాయి ఆలోచనలకి break పడినట్టు ఈ లోకానికి మళ్ళా వచ్చేసాడు. పాకం పురుష లక్షణం.. రాకుండ ఎలా అండి అన్నాడు. హమ్మయ్య ఓ పని తగ్గింది అనుకుంది అమ్మాయి. మీకు బండి నడపడం వచ్చా అని అడిగింది.. ఆ పోలీసుకి దొరక్కుండ నడుపుతా అన్నాడు... దొరికినా ఒక కహాని చెప్పి డబ్బు కట్టకుండా ఉంటా అన్నాడు... ఇంకే ఇదే పదివేలు అనుకుంది అమ్మాయి. ఇలా ఓ గంట బాటు పరస్పర ప్రశ్న-జవాబుల కార్యక్రమం కొనసాగింది. అప్పటికి ఇద్దరికి కొంచం అవగాహణ వచ్చింది.. సరే అని అమ్మాయి ముందు చెప్పింది.. అబ్బాయి ఇంచు మించు గా ఓ కిలోమీటర్ గెంతాడు ఆనందంతో... అంతే.. మరుసటి రోజు లగ్నపత్రిక రాసేసారు..

ఇలానే జరిగిందా అంటే ఏమో మరి చెప్పలేము.. కాని బహుశా ఇలానే జరిగింటది అని నా ఆలోచన.. మన పెంకి పింకీ పెళ్ళిచూపులు. అబ్బాయి పాపం భయం భయం గా ఉన్నాడు... మన పిల్ల వాగ్ధాటి చూసి. అబ దబ జబ అని ఇప్పటికే హాస్పిటల్ లో తను పుట్టినప్పటి విషయాలనుండి చెప్పడం మొదలెట్టేసింటుంది. ఇన్ని రోజుల్లో ఇంకా నర్సరీ లోనో UKG లోనో ఉండి ఉంటుంది.. ఇంకా ఇంజనీరింగ్ ఉద్యోగం వరకు వచ్చేపాటికి ఎన్నేళ్ళూ పడతాయో అని బెంగ పెట్టుకొని ఉంటాడు. పెళ్ళి చూపుల్లో మొదటి ప్రశ్నకే అర్థం అయ్యిండాలి... కాని ఏం చేస్తాం.. లగ్గం ఆకాశం లో జరిగింటాయి అంటారు.. అదే marriages are made in heaven అని. నేను-నేనుగా అని అనుకుంటున్న పింకీ కి ఇంక నేను-మేముగ అని అనే టైం ఆసన్నమైంది.

వాళ్ళ ఇరువురికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ.. ఇంకొద్ది రోజుల్లో .. మన పింకీ పెళ్ళికూతురాయేనె...

Read more...

Saturday, October 10, 2009

క్రికెట్ తెలియనివాడు ...

అనగనగనగనగా ఒక ఊరిలో బుజ్జిగాడు అనే ఓ కుర్రాడు ఉండేవాడు. వాడు ఎలా ఉన్నా.. వాడ్ని అందరు ఇంచు మించు గా హీరో రాజా లా (మేధావి లా) చూసేవారు. అంటే ఊర్లో కష్టాలు లేకున్నా ఏదో ఒకటి చేసి కొంచం కష్టం గా దాన్ని చిత్రీకరించి ఉపాయాలు చెప్పేవాడు. అందరు వాడ్ని బాగా చూసుకునేవారు. ఊర్లో కాస్తో కూస్తో కొంచం జ్ఞానం బుద్ధి ఉన్నవాళ్ళళ్ళో ఒకడిగా అందరి అభిమానం పొందాడు. ఇలా ఉండగ పక్క ఊరునుండి ఒకడు వచ్చి బుజ్జిగాడి మేధస్సు చూసి "మామూలుగా రండి మేధవులుగా పొండి" అనే పోటికి పంపమని ఆ ఊరువాళ్ళతో చెప్పాడు. ఊరు పరువు పేరు నిలబెట్టాలి అని చెప్పి పెద్దలు నిర్ణయించి బుజ్జిగాడికి ఓ తోడు ఇచ్చి ఆ పోటి కి పంపారు.

బుజ్జిగాడు వాడి స్నేహితుడు పోటి జరుగుతున్న స్థలానికి చేరారు. మొత్తం ఇంకా అన్ని ప్రదేశాల నుండి ఓ వంద మంది వచ్చారు. అసలు పోటిల్లో పాల్గొనే అర్హత ఉందో లేదో అని ముందు చిన్న చిన్న పరీక్షలు పెట్టి మొత్తం మీద ఓ ఆరు మందిని ఎన్నుకున్నారు. ఇంక పోటిలూ ప్రారంభమైయ్యాయి. మొదటిది ఏంటంటే మూడు అగ్గిపుల్లల్తో ముప్పై మందికి మూడు రకలా వంటలు చేసి పెట్టాలి. ఇలాంటివి మన బుజ్జిగాడికి పప్పుతో పెట్టిన విద్య .. వెంట్టనే మూడు పుల్లల్ల్ని వేరు వేరు చేసి మూడు గిన్నెల కింద పెట్టి చక చక వంట చేసేసాడు. పోటిలో మొదటి స్థానాన్ని సంపాదించాడు. రెండో పోటి ఐస్కాంతం తో ఓ కాంత ని ఆకర్షించాలి. ఇది కూడా చిల్లర పని కాబట్టి నిమిషాల్లో చేసేసాడు. ఇలా ఐదు విడతల పోటిల తర్వాత మొదటి స్థానం లో బుజ్జిగాడు నిల్చున్నాడు. ఇంక ఫలితాలు చెప్పే సమయం అయ్యింది.. అందరు ఇంక బుజ్జిగాడికే వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. బుజ్జిగాడు కూడా విజయగర్వం తో అందరికి చేతులు ఊపుతు నిల్చున్నాడు. కాని చివరి క్షణంలో ఆ పోటి విజేత విజేంద్ర వర్మ అని చెప్పేసరికి ఎనలేని నిరాశ నిస్ప్రుహతో స్ప్రుహ కోల్పోయాడు బుజ్జిగాడు. ఇంక జీవితం మీద విరక్తి కలిగి అలా అలా నడుచుకుంటు దగ్గర్లో ఉన్న అడివిలోకి వెళ్ళి తపస్సు మొదలెట్టాడు. కొద్ది రోజులు తర్వత ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైయ్యాడు. అప్పుడు బుజ్జిగాడు అడిగిన ఏకైక ప్రశ్న అన్నింటిలోను తాను ముందుండగా మేధావి అనే బిరుదు మాత్రం వేరేవాడికి ఎలా వచ్చింది అని. అప్పుడు ఆ పరమేశ్వరుడు "నీకు దైవ క్రీడ్ ఐన క్రికెట్ అంటే ఇష్టం లేకపోవడమే కారణం బుజ్జి" అని. ఆ మాటకి అవాక్కైన బుజ్జికి మించు ఇంచు గా మతి భ్రమించింది. "దేవా.. దేవాది దేవా మహాదేవా ....ఏంటి మీరంటుందేది. కొంచం వివరంగా చెప్పగలరు" అని పరిపరివిధములుగా ప్రార్థించగా ఆ పరమేశ్వరుడు చిన్నగా నవ్వి చెప్పడం ఆరంభించాడు -

ఒకానొకప్పుడు దేవుళ్ళు దూర్వస ముని శాపము వలన వారి శక్తులు అన్ని కోల్పోయారు. అప్పుడు వాళ్ళందరు విష్ణు మూర్తిని స్తుతించగా విష్ణుమూర్తి సంతుషూటుడై వారికి వారి గతవాఇభవం చేరూకే ఒక ఉపాయము చెప్పెను. క్షేరసాగరాన్ని మదించి అందులోనుండి వెలువడిన అమ్రుతాన్ని సేవించినచో దేవుళ్ళకి వారి గత వైభవం తిరిగివచ్చునని తెలిపెను. దేవుళ్ళు ఒక్కరే ఆ సాగరాన్ని మదించలేరు కాబట్టి వారి చుట్టలైన అసురులని కూడా ఆహ్వానించిరి. అలా ఇరువురు కలిసి మందర పర్వతాన్ని కవ్వంగా పెట్టి మదనాన్ని ఆరంభించిరి. హాలాహలము, కామధేనువు గట్ర అన్ని వచ్చాక అమృతం బయటకి వచ్చెను. ఆ అమృతానికి దేవుళ్ళు అసురులు కొట్లాడుకోవడం ఆరంభించారు. ఆ కొట్లాటని పరిష్కరించేదానికి కనుగొనబడిన క్రీడ ఈ క్రికెట్. ఆ రోజు జరిగిన మ్యాచ్ కి అంపైర్ గా వ్యవరించినది సాక్షాత్తూ ఆ బ్రహ్మే. మధ్యలో అసురులు వీరవిపరీతం గా విజ్రుంభిస్తూంటే వారి ఆటని దెబ్బకొట్టేదానికి విష్ణుమూర్తి మోహిని గా వచ్చే సరికి ఆ సుందరిని చూస్తూ మతిచెడి అసురులు ఓడిపోయారు. అలాంటి ఆటని హేళన చేసినందుకును ఇష్టపడనందుకును నీకు ఆ బిరుదు రాలేదు.

ఇది విన్న బుజ్జిగాడికి కళ్ళు చెమ్మగిల్లాయి.. ఐతే దేవా ఈ క్రీడని తెల్లోళ్ళకి ఎందుకు ఇచ్చినట్టు? ఇది మన జాతీయ క్రీడ అవ్వాలి కద? అని అడిగాడు. అందుకు ఆ మహదేవుడి ఇలా సెలవిచ్చాడు - "భారతీయులకి ఓ భయంకరమైన జబ్బు ఉంది. అది ఎందుకు ఎలా వచ్చింది అనేది ఇప్పుడు అసంధర్భం కావున చెప్పడం లేదు.. కాని ఆ జబ్బేంటంటే 'భారతీయులకి - పొరుగింటి పుళ్ళకూర రుచి! మనది, మన దేశానిది మన వాళ్ళూ అంటే చచ్చిన అవళంబించరు సరికద అపహాసం చేస్తారు. అందుకనే ఈ క్రీడని తెల్లోళ్ళకి అంటగట్టాల్సి వచ్చింది. అలా అయినా మనవాళ్ళు దీన్ని పుళ్ళకూరంత రుచిగా చూసుకుంటారని. ఇప్పుడు జరుగుతుండేది అదే కద!" ఇలా చెప్పేసరికి బుజ్జిగాడికి బోధిచెట్టుకింద కూర్చున్నంత జ్ఞానమొచ్చి ఇలా అన్నడు:

ఖగపతితోడన్ క్షీరసాగరము మదించగన్,
తగువున్ చేదించుటకు విధాత తలపుగన్,
జన్మనొందెన్ ఈ మహోనత క్రికెట్ క్రీడన్,
క్రికెట్ తెలియనివాడు దున్నపోతై పుట్టున్..

గమనిక: ఈ టపా ఎవ్వరిని ఉద్దేసించి వ్రాసినదికాదు. 'నేను-నేనుగా' యే 'నేస్తా'ల సహాయం లేకుండా రాసినది. ఎవరినైన బాధ కలిగిస్తే కేసేసుకోండి. నేను దానికి బదులుగా ముందే ఓ రెండు మూడు కేసులేసేస్తా.

Read more...

Saturday, October 3, 2009

Wake Up Sid - My Experience

నిన్న చూసా ఈ చిత్రం. బాగా అనిపించింది. చాలా రోజులు తర్వత ఓ మంచి కాఫీ లాంటి సినెమా చూస్తున్నట్టూ అనిపించింది. చెట్లెనకాలా పుట్లెనకాలా పెరిగెత్తే పాటలు లేవు.. తాతా ముత్తాతా ని తలుచుకుంటూ సోది లేదు.. కార్లు గాల్లో పల్టీలు కొట్టడాలు ఒక్క గుండు తో ఓ సైన్యాన్ని చంపేడలు లాంటివి అస్సలు లేదు. అలగే తేజా టైప్ "టీనేజ్ రొమాన్స్" లేదు. చాలా మెచూర్డ్ గా ఉంది మూవీ. దాదాపుగా నిజజీవితం లో జరిగేట్టే ఉంది. మన సినెమాల్లో అరుదుగా కనిపించే నిజాయతి ఉంది.

సిడ్ ఉరఫ్ సిద్ధార్త్ అంటే రనబీర్ కష్టపడి అప్పుడప్పుడు పాసయ్యే రకం అన్నమాట. రేపు పరీక్ష అంటే ఈ రోజు వన్-డే బ్యాట్టింగ్ లాగా అన్నమాట. మనలో (అంటే మాలో) సగం పైన ఇదే పద్ధతి తో గట్టెక్కాం .. బండిని లాక్కుంటు వచ్చాం. దానికి ఓ కిటుకు ఉంది.. పాత ప్రశ్నాపత్రాలని తిరగేస్తే ఓ అంచన వస్తుంది ఎలాంటి ప్రశ్నలు రావచ్చో అని.. మసిపూసి మారేడుకాయ చేయడం మాత్రమే మిగులుతుంది.. అలా కాకుండా పాపం ఒక్క రోజు ముందు టెక్స్ట్ బూక్ తిరిగేయడం మొదలెడతాడు. ఇంక పరినామం అర్థం అయినట్టే కద!!! పరీక్ష హాల్ లో ఏటు నుండి ఏటు చూసిన ముక్క అర్థం కాదు.. నాకైతే నా ఇంజరీనింగ్ ఫస్ట్ సెం లో ఓ పరీక్ష గుర్తొచ్చింది. (డీటేల్స్ అడగొద్దు.. శాస్త్రి గారి పలుకు ప్రకారం "ఉందిగా సెప్టెంబరు మార్చి పైనా... " అనుకోవడమే..)

ఫైనల్ పరీక్ష తర్వాతా రేపటి నుండి అదేగో గొప్ప ఘణకార్యం చేసినట్టు ఇంట్లో బయట అందరు "ఇంకేంట్రా పెద్దోడివైపోయావు" అని అంటారు. ఒక్క రోజులో విధ్యార్థి దశ నుండి నిరుద్యోగి దశ కి చేరుకుంటాం. కనీసం పరీక్ష ఫలితాలు వచ్చేవరకి కూడా ఆగరు. అదేంటో. అదో మన్మోహన్ (అదే చిదంబర) రహశ్యం. అలా ఒక్కరోజులో "పెద్ద"వాడైపోకుండా నిరసిస్తున్న సిడ్ కథే ఈ చిత్రం. బొంబాయి ని చాలా అందం గా చూపించారు. బొంబాయి అంటే గుర్తొచ్చింది.. సినెమా మొత్తం అందరు బొంబాయి ని బొంబాయి అనే.. సారి సారి "ముంబాయి" ని బొంబాయి అని అన్నారని శివ సేన ధర్నా చేసిందట. అస్సలు పనిలేకుండా ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు.

చాలా మెచూర్డ్ గా డీల్ చేసాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. బ్యానర్ .. ధర్మా ప్రొడక్షన్స్ .. కరణ్ జోహర్ ది.. చూసి దడుసుకొని జడుసుకొని కొంచం భయపడి ఎగ్గొట్టేద్దాం అని చాలా రోజులక్రితమే ఆలోచనమొదలెట్టా. కాని కరణ్ దర్శకత్వం కాదు కద అని కొంచం ఊపిరిపీల్చుకొని సాహసించా. బయటకి హాయిగా వచ్చాం. బ్యానర్ ని బట్టి మూవిలని కొలచకూడదని తెలుసుకున్నా. కొంకణా సేన్ గురించి చెప్పెక్కరలేదు. ఎటువైంటి పాత్రకైన న్యాయం చేస్తుంది. ఇందులోను అంతే. ఒక కొత్త ఊరికి వస్తే.. వచ్చిన మొదట్లో ఎలా ఉంటుందో అని మరోసారి గుర్తుచేసింది. అమెరికా కీ వచ్చినప్పుడు నాకు తెలిసినవాడు ఒక్కడు కూడా లేడు మా కాలేజి లో. అసలు హైదరబాదు దాటి ఒక్కడినే నేను వెళ్ళీన గరిష్ట దూరం దిల్లీ. అదెక్కడ అమెరికా ఎక్కడ. కొత్త ఊరూ కొత్త వాతావర్ణం.. మళ్ళా ఆ రోజులు గుర్తొచ్చాయి ఈ మూవీ చూస్తూంటే. చిన్నప్పటి స్నేహితులని విడిచి వస్తున్నప్పుడు కలిగిన బాధ... తర్వాత తర్వాత కొద్ది కాలానికే పరిచయమైన కొత్త స్నేహితులు.... కాలక్రమేన వీళ్ళు ఆ ప్రాణ స్నేహితుల జాబితాలోకి చేరిపోతారు. అది సహజం.. మన నైజం. ఇవ్వనిటితోబాటు తల్లిదండ్రులతో ఘర్షణలు.. అన్ని ఉన్నాయి ఇందులో. ఒక్క సీన్ మాత్రం చింపేసారు. ఎంత authentic గా ఉందంటే I am sure everyone can identify themselves with that.

చివరగా ఓ మాట. ఇది ప్రేమ కథే. కాని పదో తరగతో కాలేజో ప్రేమ కథ కాదు. అందుకే చూడండి అంటున్నా. వీలైతే. ఇంతకంటే సినెమా గురించి చెప్పడం కష్టం. చెప్తే మీకు కథ చెప్పేసినట్టు ఉంటూంది.. చెప్పకపోతే కూడా కష్టమే. సో పొరబాటున కథ ఎమైన చెప్పెస్తె క్షమించేయండి.

Read more...

Friday, October 2, 2009

కృష్ణమ్మ కొంచం కోపం తగ్గించుకోమ్మ..

గత వందేళ్ళళ్ళో ఎన్నడులేనంత ఆంధ్ర దేశం లో వరద ప్రాంతం ఏర్కొన్నది. భాస్కర్ దీన్ని *పాలనా వ్యవస్థల అట్టర్ ఫైల్యూర్* అన్నారు. కాని ఒక్కటి అసలు ఇంత వస్తుంది అని కలలో కూడా ఎవ్వరు ఊహించిండరు. కేవలం శ్రీ వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం తప్ప ఇంక ఎవ్వరు ఊహించలేదు ఇది. ప్రతి యేట వచ్చే వరదలని తట్టుకునే .. అలాంటివి వచ్చిన వెంట్టనే ఆదుకునే సత్త మాత్రమే మన ప్రభుత్వానికి ఉంది. అంతే తప్ప ఇలా ఇంత భారి లెవెల్ లో వరదలు వస్తే ఎవ్వరు ఏమీ చేయలేరన్నది నా అభిప్రాయం. మన దేశమే కాదు అసలు ఎక్కడ ఎవ్వరు ఈ లెవెల్ లో వరదలని ఎదుర్కునేంత లేదు. (please correct me if I am wrong).

ఇందాకే డా|| జయప్రకాష్ నారాయణ్ గారు చెప్పారు - ప్రపంచంలో యే ప్రభుత్వం / ప్రపంచలోని అన్ని ప్రభుత్వాలు కలిసి పని చేసిన మూడుగంటల్లో మూడులక్షల మందిని మూవ్ చేయలేరు అని. అది వాస్తవమే. మూడు రోజులుగా కురుస్తున్న భారి వర్షాలని తప్పు అంచనా వేసిందా మన ప్రభుత్వం అంటే .. అది నిజమే. కాని ఇంత లా ఔతుంది అని ఎవ్వరు ఊహించలేదు.

ఇప్పుడు సమయం రాత్రి 11:10 దేశం లో.శ్రీశైలం గరిష్ట స్థాయికి చేరుకుంది అట. మొత్తం 11 గేట్లు 43 అడుగులు ఎత్తివేసారు అట. 889 అడుగుల నీటిమట్టం చేరుకుంది. ఇంకా ఈ రోజో రేపో "మేము నీళ్ళు ఇవ్వము వదలము దాచుకుంటాం గిన్నేలో బిందెల్లో పోసుకొని ఇంటి భూగర్భం లో పెట్టుకుంటాం" అన్ని ఇన్నేళ్ళు అన్న పొరుగురాష్ట్రం ఇంకో ఇరవై లక్షల క్యూసెక్ల వరద నీరు విడుదల చేస్తుంది అట. అది రేపు మధ్యానానికో సాయంత్రానికో శ్రీశైలం చేరుకుంటుంది. కర్నూలు అప్పటికి ఉంటుందనే ఆశిస్తున్నాను. నా భయం.. శ్రీశైలానికి పొరబాటున అటు ఇటు ఏమైన జరిగితే మొత్తం నాగార్జున సాగర్ మీద పడుతుంది..

నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు ఇంకొద్ది గంట్టల్లో. అక్కడ 26 గేట్లు ఎత్తేసారు. రేపు మధ్యానానికి మొత్తం లెవెల్ లో ఎత్తేసే అవకాశాలు ఉన్నాయి అట. ఇంక మిగిలింది ప్రకాశం. ప్రకాసం 12 గేట్లు ఇప్పుడు 6 అడుగులు ఎత్తేసారు. రేపు మధ్యానానికి ఆరులక్షల క్యూసెక్ల నీరు చేరుతుంది అట బెజవాడ కి. కర్నూల్ లో కరెంట్ తీసేసారు. ల్యాండ్ లైన్లు లేవు. కేవలం సెల్ మీదే నడుస్తోంది. ఇంకా భారి వర్షాలు పడుతున్నాయి మన రాష్ట్రం లో.. అలనే కర్ణాటకలో కూడానూ. ఇంకో ఇరవై నాలుగు చాలా క్లిష్ట పరిస్థితి మన రాష్ట్రానికి కొన్ని జిల్లాలకి ....

Update: రేపు ప్రొదున్నకి మద్రాసు నుండి 30 పవర్ బోట్లు చేరుతాయి అట కర్నూల్ నగరం. అలనే కర్ణాటక 20 లక్ష క్యూసెక్లు వరద నీరు ఒదిలేసింది. దీని వళ్ళ రేపు ప్రొదున్నకి ఇంకో పది అడుగులు .. పది అడుగులు నీరు పెరుగుతుంది అట కర్నూల్ నగరం లో.

Update సమయం తెల్లవారి 3:15. జూలార 60 గేట్లు తెరిచేసారు అట. శ్రీశైలం లో నీటి ప్రవాహం ఇప్పుడు 891 అడుగులకి చేరుకుంది!!!! శ్రీశైలం గరిష్ట ఎత్తు 885 అడుగులు. దేవుని మీద భారం వేసి సైట్ నుండి వెళ్ళిపోయారట ఇంజనీర్లు.

Read more...

Thursday, September 24, 2009

దిల్ బోలే "రక్షించు బాబా.."

నాకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు. అలా అప్పుడప్పుడు అంటే యాడాదికి ఒకటో రెండో లా అన్నమాట.. నన్ను నేనే చిత్రవధ కి గురి చేసుకుంటా. (సేడో-మసోచిస్ట్ అనుకునేరు.. అంత బొమ్మ లేదు ) అంటే అదేదో చెట్టుకి కట్టేసుకొని కొట్టుకునే టైప్ కాదు.. మానసికంగా అన్నమాట. దానికి కొన్ని కారణాలు కొన్ని పద్ధతులు అవళంబించుకున్నా. శాస్త్రీ గారనట్టు "రాత్రిలో సొగసు ఏమిటో చూపడనికే చుక్కలు.. బ్రతుకులో తీపి ఏమిటో చెప్పడానికే చిక్కులు .. " అని.. అలా అప్పుడప్పుడు నా బుద్ధిని పదును పెట్టుకునే దానికి నన్ను నేనే బుద్ధిపరంగా కొన్ని చిక్కులకి గురి చేసుకుంటా. దానికోసం కొన్ని సార్లు మంచి సినెమా దోహదపడుతుంది. అంటే రాబోయే సీన్ ఏంటా ఇది ఇలా ఎందుకు తీసాడు అలా ఆలోచిస్తా. దానికి విరుగుడు గా ఇంకో రకం సినెమా ఉంటుంది.. చూస్తున్నంత సేపు చూసినందుకు మనమీద తీసినందుకు దర్శకుని జీవితం మీద విరక్తి కలిగించేవి. ఈ చిత్రం రెండో కోవకి చెందింది.

ఈ ఉపోద్ఘాతం (సొల్లు అని కొంతమంది అనచ్చు) ఎందుకురా అంటే ఎదైన విషయం చెప్పే ముందు కొంచం భూమి పని (groundwork) చేయడం నాకిష్టం గనుక. గత కొద్ది సంవత్సరాళ్ళో ఇంత కంటే చెత్త సినెమా నేను చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆ మాట నేనంటున్నాను అంటే ఎంత చండాలంగా ఉందో అర్థం చేసుకోండి. కథ పక్కనబెట్టండి. అసలు .. పోనీ నేను పంజాబ్ కి ఎప్పుడు వెళ్ళలేదు కాని నాకు తెలిసినంత వరకు అక్కడ మనిషి ఎదురైతే రోడ్డు మీద భల్లే భల్లే అని భాంగ్రా వేయరనే అనుకుంటున్నా. అదేంటో యష్ రాజ్ సినిమాల్లో మాత్రమే ఇలా వెరైటీ గా ఉంటారు పంజాబీలు. ఈ సినెమా వాళ్ళకి చూపిస్తే స్తేట్ స్తేట్ మొత్తం పరువునష్టం దావా వేస్తారేమో. రాణీ ముఖర్జీ కష్ట పడి ప్రతి వాక్యం లో పంజాబీ పదాలు కలిపి మాట్లాడ్డం ఏంటో. నేచురల్ గా రావడం వేరు.. పనిగట్టుకొని ఇలా మాట్లాడ్డం వేరు. మొదటిది - అనుకోకుండా ఒక రోజు లో హర్ష వర్ధన్ టైప్ - you dance, i glance లాంటివి. రెండవది .. వద్దులేండి. తలుచుకుంటేనే అదో మాదిరి ఔతుంది పొట్టలో.

కథా పరంగా చెప్పేదానికి ఏమీ లేదు. పాకిస్తాన్ చేతిలో ప్రతి యేట ఓడిపోతూంటంది మగవాళ్ళ జట్టు. వీళ్ళతో ఐతే పని కాదని ఇగ రాణీ లుంగీ కట్టుకొని బరిలో దూకుతుంది. దసర వేషాళ్ళో దొరికే పెట్టుడు మీసాలు గేడ్డం అద్దెకు తెచ్చుకొని ఫెవికాల్ లో అద్దుకొని. అహా తెలీక అడుగుతాను .. ఓ అమ్మాయి అబ్బయిగా వేషం వేసుకోవడం అంటే మీసం గెడ్డం పెట్టుకుంటే సరిపోద్దా ? చేయి చూస్తే చెప్పచు అమ్మాయి అని. ఏంటో. మిగితాది పక్కన పెడితే కూడా. విరక్తి కలుగుతుంది ఇలాంటివి చూస్తే. పోనీ అలా అని పూర్నిమా రావు లా ఆడుతుందా అంటే అబ్బే ... గల్లి క్రికెట్ లో కూడా అంత కంటే అద్భుతమైన షాట్లు చూడచ్చు. గల్లి క్రికెట్ ని దీనితో పోల్చడం తప్పు. అపచారం. రాణీ లాస్ట్ వికెట్ కి వచ్చీ ఓ ఐదోవర్లల్లో ఓ నూట యాభై పరుగులు కొట్టడం అదీ ఆఫ్రీదీ లా ప్రతి బాల్ అడి.. ఆ ఒక్క షాట్ కోసమే దీన్ని కళా-ఖండం గా పరిగణించచ్చు.

ఈ యేడు ఈ సినెమా ని మన అఫీశియల్ ఆస్కర్ గా పంపాలని నా అభ్యర్తన. ఈ సినెమా చూసాక ఇంక జన్మ లో ఎప్పుడు భారతదేశం నుండి సినెమా అంటే చిన్న చూపు చూడరు. జడుసుకుంటారు. భయపడతారు. కాని కాని ఆస్కర్ ఇవ్వకుండ ఉండరు. ఎప్పటికీ. ఓ ఐదు వందల సంవత్సరాల తర్వత ఎప్పుడైన ఆస్కర్ కమిటీ వాళ్ళకి భరత దేశం నుండి సినెమాల మీద చిన్నచూపు వస్తే ఈ సినెమా లో యే ఒక్క సీన్ చూపించిన చాలు. సెట్ అయిపోతారు. అంత పవర్ ఉంది ఈ సినెమా కి. ప్రపంచ చరిత్రలో ఇదో మైలురాయి. స్టీవన్ స్పీల్బర్గ్, గురు దత్, మణి రత్నం, వర్మా, సత్యజిత్ రే, అదూర్ గోపాలకృష్ణన్ - ఎవ్వరు సాధించలేనిది అనురాగ్ సింఘ్ సాధించాడు. జోహార్. ఇది ప్రపంచ అన్ని భాషల్లో అనువదించి రిలీస్ చేసినా ఫ్లాప్ ఔతుంది. అసలు ఈ మహాయుగం లో ఇదే మొట్టమొదటి సినెమా ఐనా ఫ్లాప్ అయ్యేది. అంత గొప్ప చిత్రం ఇది. దీన్ని మీకోసం మిస్స్ అవ్వకండి. ప్లీజ్ నా కోసం వెళ్ళి చూడండి. చూసారా "చూడండి" అని అన్నాను "చూసి రండి" అని అనడం లేదు.. అంత potential ఉన్న మూవీ ఇది. గ్రేట్ సినెమాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇలాంటివి అరుదు. అందుకే చూసి తరించండి.

Read more...

Sunday, September 6, 2009

వై.యెస్.ఆర్ ... తర్వాత ?

ఒక మనిషి చేసిన మంచి చావులో తెలుస్తుంది అంటారు. ఆ విధంగా చూస్తే వై.యెస్ పేదలకి చాలానే మంచి చేసినట్టూ గోచరిస్తుంది. నాకు పెద్దగ నచ్చకపోయినా ఒక్క అంశం వల్ల నచ్చేవాడు. జలయగ్ఞం. మన రాష్ట్రం లో దేశం లో భూమిలో నీరు అంటే గ్రౌండ్ వాటర్ టేబల్ చాలా చాలా చాలా దారుణంగా పడిపోతోంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది మన మూర్ఖవతం వలన వచ్చిన ముప్పే. ఒక కాలం లో అంటే బ్రిటిషర్లు రాకమునుపు అన్నమాట, ఓ 7-8 వేల సంవత్సరాలు మన పూర్వీకులు ప్రతి ఊరిలో ఓ కోనేరు అని ప్రతి కిలోమీటర్ కి ఓ కోనేరు అని కట్టే వాళ్ళు. అలనే "స్టెప్ ట్యాంక్" లని కూడా భారీ లెవెల్ లో నిర్మించారు. వీటి వళ్ళ రెండు ఉపయోగాలు - ఒకటి వషపు నీరు ఇందులో చేరడం వలన ఊరికి నిత్యం నీరు ఉండేది. రెండు - కింద మట్టే కాబట్టి నీరు తిరిగి నేలలో ఇంకిపోయేది. అల వాడని నీరు భూమిలో పోయేది. ఎప్పుడైన అవసరం వచ్చి బావి తొవ్వితే నీరు వచ్చేది. ఇది నా దృష్టిలో ultimate water conservation. కాని బ్రిటిషర్లు ఈ కోనేరులు filthy water అని నమ్మి చాలా వాటిని పూడ్చేసారు. స్వతంత్రం వచ్చాక మన ప్రభుత్వం వేల యేళ్ళ నాటి మన మనుగడని తలచక బ్రిటిషర్ల బాటలోనే నడిచి.. ఇదిగో ఇప్పుడు నీళ్ళూ లేని పరిస్థితి తెచ్చి పెట్టింది.

పంటలకి నీటి కోసం పంపు సెట్లు ఎంత లోపల దింపిన చాలా చోట్ల నీరు రావడం లేదు ఈ కాలం లో. అసలు భూమిలో నీరు ఉంటే కద వచ్చేది. water table restoration కి ఓ ఉపాయం జలయగ్ఞం. 70 చిల్లర చిన్న పెద్ద ఆనకట్టలు నిర్మించడంతో ఈ సమస్య కొంత తీరుతుందేమో. అందులో భాగం గా ఇప్పటికి 35 దాక నిర్మాణం పూర్తి చేసింది వై.యెస్ ప్రభుత్వం. అన్నిటి నిర్మాణం తర్వత ఒక కోటి ఎకరాలకి సాగునీరు అందేది. వ్యవసాయం మీదే ఆధరపడే మనకి ఇది ఎంత మేలో మాటల్లో చెప్పలేము. మన దేశం లో గుజరాత్ తర్వత ఇంతగా నీటి మీద వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ చూపింది ఈ ప్రభుత్వమే. అందుకే నాకు వై.యెస్ అంటే అభిమానం. మన నాయకుల మీద మనకి ఎంత అపనమ్మకం అంటే వాడు ఎంత తిన్న పర్లేదు కొంచం ప్రజలకి చేస్తే చాలు అని అనుకుంటాం. అందులో ఇంకొంచం ఎక్కువగా ప్రజల సమస్యలని పట్టించుకుంటే దేవుడు అనేస్తాం. వై.యెస్, ఎన్.టీ.ఆర్, జలగం, బూర్గుల, ప్రకాశం పంతులు .. ఈ కోవకి చెందిన వారు.

వై.యెస్ హఠాన్మరణం తో ఆంధ్ర చరిత్రలో ఓ గొప్ప ఘట్టం ముగిసింది. ఇప్పుడు అతడి పేరు చెప్పుకొని బ్రతికే ఘట్టం ఆరభం ఔతుంది. మనం పేరుకిమాత్రం democracy పనితీరు మాత్రం feudalistic అని చెప్పేదానికి గత రెండు మూడు రోజుల్లో టి.వీ చూస్తే చాలు. శరత్ అన్నట్టు YS est mort, vive YS!. అసలు జగన్ అనేవాడు ఎవరు? ముఖ్యమంత్రి కి కావల్సింది ఎక్స్ పీరియన్స్. అది అతనికి అసలు ఉందా? సాక్షి పెట్టకమునుపు అతనెవరో కూడా చాలా మందికి తెలీదు. పైగా సత్యం అవకతవకల్లో అతనికీ భాగం ఉందని అప్పట్లో అన్ని పత్రికలు, చానల్లు రాసాయి / చెప్పాయి. ఇప్పుడు అవేమి గుర్తుకు రావే!! ఇందిరాని చంపేసారని రాజీవ్ కి పట్టం కట్టారు. 410+ సీట్లోచ్చిన కాంగ్రెస్ని ఐదేళ్ళల్లో 200 కంటే తక్కువచి తెచ్చేసాడు. యే పనికైన ఎక్స్పీరియన్సె అవసరం. అంటే జూనియర్ పోస్ట్లకి కాదు.. అవి నేర్చుకునేదానికే ఉంటాయి. కాని పెద్ద పోస్ట్లకి వెళ్ళేటప్పుడు ఆ పోస్ట్ కి తగ్గ బుద్ధి విగ్ఞానం తోబాటు మనకి ఉన్న అనుభవాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటారు. కేవలం రాజకీయాల్లో సినిమాళ్ళో ఇదెందుకో వర్తించదు.

ఏమైన అంటే మా రక్తం లో నటన ఉందనో రాజకీయం ఉందనో అంటారు. అదెలా? సినిమాలూ వేరే విషయం అనుకోండి. ఒక గొప్ప నటుడి కొడుకు (ఫార్ దట్ మాటర్ కూతురు) సర్రిగ నటించకపోతే దేశానికి ఒచ్చే నష్టం ఏమీ లేదు. ఓ రెండు మూడు సినిమాలు తర్వత వాడ్ని అసలు ఎవ్వరు చూడరు. దానితో ఎవ్వరికి నష్టం లేదు. కాని రజకీయం ఇత్యాది వాటిల్లో అల జరగకూడదు. ఉదాహరణకి - ఒక గొప్ప వైద్యుడు ఉన్నడనుకుందాం. అతడు ఎన్నో యేళ్ళగా కృషి చేసి వైద్య తప్పస్సు చేసి మంచి హస్తవాసి ఉన్నవాడిలా పేరు సంపాదించడనుకోండి. అతడు పాపం ఒక రోజు ఆపరేషన్ చేస్తు మధ్యలో పోయాడనుకోండి అప్పుడు వెంఠనే జెస్ట్ అప్పుడే ఎంసెట్ రాసిన అతడి పిల్లడ్ని పిలిచి మిగితా ఆపరేషన్ పూర్తిచేయమని అంటారా? సపోస్ వాళ్ళ నాన్న కార్డియాలగిస్ట్ అయ్యిఉంటే ఇతడు ఆర్థోపెడిస్ట్ ఐనా కూడా లేదు లేదు వాళ్ళ నాన్న గొప్ప గుండె డాక్టర్ కాబట్టి ఇతడి రక్తం లో గుండెకోయడం వచ్చింటది అందుకే ఇతడే గుండె ఆపరేషన్ చేయాలి అని పట్టుబడతారా?

చెప్పోచేదేంటంటే ఇప్పటికైన ఈ వారస్త్వపు ఆలోచనలు మానేయాలి. ముకేష్ అంబానిని కూడా డైరెక్ట్ గా ఎం.డి చేయలేదు ధీరుభాయి. అతడికి మొదట్లో చిన్న చితక పనులు ఇచ్చి అది చేసాకే ప్రమోషన్ ఇచ్చాడు. కుమారమంగళం కథ కూడా అదే. సురేష్ బాబు కథ కూడా అదే. నటవారసుల సంగతి నాకు తెలీదు కాని మిగితావాటిలో వారసత్వం.. i am not that sure.

Read more...

Saturday, August 22, 2009

విశ్వ దర్శిని - sports edition

ఉసేన్ బోల్ట్ strikes again
Lightning Bolt గురించి దేవుడెరుగు ఉసేన్ బోల్ట్ గురించి ప్రపంచం అంతా చెప్తారు. పోయినేడు చైనా లో జరిగిన ఒలంపిక్స్ 100, 200 మీటర్ల పరుగు పందాళ్ళో ప్రపంచాన్ని ఆహ్లాదపరచి ప్రత్యర్థులని భయపెట్టి రెండు ప్రపంచ రికార్డ్లని స్థాపించాడు. 100 మీ పరుగులో 80 తర్వత కొంచం మెళ్ళాగా అయిపోయీ అప్పుడే celebrations మొదలెట్టాడంటే ఆలోచించండి ఎంత వేగంగా పరిగెడుతున్నాడో అని. అప్పుడు నెలకొలిపిన రికార్డు 9.69 సెకన్లు. గతవారం జెర్మనీ లో జరిగిన పరుపుపోటీళ్ళో మళ్ళీ తర రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకొని ఈ సారి 9.58 సె లో 100 మీ పరిగెత్తాడు. 100 meters in 9.58 secs!!!! ఒక కాలం లో 100 మీ లని 10 సే లో పరిగెట్టడం గొప్పగా ఉండేది. ఇప్పుడు ఈ 22 యేళ్ళ కుర్రాడు ఇంకొన్ని యేళ్ళవరకు ఎవ్వరికి అందకుండా పరిగెత్తి ఆ రికార్డ్లని దాచేటట్టు ఉన్నాడు. పనిలో పనిగా 200 మీ లని 19.19 సె లో ఛేదిచ్చేసాడు. ఆ రెండు పరుగుల వీడియోలు ఇక్కడ:





Where is Tiger?
ఈ ప్రశ్న నాతోబాటే ప్రపంచంలో చాలామంది అడిగింటారు. అసలు PGA ఆడుతున్నది టైగర్ వుడ్సేనా ఇంకెవరైన నా అని. ఐదో సారి గెలిచేటందుకు అన్ని సెట్ చేసుకొని ఉన్న టైగర్, చివరి రోజున యాంగ్ ధాటికి తట్టుకోలేకపోయారు. ఇప్పటివరకు మేజర్స్ లో అంటే ఎనిమిది సార్లు టైగర్ చివరి రోజున ఆధిక్యం లో ఉంటే ఎప్పుడు ఓడిపోలేదు. ఈ సారి కూడా అంతేనేమో అని అందరు ఊహించారు. టైగర్ మీద నమ్మకమో యాంగ్ అంటే "ఎవరు?" అన్న ధైర్యమో తెలీదు కాని ఒక ఐరిష్ బుకీ మాత్రం ఆదివారం ముగిసే PGA tournament కి శుక్రవారం, టైగర్ 4 షాట్ల ఆధిక్యం లో ఉండగా, టైగర్ మీద పందెం కాసిన వాళ్ళందరికి డబ్బులు ఇచ్చేసారు. ఆదివరం అది ఉల్టా అయ్యింది.. దెబ్బకి ఓ $2.12 మిల్లియన్లు నష్టం కోరితెచ్చుకున్నారు. ఆత్రమో ఆవేశమో ఓ ఐదు నిమిషాలు.. ఇక్కడ ఓ రోజు.. ఓపిక పట్టుకోవాలి అని ఊరికే కాదు అనేది. యాంగ్ టైగర్ ని ఓడించడం ఇది రేండో సారి. 2006 HSBC tournament లో ఒక్కసారి ఇంతకముందే ఓడించాడు. ఈ PGA గెలుపువళ్ళ మేజర్ గెలుచుకున్న మొట్టమొదటి ఏషియన్ గా చరిత్ర పుట్టాళ్ళో తన స్థానాన్ని చేజిక్కిచ్చుకున్నాడు.

యేయ్ యేయ్ ఇంగ్లండ్.
మన దేశాన్ని దోచుకొని ఇన్నేసి కలతల్ని రేపి విభజించి భ్రష్టుపట్టించి మన దారిద్ర్యానికి కారకులైన ఇంగ్లాండ్ ని నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. ఒక్క బుడిదలో తప్ప.. అదే అదే ఆషెస్ లో తప్ప. ఇంగ్లాండ్ మీద కోపం కంటే ఆసీస్ అంటే చిరాకు ఎక్కువ. చిరాకు చాలా చిన్న పదమేమో. కంపరం apt. అందుకని ఆసీస్ ని ఎవ్వరు ఓడించిన ఒక్క పాకిస్తాన్ తప్ప వాళ్ళకి నేను అభిమానిని. తప్పుబట్టకండి .. స్టీవ్ వా ఉన్నప్పుడు కొంచం బాగుండేది వాళ్ళ బిహేవియర్. ఈ పంటర్ చేత్లో వచ్చాక అదేదో god given right గా అతిగా చాలా చేసాడు. ఈ సారి ఓడిపోతే పీకేస్తారు పంటర్ ని. హమ్మయ్య ఈ పీడ విరగడైద్ది. షేన్ వార్న్, గ్లెన్ మెక్ గ్రాత్, గిల్లి గట్ర ఉన్నప్పుడు నిజంగానే ఆసీస్ రాజుల్లా ఉండేవారు. ఇప్పుడు world XI లో చోటు సంపాదిచ్చుకునే ప్లేయరే లేడు. కాని పంటర్ పొగరు మాత్రం అలనే ఉంది. ఈ దెబ్బతో అతడి క్యాప్టన్సీ పొగరు రెండు హూష్ కాకి ఔతాయేమో అని చిన్ని చిన్ని ఆశ..

బ్రేడి ఈజ్ బ్యాక్ ..so is Favre.
2001 లో నేను ఇక్కడికి వచ్చాను. అప్పటి దాక రోజంత క్రికెట్ చూస్తూ ఆనందంగా ఉండే నా జీవితం సడన్ గా ఏమీ లేకుండా అయిపోయింది. ఇప్పుడెలా అనుకుంటూ ఉండగా MLB, NBA చూడ్డం మొదలెట్టాను. కొద్ది రోజులు చూసాకా నాకు పరమ బోరింగ్ గా అనిపించింది. ఇలా ఐతే నాకు పిచ్చి ఎక్కుతుంది అని అనిపించేది. అప్పుడు చూసా NFL. అర్థం చేసుకునేదానికి ఓ సీజన్ పట్టింది కాని నాకు భలే నచ్చింది. అసలు క్రికెట్ కి మన ఊర్లో ఉన్నంత అభిమానం ఈ క్రీడకి ఉండడం అన్నింటికన్న నన్ను ఆకట్టుకున్న విషయం. దానికి తోడు MLB NBA లా కాకుండా ఒక్క రోజు.. ఒక్క గేం లో తేలిపోద్ది.. అది ఇంకా నచ్చింది నాకు. ఈ గేం ని అర్థం చేసుకునేదానికి నేను ఫాలో అయినా టీం పేట్రియట్స్. 2001 సూపర్ బోల్ గెలుచుకున్న టీం. అప్పటి నుండి నాకు పేట్రియట్స్ అన్నా టాం బ్రేడి అన్న అభిమానం. 2008 లో ఏడే ఏడు నిమిషాలు ఆడాడు. మళ్ళా ఆడగలడొ లేదో అని అనుమానం వచ్చింది. కాని ఈ యేడు ప్రీ సీజన్ గేం లో ఆడి న్యూ ఇంగ్లాండ్ వాళ్ళందరికి పేట్ర్యియాట్స్ ఫ్యాన్స్ కి ఊరట కలిగించాడు. హమ్మయ్య.

అలనే నేను ఒక్కప్పుడు అభిమానించే ఇంకో QB బ్రెట్ ఫావ్ర్. గ్రీన్ బే కి ఆడినన్ని రోజులు బాగుండేవాడు.. ఇప్పుడు సంవత్సరానికి ఓ రెండు సార్లు రిటైర్ అయ్యి ఒక వేరే వేరే టీం లో చేరి తన అభిమానులని దూరం చేసుకుంటున్నాడు. బహూసా ఈ జన్మ లో రిటైర్ అయ్యి Hall of Fame కి వెళ్తే చాలా మంది మర్చిపోతారేమో. కాని అసలు ఆ మనిషి రిటైర్ ఔతాడా అన్నది కోటి రూపాయల ప్రశ్న.

Read more...

Friday, August 14, 2009

కమీనే - My Experience

ఒక మనిషి పనిని చూసి మరో మనిషి అదే విధంగా చేయడం మానవ నైజం. మానవులదే కాదు ప్రతి జంతువు కి అది సహజం. ప్రతి మనిషి తనని తాను మలుచుకుంటూ ఉంటాడు. అది నిత్య ప్రక్రియ. అలా మలుచుకునేదానికి దోహదపడేవి అతడి చుట్టు ఉన్న సమాజం.. చుట్టు ఉన్న మనుషులు వారి గుణాలు. ఇంకొకరి లో నచ్చినవి మనం మనలో నిబిడీకృతించే ప్రయత్నం చేస్తాం. అలానే ఇంకొకరి లో నచ్చనివి మనలో లేకుండా.. రాకుండా జాగ్రతపడతాం.ఇవేవి తప్పు గా అనిపించవు.. తప్పు కావు కూడా. ఒక మనిషి మలిచిన ఒక వస్తువుని చూసి అది మనకి నచ్చి మళ్ళా అది మనం వాడితే లేకుంటే దాన్ని ప్రస్తావిస్తే అది కాపి కొట్టినట్టు కంటే ఆ మనిషికి అర్పిస్తున్న నివాళి లా భావించాలి. ఎవరో అన్నట్టు originality is overrated అది వాస్తవం కాకపోయినా పాయింట్ ఏంటంటే an inspiration can be as good, if not better, than the original. nothing wrong with that.ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నా అంటే..

ఇందాకే కమీనే చూసి వచ్చా. భారతీయ సినిమాళ్ళో ఓ his-pearl (ఆణిముత్యం) అని అనడం లేదు కాని భారతీయ చిత్రాలని ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళే చిత్రం అని ఖండితంగా చెప్పగళను. ఒక్క మెట్టేం ఖర్మా ఓ పది మెట్లు పైకి లాగుతుంది అని నమ్మకం. కొంచం విశ్లేషన అవసరం. రాం గోపాల్ వర్మా రాక ముందు తెలుగు సినిమాలు అలానే హింది సినిమాలు నాటకరంగానికి వారసుల్లానే ఉండేవి. అంటే కెమెరా యాంగల్ మారే సంధర్బాలు చాలా అరుదుగా ఉండేవి. సినిమా అంటే నాటకాన్ని రెకార్డ్ చేసి రోజు చూపించే దానిలా భావించేవాళ్ళు. కావాలంటే చూడండి. శివ ముందు వరకు (అంటే తర్వత ఈ రోజు వరకు కూడా ఇది వర్తిస్తుంది..) ప్రతి సీన్ కి ఓ ఫ్రేం లో బంధించేవారు. నటీనటులు ఆ ఫ్రేం లో లేకుంటే వారి మాటలు వినపడేవి కావు. అలనే ప్రతి ఒక్కరు ఆ ఫ్రేం లో వచ్చే వరకు మాట్లాడేవారు కాదు. కెమెరా ఎక్కువగా జరిగేది కాదు.. సినిమా మొత్తం అలా ఓ ఫ్రేం లోనే ఉండేది. (దీనికి ఉదాహరణ కె.రాఘవేంద్ర రావ్, బీ.ఏ చిత్రాలు చూడండి) మామూలుగా మనం నిజ జీవితం లో యే విషయాన్నైనా ఓ కోణం నుండి చూస్తాం... అలనే ఆ విషయాన్ని మరోకడ్డూ ఇంకో కోణం నుండి చూస్తాడు. కాని ఇది సినెమాలో కనిపించేది కాదు. ప్రేక్షకులు అందరు తెర ముందు ఓ నాటిక చూస్తున్నారు అనే భావన తోనే సినిమాలు తీసేవారు.

ఈ పద్ధతి కి విరుద్ధంగా వెళ్ళిన వ్యక్తి రాం గోపాల్ వర్మా. అంతక పూర్వం (నాకున్న చిత్ర పరిజ్ఞానం ప్రకారం) ప్రయత్నించింది గురు దత్త్. కాని అతడూ వర్మ అంత పేరు పొందలేదు.. వర్మ చేసినన్ని experiments చేయలేదు. "కంపని" చూస్తే మీకే అర్థం ఔతుంది నేను ఏం చెప్పెప్రయత్నం చేస్తున్నానో అని. "ఖల్లాస్ " పాట లో ఈషా అదేదో వీధి నాటకాల్లో లా అగుపించదు... తన చుట్టూ కెమెరా తిరుగుతూ ఉంటది. ఆ కెమెరా కదలికల్లో ఆ బార్ లో జరిగే వేరే విషయాలు కూడా కనిపిస్తాయి.. కాని వాటి మీద ఎక్కువగ concentration ఉండవు. నన్నడిగితే కేవలం కెమెరా యాంగెల్స్ కోసం కంపని నీ ఓ textbook గా తీసుకోవచ్చు. అలనే ఇప్పుడు ఈ కమీనే ని.

Quentin Tarantino పేరు వినే ఉంటారు చాలా మంది. pulp fiction, reservoir dogs, kill bill చిత్ర దర్శకుడు. అతడి యాంగెల్స్ అన్ని చాలా చాలా చాలా వరైటీ గా ఉంటాయి. ఒక సీన్ ని ఇలా చూపిస్తే బాగుంటది అని మనం అనుకుంటే అదే సీన్ ని మరో కోణం నుండీ చూపించి "ఇప్పుడేమంటావ్" అని మన ఆలోచనని ఎగతాలి చేయగల సత్తా ఉన్న దర్శకుడు. non linear కథానువాదం (screenplay) కింగ్. చూసే ప్రేక్షకుల ఐ.క్యూ ని కించపరచడు. మన వర్మ (కొన్ని) చిత్రాల్లా.విడమర్చి ఏదీ చెప్పరు అలా అని అర్థం కానివ్వకుండా ఏదీ వదలరు.

ఈ కమీనేయ్ కూడా అంతే. ఎక్కడ అంటే యే ఒక్క సీన్ ని విడమర్చి పూసగుచ్చినట్టు చెప్పె ప్రయత్నం చేయలేదు విషాల్ భరద్వాజ్. అర్థం కాకుంటే నీ ఖర్మా లా అనిపిస్తుంది.. అలా అని అర్థం కానిది ఏమీ ఉండదు. కాని మెదడుకి మేత మాత్రం ఉంటుంది. మన టైం వృధా చేయకూడదు అన్నట్టు ప్రతి సీన్ ని కుదించినట్టు ఉంటూంది. కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం ఉండదు.. అంటే మనమే అర్థం చేసుకోవాలన్నమాట. ఇలాంటివి మన దేశి సినిమాల్లో చాలా అరుదు. మొత్తం సినెమా తొందర తొందర లో ఉన్నట్టు అనిపిస్తుంది. కాని ఇలా linear సినిమాలోకి nonlinear element తేవాలంటే ఆ మాత్రం తప్పదు కద. అలా సీన్ సీన్ కి ఉన్న 4-5 కమెరా యాంగెల్స్ లోనుండి ఎన్నుకొని సినెమా ఫ్లో ని వారించకుండా చేయడం చాలా కష్టమైన పని. editing చేసిన శ్రీకర్ ప్రసాద్ కి జోహార్లు.

ధన్ తనా అన్నా వెనక వచ్చే శబ్ధాలైనా ప్రతి సీన్ లో అంతలా జాగ్రత్తపడిన విషాల్ ని మెచ్చుకోకుండా ఉండలేకున్నా. every single scene every single sound every single dialogue every single expression has been carefully thought about. every single one has been made to "act". Hats off to him. నీతిబోధనలు ప్రేమ కథలు కామెడి ట్రాక్ త్యాగాలు సావుడబ్బు బ్యాక్ గ్రౌండ్ అదే అదే అదే ఎక్స్ ప్రెషన్స్ కోరేవారు దీన్ని చూడకండి. చరిత్ర పాఠాలు కోరేవారు కూడా చూడకండి. రాజశ్రీ సినిమాలే నచ్చేవాల్లు చూడకండి. మీకు అర్థం కాకపోవచ్చు. అది మీ తప్పు కాదు.. ప్రతి విషయాన్ని ఒలిచి చేతికి ఇచ్చి ఇన్నేళ్ళూ తినిపించ ఆ దర్శకుల తప్పు. People who want an exhilarated experience, people who "get" Quentin and RGV, people who "think" thru their movies, people who dont want the movie to question their intelligence - get your expectations to zero and let Vishal unfold Kaminey for you.

గమనిక: రివ్యూ అని కథ రాయలేదేంట్రా అనుకుంటున్నారా? fullhyd.com కి వెళ్ళినా, bollywoodhungama.com కి వెళ్ళినా, rediff.com కి వెళ్ళినా మీకు రివ్యూలు దొరుకుతాయి. నాకు సినిమాలో నచ్చినదాని గురించి ఇక్కడ రాశా. సినిమా చూసొచ్చి చస్ నువ్వు చెప్పినట్టూ లేదు అంటే అది కూడా నా తప్పు కాదు. every film is a personal experience "వాడి IQ కొంచం ఎక్కువా" అని సరిపెట్టుకోండి అంతే. ;-)

Read more...

Wednesday, August 12, 2009

సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.


ఈ రోజు కృష్ణాష్టమి. ఆ యోగేశ్వరున్ని కొంచం సేపు మన ఆలోచనల్లో బంధిద్దాం. చిలిపి చేష్టలు చేసినా గీతని భోదించినా విశ్వరూపాన్ని ప్రదర్శించినా అది ఆ కృష్ణపరమాత్మునికే చెల్లు. యుగపురుషులు రాబోయే యుగానికి నిదర్శనంగా ఉంటారని ఎక్కడో చదివినట్టు గుర్తు. అంటే కృష్ణావతారం ద్వాపరం చివర్లో వస్తుంది. ఆ అవతారం ముగిసినవెంట్టనే ద్వాపరం ముగిసి కలి మొదలైంది అని మన నమ్మకం. అంటే కృష్ణావతారం లో బోధించిన భగవత్ గీత ఆ యుగానికంటే మన కలికే ఎక్కువగా వర్తిస్తుంది. సత్య, త్రేత తో పోలిస్తే ద్వాపరం లో ఈర్షలు, కుట్రలు, రాజకీయాం గట్ర కలి కంటే కొంచం తక్కువగా ఉన్నయనే చెప్పాలి. అలాంటి యుగానికి కృష్ణావతారం తగునైంది అని చెప్పడం లో ఎటువంటి అనునామం లేదు.

జగమంత కుటుమబైనా ఏకాకిగానే జీవించాడు. ఎవ్వరిని నొప్పించలేదు. అందరికి అందుబాటులోనే నిలచాడు. యుద్ధం తథ్యం అని తెలిసినా నివారించేదానికి ఓ ప్రయత్నం కూడా చేసాడు .సకల వేదాల సారామైన గీతని యుద్ధభూమి మీద ప్రబోధించాడు. ఆ ఒక్క అవతారం లోనే "నేనే భవగంతుడని.." అని చెప్పాడు. దశావతారాల్లో అన్నింటికంటే మోస్ట్ పవర్ఫుల్ అవతారం కృష్ణుడే అని చెప్పచ్చు. అంటే మనుషులకి అన్ని యుగాలు పట్టిందనుకోవాలా.. ఆ పరమేశ్వరుడ్ని అర్థం చేసుకునేదానికి? అంతకముందు యే అవతారం లోను తన విశ్వరూపం చూపలేదు. తర్వత యే అవతారం లోను అవసరం పడలేదు.

ఏ విషయం మారదో అదే సత్యం అని అంటారని మా గురువుగారు చెప్పారు. అలానే ఎవరైతే మారరో.. స్థితప్రజ్ఞులుగా ఉంటారో వారే అచ్యుతులని అంటే భగవంతుడని చెప్పారు. గీతలో శ్రీ కృష్ణుడు అదే అంటాడు తానే సత్యాన్ని అని. అంటే తానే ఆ పరమపురుషుడని. తానే తత్వదర్శి అని. తానే జ్ఞానాన్ని అని. ఆ యోగేశ్వరుడ్ని ఆ జ్ఞానేశ్వరుడ్ని ఆ కృష్ణపరమాత్ముడ్ని తలచుకుంటూ కొన్ని పాటలు / సంకీర్తనలు.








శ్రావణుడు అన్నమయ్య సంకీర్తనలకు తద్వారా తెలుగు కి చేస్తున్న ఎనలేని కృషికి సత సహస్ర వందనాలు. అన్నమయ్య కృష్ణునుని మీద రచించిన అరుదైన సంకీర్తనలు ఇక్కడ వినచు.

అందరికి గోకులాష్టమి శుభాకాంక్షలు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!

Read more...

మేరా నంబర్ కబ్ ఆయేగా ??

ఎనిమిదేళ్ళు. eight long years ఆఠ్ సాల్.. భాష మారినా భావం ఒక్కటే. సంవత్సరాలు గడచినా బాధ ఒక్కటే. ఈ రోజుకి నేను నా స్వర్గం వదిలి ఎనిమిదేళ్ళయ్యింది. నా స్వగ్రామం నా స్వనగరం నా ఊరు.. నా హైదరాబాదు. దాన్ని విడిచి ఇన్నేళ్ళైనా హైదరాబాదు ఎంతగా మారినా సొంతం అనేపాటికి అదో ఆత్మబంధం. నా ప్రపంచం ని రెండుగా విభజించచ్చు. ఒకటి హైదరాబాదు ఇంకోటి నాన్-హైదరాబాద్ (non-hyderabad).

ఎనిమిదేళ్ళా క్రితం రింగులు రింగులు తిప్పితే.. హిల్టన్ లో కూర్చొని దం చాయి తాగుతూ అప్పుడప్పుడు వర్షం పడితే వేడి వేడి పకోడి తింటూ.. రోజూకి ఎక్కువకాదు మామూల్గా ఓ పదో పాతికో వందో పానీ పూరీలు తింటూ ఉండినాను. నలుగురితో నారాయణా అని అందరు రాస్తున్నారు కద అని నేను రాసా జి.ఆర్.యీ నా అద్రుష్టం పండి మధ్యలో విసొగొచ్చి త్వర త్వరగా అవ్వగొట్టేసా .. న్యాచురల్ గానే ఎదో మామూల్ స్కోర్ వచ్చింది. యాహూ అనుకొని గెంతుకుంటూ బయటకి వచ్చా.. ఈ స్కోర్ కి ఎవడిస్తాడు లే అని.. నేను అల తలిస్తే, నన్నే కాపీ కొడతావా అని పైనున్న విధాత మరోలా నిర్ణయించాడు. సీన్ కట్ చేస్తే యడ్మిషన్ వచ్చింది. సరేలే.. వీసా వస్తదా పెడ్తదా అనుకునొని దగ్గర్లో ఉన్న డ్రాప్ బాక్స్ (ఇది ఆ కాలం మాటాలు. గుర్తుందో లేదో చాలా మందికి, ఆ యేడే కొత్తగా drop box పెట్టారు స్టూడెంట్ వీసా కి. అదే యేడు తీసేసారు 9/11 తర్వాత. అది వేరే విషయం) లో పడేసా.. మందు కొట్టాడో ఏమో నాకు ఇచ్చేసారు వీసా. ఆ రోజే అనుకున్న.. శశి అయిపోయింది రా నీ హ్యాప్పీ డేస్ అని..

ఎనిమిదేళ్ళు గడిచాయి ఇక్కడికి వచ్చి. నా జీవితం ఏంట్రా అని వెనక్కి తిరిగి చూస్తే పాని పూరి కోసం వేవిళ్ళూ తప్ప ఏమీ కనిపించడం లేదు. కొంచం కళ్ళాజొడు సరి చేసుకొని చూస్తే .. చకోర పక్షి లా .. హిటొస్తుంది అని వేచి చూస్తున్న సాయి కిరణ్ లా.. కామెడి పండిస్తా అని అనుకుంటున్న బాలయ్య లా దేశానికి తిరిగివెళ్ళిపోవాల్లన్నా ఆశ తప్ప ఏమీ లేదు. నా స్నేహితులు కొంత మంది ఇప్పటికే తిరుగు టపా కట్టేసారు. ఇంకొంతమంది అదే పని లో ఉన్నారు. నేను ఇంకా "మేరా నంబర్ కబ్ ఆయేగా " అని వేచి చూస్తున్నా. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది.. అంత కంటే ఏం చేయలేము. ఎనిమిదేళ్ళల్లో ఈ దేశం లోని 30 రాష్ట్రాలు చూసాను. దిక్కు మొక్కు లేని డకోటా ప్రాంతం తప్ప బానే కవర్ చేసా.

ఎంచక్క ఇంటి దగ్గర సాయంత్రం 5 కి ఓ రెండు రూపాయలు ఇస్తే అరకిలో వేడి వేడి జిలేబిలు - తోచినప్పుడు పానీ పూరీలు , ఓస్మానియా బిస్కెట్ తో బాటు దం చాయిలు, బావర్చి బిర్యానీ, 113M, 156H, 3 నంబర్ బస్సు, ఆదివారం ఆబిడ్స్ లో పాత పుస్తకాలు, గల్లీ ఓ పది వినాయకులు.. అక్కడ దొరికే ప్రసాదాలు, నిమ్మజ్జనం గలాటాలు, హోళీ రంగులు, సంక్రాంతి పతంగుల ఢీల్ - లడీ - పేంచులు, దీపావళి పటాసులు, బోణాల జాతరలు, హలీములు, అలెక్స్ కిచన్ లో 'american chopsueyలు, గురువారం బాబా గుడిలో భజనలు, నీల్గిరి లో ... లు, RTC X Roads లో లెక్కకుమించిన సినిమాలు, పారడైస్ సాఫ్టీ డెన్ లో ఐస్ క్రీంలు.. లాంటివి ఎంజాయి చేయడం మానేసి ఇక్కడెక్కాడో.. ఇలా.. ప్చ్..

నా ప్రశ్నకి వరుణ్ విశ్వరూపం:

శశి:
ఇక చాలు అమెరికా. ఇక చాలు. ఇంత దాకా నేను కోల్పోయింది చాలు.

వరుణ్:
ఏం కోల్పోయావ్ శశీ?

శశి:
ఇంకా అర్థం కాలేదా నీకు...? యెనిమిదేళ్ళ క్రితం నా దగ్గర యేముండేదో, ఇప్పుడేం లేదో ..అదే కోల్పోయాను.. ఆనందం.. చిన్న చిన్న విషయలకు ఉండే ఆనందం..ఈ అమెరికా ఎప్పుడూ నాకు గొప్ప జీవితాన్ని ఇస్తున్నట్టే ఫీల్ ఔతుంది. కానీ నాకేం కావాలో అర్థం చేసుకోదు.

వరుణ్:
శశీ, నీకు ఎప్పుడు అమెరికా లో ఏం చాన్స్ వచ్చినా అది నీ జీవితాన్ని వేయి రకాలు గా బాగు పరిచేది గా ఉంటుంది కదా.

శశి:
ఔను.. వేయి రకాలుగా బాగు పడే అవకాశం ఉంటుంది. కానీ ఒక్క సారి నాకు ఏం కావాలి అని ఆలోచించదు. అడిగిందాని కన్నా ఎక్కువ ఇవ్వడం లో ఉన్న సాటిస్ఫాక్షన్ అమెరికా కు తెలుసు.. కానీ కోరుకొన్నది దొరక్క పోవడం లో ఉండే బాధ అమెరికా కు తెలీదు.. నాకు తెల్సు..అస్సలు ఎవరైనా నన్ను అడిగితే కదా తెలిసేది నాకు ఏది కావాలో ఏది ఒద్దో..! ఎదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఆలోచిస్తారు.. నన్ను అడగండి వరుణ్.. నా కళ్ళళ్ళో చూసి అడగండి వరుణ్.

వరుణ్:
ఎంటి శశీ, అప్పుడే అమెరికా వెళ్ళే ముందే అడిగాం కదా శశీ నీకు ఇష్టమా లేదా అని..

శశి:
అడిగారు, కానీ నేను చెప్పేది వినరు.. ఆశలు చూపిస్తారు..జీ ఆర్ యీ వ్రాయమంటారు..

నాకు జీ ఆర్ యీ స్కోరు రాకూడదు అని నేను అనుకొన్నా. తీరా చూస్తే వచ్చింది.. నాకెలా ఉండిందంటే, ఆ స్కోరు కార్డ్ చించేసి నేను అమెరికా కు వెళ్ళనూ అని అరవాలనిపించేది.. వీసా వచ్చినప్పుడు కదా అని అప్ప్లై చెయ్యమన్నావ్. నేను చేసాను. కానీ ఇలా అప్ప్లై చెయ్యగానే అలా పోస్ట్ లో వీసా పంపిచేసారు.. ఏడుపొచ్చింది వరుణ్ అప్పుడు నాకు.. ఏడుపొచ్చింది... ! ఒరే శశీ వెళ్ళరా చదివేసుకొని మళ్ళీ వచ్చేయచ్చు అని చెప్పారు. నేనేదో... చదివేసి వెళదాం అనుకొన్నా.. కానీ ఈ అమెరికా ఏమో, నాకు ఉద్యోగమొచ్చేంత చదువు చెప్పింది... నా ఉద్యోగం కూడా అమెరికాయే ఇప్పిస్తే.. నేనెందుకు వరుణ్, ఇండియా వెళతాను..? చివరికి వెనక్కు వెళ్ళాలన్నా, కుదరని పరిస్థితి కల్పిస్తే.. వెళ్ళ బుద్ది కావడం లేదు వరుణ్..

మీకెవరికీ తెలీదు.. ఇలా అమెరికా లో ఉండలేకా, ఇండియా వెళ్ళలేక నేను నరకం చూసాను వరుణ్, నరకం చూసాను. కోపం, ఫ్రస్ట్రేషన్.. ఎవరి మీద చూపించాలో కూడా తెలీక ఒక రోజు బుడుగు మీద కూడా అరిచేసాను. దాంతో తను వేరే బ్లాగ్ పెట్టుకొన్నాడు. నేను ఎందుకు అలా అరిచానో బుడుగుకే అర్థం కాక పోతే..ఇక మిగిలిన వాళ్ళకు ఎం తెలుస్తుంది వరుణ్..? ఇక్కడకొచ్చేప్పుడు.. నేను ఇండియా లో చెప్పాను. రెండేళ్ళలో మళ్ళి వచ్చేస్తాను అని.. కానీ ఇప్పుడు చెపుతున్నా.. రెండేళ్ళూ కాదు కదా, మరో పదేళ్ళయినా వెళ్ళలేనని.. ఇప్పటి దాకా మీరంతా గెలిచారని సంబరపడుతున్నారు కదా.. కానీ మిమ్మల్ని గెలిపించడానికి యెనిమిదేళ్ళుగా నేను ఓడి పోతూనే ఉన్నాను వరుణ్...ఇలాగే ఓడిపోతుంటే.. ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకొంటే.. నా జీవితమంతా అమెరికా యే ఉంటుంది.. అందులో ఇండియా ఉండదు. దయచేసి నాకు నచ్చని దేశాన్ని ఇచ్చి నన్ను ఆనందంగా ఉండమనొద్దు వరుణ్..!

వరుణ్: ఇంత కాలం నువ్వు అమెరికా లో ఆనందంగా ఉన్నావ్ అనుకొన్నా గానీ శశీ, నీ ఆనందాన్ని తీసుకొని మేము సంబర పడ్డమని తెలీదు. తెలీదు శశీ.. ! నాకు అమెరికా లో కంపెనీ కి సి.యి.ఓ గా వచ్చినా ఆనంద పడలేదు కానీ, నీకు అమెరికా లో సీట్ వస్తె రోజంతా పది మందికి చెప్పి ఆనందపడ్డాం.. కానీ మా ఆ ఆనండం కోసం నిన్ను బాధ పెడుతున్నా అని ఎప్పుడూ అనుకోలేదు శశీ.. సారీ రా నాన్నా..! వెంటనే ఇండియా కు వచ్చేసెయ్..

శశి:
థాంక్స్ వరుణ్. మరో రెండేళ్ళాగి వస్తా...!

Read more...

Monday, August 10, 2009

పరీక్షలే లేకుంటే..

ప్రతి ఒక్కరి జీవితం లో అసలు మరిచిపోలేని మరపురాని రోజులు ఏంటా అని తిరిగిచూస్తే సగానికి సగం పరీక్షలు రాసిన రోజులే అయ్యింటాయేమో. పదవ తరగతి పరీక్షలు మొదలైన రోజు.. మొదలైయ్యే ముందు రోజు పొట్టలో పోటి పడ్డ పక్షులు గుర్తొస్తాయి. మాకు అంటే cbse ఉద్దరించిన వాళ్ళకి పదవ తరగతే మొదటి సారి పబ్లిక్ పరీక్షలు. జీవితం లో మొట్ట మొదటి సారి హాల్ కి వెళ్ళి పరీక్ష రాయడం అంటే అదేదో గొప్ప అనుభూతి. అంత మందితో పోటి పడ్డం పక్కన.. అసలు నెగ్గుతామా లేదో తెలీని పరిస్థితి. రాస్తున్నప్పుడు అల్ల నన్ను ఎవరైన చూస్తున్నరేమో డిబార్ చెస్తారేమో అని పిచ్చి టెన్షన్. కాని అల ఏమి జరలఏదు. అది వేరే విషయం. తర్వాత తర్వాత అన్ని పబ్లిక్ పరీక్షలు కావడం తో ఇంజనీరింగ్ రేండో యేడు వచ్చేపాటికి పెద్దగా ఏమీ అనిపించేది కాదు. జెస్ట్ పాసా ఫేల్ ఆ అని తప్ప.

ఇంకొద్ది రోజుల్లో ఇలాంటి గొప్ప అనుభూతి ఉండకపోవచ్చేమో. మన విద్యాసాఖ మంత్రి కపిల్ సిబాల్ పావు పారితే ఇంక పదవ తరగతి కి పరీక్షలు ఉండకపోవచ్చు. అసలు పరీక్ష అంటే ఆ యేడు మనం ఎంత నేర్చుకున్నామో మన పుర్రెల్లో ఎంత పోయిందో ఎంత గాలికి వదిలేసామో సినిమాల చూసి ఎంత నేర్చుకున్నామో కొత్త స్టెప్పులు కొత్త కామెడి గట్ర గట్ర అని. సరే సరే సినిమా విషయం పక్కనపెడితే మిగితావి అన్ని పరీక్షిస్తారు. అలానే ఈ యేడు కొత్తగా కాపీ కొట్టే పద్దథులని కూడా పనిలో పని గా టెస్ట్ చేసుకోవచ్చు. అసలు పబ్లిక్ పరీక్షల ముందు ఓ రెండు మూడు నెలల నుండి ఇంట్లో బయట నెలకొనే ఉత్కంఠత మాటల్లో చెప్పలేము. ప్రతి ఒక్కరు దాన్ని అనుభవించింటారు. అనుభవించాలి. జీవితం అంటే ఏంటో చాలా మందికి బోధ పడే సమయం కూడా అదే అనుకుంట.

అసలుకే మోసం తేవడం లో కపిల్ సిబాల్ ఆలోచన నాకు అంతు చిక్కడం లేదు. మన పరీక్షా విధానం కొంచం తప్పే. అంటే బొరుగుల బట్టి కొట్టగలిగేవాళ్ళు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటారు .. కొంచం చదివి అర్థం చేసుకొని వాళ్ళా భాషలో రాసేవాళ్ళు కొంచం కష్టంగా మార్కులు తెచ్చుకుంటారు. ఇది ఎంత పెద్ద తప్పో లోక విధితమే! పరీక్షా విధానాన్ని సవరించాల్సింది పోయీ అసలు ఆ సంస్థనే తీసేద్దాం అనడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి నిపుణులతో చర్చించాల్సి తీసుకోవాల్సిన నిర్ణయం. స్కూల్ స్కూల్ కి విడి విడిగా పరీక్ష ఒక ఉపాయం కాని అప్పుడు స్కూల్ వాళ్ళే స్వార్థం కోసం పరీక్ష విధానాన్ని వారికి అనుకూలంగ మార్చుకోరు అని నమ్మకం ఏంటి? అసలు ఇలా జరగకూడదూ అనే కద పబ్లిక్ పరీక్ష పద్దతి ని ప్రవేశపెట్టింది. బట్టికొట్టే విధానన్ని అరికట్టాలి... అంతే కాని అసలు పరీక్షలే ఎత్తేస్తే సినిమా హాల్లు నిండడం తప్ప ఒరిగేది ఏమి ఉండదు.

ఉన్నత విద్య ని కూడా కొంచం మెరుగు పరిస్తే బాగుంటుంది. ఆంధ్ర దేశం లో మొత్తం మీద ఓ 5-6 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదే అమేరికా లో ఐతే దాదాపుగా ఓ 3000-5000 దాకా ఉన్నాయి. రెంటికి పోలికే లేదు. కొత్త పదవి జోష్ లో రెండు దశాబ్దాల నుండి ఎవ్వరు పట్టించుకోని ఉన్నత విద్య ని కపిల్ సిబల్ గారు ఎమైన చొరవ చూపి modernize చేస్తే అదే పది వేలు, పది లక్షలు. చూద్దాం. మనిషి ఆశా జీవి కద..

Read more...

Saturday, July 25, 2009

kavya's dairy - కావ్యము కాని డైరీ

కొన్ని సినిమాలు చూస్తే అంటే ఓ పది క్షణాలు చూస్తే చెప్పేయచ్చు ఎలా ఉంటాయో అని.. ఎవరో అన్నట్టు అన్నం ఉడికిందా లేదా అనేదానికి ఒక్క మెతుకు చాలు టైప్ అన్నమాట. అలా అని మొత్తం సినిమా చూడకపోతే తీసినోడు ఫీల్ ఔతాడు కద.. అందుకే మొత్తం చూస్తా నేను. సినిమా అయ్యాక పేర్లు వస్తాయి కద.. అప్పటి వరకు చూస్తా. ఇలానే మొన్నా ఓ సినిమా చూసా.. ఓ ఐదు నిమిషాలు చూసేపాటికి స్టోరీ చాలా మటుకు అర్థం అయిపోయింది.. కాని పుట్టుకతో వచ్చిన బుద్ధి కద సోఫా లో పడుకొని మిగితా చూసా.

అదే కావ్యాస్ డైరీ. ఇప్పటికి ఇలాంటివి ఓ వందో వెయ్యో వచ్చింటాయి .. సతకోటిలో ఇదోటి అంతే. పెద్దగా గుర్తుండే సన్నివేశాలు కాని డైలాగులు కాని సీన్ కాని అసలు ఏమి గుర్తుండదు ఓ రోజు తర్వత. అంత గ్రేట్ మూవీ ఇది. యే సన్నివేశం చూసినా ఇంతక మునుపే చూసిన ఫీలింగ్ కూడా ఉంటది. అది బోనస్. ఏం జరగబోతోందో అని ఇంతకముందు ఓ రెండు మూడు సినిమాలు చూసిన పెతీ ఒక్కరు చెప్పగలరు. ఇంక అసలు కథ (నాకు గుర్తున్నంత వరకు) - ఓ ఇల్లు, ఓ ఫామిలి అంటే కరెష్ట్ గా ఓ అమ్మా ఓ నాన్న ఓ చంటిది ఓ బుడ్డోడు వాళ్ళకి ఓ కుక్క. పెద్ద ఇల్లు. ఇందులో ఎగెస్ట్రా ఏంటంటే మంజుల కి ఓ గ్రీన్ హౌస్ ఉంటది. ఓ తోటమాలి .. అదే రాజేష్. రోల్ పెద్దగా లేదు అతనికి .. అలా ఓ రెండు మూడు సీన్లలో కనిపిస్తాడు అంతే.

స్క్రీన్ మొత్తం చార్మే ఉంటది.. ఎంట్రీ ఇచ్చాకా. మంత్రా తర్వత ఇలాంటి కారెక్టర్లకే పరిమితం అయిపోయినట్టు ఉంది చార్మి. అనుకోకుండా ఒక రోజు లో కొంచం నార్మల్ గానే ఉండేది తర్వత ఏమైయిందో ఏమో కాని ఆవిరి కుడుము లా తయారయ్యింది.. కొంచం ఏంటీ బానే తగ్గాలి. అసలు మెడ కనిపించడం లేదు. పోనీ మనమేమైన సావిత్రా అంటే అది కాదు కద.. క్లోస్ అప్ లో ఐతే చూసి జడుసుకున్నా. మా నటశేఖర నటకిరీటి నటచక్రవర్తి నటసామ్రాట్ నటరాజ సూపర్ స్టార్ గారి అమ్మాయి ఐతే ఈ రోల్ కి చాలా బాగా స్యూట్ అయ్యింది. అచ్చు మా సూపర్ స్టార్ ని చూసినట్టే ఉంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు దివ్య ఏమో తర్వత ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అన్నది.. నాకు అర్థం కాలే నేను చూడని మూవీ తనెప్పుడు చూసిందా అని.. అప్పుడు చెప్పింది ఇది "hand that rocks the cradle" అని చిత్రం కాపీ అట. ఈ చిత్రం లైఫ్ టైం లో ఎప్పుడో వస్తే చూసిందట. లైఫ్ టైం కూడా చూస్తావా అని పరమవిపరీతల్టిమేట్ ఎక్స్ ప్రెషన్ ఒకటి పెట్టి మరో సినిమా చూడ్డం మొదలెట్టా..

<దీనితోబాటే చూసిన ఇంకో రెండు సినిమాల రివ్యూ రాద్దాం అనుకున్నా.. కాని అస్సలు టైం లేదు. మా బాసు రెండు నెలలు పట్టే పనిని ఒక్క వారం లో చేస్తాం అని క్లైంట్ కి చెప్పొచ్చాడట. థూ నా బ్రతుకు అని పని చేస్తున్నా(ము). దాని గురించి మళ్ళా చెప్తా లే..>

Read more...

Monday, July 13, 2009

Beat in my heart..

దాదాపుగ ఒక పదైయేళ్ళ (అంటే పదిహేనేళ్ళన్నమాట) క్రితం ఒక అద్భుతమైన చిత్రం వచ్చింది. చాలా మంది మదిలో ఎదలో మెదడులో అంతక ముందే ఉన్న ఆలోచనలకి ప్రరిబింబం గా నిలచింది. తేజా "చిత్రం" అంత కాకపోయిన కొంచం చెడగొట్టింది అనే అనాలి. 'క్లాసు రూముల్లో తప్పస్సు చేయుట వేస్టు రా గురూ..' అని మాకున్న లక్ష సాకులు సరిపోదనట్టు ఇంకో గ్రేట్ సాకు ని చూపించింది. సరే ఎలాగూ క్లాస్ ఎగ్గొట్టాం కదా ఏం చేద్దామా తర్వతా అంటే దానికీ ఒక దారి చూపించింది.. ' బీట్ ఇన్ మై హార్ట్ ..' అని.

అసలు ఆ పాట విన్న మొదటిసారి ఇంచు మించు గా పిచ్చెక్కింది. ఆ ఊపూ ఆ బీటు.. దానికి తగ్గట్టుగానే సినిమా చూస్తే ఆ పాట picturization.. అది మా ఇంటర్ రోజులు. ఇంటర్ అంటే పెద్దగ లైఫ్ లో దేనికి టైం ఉండదు (ఇప్పటి సంగతి తెలీదు మా రోజుల్లో ఐతే ఇంటర్ లో మాకు లైఫే ఉండేది కాదు).. ఒహో ఇంజనీరింగ్ చేరితే ఇలా ఎంచక్క బైకుల మీద అమ్మయిని వెనకేసుకొని జాం చక్ అని రోడ్లెంబడి తిరగచ్చేమో అని తెగ చదివేసాం "సాంకేతిక వ్యవసాయ వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష" కి .. అదే ఎంసెట్ కి. ఎదో కొద్దో గొప్పో ర్యాంక్ రావడం తో సిటి లోనే కాలేజి లో చేరాం. రోజు అంతంత దూరం సిటి బస్సుల్లో వేలాడ్డం, ఇంటి ముందరే రన్నింగు బస్సు దిగడం... ఇలా ఉండేది. మా నాన్న ఓ రోజు "ఒరేయ్ నీకు కంప్యూటర్ కావాలా? బైకు కావాలా?" అని అడిగారు.. ఈ మాట కోసం ఒక రెండేళ్ళ నుండి కాచుకున్నా కద.. వెంట్టనే బైక్ అని చెప్పా. నాన్న అంత చట్టుకున్న చెప్పినందుకు ఆశ్చర్య పడి కొంచం నిరాశ పడి వీడి జన్మలో మారడు అని బాధపడి కొనిచ్చారు. ఇంకే.. ఇంటర్ నుండి దాచుకున్న నా లిస్ట్ బయటకి తీసి "ఇంజినీరింగ్" పక్కన, "బైక్" పక్కన "చెక్" మార్క్ పెట్టా. ఇంక కావాల్సింది కాలేజి బంక్ కొట్టడం - ఇది చాలా కష్టమైన పని (ఎప్పుడు చేయలేదు కాబట్టే), ఇంక ఒక గరల్ ఫ్రెండ్ ని పటాయించడం - అన్నేసి సినిమాలు చూసి ఇదెంత పని చిటికెలో ఐపోద్ది అని అనుకున్నా. ప్చ్...

క్లాసు రూముల్లో తప్పస్సు వేస్టని బైకుల మీద రోడ్లెంబడి తిరిగాము. సినిమ రెలీస్ అంటే అక్కడ ప్రత్యక్షమైపోయేవాళ్ళం. అలనే ఓ సారి అమరావతి లో 'గణేష్' విడుదలా అంటే మా వాడు ముందే వెంకీ ఫ్యాన్ .. లంచం ఇచ్చి నన్ను తీసుకొని వేళ్ళాడు. అక్కడేమో భయంకరమైన జనం. మరి మొదటి రోజు మొదటి ఆట అంటే ఆ మాత్రం ఉండాలి కద.. సరే అని క్యూ లో నిలబడ్డాం. మా గోల తట్టుకోలేక పోలీసులు లాఠీ అన్నారు. అది తప్పించుకునే ప్రయత్నం లో కాలి మీద ఓ వాత కూడా పడ్డది. సినిమా వద్దు ఏమి వద్దురా నాయాన అని .. మా ఆస్థాన థియేటర్ "శ్రీ రమణ" లో చూసాం.. అలా కాలాం సాగిపోతోంది. సీన్ కట్ చేస్తే ఇంజినీరింగ్ రెండో సంవత్సరం సగం అయిపోయింది.. కాని "నాకో గరల్ ఫ్రెండ్ కావాలి" అన్న కోరిక మాత్రం అలనే మిగిలిపోయింది. లేట్ గా అయినా లేటెస్ట్ గా అప్పుడర్థమైంది.. బంక్ కొట్టడం కాదు కష్ఠమైనది అని. సినెమాల్లో చూపిచినట్టుగా చేస్తే అమ్మయిలు పడ్డం కాదు చెప్పుదెబ్బలు పడతాయి అని. అయినా మానుతామా? ఎన్నోయేళ్ళ కోరిక కదా.. మా కాలేజి కాకుంటే పక్క కాలేజి లేకుంటే st. anns ఎక్కడ ట్రై చేసినా ఫలితం సున్నానే.

ఆలా చూస్తున్నే ఇంజినీరింగ్ అయిపోయింది.. సరే అమేరికా కి వస్తున్నాం ఇక్కడైనా అద్రుష్టం వరించకపోద్దా అని ఆశతో ఉన్నా. తీరా ఇక్కడ చూస్తే మా కాలేజి లో అబ్బాయిలు: అమ్మాయిల ratio 100:1 లా ఉండేది. ఖండాంతరాలు దాటొచ్చినా ఇంకా ఆంధ్రా అమ్మయిలేనా అని విదేశిలని పటాయించుదాం అని అనుకొని సైకాలజి కోర్స్ ఒకటి తీసుకున్నా మా సీనియర్ల అడుగుజాడల్లో. వారం వెళ్ళేసరికి మైండ్ బ్లాక్ అయ్యింది. తాజ్ మహల్ కట్టింది నేనే అని నా పేరు టిప్పూ సుల్తాన్ అని నేను క్రీ.పూ. 200 సంవత్సరం లో పుట్టానని ఇలా కొన్ని నిజాలు తెలిసే సరికి ఎందుకొచ్చిన కొచ్చిన్ అని మానేసా. ఇలా ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా నా చిరకాలా కోరిక మాత్రం అలనే ' హీట్ ఇన్ మై థాట్ ' అని వెంటాడుతునే ఉంది.

తర్వత తర్వత బోధి చెట్టుక్రింద కూర్చున్న బుద్ధుని లా నాకూ జ్ఞానోదయం అయ్యిన తర్వాత తెలుసుకున్నా... అలా ఆ రోజ్జుల్లో అలా తిరిగింటే మా ఆవిడ నా బెండు తీసేదని. ఒకందుకు అదే మంచిదైంది అని. మా నిశ్చితార్థం అయ్యాక .. అంటే అపటికే నా బండి 3000 కి ఎవరికో అమ్మేసారు మా ఇంట్లో.. అది అంత పెట్టి కొన్నవాడు ఎవాడో అని ఆశ్చర్యపడ్డా అది వేరే విషయం... మా ఆవిడ ని వాళ్ళ ఆపీసు నుండి పిక్ చేసుకొని లంచ్ కి వెళ్ళి మళ్ళా డ్రాప్ చేద్దాం అని ఓ గ్రేట్ ప్లాన్ వేసా. మా శ్రీ గాడి బండేసుకొని అంత దూరం మే ఎండ్డాళ్ళో వెళ్ళి పిక్ చేసుకొని లంచ్ చేసి 'బీట్ ఇన్ మై హార్ట్' అని పాడుకుంటూ ఎంచక్కా డ్రాప్ చేస్తున్న సమయంలో ఢామాల్ అని పెద్ద సౌండ్ తో ఆ ముష్టి టైర్ పగిలింది. ఆహా నా రాజా ఏం టైమింగో అని మా ఆవిడని ఆటో ఎక్కించి ఓ రెండు కిలోమీటర్లు తోసుకొని టైర్ మార్చుకొని ఇల్లు చేరా. మొదటిసారి నా ఖ్వాయిష్ తీరేపాటికి ఇలా అయ్యింది అని బాధేసినా.. ఈ సారి హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు శ్రీ గాడి బండి బదులు ఇంకో కొత్త బైక్ ఉంది.. దాని మీద వెళ్తా.. 'బీట్ ఇన్ మై హార్ట్' అని పాడుకుంటూ...

Read more...

Thursday, July 9, 2009

పనిపాట ఏటూ లేదు ట్విట్టర్ అయినా పంపు బ్రదర్..

ఏంటో.. కొన్ని సార్లు అనిపిస్తుంది అసలు నాకేమైన తెలుసా అని. అంటే ఏ ఒక్క ఫీల్డ్ లో అయినా కొంచం కొద్దో గొప్పో జ్ఞానం ఉంది అంటే అది ఈ సాఫ్ట్ వేర్ రంగం లోనే.. కాని ఇది ఓ మహా సముద్రం లా అనిపిస్తుంది. అది నిజమే.. కాని కొత్తగా ఏదైనా వస్తే అది ఎలా పని చేస్తుందో ఎందుకు పని చేస్తుందో అని వెంట్టనే అర్థం ఔతుంది. అదో ఆనందం. తుత్తి. నాలాగే చాలా మంది ఉంటారని నా అభిప్రాయం. మచ్చుక్కి.. గూగల్ వారి "క్రోం" వచ్చినప్పుడు దాన్ని దింపుకొని వాడి -ఓస్ ఇంతేనా. మంటనక్క (ఫైర్ ఫాక్స్) తో పోలిస్తే కొన్ని లేవు కొన్ని మంచిగా ఉంది అని తెలిసే వరకు జీవితం లో అదేదో కోల్పోయినట్టు ఉండడం సహజం. అది మన నైజం.

దీనికి విభిన్నంగా ఒక కొత్త (అంటే కొత్తదేమి కాదు.. ఓ రెండేళ్ళు అయ్యిందనుకుంట) టెక్నాలజి వచ్చి అది అంటుబట్టకుండా ఉంది అంటే అది - ట్విట్టర్. అది మొదలైనప్పుడు ప్రతిసారి లాగే ఓ యకౌంట్ తెరిచా. అదేంటో అని కొంచం వాడాను కాని అంతు బట్టలేదు. అసలు ఎందుకు వాడతారో అర్థం కాలేదు. ప్రతి క్షణం నేను ఏం చేస్తున్నానో తెలుసుకోవాలనుకునే వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరు లేరు. ఉండరని నా నమ్మకం. ఆశ కూడా.. నమ్మకం కంటే ఆశే ఎక్కువ. :p నిజంగా ఉన్నరంటే వాళ్ళ కంటే పని లేని వాళ్ళు.. అంటే కే.సీ.ఆర్ టైప్ అన్నమాట.. భూ ప్రపంచకం ఓల్ మొత్తం మీద ఎవ్వరు ఉండరు. అయినా సరే బోలెడు మంది ట్విట్టర్ ట్విట్టర్ అంటూ ఉంటారు. మచ్చుక్కి CNN పొరబాటున పెడితే చాలు. ప్రతి ఒక్కడు న్యూస్ బదులు ట్విట్టర్ చూడండి అంటు తెగ గోల చేస్తూ ఉంటారు. ట్విట్టర్ లో అంత గొప్ప గా నాకేమి కనిపించలేదు. బహుశా కనిపించదు కూడా. well this is just my own సొంత personal opinion. కాదు కూడాదు అని ఎవరైన అంటే కేసు పడుద్ది (TM).

నాకనిపించేది ఏంటంటే గూగల్ పెరుగుదల చూసి అర్రెర్రె ఇది మిస్ కొట్టామే ఇప్పుడెలా అని అనుకుంటున్న సమయం లో ఇది కనిపించింటది.. అందరు యకౌంట్లు తెరుస్తున్నారు బహుశ ఇది నెక్స్ట్ గూగల్ ఔతదేమో .. మళ్ళా ఇది కూడా మిస్ ఐతే జీవితం వేస్టూ అని భావించి ఈ CNN గట్ర ట్విట్టర్ వెంట పడ్డారు అని. అస్సలు పనికిరాదు అని చెప్పడం లేదు.. బంబాయి మీద దాడులు జరిగినప్పుడు ఈ ట్విట్టర్ ద్వారానే చాలా తెలిసింది. అలాంటప్పుడు ఒప్పుకుంటా.. కాని నిత్యం నిరంతరం "నేను ఇప్పుడు ఫార్ లూపు రాస్తున్నా" "ఇప్పుడు సొనాలీ బేంద్రే పోస్టర్ చూస్తున్నా " "ఇప్పుడు బుడుగుని తిట్టుకుంటున్నా" లాంటివి ఎవడు చదువుతాడు అని నా అనుమానం. నాతో ఎవడైన మాట్లాడాలంటే జీ-టాక్ లో పింగ్ చేస్తారు లేకపోతే .. వాళ్ళా అద్రుష్టం పండి ఉల్టా అయితే ఫోన్ చేస్తారు.. అంతే తప్ప ట్విట్టర్ లో "అరేయ్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా" అని ఎవ్వడు రాయడు అనే నా ఫీలింగ్.

- ఇప్పుడే వీరో ఎంట్రీ ఇచ్చాడు.
- అప్పుడే ఓ పాట. పాట ఇలా ఉంది "పనిపాట ఏటూ లేదు ట్విట్టర్ అయినా పంపు బ్రదర్.. " (సాపాటు ఏటు లేదు ట్యూన్ లో..)
- వీరో "అగరబత్తులు" పట్టుకు తిరుగుతున్నాడు. ఎందుకో తెలీదు.
- వీరోఇన్ వచ్చింది.
- హీరో అగరబత్తులు వీరొఇన్ కి ఇచ్చాడు. ఏంటో నాకు పిచ్చేకుతోంది.
- వీరో కలగంటున్నాడు. అందులో బాలయ్య - హరికృష్ణ - తారక రత్నా - కలిసి పాటలు పాడుతున్నారు. అటువైపు నుండి రజని ఈల వేసుకుంటూ వస్తున్నాడు..
- ఇటు వైపు నుండి నేను జంప్ అని.
-----
- ఇప్పుడే మమతా తన రైలు బడ్జెట్ ప్రెసెంట్ చేస్తోంది.
- అటు పక్కనే కె.సి.ఆర్ ఎదో తాగుతున్నాడు
- లాలూ కి ఒక్క ముక్క అర్థం కాకుండా తన నోట్ బుక్ లో ఆవుల బొమ్మలేసుకుంటూ గడ్డిని ఊహించుకుంటున్నాడు.

ఏంటి వీడికి పిచ్చేకిందా అనుకుంటున్నారా? అంత లేదు..ఇది రాబోయే కాలానికి సంకేతాలు. ఆ రెండవది శశి తరూర్ ట్విట్టర్లు. (స్వకల్పితం) పోయినేడు U.N.O ఎన్నికల్లో బాన్-కి-మూన్ కి ప్రత్యర్థిగా నిలచి ఓడిపోయిన అతడికి కాంగ్రెస్ లో సీటిచ్చి పాలకాడ్ నుండి నిలబెట్టారు.. గెలిచేసాడు.. అర్రెర్రె గెలిచేసాడే ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే బాగోదేమో అని ఓ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఫుల్ "techie guy, youth తో టచ్ లో ఉన్నా అని ఎలా చెప్పాలా అనుకుంటున్నతడిని ఈ ట్విట్టర్ కరిచింది. దెబ్బకి ఇప్పుడు కేవలం ట్విట్టర్తోనే మాట్లాడుతున్నాడట. పదివేల మంది "followers" ఉన్న మొట్టమొదటి భారతీయుడు అట. (ఎందుకు అని అడగద్దు అది చదివిన తర్వత ఎందుకో వరైటి గా అనిపించింది).

ఈ ట్విట్టర్ మీఎవరికైన అర్థం అయితే ప్లీజ్ నాకు చెప్పండి. ఎం.ఎఫ్. హూసైన్ చిత్రాలు, బాలయ్య రొమాన్స్, అరవ కామెడి, అజిత్ అగార్కర్ బౌలింగ్ - వీటి తో బాటే ఈ ట్విట్టర్ అని డిసైడ్ అయ్యాను. అల కాదు దీన్ని ఇలా వాడాలి అనో అరవ కామెడి ని అర్థం చేసుకే పద్దథి ఇది అనో ఎవరైన నాకు "ట్విట్టరోపదేశం" చేస్తా అంటే - ధన్యుడని. అంత వరకు..

Read more...

Monday, July 6, 2009

Home - an invaluable documentary.

ప్రపంచం. ధరణి. మన భూమి. పదాలు వేరైన భావం ఒక్కటే కదా. మనుషులు వేరైన నిల్చునేది ఒక్కటే. దేశాలు వేరైనా చెడగొట్టేది ఒక్కటే. గత వంద సంవత్సరాళ్ళో మానవజాతి చాలా రంగాల్లో ముందడుగు వేసింది.. ఇంకా చాలా విషయాల్లో వెనకడుగు వేసిందనే చెప్పాలి. శాంకేతికంగా ఇంతకమునుపెన్నడు లేలంత నైపుణ్యం సంపాదించాము.. ఎన్నో ఎన్నేన్నో రోగాలకి మందులు కనుకున్నాం.. అంతరిక్షాంలోకి వెళ్ళాం ఇంటర్నెట్ ద్వారా ప్రతి క్షణం "కనెక్ట్" అయ్యివున్నాం. ప్రపంచం తో "డిస్కనెక్ట్" అయ్యాం.

మనిషి ఇలా నాగరికంగా సాంఘికంగా చరిత్ర చూస్తే ఓ పది వేల సంవత్సరాల నుండి ఉంటున్నాడని తెలుస్తుంది. కాని మునుపెన్నడు లేనంత ఇబ్బందులు ఇప్పుడే ఎదుర్కొంటున్నాం. మన దేశం లో మొట్టమొదటి దాదాపుగా పది వేల సంవత్సరాల క్రితం సరస్వతి నది ఒడ్డున మకాం వేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మహానది సరస్వతి లేనేలేదు!!! కాని ఇప్పుడు మన దేశం లో మనిషి అంటూ లేని ఇంచు లేదేమో! ఒక్కప్పుడు దిల్లీ నుండి ఆగ్రా వరకు ధట్టమైన అడవులు ఉండేవి. మన ఆంధ్ర దేశం అటవీ ప్రాంతం గా వాల్మీకి రామాయణం లో చెప్పబడుతుంది. అంతెందుకు చిత్తూరు జిల్లా మొన్న మొన్నటిదాకా ప్రతియేట వరదలు వచ్చేవి. భాగ్యనగరం లో సరిగ్గా వందేళ్ళ క్రితం వచ్చిన వరద ఫలమే శ్రీ మోక్షగుండం నిర్మించిన గండీపేట్ ఆనకట్ట. ఇప్పుడు మూసి అంటే పెద్ద బూతైపోయింది. హైదరాబాదు నాలుగు వందలేళ్ళ చరిత్రలో దాదపుగ మూడువందలేళ్ళూ ఆ మూసి నది నీళ్ళే తాగింది. ఇప్పుడు మురికి కాలువగా జతకట్టేసాము. ఏం జరిగింది? ఏం జరుగుతోంది?

మనము పురోగతి సాధించామో పురోగతి పేరిట తిరోగతి సాధించామో నాకు తెలీదు. కాని తెలుసుకోవాల్సిన అవసరం అందరికి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరు లంకవేయపడ్డారు కాబట్టి. అమేరికా తదితర దేశాలు ఇన్నేళ్ళు పురోగతి పేరిట చాలా చాల పొగ ప్రపంచంలోకి వదిలింది చాలా చెత్త చేర్చింది అందుకే మాకు కొన్నేళ్ళు వ్యవధి కావాలి మా వంతు కాలుష్యాన్ని చేసేదానికి అని చైనా మన దేశం అనడం మూర్ఖంగా ఉంది. వాళ్ళు చేసారు కాబట్టీ మేమూ చేయాలి అనడం తప్పు కాదు కాని వాళ్ళు చేసిన తప్పే మేమూ చేస్తాం అనడం తప్పు అంటున్నా. యాభై యేళ్ళ క్రితం వరకు మనకి ప్రపంచం లో కాలుష్యం వలన సంభవించిన మార్పులు తెలీవు.. కాని ఈ రోజు ప్రతి దేశం లో ప్రతి చోట ఎన్ని అవకతవకలు జరుగుతున్నయో కళ్ళారా చూడగలుగుతున్నాం. కాని నివారించే యే ప్రయత్నం చేయడం లేదు. ఆ మనం ఏమి చేసిన ఏమి అవ్వదు అన్న సినికల్ మెంటాలిటీ కి బానిసలైపోయాం.

ప్రపంచం కనిష్టం 33 శాతం వృక్షాలతో ఉంటేనే వర్షాలు సరిగ్గా పడుతయి భూమి ఎడారిగా మారదు అని తెలిసినా మనం ఏమీ చేయడం లేదు. ఇది రాజకీయం గా ఎంత తప్పో మనం ప్రజలుగా చేస్తున్నది కూడా అంతే తప్పు. మన నగరల్లో అసలు చెట్లు కనిపించవు. చెట్లు లేకపోతే వర్షాలు పడవు అని తెలిసినా మనం చెట్లు నాటము. మన carbon footprint తగ్గించుక్నే యే ప్రయత్నం చేయము. అనంతపురం జిల్లా ని చూసైన బుద్ధి తెచ్చుకుంటాం అనుకున్నా.. కాని అదీ కష్టం గా ఉంది. మన వాతావర్ణం చాలా చాలా సున్నితమైనది. యే కొంచం మార్పు వచ్చినా సరిపొయేదానికి చాలా టైం పడుతుంది. కాని అదేమి పట్టించుకోవడం లేదు మనం. fishing పేరిట సముద్రాంలోని చేపల్ని ఎంత పట్టేసాం అంటే ఇంకో 20-30 యేళ్ళల్లో అసలు చేపలే ఉండవట. మెళ్ళ మెళ్ళగా మన సముద్రాల్లు అన్ని అసిడిక్ ఔతున్నాయి. దాని వలన కోరల్ రీఫ్స్ అన్నీ చచ్చిపోతున్నాయి. ప్రతి జీవి కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలనే ఈ కోరల్ రీఫ్స్ కూడా. వాటిలో యే ఒక్కటి మాయమైనా బ్యాలన్సె తప్పుతుంది. Our world is like a beautiful glass globe balanced on the edge of a pin. Any minute change from this state of equilibrium will disturb the balance and shatter the globe.

వేసవి లో ఆర్టిక్ లో ఇప్పుడు మంచు ఉండడం లేదు. దాని వలన సూర్య రస్మి సముద్రాన్ని ఇంకా త్వరగా వేడి చేయగలుగుతోంది. పోలార్ బేర్స్ ఇంచు మించు గా శాస్వతంగా మాయామయిపోట్టూ ఉన్నాయి. గ్రీన్ ల్యాండ్ లో దాదాపుగా ప్రపంచం లోని 20% మంచి నీళ్ళు మంచు రూపంలో ఉంది. కాని అది చాలా వేగంగా కరిగిపోతోంది. అలనే మనం హిమాలయాలు కూడా శరవేగం తో కరిగిపోతున్నాయి. కాని మనం మత్రం అలనే కాలుష్యం చేస్తునే ఉన్నాం. ఇప్పుడు వాతావర్ణం లో మునుపెన్నడు లేనంత CO2 ఉంది. ఇంక సైబీరియా లోని పర్మా ఫ్రాస్ట్ కరిగితే అందులో కొన్ని వేల సంవత్సరాల నుండి నిర్భంచ్నబడిన మీథేన్ బయటకి వచ్చే ప్రమాదం ఉంది. మీథేన్ CO2 కంటే నాలుగింతలు పవర్ ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్. అసలు అలా మీథేన్ వాతావర్ణం లోనికి వస్తే ఏమౌతుందో చెప్పేదానికి మోడల్స్ కూడా లేవు.

ఇన్నేళ్ళు నేను కొంచం ఆప్టిమిస్తిక్ గా ఉండేవాడ్ని. కాని ఏమీ జరగకపోవడం చూసి నాకు అంతగా hopes ఏమీ లేవు. We might have crossed the point of no return అదే గనక జరిగి వుంటే ఇంకొద్ది యేళ్ళల్లో there will be a "reset". ధరణి ప్రతి సారి తన బ్యాలన్స్ తప్పినప్పుడు రీసెట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సరి కూడా అలా జరిగే చాన్సులు ఉన్నాయి. ఎప్పుడు ఎలా అని మనకి తెలీదు. జరుగుతుంది అని మాత్రమే తెలుసు. మన రాబోయే తరానికి మనం ఇచ్చే బహుమతి ఇదేనేమో.

నాకు వీళైతే ఈ documentary ని మన దేశం లోని అన్ని భాషల్లోకి అనువదించి ఊర్లల్లో కూడా చూపించే ఏర్పాటు చేసేవాడ్ని. మన ప్రజలకి తెలియాలి మనం చేస్తున్న తప్పేంటో అని. ఇది తప్పు అని తెలిస్తే కద దాన్ని సరిదిద్దుకునేది. మీ అందరికి నా మనవి. 93 నిమిషాలు పక్కనబెట్టి చూడండి. నెట్ లో రోజు చెత్త బదులు అందులో ఒక్క 93 నిమిషాలు పక్కనబెట్టి ఇది చూడండి. ప్రతి ఒక్కరు చూడండి. మనవంతు కృషి మనం చేద్దాం. మన తర్వాత తరం మనన్ని తిట్టుకోకుండా ఉండే ప్రయత్నం చేద్దాం.

గమనిక: ఈ documentary free version ఇక్కడ చూడచ్చు.

Read more...

Thursday, June 25, 2009

ఇళ్ళా? ఉద్యోగమా?

కొంత కాలం కిందట .. ఈ మధ్యలో వరకు కూడా అనుకోండి కొన్ని ఇళ్ళల్లో ఒక చిన్న ప్రశ్న మొలిచేది.. తల్లా? పెళ్ళామా? అని. ఆ ప్రశ్న ఎంత మూర్ఖంగా ఉన్నా..ఈ మధ్య కాలం లో అసలు ఈ ప్రశ్న కి సమయమే లేకుండాపోయింది. శుభం అనుకునే లోపే ఇళ్ళా? ఉద్యోగమా? అన్న ప్రశ్న మొదలైంది. ఇది మూర్ఖమైన ప్రశ్న కాకున్నా చాలా మంది జీవితాల్లో చాలా ఇళ్ళాల్లో జరిగే నిరంతర పోరాటమే అని అనుకోవచ్చు. (చాలా ఇళ్ళాల్లో అన్నదానికి నా కాడ statistics గాని సర్వేలు కాని లేవు.. జీవితంలో చూసిన దాన్ని బట్టి నేను ownగా సొంతంగా personalగా ఊహించుకున్న సంఖ్య మాత్రమే!!).

ఉద్యోగం నుండి బయటకి వచ్చాకా అంటే జెస్ట్ ఆ డోర్ నుండి బయటకి వచ్చాక యే కంపనీ నీది అంటే బ్రహ్మానందం చూపులు చూసే వాళ్ళని నేను ఎరుగుదును. అందులో ఒక కాలం లో నేను ఉన్నా. ఠంచన్ గా ఐదో ఆరో అయితే మళ్ళా అసలు వర్క్ గురించి గుర్తుండేది కాదు నాకు. ఆ రోజు రాసిన for లూపులు కూడా మర్చిపోయేవాడ్ని. అల అయ్యేదానికి కొన్ని యేళ్ళు పట్టింది. అది వేరే విషయం. ఇప్పుడు కూడా నేను మించు ఇంచు గా అదే టైప్. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు.. ఇంకో పది రోజుల్లో ఒక పెద్ద డెలివరి ఉంది మాకు.. సో అది అయ్యకా మళ్ళా ఐదైతే అన్ని మర్చిపోతా. అంత వరకు మాత్రం రోజుకి ఒక 12 గంటలు తప్పడం లేదు. అలా సంవత్సరానికో ఆర్నెల్లకో చేసేవాళ్ళని చూసాను. కాని నిత్యం నిరంతరం పెతీ రోజు అలా ఉద్యోగమే జీవితం అనుకుంటు ఉండేవాళ్ళూ ఉన్నారు.

ఎవరైన ఉద్యోగమ? ఫామిలీ ఆ? అని అడిగితే క్షణం పట్టదు తేల్చుకునేదానికి. కాని అలా 12 గంటలు ఇంట్లో కూడా మాట మాట్లాడకుండా ఎదో జాతిని ఉద్దరించే పని చేస్తున్నట్టుగా చేసేవాళ్ళ priority మీద నాకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది. వీళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళూ ఎట్లా భరిస్తున్నారా అని. ఆ స్టేట్మెంట్ కొంచం ఎక్కువే అయినా అందులో ఓ యాభై సాతం నిజం లేకపోలేదు. వీళ్ళు ఇంట్లో ఉన్నా వర్క్ లో ఉన్నా పెద్దగా తేడా పడదు.. జెస్ట్ ఎదో ఇంట్లో ఉంటే మన ముందు ఉన్నరాన్న ఆనందం తప్ప. కాని అదీ క్షణికమే. వర్క్ చేసేటప్పుడు శబ్ధం వచ్చినా మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టే.. ఆ భాగ్యానికి ఇంటికి రావడం ఎందుకో? అని కూడా అనిపిస్తుంది. జివః కో రుచి అని తెలుసు... వెర్రి వెయ్యి విధాలు అని కూడా తెలుసు కాని ఇంత వర్క్ వెర్రా?

నేనేదో ఉత్తముడిని అని చెప్పడం లేదు..కాని at least i have my priorities right. క్రికెట్, NFL, ఫుడ్, సినిమాలు, ఫ్యామిలి, ................................................ వర్క్. in that order. సెప్టెంబర్ నుండి మొదటి రెండు కొంచం అటూ ఇటూ ఔతాయి. కాని ఆర్డర్ మాత్రం పెద్దగా మారలేదు చాలా ఏళ్ళగా. ఈ ఎకానమి లో ఆ మాత్రం పని చేయకపోతే కష్టం అని అనకండి.. ఎందుకంటే వీళ్ళు ఎకానమి ఎలా ఉన్నా మారరు కాబట్టి. అయినా పక్కనోడికి చెప్పేంత నాకు లేదు. నేను నూరుశాతం కాకపోయినా తొంభై తొమ్మిది శాతం పర్ఫెక్ట్ కాబట్టి చెప్తున్నా అంతే. ఉద్యోగాలు మారుతాయి (ఇది చాలా మందికి. కొంత మంది అలా ఒక్క సారి చేరితే గవర్నమేంట్ మారినా.. బాలయ్య మారిన.. చివరికి కె.చంద్రశేఖర్ రావ్ మారినా .. అదే ఉద్యోగం లో ఉంటారు. అది వాళ్ళ నైజం. ఇష్టం. స్వభిప్రాయం. choice. దాని గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. మిగితా వాళ్ళా గురించి అంటున్నా).. కాని ఫ్యామిలి మారదు. జావా కాకపోతే డాట్ నెట్ .. కాని ఫ్యామిలి కి ప్రత్యామ్న్యానం లేదు కదా!! అయినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు.. ఎవరికి చెప్పాలని చూస్తున్నా నేనూ? నా వెర్రి కాకపోతే..

Read more...

Sunday, June 21, 2009

నేను మార్గదర్శి లో చేరా.. నేకు "కేసు" పెట్టా..

నేను మార్గదర్శి లో చేరుతా.. నేను కేసు పెడతా. ఎందుకు ఏమిటి అంటే ఒప్పుకోను ... అడిగే హక్కు మీకు లేదు. నా జాతిని బట్టి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నాకు అర్థం అయ్యింది. మీ మీద కూడా పెట్టేస్తా. మలక్ పేట్ రౌడి గారి మీద కేసు పెడుతున్న బుడుగు ఉరఫ్ జీడిపప్పు మీద నేను కేసు పెడుతున్నా. నా కంటే ముందు అలా కేసు పెడతా అని వ్రాసినందుకు. కేసు పెట్టడం నా జన్మ సిద్ధ అధికారం. దాన్ని నా నుండి ఎవ్వరు వేరు చేయలేరు.

నాకు అలా కేసు పెట్టాలనె ఆలోచన రాకమునుపే బుడుగు కి వచ్చింది. ఇది IPC సెక్షన్ 1116 క్రింద ఘోరాతి ఘోరమైన నేరం. దీన్ని శిక్షించకపోతే బుడుగు లాంటివాళ్ళు నా లాంటి మేధావుల్ని తొక్కేస్తారు. మాకు ఆలోచనలు రాకమునుపే కాపి కొట్టేస్తారు. ఇలాంటి "కిష్యోటకల్ని" ఒదిలితే దేశానికి చాలా నష్టం, కష్టం. అందుకే కేసు పెడుతున్నా. ఎందుకు ఏమిటీ అంటే అది అంతే. ఇది చెట్టరీత్య నేరం. అడిగినందుకు కూడా మీ మీద పెడతా. ఒక కేసు. ముందే హైదరాబాద్ లో ఈ మధ్యే సాఫ్ట్-వేర్ ఉద్యోగాలు పోయిన నా స్నేహితుల్ని అడిగి కనుకున్నా.. వాళ్ళు చాలా చాల కష్టపడి internet తీగలమీద పాకి స్తంబాలు ఎక్కి మరీ ఈ క్రింద చెప్పడే వ్యక్తుల IP లు కనుకున్నారు.



"మనవోన్మాది" "మానవద్వేషి" బుడుగు a.k.a జీడిపప్పు మీద పెడతా. యే సెక్షనో అర్థం కావడం లేదు. కొంచం ఎవరైన "న్యాయవాదుల్ని" సంప్రదించి చెప్పగలరు. బుడుగు IP, birth certificate వాళ్ళా ఊరి మునసబ్ నుండి తెచ్చిన లేఖ వాళ్ళా బడి హెడ్ మాస్టారు ఇచ్చిన 'అ-ప్రశంసా పత్రం" అన్ని సేకరిచ్చా నేను.

మీకు అలాంటివి ఇంకేమైన దొరికితే నన్ను సంప్రదించండి. నా ఈ-మేల్ ;dikkulenicourtlodava@gmail.com. అలనే బుడుగు ఉరఫ్ జీడిపప్పు ఫోటో కూడా సంపాదించా. (క్షమించాలి ఆ ఫోటో పెట్టలేకపోతున్నా. "unparliamentary / uncivilised గా ఉంటుందని) ఇంత చదువుకు కొని ఇన్నేసి చికేన్ లని తిని అన్నేసి సార్లు గాడ్ ఫాథర్ చూసినా కూడా జీడిపప్పు కి బుద్ధుని లా జ్ఞానం రాకపోవడం చింతనీయం.

పనిలో పని పేపర్లో పేపరు కేసులో కేసు అన్నట్టు మలక్ పేట్ రౌడి గారి మీద, రాఘవ మీద, నేను నిద్రపోతున్న సమయంలో నా బుర్రలోని ఆలోచనల్ని కాపి కొట్టిన ఏక లింగం గారి మీద, గూగల్ మీద నేను పెట్టాలనుకున్న కేసుని నా కంటే ముందే ఆలోచించిన విశ్వక్శేనుడి మీద, మాటి మాటికి కేసు కేసు అని భయపెట్టి నా లాంటి మేధవుల్ని కించపరుస్తున్న నాగప్రసాద్ మీద, ఇవ్వంటికి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటున్న శరత్ 'కాలాం" మీద కూడా ఓ పదో పాతికో కేసులు పడేస్తున్నా. వీళ్ళు హైదరాబాదులో కనిపిస్తే అప్పడ తప్పడి తాండ్రే.!!!! ఖబర్దార్!!! కమాన్ సూస్కుందాం. బస్తిమే సవాల్!!! ఎవరెవరు ఎన్నేసి కేసులు పెడతారో సూస్కుందాం.

నా కంటే ముందు మీకు ఏమైన ఆలోచన వస్తే జాగ్రత్త!!! ఇదే మీకు తుది హెచ్చరిక. నా కంటే ముందు ఆలోచిస్తే కేసు పడుద్ది.

ఇది చూసి కామెంట్ వేయని వాళ్ళకి / నా కంటే ముందే నా ఆలోచనల్ని కాపీ కొట్టే వాళ్ళకి ఇదే హెచ్చరిస్తున్నా: మీ IP Address నాకు తెలుసు. మీ పైన atrocity కేసు పెడతాను. నా బ్లాగు అడ్రస్ ఇస్తూ incriminating వ్యాఖ్యలు చేస్తే that amounts to cheating and impersonating. IPC సెక్షన్ 420 మరియూ దాని సన్ సెక్షన్స్ సమానమైన సైబర్ నేరాల పరిధిలోకి ఈ విషయం వస్తుంది. మీరు హైదరాబాద్ లోనే ఉంటే 23240663, 27852274 ఫోన్ చేసి కనుక్కోండి.

Read more...

Thursday, June 18, 2009

మా హిల్టన్ కి కన్నీటి వీడుకోలు - 1

జ్ఞాపకాలు. మన జీవితం ఎటువైపు పయనిస్తే బాగుంటుంది అని మనం భావిస్తామో దానికి పునాది మన గతమే అని నా అభిప్రాయాం. ప్రతి ఒక్కరికి కొన్ని మధురమైన జ్ఞాపకాలు కొన్ని ఖటినమైనవి ఉంటాయి. సాయాంసంధ్య వేళలో ఇంటి బయట కూర్చొని అస్తమిస్తున్న రవిని చూస్తూ తే నీళ్ళు తాగుతూ చల్లని గాలి వీస్తున్నప్పుడు వెనక ఎక్కడో కొద్ది దూరం లో "వే వేళ గోపెన్మల్ల మువ్వా గోపాలుడే.." పాట వినిపిస్తున్నప్పుడు చిన్నపుడు అంతగా చిన్నగా లేనప్పుడు జరిగినవి గుర్తొస్తాయి. ఆ రోజుల్లో... అని మనం అనుకుంటూ ఉంటాం. ఒక ప్రదేశమో లేక ఒక గుర్తో లేక ఒక ఫోటో చూసినప్పుడు వద్దనుకున్నా చాలా విషయాలు గుర్తుకొస్తాయి. ప్రదేశాలు చిన్నప్పటి గుర్తులు బహుశా మారుతాయి.చిన్నప్పుడు మనం తిరిగే ప్రదేశాలు చోట్లు ఎల్లప్పటికి అలనే ఉంటుంది అని భ్రమపడతాం. ఆశిస్తాం. కాని అల జరగడం ఇంచు మించు అసంభవమే. మార్పు తథ్యం కద. కాలాన్ని ఎవ్వరు ఆపలేరు.. కాలం కదలకుండా నిర్భంధించలేరు. అలాంటి కాలాన్ని ఒక్క క్షణమైన కదలకుండా ఎటువంటి మార్పు రాకుండా చెసే మన యత్నమే ఫోటో అని నేను భావిస్తాను. ఫోటో అనేది మనం కాలాన్ని జయించ్చే ప్రయత్నమే. కాలాని జయించడం అంటే ఒక ఫోటో తీసినప్పుడు ఆ క్షణాన్ని బంధిస్తాం .. భద్రపరుస్తాం... అంటే కాలాన్ని ఆ ఒక్క క్ష్ణమైన పర్లేదు.. కాని ఆ సమయాన్ని జయించి బంధించినట్టే కదా!

అలనే ఒకటి మా బడి కి వేళ్ళే దారిలో ఒక పెద్ద చెట్టు (గుల్మోహర్ అనుకుంటా) ఉండేది.. ఇంకా కూడా ఉంది. ప్రతి రోజు నడుచుకొని బడికి వెళ్ళేప్పుడు ఆ చెట్టుని ముట్టి వెళ్ళేవాళ్ళం. అల ఒక పది సంవత్సరాలు చేసింటా. మొన్నామధ్య దేశం కి వెళ్ళీనప్పుడు మా బడి వైపు వెల్తూంటే ఆ చెట్టు ని చూసినప్పుడు ఎన్నో ఎన్నెన్నో సంగతులు గుర్తొచ్చాయి. నేను మా అక్క రోజు అల నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అంటే మా బడి మొదటి గంట 9:10 కి కొట్టేవాళ్ళు నేనేమో 8:45 కి అల చేరాలి అని. అల చేరితే ఒక అరగంట ఆడుకోవచ్చని నా బాధ. మా అక్కేమో ఎందుకు లేరా హాయిగా 9:05 కి చేరుదాం అని. అల అప్పుడప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం కొన్ని కొన్ని సార్లు నేను ఇంట్లో రబస చేసి త్వరగా వెళ్ళిపోయేవాడ్ని. మా బడి ఇంటి నుండి ఓ పది పదిహేను నిమిషాల దూరం. కొంచం పెద్ద అయ్యేపాటికి మా అక్క పదవ తరగతి అయిపోయింది సో నేను ఒక్కడినే 9:15 కి చేరేవాడ్ని. of course అది చూసి మా అక్క నన్ను వీర బాదుడు బాదింది.

నేను ఒకటవ క్లాస్ లో ఉన్నప్పటి మాట. మా అక్క ఎమో ఐదు చదువుతోంది. బడి తర్వాత తను కరటే నేర్చుకునేది. నేను స్కూల్ లోనే ఎక్కడో ఆడుకుంటున్నాను. నేను మా అక్క క్లాస్ మేట్ ఒకడు. వాడేమో మా టీచర్ వాళ్ళ అబ్బాయి. ఎదో ఆడుకుంతున్నాం ఇసుకలో. సీన్ కట్ చేస్తే నేను వాడి మీద ఎక్కి బాటా బూటు తిరగేసి కొడుతున్నా. ఎందుకో నాకు గుర్తులేదు.. కని కొట్టడం మాత్రం బాగా గుర్తుంది. అప్పుడే మా ప్రిన్సిపాల్ వచ్చింది. ఇద్దరిని లాక్కెళ్ళి తిట్టింది (అనుకుంటా.. చెప్పా కద మొదటి తరగతి అని). మరుసటి రోజు ప్రొదున్న మా ఇంట్లో నేనేమో బడికి వెళ్ళను అని ఏదో ఒక నెపం ట్రై చేస్తున్నా. మా అమ్మ కి అనుమానం వచ్చింది. ప్రొద్దునైతే స్కూలు స్కూలు (ఆ ఆ వింటున్నా.. చిన్నప్పుడు స్కూల్ అంటే ఇష్టం నాకు. తర్వత తర్వత ఎల ఎగ్గొట్టాలా అని యోచించేవాడ్ని అది వేరే విషయం) అనే వాడూ వీడికేమొచ్చింది అని. అయినా సరే స్కూల్ వద్దు వద్దు అని నేను. జ్వరం అని చెప్ప పొట్టలో నెప్పి అని చెప్ప.. మా అమ్మ మాత్రం ఏది వినడం లేదు. మా నాన్న అప్పుడు మా అక్కని పిలిచి అడిగారు - ఏంటి వీడు ఇలా అని. మా అక్క చెప్పింది అప్పుడు ఇలా నిన్న సాయంత్రం వీడు ఇంకొకడు కొట్టుకున్నారు వీడు వాడ్ని బూటు తో కొట్టాడు అని. అప్పుడు చెప్పా నేను మెళ్ళగా నాన్న నన్ను బూట్ల మీద మూడు పేజీల వ్యాసం రాయమన్నది మా టీచర్ అని. నాకు పట్టుమని పది పదాలు కూడా రావు నేను మూడు పేజీలు రాయడం ఏంటో అని మైండ్ బ్లాక్ అయి స్కూల్ ఎగ్గొడదాం అని ప్లాన్ వేసా. కాని కుదరలేదు. మా అమ్మ వచ్చింది అనుకుంట నాతో ఆ రోజు.

ఇంకో సారి నేను నలుగు చదువుతున్నా. అయితే మా బడి లో 11 కి ఒక పది నిమిషాల బ్రేక్ ఇచ్చేవారు. 11 అయ్యేపాటికి గంట కొడితే పరిగెత్తుకుంటూ బయటకి వెళ్ళాను .. ఎవరో అటునుండి పరిగెత్తు కుంటూ వచ్చారు. అదొక్కటే గుర్తు నాకు. తర్వత గాల్లో ఒక 2-3 చక్కర్లు కొట్టి ఎటో పడ్డాను. గట్టి గట్టిగా ఏడుస్తుంటే తెలిసింది నా కుడి చేయి కొంచం డామేజ్ అయ్యింది అని. అప్పుడు ఎవరో వెళ్ళి మా అక్క కి చెప్పారు.. ఇలా వాడి చేయి విరిగింది అని. తనకి ఆ రోజు ఏదో పిట్ట పరీక్ష ఉండే... అది మధ్యలో ఆపి మరి వచ్చింది పాపాం. తను వచ్చే వరకు నేను అలా ఏడుస్తూనే ఉన్నా. నా ఏడుపు నెప్పి కంటే ఇంట్లో మా అమ్మ నా వీపు ఎల విమానం మోత మోగిస్తుందో అని భయం తో. చేయి విరగలేదు కాని కొంచం జరిగింది. అంటే dislocate అయ్యింది నా ఎముకలు. అయినా మ అక్క ని కాక పట్టి ఇంట్లో చెప్పద్దు అని ఒప్పించా. కాని ఏం చేస్తాం. నెప్పి. వాపు. భోజనం కూడా చేయలేక పోయా. అప్పుడు మళ్ళా మా అక్క ని పిలిచి అడిగితే చెప్పింది ఇలా అయ్యింది అని. మరుసటి రోజు మా నాన్న సెలవు పెట్టి నా చేతికి పట్టి కట్టించారు. ఇదే వంకా అని ఓ పది రోజులు స్కూల్ లో రాసే పని తప్పింది. :)

ఇంకో సారి .. ఇది వర్షా కాలం లో. నేను ఐదవ తరగతి లో ఉండినాను. అప్పటికి నాకు జ్ఞానోదయం అయ్యి బాటా బూట్లు మానేసి క్యాన్వాస్ వాడేవాడ్ని. బాటా అంటే మళ్ళా పాలిష్ గట్ర చేసుకోవాలి. పుట్టెడు బద్దకం ఉన్న నాకు అలాంటివి సుతరాగు పడవు. ఆ క్యాన్వాస్ రోడ్ల మీద రాచీ రాచి కొంచం చిల్లు పడ్డది. అది ఇంట్లో చెప్తే తిట్లుపడతాయి అని చెప్పలేదు. వర్షం.. దాంతో నా షూ మొత్తం తడిసిపోయింది. అలనే మా క్లాస్ లోకి వెళ్ళి కొంచం ఆరబెట్టుకుందాం అని తీసా. ఇంతలో మా శ్రీ గాడు ఫుట్ బాల్ కి నా షూ కి తేడా తెలీక దాన్ని తన్నాడు. అల అల మా గ్యాంగ్ మొత్తం నా షూ ని ఫుట్ బాల్ లా ఆడుకుంటున్నారు. శ్రీ గాడు నా షూ ని తీసి మా గోడ మీద కొట్టాడు. అంతే! అదేదో గుర్తులాగా నా షూ అచ్చు తెల్లటి మా స్కూల్ గోడ మీద పడ్డది. అలనే మళ్ళా సున్నం వేసే వరకు అంటే దాదాపుగా ఇంకో 3-4 యేళ్ళు ఆ అచ్చు అలానే ఉండిపోయింది.

అర్రెర్రే అసలు నేను చెబుదాం అనుకున్న విషయం వేరు చెప్తోంది వేరు. మా బడి ముచ్చట్లు కాదు నేను అనుకున్నది. పెద్దయ్యాక అంటే ఇంజినీరింగ్ అప్పుడు ఎన్నేన్నో లెక్కకు మించిన జ్ఞాపకాలకు సాక్షం గా ఉండిన మా హిల్టన్ కేఫ్ ని మూసేసారట. ఈ హిల్టన్ అంటే ఊస్మానీ విశ్వవిద్యాలం దగ్గర్లో ఉండేది. ఆ చుట్టు పక్కళ్ళో చదివిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి సుపరిచితమైనది ఇది. మా ఇళ్ళలో కంటే ఎక్కువ సేపు అక్కడే ఉండేవాళ్ళాం. అలాంటి మా హిల్టం మూసేసారు అని తెలిసింది. ఆ విషాదాన్ని అందరితో పంచుకుందాం అనుకున్నా. ప్చ్.. సరె అది వచ్చే టప లో వ్రాస్తా. అంత దాకా సెలవు.

Read more...

Tuesday, June 16, 2009

i want to break free..

జీవితం లొ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏం చేస్తున్నానా అని. బహుశా ఇది చాలా మందిని కాలం తన్ని మరీ అడిగే ప్రశ్నే. ఏం చేస్తున్నానా అంటే ఈ రోజు ఈ పూటా ఈ క్షణం అని కాదు జీవితం తో జీవితం లో ఏం చేస్తున్నానా అని. అలా రోజులు గడిచిపోతోంది నెలలు సంవత్సరాలు కాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందనట్టు అక్కడే అదే ఫార్ చక్రాలు (టెన్షన్ పడకండి నేనన్నది for loops అని) కాలా చక్రాం లో రాసుకుపోతున్నా.

ఎనిమిది తొమ్మిది యేళ్ళగా రాసిన ఫార్ చక్రాలే రాసీ రాసీ అలసిపోయా. 8085 మొదలుకొని వివిధ భాషల్లో రాసి ఇదిగో ఇప్పుడు లేటెస్ట్ గా .NET లో వెలగబెడుతున్నా. కాని ఏమి మార్పు లేదు .. ప్రతి రెండు మూడేళ్ళకి మారిన బిరుదు, జన్మానికో శివరాత్రి లా మారే జీతం తప్ప. అన్నమయ్య కూడా వివిధ రసాల్లో సంకీర్తనలు వ్రాసారు. ఒక సారి "భావాయామి గోపాలాబాలం మనఃసేవితం చింత్యే అహం సదా" అని మరో సారి "ఫలనేత్రానల ప్రబల విధుల్లతకేలి" అన్నారు. నేను మాత్రం for(int i =0; i < నా జీవితం; i++) అని రాస్తునే ఉన్నాను.

పరిస్థితులు బాలేనప్పుడు ఏంటీ గోల అంటే మరి మరి పరిస్థితులు బాగున్నప్పుడు కూడా ఇలా అప్పుడప్పుడు అనిపించేది నాకు. తప్పుపట్టకండి.. నేను చేస్తున్న పని నాకు నచ్చే నాకిష్టం వచ్చే చేస్తున్నా. కాని నా ఆవేదన పని మీద కాదు నా మీద. రెంటికి D. రంగా రావ్ సినిమాకి కే. విశ్వనాథుని సినిమాకి ఉన్నంత వ్యత్యాసం ఉంది. (డి. రంగా రావ్ ఎవరు అంటే అతనో మహానుభావుడు. "నవ్వు నవ్వించు", "మర్డర్" లాంటీ కళని, చూసిన వాల కలల్ని, ఖండించే చిత్రాలు తీసిన గొప్ప వ్యాక్తి. గుర్తొచ్చింది నవ్వు నవ్వించు చిత్రం రివ్యు కోసం వేచు చూస్తూండండి. శంకర్ రేంజి మూవి. చూడకపోతే వెంట్టనే వెళ్ళి చూడండి. థియేటర్ లో కాదు DVD లో. ఆ చిత్రాన్ని థియేటర్ లో ఎవ్వరు చూడలేరు.)

ఈ ఫార్ చక్రాలు వైల్ (while) చక్రాలనుండి i want to break free. కాని ఎలా అన్నదే నా బుర్రకి తోచడం లేదు. ఎంత సేపు "దత్తం పెట్టి" (అదే database) కి అనుసంధానం సరిగ్గా ఉందా ఉంటే కూడా రాసిన కోడు ఎందుకు పనిచేయడం లేదు చెప్మా ఉప్మా అని అనుకోవడం తోనే సరిపోతోంది. చస్స్.. ఏదో రాద్దాం అనుకొని ఏదో రాయబోయి ఏదో రాస్తున్నా. నా బుర్రని ఇప్పుడు లక్ష దిక్కుల్లో శతకోటి ఆలోచనలు పీకుతున్నాయి. అందుకే ఇలా సటిలాయిట్ సిగ్నల్ అందని జి.పి.యస్ లా ఉన్నా. ఇరవై నాలుగు గంట్టల్లో కనిష్టం ఒక 10 గంటలి ఇలా కోడు రాసి డీబగ్ చేస్తుంటే పిచ్చి పిచ్చి ఆలోచనల్తో ఇదేనా జీవితం అంటే? నాకు విముక్తి లేదా ? అని అనుకుంటున్నప్పుడు మహాకవి శ్రీ శ్రీ గారన్నది గుర్తొచింది:

నేను సైతం కోడూ ప్రపంచానికి లూపు ఒక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం కోడూ వ్రుష్టికి if ఒక్కటి రాసిపెట్టాను
నేను సైతం వెబ్బు ఘోషకు bug ఒక్కటి పట్టి చంపాను

ఆ మాహాకవే అలా అన్నాక ఇంక చేసేది ఏమీ లేదని ఈ ఫార్ వ్యూహం లో - దర్శకేంద్రుని చేత్లో చిక్కిన ద్రాక్ష లా, వరం సినిమా నిర్మాత లా - చేసేది ఏమీ లేక .. ఏమీ చేయలేక నా బ్రేక్ పాయింట్ చేరే వరకు అలా తిరుగుతునే ఉందాం అని డిసైడ్ అయ్యాను. చూద్దాం.. బాలయ్యే కామెడి ట్రై చేయగాలేంది నేను ఈ లూపు నుండి బ్రేక్ అవ్వలేనా?

Read more...

  © Free Blogger Templates Blogger Theme II by Ourblogtemplates.com 2008

Back to TOP