పాక్ లో కలకలం.. ఆనందమా? ఆలోచనా ?
ఎలా రియాక్ట్ కావాలో అర్థం కావడం లేదు. ఒక వైపు ఆనందం గా ఉన్నా మరో వైపు పాపం వాళ్ళు మనలాంటి ప్రజలే కదా అని అనిపిస్తుంది. ఇన్నేళ్ళు మన దేశం మీద పన్నిన కుట్రకి జరిపించిన మారణహోమానికి తగిన సాస్తే జరుగుతున్నట్టు అనిపిస్తోంది.. కాని ఉగ్రవాదానికి ఇటువైపు ఉండి అనేకానేక దాడులని తట్టుకొని ఉండడం వళ్ళేమో కొంచం .. అంటే చాలా చాలా చాలా చిన్నమోతాదులో .. బాధ కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా ఎవరు తొవ్విన గొయ్యిలోకి వాళ్ళే పడతారు అని మరోసారి రుజువైనట్టుంది. మన దేశాన్ని ముక్కలు ముక్కలు గా చేయాలి అని చాలా యేళ్ళు ప్రయత్నించి అటు కాశ్మీరంలో, పంజాబ్లో, మన రాజధానిలో, సిమి లాంటి దేశద్రోహులకి అన్ని విధాలుగ సహాయం ఇచ్చి లక్షల మందిని పొట్టనపెట్టుకున్న పాప ఫలమేమో ఇప్పుడు పాకిస్తాన్ లో జరుగుతున్న మారణహోమం. ఇందులో మన హస్తం పెద్దగ లేదనిపిస్తుంది. అసలు అవసరమే లేదనిపిస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ పైన సోవియట్ల దాడి చేసాకా కొద్ది రోజులు తర్వత అమెరికా ప్రోద్బలం మీద పాకిస్తాన్ ఐ.ఎస్.ఐ గర్భం లో జన్మించింది తాలిబాన్. మొదటి పది సంవత్సరాలు డబ్బు గట్ర అంతా సి.ఐ.ఏ ద్వర వచ్చేవి. తర్వత సోవియట్లు తిరిగి వెళ్ళిపోయారు... సోవియట్ యూనియన్ చరిత్రపూటాల్లోకి జారుకుంది. ఇంక చేసేది ఏమి లేక ఆఫ్ఘనిస్తాన్ లో అంతర్గత కలహాలు చెలరేగాయి. ఒక తరం తుడిచిపెట్టుకుపోయింది ఆ దేశం లో ఈ యుద్ధాల మూలంగ. 79 నుండి 89-90 వరకు సోవియట్ల భీభత్సం వళ్ళ దేశం చాలా చాల నష్ట పోయింది.. తర్వత ఇంకో ఐదారేళ్ళు అంతర్గత కలహాలు చెలరేగాయి. పాకిస్తాన్ సహయాం చేయడం తో అందరిని ఓడించి కాబుల్ మీద విజయపతాకం ఎగరవేసింది తాలిబాన్. ఒక "గవర్నమెంట్" కూడా స్థాపించింది. దాన్ని ప్రపంచం మొత్తం మీద అంగీకరించిన రెండే రెండు దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఎంతైన సొంత బిడ్డ లాంటిది కద... అప్పుడే వాళ్ళు బమియాన్ లో ఉన్న వేల సంవత్సరాల బుద్ధ విగ్రహాలని పేల్చేసారు. యే ఒక్క దేశం కై కుయి అని అనలేదు. మన దేశం ఐతే మాటవరసకి వద్దు ఆపండి ఈ ఘోరం లాంటి కొన్ని డవిలాగులు అన్నదే తప్ప.. అంతకు మించి ఏమీ చేయలేదు. రెండు వేల సంవత్సరాల క్రిందట.. ఆ బుద్ధ విగ్రహాలని చెక్కినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మన దేశం లో ఓ భాగమే అని గుర్తించవారు కూడా తక్కువే!! ఏం చేస్తాం.. బుద్ధుడే ఆపలేకపోయాడు మనమెంత అని అందరు ఊరుకున్నారు. అది వేరే విషయం..
అలా అలా చిలకలు గోరికలు లా బ్రతుకుతున్న తరుణం లో.. అమెరికా మీద దాడి చేసింది అల్-ఖైదా. మరి అమెరికా ఊరుకుంటదా? ముందే ఏమి మిగలని ఆఫ్ఘనిస్తాన్ ని ఇంకా కుమ్మేసింది. అసలు అక్కడ ఏముందని ..అదే ఏం మిగిలిందని దాడి చేసిందో నాకు ఇంత వరకు అంతు చిక్కలేదు. అలా ఘోరం గా ఓడిపోయిన తాలిబాన్ అగ్ర నాయకులని స్వయానా తన సొంత విమానం లో సురక్షితం గా తీసుకొచ్చింది పాకిస్తాన్. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద తన దాడికి సహాయం చేయకపోతే వాళ్ళాని అదేలా చేస్తాం అని మెల్లిగా చెప్పేసరికి దిక్కులేక సహాయానికి ఒప్పుకుంది పాకిస్తాన్. కాని ఎంతైన తాలిబాన్ ని పుట్టించి పోషించింది కద.. ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది.. అటు అమెరికా కి సహాయం చేస్తా అంటునే ఇటు వీళ్ళకీ సహాయం చేసేది. రెండు వేరు వేరు దిక్కుల్లో పొయే గుఱ్ఱాల మీద ఒకటే సారి స్వారీ చేస్తే ఎల ఉంటదో తెలుసుకుందాం అని చేసినట్టు ఉండేది. రెండు చెరో దిక్కు వెళ్ళిపోయి నడ్డి ఇరిగినట్టు ఉంది ఇప్పుడు. "ఉగ్రవాదం మీద యుద్ధం" లో మొదటి ఐదేళ్ళు అస్సలు ఏమి చేయలేదు పాకిస్తాన్. కాని ఇలా తాలిబాన్లకి కూడా సహాయం చేయడం అమెరి"కనుల"కి తెలీకుండ ఉంటద? తెలుసుకున్నారు... ఇలా చేస్తే పెట్టే భిక్ష ఆపేస్తాం అన్నారు. జడుసుకొని కొంచం భయపెట్టాలని ప్రయత్నించింది పాకిస్తాన్. వజీరిస్తాన్ మీద దాడులు చేసింది.. NWFP (North West Frontier Province) మీద దాడులు చేసింది.. అమెరికా చేసిన దానికంటే పాకిస్తాన్ చేయడం వలన కోపం వచ్చింది తాలిబాన్ కి. ఆ మాత్రం ఉండదు? సొంత వళ్ళే అంటే కోపం రాదు మరి?
ముందు ఆఫ్ఘనిస్తాన్ వలయం లోకి మెల్లగా లాగింది అమెరికా ని. పాపాం వాళ్ళకి తెలీదు కద ఆఫ్ఘనిస్తాన్ గురించి.. ఇర్రుక్కున్నారు. అలెక్సాండరే భయపడ్డాడు ఆఫ్ఘన్లని చూసి. చెంఘిస్ ఖాన్, సోవియట్లు ఎవ్వరు నిలదక్కుకోలేకపోయారు .. అలాంటి చోట ఇరుకున్నారు అమెరికన్లు. గత ఐదేళ్ళలో చాలా భాగం మళ్ళా తాలిబాన్ల చేతుల్లోకి వచ్చేసింది. కాని ఇటు పాకిస్తాన్ సైన్యం వళ్ళ చాల నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడే వాళ్ళా దృష్టి పాకిస్తాన్ మీదకి సారించారు. NWFP, వజీరిస్తాన్ లో పాక్ సైన్యాన్ని ఎదుర్కోగలిగింది. స్వాట్ లోయలోకి వచ్చి పాక్ సైన్యం తో ఢీ కొట్టింది. తర్వత ఒక రోజు అమెరికా విమానం తో పాక్ తాలిబాన్ అధ్యక్షుడ్ని చంపేసింది. దానికి ప్రతీకారం గా కొత్తగా ఎన్నికైన తాలిబాన్ నాయకుడు మొదలెట్టిన ప్రతీకరమే ప్రస్తుతానికి పాకిస్తాన్ తో రగులుతున్న భీభత్సం.
ఈ సంవత్సరం కనీసం 500 మంది బలి అయ్యారు అడపా దడపల బాంబుల వళ్ళ. ఇన్నేళ్ళు మన మీద సాగించిన కుట్ర ఎల ఉంటదొ ఇప్పుడిప్పుడే అర్థం ఔతున్నట్టు ఉంది వాళ్ళకి. ఇంటి బయటకి వెళ్తే తిరిగి వస్తారో లేదో అన్న భయం వచ్చింది పాకిలకి. వాళ్ళ పరిపాలకులకి కూడా ఆ భయం వస్తే బాగుంటుంది. మొన్నామధ్య ఏకంగా ఆర్మీ హెడ్క్వాటర్ మీదే దాడి చేసారు. మన ప్రమేయం ఏమీ లేకుండా పాక్ ఇలా ఔతోంది అంటే ఎక్కడో కొంచం ఆనందం గా ఉంది. ఈ యుద్ధం సాగుతునే ఉంటుంది.. గెలుపు రుచి చూసారు తాలిబాన్లు పాకిస్తాన్ మీద. వజీరిస్తన్, NWFP లో వాళ్ళదే రాజ్యం ఇప్పుడు. మరో ఆఫ్ఘనిస్తాన్ తయారు చేసారు అక్కడ. అందుకే మిగితా పాక్ ని అల చేయాలి అని ఆశ పడుతున్నారు. అల జరిగితే మనకి నష్టమే కష్టమే. కాని ఎప్పటి వరకు ఐతే పాక్ సైన్యం ప్రభుత్వం ఈ యుద్ధం కొనసాగిస్తుందో అప్పటి వరకు మనకి ఢోకా లేదు. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి...